Voltas Begins Work On Rs 500 Crore AC Factory In Tamil Nadu, See Details - Sakshi
Sakshi News home page

Tamil Nadu Voltas Plant: రూ.500 కోట్లతో వోల్టాస్‌ ప్లాంటు

May 29 2023 11:56 AM | Updated on May 29 2023 12:08 PM

Voltas work on Rs 500 crore AC factory in Tamil Nadu - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: రిఫ్రిజిరేటర్లు, ఏసీల తయారీలో ఉన్న వోల్టాస్‌ మరో ప్లాంటును ఏర్పాటు చేస్తోంది. రూమ్‌ ఏసీల తయారీ కోసం తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో 150 ఎకరాల విస్తీర్ణంలో రూ.500 కోట్లతో కేంద్రాన్ని స్థాపించనుంది.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. టాటా గ్రూప్‌ కంపెనీ అయిన వోల్టాస్‌కు ఇప్పటికే ఉత్తరాఖండ్‌లో ఒకటి, గుజరాత్‌లో రెండు ప్లాంట్లు ఉన్నాయి. తమిళనాడులో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంటులో సుమారు 1500 మందికి ఉపాధి లభించనున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చదవండి: పార్లమెంట్‌ నూతన భవనం: ఖర్చెంత.. కట్టిందెవరు? ఆసక్తికర విషయాలు..

Advertisement
 
Advertisement
Advertisement