సూపర్ మార్కెట్ చైన్ కంపెనీ విశాల్ మెగా మార్ట్లో సమయత్ సర్వీసెస్ తాజాగా 14 శాతం వాటా విక్రయించింది. పీఈ దిగ్గజం కేదార క్యాపిటల్, స్విట్జర్లాండ్ కంపెనీ పార్ట్నర్స్ గ్రూప్ ఏర్పాటు చేసిన ఎస్పీవీ ఇది. షేరుకి రూ. 117 సగటు ధరలో 13.96 శాతం వాటాకు సమానమైన 65.25 కోట్ల షేర్లను అమ్మివేసింది.
వీటి విలువ దాదాపు రూ. 7,636 కోట్లుకాగా.. విశాల్లో సమయత్ వాటా 54.09 శాతం నుంచి 40.13 శాతానికి దిగివచి్చంది. ఈ నేపథ్యంలో విశాల్ మెగా మార్ట్ షేరు ఎన్ఎస్ఈలో 8 శాతం పతనమై రూ. 118 వద్ద ముగిసింది.


