బుధవారం లాభాల్లో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు.. ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి లాభాల్లోనే ముగిశాయి. సెన్సెక్స్ 347.14 పాయింట్లు లేదా 0.45 శాతం లాభంతో 77,155.62 వద్ద, నిఫ్టీ 96.55 పాయింట్లు లేదా 0.40 శాతం లాభంతో 24,085.70 వద్ద నిలిచాయి.
బ్లూస్ప్రింగ్ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్, పారస్ డిఫెన్స్ అండ్ స్పేస్ టెక్నాలజీస్ లిమిటెడ్, హైబ్రిడ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్, ఐడీబీఐ బ్యాంక్ లిమిటెడ్, అమాగి మీడియా ల్యాబ్స్ లిమిటెడ్ కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో చేరాయి. సీమెక్ లిమిటెడ్, టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, రేతాన్ టిఎమ్టి లిమిటెడ్, ఆర్బిట్ ఎక్స్పోర్ట్స్ లిమిటెడ్, ఆర్చాస్ప్ లిమిటెడ్ సంస్థలు నష్టాలను చవిచూశాయి.
(Disclaimer: మార్కెట్ గురించి సాక్షి వెబ్సైట్లో నిపుణులు వెల్లడించే అభిప్రాయాలు వారి పరిశీలన, అంచనాలను బట్టి ఉంటాయి. ఇన్వెస్టర్లకు ఇది కేవలం విషయ అవగాహన మాత్రమే తప్ప.. వారు పెట్టే పెట్టుబడులకు సాక్షి మీడియా గ్రూపు ఎలాంటి హామీ ఇవ్వదు.)


