హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: సౌందర్య సాధనాలు, లైఫ్ స్టయిల్ ఉత్పత్తులు మొదలైన వాటిని కొనుగోలుకు ముందే ట్రయల్ చేసేందుకు వీలు కల్పించే స్మిటెన్ తాజాగా దక్షిణాదిలో కార్యకలాపాల విస్తరణలో భాగంగా హైదరాబాద్లో స్టోర్ ప్రారంభించింది. కంపెనీకి ఇది ఎనిమిదో స్టోర్. 2027 నాటికి రూ. 100 కోట్ల ఆదాయం, 50 పైచిలుకు స్టోర్స్ స్థాయికి చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ తెలిపింది. విశాఖపట్నం, చెన్నై, హుబ్లి, బెంగళూరు తదితర కీలక దక్షిణాది మార్కెట్లలోను రిటైల్ నెట్వర్క్ మరింత పటిష్టం చేసుకునే యోచనలో ఉన్నట్లు సంస్థ తెలిపింది.


