కొత్త ప్లాన్లు తీసుకొచ్చిన జియో | Reliance Jio announces new 5G booster plans | Sakshi
Sakshi News home page

కొత్త ప్లాన్లు తీసుకొచ్చిన జియో

Jul 8 2024 10:09 PM | Updated on Jul 8 2024 10:09 PM

Reliance Jio announces new 5G booster plans

రిలయన్స్ జియో ఇప్పటికే టెలికాం ఛార్జీలను సవరించింది. ఈ క్రమంలోనే కొత్తగా 5జీ డేటా బూస్టర్ ప్లాన్‌లను ప్రవేశపెట్టింది. 1జీబీ, 1.5జీబీ మొబైల్‌ డేటా ప్లాన్లను తీసుకొచ్చింది. ఇప్పటికే వివిధ ప్రీపెయిడ్‌ ప్లాన్లను కలిగి ఉన్న యూజర్లు అదనపు డేటా కోసం వీటిని రీచార్జ్‌ చేసుకోవచ్చు.

ఈ కొత్త ప్లాన్ల ధర రూ.51, రూ. 101, రూ. 151 లుగా ఉంది. డేటా కోసం మాత్రమే రీఛార్జ్ ప్లాన్ చేయాల్సిన వారికి ఈ ప్లాన్‌లు ఉత్తమమైనవి. మూడు ప్లాన్‌లలో ఒక సాధారణ విషయం ఏమిటంటే, ఇవన్నీ అపరిమిత 5G డేటాతో వస్తాయి. అయితే ఈ మూడు ప్లాన్‌లకు ప్రత్యేక వ్యాలిడిటీ లేదు. ఈ ప్లాన్‌ల చెల్లుబాటు యాక్టివ్ ప్లాన్ వ్యాలిడిటీపై ఆధారపడి ఉంటుంది.

జియో వెబ్‌సైట్‌లో ట్రూ అన్‌లిమిటెడ్ అప్‌గ్రేడ్ సెక్షన్ కింద ఈ ప్లాన్‌లు లిస్ట్‌ అయ్యాయి. అయితే ఇవి రూ. 479, రూ. 1,899 ప్రీపెయిడ్ ప్లాన్‌లకు అనుకూలంగా లేవు. మూడింటిలో చౌకైనది. రూ. 51 ప్లాన్. 3జీబీ 4జీ మొబైల్ డేటాను అందిస్తుంది. మీరు 5జీ కనెక్టివిటీ బాగా ఉన్న ప్రాంతంలో నివసిస్తున్నట్లయితే, అపరిమిత 5జీతో పాటుగా రూ.101 ప్లాన్‌ అయితే 6జీబీ 4జీ డేటా, రూ.151 ప్లాన్‌ అయితే 9జీబీ 4జీ డేటా పొందవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement