జులైలో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు | GST collection in July rose 10.3 per cent to over Rs 1.82 trillion | Sakshi
Sakshi News home page

GST: జులైలో పెరిగిన జీఎస్‌టీ వసూళ్లు

Aug 2 2024 11:28 AM | Updated on Aug 2 2024 11:41 AM

GST collection in July rose 10.3 per cent to over Rs 1.82 trillion

భారత వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) వసూళ్లు జులైలో గత ఏడాది ఇదే కాలంతో పోలిస్తే 10.3 శాతం పెరిగి రూ.1.82 లక్షల కోట్లుగా నమోదయ్యాయి. 2017 జులై 1వ తేదీన కొత్త పరోక్ష పన్ను వసూళ్ల వ్యవస్థ ప్రారంభమైన తర్వాత ఇవి మూడో అత్యధిక వసూళ్లు.

ప్రభుత్వం విడుదల చేసిన డేటా ప్రకారం..జులైలో మొత్తం రీఫండ్‌లు రూ.16,283 కోట్లుగా ఉన్నాయి. రీఫండ్‌లను సర్దుబాటు చేసిన తర్వాత నికర వస్తు, సేవల పన్ను (జీఏస్టీ) సేకరణ రూ.1.66 లక్షల కోట్లుగా ఉంది. స్థూల జీఎస్టీ ఆదాయం రూ.1,82,075 కోట్లు. ఇందులో సెంట్రల్ జీఎస్టీ రూ.32,386 కోట్లు, స్టేట్‌ జీఎస్టీ రూ.40,289 కోట్లు, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ రూ.96,447 కోట్లు, సెస్ రూ.12,953 కోట్లు ఉన్నాయి. 

ఇదీ చదవండి: పెరిగిన పెట్రోల్‌, డీజిల్‌ అమ్మకాలు.. కారణం..

దేశీయ కార్యకలాపాల పన్నుల ద్వారా ఆదాయం 8.9 శాతం వృద్ధి చెంది జులైలో రూ.1.34 లక్షల కోట్లుకు చేరింది. దిగుమతుల ద్వారా వచ్చే ఆదాయం 14.2 శాతం పెరిగి రూ.48,039 కోట్లకు చేరింది. స్థూల జీఎస్టీ రాబడులు ఏప్రిల్ 2024లో రికార్డు స్థాయిలో రూ.2.10 లక్షల కోట్లుగా ఉన్నాయి. అంతకుముందు ఏప్రిల్ 2023లో ఇది రూ.1.87 లక్షల కోట్లు. తాజాగా వసూలైన జీఎస్టీ రూ.1.82 లక్షల కోట్లు మూడో భారీగా వసూళ్లుగా నమోదయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement