తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. నేడు పౌర్ణమి గరుడ సేవ | TTD News: Devotees Rush Pournami Garuda Seva Details | Sakshi
Sakshi News home page

తిరుమల: పెరిగిన భక్తుల రద్దీ.. నేడు పౌర్ణమి గరుడ సేవ

Sep 29 2023 7:48 AM | Updated on Sep 29 2023 4:33 PM

TTD News: Devotees Rush Pournami Garuda Seva Details - Sakshi

సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడిపై కొలువుదీరి.. 

సాక్షి, తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లన్ని నిండి వెలుపల క్యూలైన్ లో వేచి ఉన్నారు భక్తులు. టోకెన్లు లేని భక్తుల సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది.

ఇదిలా ఉంటే.. నిన్న(గురువారం) 54,620 భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య 24,234. హుండీ ఆదాయం రూ.2.98 కోట్లుగా లెక్క తేలింది. 

Tirumala Garuda Seva : శుక్రవారం తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు మాడ వీధులలో గరుడ వాహనంపై స్వామివారిని ఊరేగిస్తారు. సర్వాలంకార భూషితుడైన మలయప్ప స్వామి గరుడిపై కొలువుదీరి తిరుమాడ వీధుల్లో విహరిస్తూ భక్తులకు దర్శనమివ్వనున్నారు ప్రతి నెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement