
తిరుపతి, సాక్షి: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. ఉచిత సర్వ దర్శనానికి అన్నీ కంపార్టుమెంట్లు నిండి.. బయట ATC వరకు క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు. నిన్న(గురువారం) 63,826 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 27,530 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు.
శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.23 కోట్లు. మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 5 గంటల సమయం పడుతోంది. రూ.300 ప్రత్యేక దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది.