నేడు ఐదో విడత వాహన మిత్ర సాయం విడుదల  | CM YS Jagan To Release Fifth Installment Of YSR Vahana Mitra Scheme At Vijayawada - Sakshi
Sakshi News home page

నేడు ఐదో విడత వాహన మిత్ర సాయం విడుదల 

Sep 29 2023 3:01 AM | Updated on Sep 29 2023 10:08 AM

CM Jagan To release Fifth installment of Vahana Mitra At Vijayawada - Sakshi

సాక్షి, అమరావతి: సొంత వాహనంతో స్వయం ఉపాధి పొందుతున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్‌ డ్రైవర్లు,  ఎండీయూ ఆపరేటర్లకు అండగా నిలిచేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకాన్ని ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అమలు చేస్తున్న ఈ పథకం ద్వారా ప్రతి లబ్ధిదారుకు ఏటా రూ.10 వేలు ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు.

ఇప్ప­టి­వరకు నాలుగు విడతల సా­యాన్ని అందించిన సీఎం వైఎస్‌ జగన్‌.. వరుసగా ఐదో విడత ఆర్థిక సా­యాన్ని శుక్రవారం అందించనున్నారు. విజయవాడ నగరం విద్యాధరపురంలో నిర్వహించే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ బటన్‌ నొక్కి లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లో నేరుగా నగదును జమ చేయనున్నారు. 2023–24 సంవత్సరానికి 2,75,931 మంది లబ్ధిదా­రులకు ఒక్కొక్కరికి రూ. 10 వేల చొప్పున రూ. 275.93 కోట్ల ఆర్థిక సాయం అందజేయనున్నారు.  

దీనితో కలిపి వైఎస్సార్‌ వాహన మిత్ర పథకం లబ్ధిదారులకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.1,301.89 కోట్లు అందించినట్లు అవుతుంది. సీఎం జగన్‌ శుక్రవారం ఉదయం 10.15 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయల్దేరి విద్యాధరపురం స్టేడియంకు చేరుకొంటారు. అక్కడ ఏర్పా­టు చేసిన వేదికపై బటన్‌ నొక్కి వైఎస్సార్‌ వాహనమిత్ర లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారు. అనంతరం బహిరంగ సభలో ప్రసంగిస్తారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement