11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఆమోదించాం: మంత్రి బొత్స | Ap Government Talks With Anganwadi Workers | Sakshi
Sakshi News home page

11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఆమోదించాం: మంత్రి బొత్స

Dec 26 2023 9:17 PM | Updated on Dec 26 2023 9:26 PM

Ap Government Talks With Anganwadi Workers - Sakshi

సాక్షి, అమరావతి: అంగన్‌వాడీ సంఘాలతో ఏపీ ప్రభుత్వం చర్చలు ముగిశాయి. 11 డిమాండ్లలో 10 డిమాండ్లు ఆమోదించామని మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. గ్రాట్యూటీ అంశం మా పరిధిలో లేదని అంగన్‌వాడీలకు చెప్పామన్నారు. 

‘‘వేతనం పెంపుపై కొంత సమయం అడిగాం. సమయం ఇస్తే సమస్య పరిష్కరిస్తాం. 15 రోజుల సమ్మెతో బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. జనవరి 3వ తేదీ తర్వాత బాలింతలకు జగనన్న కిట్లు అందించాలి. జగనన్న కిట్లు అందించేందుకు సహకరించాలని అంగన్‌వాడీలను కోరాం. సంక్రాంతి వరకూ సమ్మెను వాయిదా వేసుకోవాలని కోరుతున్నాం. సంక్రాంతి తర్వాత మరోమారు చర్చలు జరుపుతాం’’ అని మంత్రి బొత్స తెలిపారు.

‘‘అంగన్‌వాడీ సమస్యల పట్ల ప్రభుత్వం సానుకూలంగా ఉంది. సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తాం. మేం అంగన్‌వాడీలను బెదిరించడం లేదు.. రిక్వెస్ట్ చేస్తున్నాం’’ అని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Fact Check: రైతుబజార్లపై ‘కుళ్లు’ కథ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement