గుంటూరు:: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ముస్తఫాపై కూటమి సర్కారు కక్ష సాధింపు చర్యలకు దిగింది. ముస్తాఫా నివాసంలోకి వచ్చిన నూజివీడు పోలీసులు.. ఆయన కుటుంబ సభ్యులతో దురుసగా ప్రవర్తించారు. వారి నివాసంలో ఉన్న కారును కిడ్నాప్కు వాడారంటూ సీజ్ చేసేందుకు యత్నించారు. ఈ క్రమంలోనే పోలీసులతో ముస్తాఫా కుమార్తె నూరి ఫాతిమా వాగ్వాదం చేశారు.
అసలు కారును ఎందుకు సీజ్ చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మీరు చెబుతున్న కిడ్నాప్ కేసులో కారు ఉపయోగించారని సాక్ష్యాలు ఉంటే చూపించాలని పోలీసులను ప్రశ్నించారు. తమ కుటుంబంపై పెట్టిందే దొంగ కేసని, పైగా ఇప్పుడు కారు సీజ్ చేస్తామని ఎలా చెబుతారని ఆమె నిలదీశారు.


