
AP Elections Political Latest Updates Telugu..
08:07PM, జనవరి 8, 2024
అంగన్వాడీల సమ్మెలో రాజకీయ ప్రమేయం ఉంది: సజ్జల
- అంగన్వాడీల సమ్మెను కొన్ని శక్తులు నడిపిస్తున్నాయి
- రౌండ్ టేబుల్ పేరుతో టీడీపీ వాళ్లంతా అక్కడ చేరారు
- అంగన్వాడీలకు ప్రభుత్వం చేయగలిగినంత చేసింది
- ఎందుకు చేయలేకపోతున్నామనేది వివరంగా చెప్పాం
- ఎంతకాలమని సమ్మెలో ఉంటారు
- పేదలకు ఇబ్బందులు కలిగితే ప్రభుత్వానిదే బాధ్యత అవుతుంది
- చంద్రబాబు హయాంలో ఏం జరిగిందో అందరికీ గుర్తుంది
- అంగనవాడీ కార్యకర్తల ఆందోళనలపై అనేక స్థాయిలో చర్చించాం
- వారి సమ్మె వెనుక రాజకీయ కోణం ఉంది
- వాట్సప్ గ్రూపుల్లో వారి ఆడియోలు మేము విన్నాం
- కొందరు రాజకీయ కోణంలో రెచ్చగొడుతూ మాట్లాడారు
- రాజకీయ అజెండాకి బలి కావద్దు
- ప్రభుత్వం తరపున చేయాల్సినవన్నీ చేస్తున్నాం
- గర్భిణీలు, పసిపిల్లలను ఇబ్బందులు పెట్ట వద్దు
- పట్టు వీడకపోతే ప్రభుత్వం ప్రత్యామ్నాయం చేస్తుంది
- మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు కూడా ఇది వర్తిస్తుంది
- సీఎం జగన్కు వ్యతిరేకంగా ఉన్న వారంతా అంగన్ వాడీలను రెచ్చగొడుతున్నారు
- వారి వలలో చిక్కుకోవద్దు
- ప్రభుత్వాన్ని దించుతాం, జైళ్లకైనా వెళ్తాం అంటూ కొందరు రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడుతున్నారు
- పేద తల్లులు, పిల్లలకు ఆహారం అందకపోవటం మంచిదేనా చంద్రబాబు చెప్పాలి
- అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు అంగన్వాడీలకు అన్యాయం చేశారు
- సమ్మె విరమించమని అంగనవాడీలు, మున్సిపల్ కార్మికులను కోరుకుంటున్నాం
- సమ్మె కొనసాగిస్తే నోటీసులు ఇస్తాం
- తర్వాత ఏం స్టెప్ తీసుకోవాలో ప్రభుత్వం తీసుకుంటుంది
8:00PM, జనవరి 8, 2024
రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం నాకేంటి: మాజీ మంత్రి కొడాలి నాని
- పక్క రాష్ట్రాల సీఎంల అపాయింట్మెంట్ నాకు అవసరం లేదు
- రేవంత్రెడ్డి గెలిచినప్పుడు సీఎం జగన్ ట్వీట్ చేశారు
- ఫోన్ చేసి అభినందించాలా..?
- పక్క రాష్ట్రంలో ఎన్నికలకు మాకు ఏం సంబంధం లేదు
- రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన షర్మిలకు మద్దతివ్వడంలో వింత ఏముంది
- రేవంత్ రెడ్డి ఏపీ కి వచ్చి పీసీసీ బాధ్యత తీసుకోమని చెప్పండి
- చంద్రబాబుని గెలిపించడం కోసం రేవంత్ ఎపి కి వస్తాడేమో
- చంద్రబాబు టికెట్లు అమ్ముకుంటున్నాడు
- 150 కోట్లకు ఎంపీ సీటు కేశినేని చిన్నికి అమ్మాడు
- కష్ట కాలంలో పార్టీ కోసం పనిచేసిన కేశినేని నాని ని మోసం చేసాడు
- నా గుడివాడ లో కూడా 100 కోట్లు ఇచ్చినోడికి సీటు ఇచ్చాడు
- రాజ్యసభ, ఎమ్మెల్సీ సీట్లు కూడా చంద్రబాబు అమ్ముకుంటాడు
- చంద్రబాబు 15 వేలు ఇస్తానని పిల్లలు కనమంటు న్నాడు
- లోకేష్కి 15 వేలు ఇచ్చి పిల్లలు కనమని చంద్రబాబు చెప్పొచ్చుగా
7:37PM, జనవరి 8, 2024
రేపు ఆళ్లగడ్డ చంద్రబాబు సభకు ముందే టీడీపీ, జనసేన నేతల మధ్య భగ్గుమన్న విభేదాలు
- ఏవీ సుబ్బారెడ్డి చంద్రబాబు సభకు రాకూడదని అఖిల ప్రియ అల్టిమేటం
- ఏవీ సుబ్బారెడ్డి వస్తే తాను సైలెంట్గా ఉన్నా నా అనుచరులు ఊరుకోరని చెప్పిన భూమా అఖిల
- రేపటి చంద్రబాబు సభకు వెళ్లకూడదని ఏవీ సుబ్బారెడ్డి నిర్ణయం
- జనసేన నేతలు కూడా వేదికపైకి రాకూడదని అఖిల ఆంక్షలు విధించారని ప్రచారం
- మీ సభ మీ ఇష్టం, మేం ఎందుకు వస్తామన్న జనసేన నేతలు
- ఆళ్లగడ్డలో రేపటి చంద్రబాబు సభకు జనసేన దూరం
- ప్రకటన విడుదల చేసిన జనసేన
- టీడీపీ సభకు జనసేన పార్టీకి ఆహ్వానం లేదు
- రేపు జనసైనికులు, నేతలు టీడీపీ సభకు వెళ్లొద్దని ఆదేశం
6:58PM, జనవరి 8, 2024
ఫిరాయింపు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వైఎస్సార్సీపీ ఫిర్యాదు
- అనర్హత వేటు వెయ్యాలని అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్కు ఫిర్యాదు
- ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవిలపై స్పీకర్కు ఫిర్యాదు
- అసెంబ్లీ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన విప్ ప్రసాద్ రాజు, ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్
- ఎమ్మెల్సీలు వంశీకృష్ణ, సి. రామచంద్రయ్యపై మండలి చైర్మన్కు ఫిర్యాదు
- శాసనమండలి కార్యదర్శికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీలు మేరుగు మురళి, లేళ్ల అప్పిరెడ్డి
6:50PM, జనవరి 8, 2024
బయటపడ్డ ఎల్లో మీడియా కుట్రలు
అనంతపురం:
- మద్యం మత్తులో టీడీపీ కార్యకర్త చంద్రమోహన్ హల్ చల్
- తనకు తానే బట్టలు విప్పేసి హంగామా సృష్టించిన టీడీపీ కార్యకర్త చంద్రమోహన్
- విడపనకల్ మండలం పాల్తూరు పీఎస్ లో ఘటన
- పోలీసులే బట్టలు విప్పించి అవమానించారని ఎల్లో మీడియా లో అసత్య ప్రచారం
- ఎల్లో మీడియా అసత్య ప్రచారాన్ని ఖండించిన ఏఎస్పీ విజయభాస్కర్ రెడ్డి
04:51PM, జనవరి 8, 2024
పార్టీలకు అతీతంగా సంక్షేమ అందించిన ఘనత వైఎస్సార్సీపీ ప్రభుత్వానిది: మంత్రి ఆదిమూలపు
- చంద్రబాబు మాయ మాటలు నమ్మి 2014లో అధికారం ఇచ్చారు:
- 2014 నుండి 2019 వరకూ మాకు ప్రజల సమస్యలపై పోరాటం చేసే అవకాశం ఇచ్చారు
- 2019 నుండి 2024 వరకూ మీ సమస్యలు తీరుస్తూ అవినీతి రహితంగా సంక్షేమం అందించే బాధ్యతను ఇచ్చారు
- ఎలక్షన్ అయ్యే వరకే రాజకీయాలు.. ఎలక్షన్ అయ్యాక కూడా రాజకీయాలు చేయడం మా నాయకుడు జగన్ విధానం కాదు
- జగన్ ఎప్పుడూ ముఖ్యమంత్రిగానో, మేము మంత్రుల హోదాలో మీ దగ్గరకు రాలేదు. మీ సేవకులుగా మాత్రమే వచ్చాం. మీకు సేవకులుగా ఉండే అవకాశం కల్పించిన ఓటర్ దేవుళ్ల రుణం తీర్చుకుంటున్నాం.
- సచివాలయ వ్యవస్థతో పార్టీలకు అతీతంగా మాకు ఓటు వేయని వాళ్లకు కూడా సంక్షేమాలు అందించామని గర్వంగా చెబుతాం
- 24 పథకాలను లబ్ధిదారుల అకౌంట్కి నేరుగా డీబీటీ ద్వారా పంపిణీ చేసాం
- ప్రతిదానిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు డెబ్బై శాతం రిజర్వేషన్ కల్పించిన పార్టీ వైఎస్సార్సీపీనే.
- నాడు-నేడులో పాఠశాలల రూపురేఖలు మార్చిన వ్యక్తి సీఎం జగన్
- సామాజిక సాధికారిత అనేది మా ఎన్నికల నినాదం కాదు.. చేతలలో చూపించిన నాయకుడు జగన్
- జగన్ అంటే నిజాయితీకి, నిబద్ధతకు, నమ్మకానికి నిలువెత్తు రూపం
- మ్యానిఫెస్టో అంటే చెత్త కాగితంలా టీడీపీ చూస్తూ.. మ్యానిఫెస్టో అంటే పవిత్ర గ్రంధం అని నిరూపించిన వ్యక్తి సీఎం జగన్
- చంద్రబాబు దళిత వ్యతిరేకి అని మరోసారి రుజువు చేసుకొన్నాడు
- దళితులపై నీచమైన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పి యర్రగొండపాలెం లో అడుగు పెట్టమంటే అరాచకమ్ సృష్టించాడు
- ఎవరు చెత్తో.. ఎవరు బంగారమో రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు
3:50PM, జనవరి 8, 2024
చంద్రబాబు ఒక అవుట్ డేటెడ్ పొలిటీషియన్: మంత్రి కారుమూరి
- నిన్న ఆచంటలో చంద్రబాబు మీటింగ్కి నా పుట్టినరోజుకి వచ్చిన జనం కూడా రాలేదు
- గతంలో తణుకులో చంద్రబాబు నిర్వహించిన రైతు పోరుబాటలోకు 400 మంది జనం కూడా రాలేదు, బహిరంగ సభకి 1500 మంది జనం కూడా లేరు
- రైతులకు ధాన్యం సంచులు 1 కోటి 14 లక్షల సంచులు అందజేశాం
- టార్గెట్ కంటే మించి 10 లక్షలు సంచులు అదనంగా ఇచ్చాం
- వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు నీకు ధాన్యం గురించి సంచుల గురించి ఏం తెలుసు?
- చంద్రబాబు రైతుల గురించి మాట్లాడటం అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లే
- నీ హయాంలో 17 లక్షల 94వేల మంది రైతుల నుంచి 2 కోట్ల 65 లక్షలు టన్నులు ధాన్యం మాత్రమే సేకరించావు
- మా ప్రభుత్వంలో 36 లక్షల 60వేల మంది రైతుల నుంచి 3కోట్ల 33 లక్షల 86 మెట్రిక్ లు ధాన్యాన్ని కొనుగోలు చేశాం
- నీ హయాంలో దళారుల నుండి ధాన్యం కొనుగోలు చేసి రైతులు నడ్డి విరిచావు
- మా ప్రభుత్వంలో రైతుల నుంచి నేరుగా ధాన్యం కొనుగోలు చేసి రైతులకు మేలు చేశాం
- మొన్న మిఛాంగ్ తుపాన్లో తడిసిన, మొక్క వచ్చిన ధాన్యాన్ని మేము కొనుగోలు చేశాం
- జగన్మోహన్రెడ్డివి స్కీములు అయితే.... చంద్రబాబువి అన్ని స్కాములే
- నేను చేపట్టిన ప్రజా దీవెన పాదయాత్రలో ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది
- ప్రతి అవ్వా, తాత మొహంలో చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు
- మన ప్రభుత్వంలో పార్టీలకు అతీతంగా అందరికీ సంక్షేమం అందిస్తున్నాం
3:21PM, జనవరి 8, 2024
ఎన్టీఆర్ జిల్లా
మైలవరం టీడీపీలో టిక్కెట్ పంచాయతీ
►లోకల్ నినాదాన్ని బలంగా తెరపైకి తెస్తున్న ఆశావాహులు
►నాల్ లోకల్ ఉమా వద్దు ... లోకల్ ముద్దు అంటున్న మైలవరం తమ్ముళ్లు
►మైలవరం ఎమ్మెల్యే సీటు స్థానికులకు ..బీసీలకే ఇవ్వాలంటున్న మైలవరం టీడీపీ నేతలు
►తనకు మైలవరం టిక్కెట్ ఇవ్వాలంటున్న కొండపల్లి మున్సిపాలిటీ 17వ వార్డు టీడీపీ కౌన్సిలర్ ముప్పసాని భూలక్ష్మి
►మైలవరం టిక్కెట్ బీసీలకు ఇస్తే పోటీకి సిద్ధమంటున్న ముప్పసాని భూలక్ష్మి
►తనకు అవకాశం కల్పించాలంటూ లోకేష్ కార్యాలయంలో లేఖ అందజేసిన భూలక్ష్మి
నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు:
సాక్షి టీవీతో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి
- నా మీద ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం చేస్తోంది
- నేను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడే ప్రసక్తే లేదు
- నేను రాజకీయాల్లోకి వచ్చిందే జగనన్న కోసం
- రాజకీయాల్లో ఉన్నంతకాలం జగనన్న, వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే ఉంటా
- టీడీపీ చేసే తప్పుడు ప్రచారం నమ్మొద్దు
- నాకు ఎమ్మెల్యే సీటు ఇవ్వమని జగనన్న చెప్పలేదు
- నాతో ఇప్పటివరకు జగనన్న సీటు విషయం మాట్లాడలేదు
- నా నియోజకవర్గంలో 40 ఏళ్ల లో పరిష్కారం కానీ సమస్యను జగనన్న పరిష్కరించారు
- శింగనమలతో పాటు 46 చెరువుల ద్వారా నీళ్లు అందించిన ప్రభుత్వం మాది
- జగనన్న నన్ను ఏనాడు అవమానించలేదు
- నన్ను సోదరిలా ప్రోత్సహించారు
2:21PM, జనవరి 8, 2024
తిరువూరు సభకు నా ప్రాధాన్యత తగ్గించారు: కేశినేని నాని ప్రధాన అనుచరుడు నల్లగట్ల స్వామి
- సోషల్ మీడియాలో నా రాజీనామా అనేది ప్రచారం మాత్రమే
- నేను ఏ నిర్ణయం తీసుకున్నా అందరికీ చెప్పే తీసుకుంటాను
- పార్టీలో కొనసాగాలా వద్దా అనే దానిపై కార్యకర్తలు,అభిమానులతో చర్చిస్తాను
- ఇంతవరకూ అధిష్టానాన్ని కలిసే ప్రయత్నం చేయలేదు
- వైస్రాయ్ హోటల్ ఘటన దగ్గర నుంచి చంద్రబాబుతో కలిసే ఉన్నాను
- తిరువూరు సభకు నా ప్రాధాన్యత తగ్గించారు అందుకే వెళ్లలేదు
1:59PM, జనవరి 8, 2024
పశ్చిమగోదావరి జిల్లా:
పితానిపై మాజీ మంత్రి శ్రీరంగనాథరాజు ధ్వజం
- టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం సిగ్గుచేటు
- చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల ముఖ్యమంత్రి 15 సంవత్సరలు ప్రతిపక్ష నాయకుడిగా పని చేసి
- వాస్తవాలు తెలుసుకోకుండా ఎవరో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ లోని అవాస్తవాలు చదవడం దారుణం
- మాజీ మంత్రి పితాని సత్యనారాయణ తన స్థాయికి తగ్గి మాట్లాడుతున్నారు
- పితాని సత్యనారాయణ అధికారంలో ఉండగా 10శాతం కమీషన్లు వసూలు చేసి కులాలు మధ్య చిచ్చు పెట్టారు
- టిడిపి మీటింగ్ కు జనసేన ఇంచార్జ్ ను పిలవకపోవడం తాని కి కాపులు పై ఉన్న అహంకారానికి నిదర్శనం
- వచ్చే ఎన్నికల్లో రెండవ సారి పితాని సత్యనారాయణ ను ఒడిస్తాను
- మొన్న వచ్చిన మెజార్టీ కంటే బారి మెజార్టీ తో విజయాఖేతానం ఎగురవేస్తాను
- పితాని సత్యనారాయణ ఇంటికి వెళ్ళిన వ్యక్తికి మంచినీళ్లు కూడా ఇవ్వడు.. నాకు భోజనం పెట్టి పంపించే అలవాటు ఉంది
- పితాని సత్యనారాయణ నిత్యం కులాల మధ్య చిచ్చు పెట్టి కాపులకు బీసీలను రెచ్చగొడతాడు
- నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి నియోజవర్గంలో ఎంతో మందికి సహాయం చేస్తున్నాను
- పితాని సత్యనారాయణ సీఎం రిలీఫ్ ఫండ్ కూడా కమిషన్ తీసుకుని చెక్కులు ఇచ్చేవాడు
- నాకు ఈ నియోజకవర్గంలో కాపులు బీసీలు రెండు కళ్ళు గా చూస్తాను
1: 30 PM, జనవరి 8, 2024
సీఎం జగన్ పాలనపై తెలంగాణ మాజీ ఎంపీ ప్రశంసలు
- సీఎం జగన్పై మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ ప్రశంసలు
- జగన్ పాలనలో తండాలకు రోడ్లు, నీళ్లు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం
- సంక్షేమ పథకాలతో గిరిజనులందరికీ లబ్ధి.. రాజకీయంగా అధిక ప్రాధాన్యం
- దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులకు అత్యధికంగా మేలు
జగన్ పాలనలో తండాలకు రోడ్లు, నీళ్లు, నాణ్యమైన విద్య, మెరుగైన వైద్యం
— YSRCP IT WING Official™ (@ysrcpitwingoff) January 8, 2024
సంక్షేమ పథకాలతో గిరిజనులందరికీ లబ్ధి.. రాజకీయంగా అధిక ప్రాధాన్యం
దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో గిరిజనులకు అత్యధికంగా మేలు
-తెలంగాణలోని మహబూబాబాద్ మాజీ ఎంపీ సీతారాంనాయక్ ప్రశంసలు pic.twitter.com/l6rkthG3CN
1: 10 PM, జనవరి 8, 2024
లోకేష్ యువగళం టీమ్ ఓవరాక్షన్
- చంద్రబాబు సభలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీల కలకలం
- ఎన్టీఆర్ బ్యానర్లతో వచ్చిన టీడీపీ అభిమానులు
- వారిపై దాడికి దిగిన ఎల్లో బ్యాచ్
- ఈ ఘటన వెనుక లోకేష్ యువగళం టీమ్ ఉందని ఎన్టీఆర్ అభిమానుల ఆగ్రహం
చంద్రబాబు సభల్లో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం
— YSR Congress Party (@YSRCParty) January 8, 2024
ఎన్టీఆర్ బ్యానర్లతో వచ్చిన అభిమానులపై టీడీపీ కార్యకర్తల దాడి
ఈ ఘటనల వెనుక లోకేష్ యువగళం టీమ్ ఉందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న ఎన్టీఆర్ అభిమానులు.#TDPGoons#EndOfTDP pic.twitter.com/2D61z98hFF
12: 40 PM, జనవరి 8, 2024
చంద్రబాబు తిరువూరు సభపై దేవినేని అవినాష్ సెటైర్లు..
- అవినాష్ కామెంట్స్..
- తిరువూరు సభ అట్టర్ ప్లాప్
- తిరువూరు సభలో చంద్రబాబు ఖాళీ కుర్చీలకు కబుర్లు చెప్పాడు
- ‘రా కదలి కదలిరా’ అని పిలుపునిచ్చినా టీడీపీ నాయకులు కదలలేదు.. కదలిరాలేదు
- గత ఐదేళ్లలో ఏం అభివృద్ధి చేశారో చెప్పుకోలేని స్థితిలో టీడీపీ నేతలు ఉన్నారు
- బీసీలు జగన్ ప్రభుత్వంలో బ్యాక్ బోన్ క్యాస్ట్గా ఉన్నారు
- వార్డు మెంబర్, కార్పొరేటర్ స్థాయి నుంచి చైర్మన్ పదవులకు వరకు సీఎం జగన్ ప్రభుత్వం బీసీ కులస్తులకే పట్టం కట్టింది
12: 20 PM, జనవరి 8, 2024
మహిళల సానుభూతి కోసం జిల్లాల టూర్కు భువనేశ్వరి
- ఎన్నికల దాకా భువనేశ్వరీ పర్యటనలు చేయాలని చంద్రబాబు సూచన
- మహిళా ఓటర్లలో సానుభూతి వచ్చేలా చూడాలని పార్టీ నేతలకు ఆదేశం
- రేపటి నుంచి రెండు రోజుల పాటు జిల్లాలో భువనేశ్వరి టూర్
- ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో భాగంగా కోడుమూరు, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాలలో భువనేశ్వరి టూర్
- చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని చెప్పడానికి పాట్లు
- కేసుల విషయంలో జనం నుంచి రాని స్పందన
- నిజంగా తప్పు చేయకపోతే కోర్టు ముందు ఎందుకు చెప్పడం లేదు అంటున్న జనం
- గవర్నర్ అనుమతి తప్ప మరో వాదన లేని బాబు లాయర్లు
12: 00 PM, జనవరి 8, 2024
టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా
- టీడీపీ 11వ డివిజిన్ కార్పొరేటర్గా కేశినేని శ్వేత
- ఈరోజు టీడీపీకి రాజీనామా చేసిన శ్వేత
- రాజీనామా తర్వాత శ్వేత కామెంట్స్..
- 11వ డివిజన్ కార్పొరేటర్గా నేను రాజీనామా చేశాను.
- నా రాజీనామా ఆమోదం పొందాక నేను కూడా టీడీపీ పార్టీకి రాజీనామా చేస్తాను.
- మేము ఎప్పుడూ టీడీపీని విడాలని అనుకోలేదు.
- టీడీపీ పార్టీ మమల్ని వద్దు అనుకునప్పుడు మేము పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదు.
- కేశినేని నాని పార్టీకి రాజీనామా చేశాక కార్యకర్తలతో మాట్లాడి భవిషత్ కార్యాచరణ ప్రకటిస్తారు.
- గౌరవం లేని చోట మేము పని చేయలేము.
- కేశినేని నాని కానీ నేను కానీ ప్రజల తరుపున పోరాటం చేస్తాము.
- గత సంవత్సరం కాలం నుంచి టీడీపీలో కేశినేని నాని అవమానాలు ఎదుర్కొంటూనే ఉన్నారు.
- కృష్ణాజిల్లాలో జరుగుతున్న విషయాలు ఇప్పటి వరకూ టీడీపీ అధిష్టానానికి తెలియదు అనే భ్రమలో ఉన్నాము.
- మున్సిపల్ ఎన్నికలప్పుడు విజయవాడలో ముగ్గురు నాయకులు మమ్మల్ని ఇబ్బంది పెట్టారు.
- మేము బయటకి వెళ్తున్నము.. పార్టీ నుంచి, మాతో వచ్చేవాళ్ళకి కచ్చితంగా అండగా ఉంటాము.
- తిరువూరు సభకి కేశినేని నానికి ఏంటి సంబంధం అని లోకేష్ అడిగారు
- ఆయన పార్లమెంట్ నియోజవర్గంలో ఆయనకు సంబంధం ఏంటి అని అడగడం విడ్డూరమే అవుతుంది.
- కేశినేని నాని మూడోసారి కూడా విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచే పోటీ చేస్తారు.
11:30 AM, జనవరి 8, 2024
టీడీపీ, జనసేనల మధ్య కుర్చీల కుస్తీ..
- ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో అభ్యర్థుల ఖరారుపై టీడీపీ, జనసేన కుస్తీలు
- ఐదు స్థానాలు కావాలని పట్టుబడుతున్న జనసేన
- రాజమండ్రి రూరల్, కాకినాడ రూరల్, పిఠాపురం, మండపేట, కొత్తపేటపై జనసేన ఆశలు
- ఈ ఐదు స్థానాల్లో బలంగా ఉన్న టీడీపీ అభ్యర్థులు
- అవే స్థానాలు కావాలని పట్టుపడుతున్న జనసేన
- జనసేనకు ఇస్తే టీడీపీ సిట్టింగులు సీట్లను వదులుకోవాల్సిన పరిస్థితి
- అధినేతల పొత్తు అసలుకే మోసం తెచిందంటున్న నాయకులు
10:45 AM, జనవరి 8, 2024
అంగన్వాడీలు విధుల్లో చేరేందుకు నేడే గడువు
- ఈరోజు సాయంత్రంలోగా విధుల్లో చేరాలని అంగన్వాడీలకు మెసేజ్లు
- విధుల్లో చేరకపోతే రేపటి నుంచి నోటీసులు జారీ చేయాలని నిర్ణయం
- న్యాయ సలహాలు తీసుకుంటున్న ప్రభుత్వం
- ప్రజలకు ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న ప్రభుత్వం
10:30 AM, జనవరి 8, 2024
కాసేపట్లో టీడీపీకి కేశినేని శ్వేత రాజీనామా
- ఎంపీ కేశినేని నాని కార్యాలయానికి చేరుకున్న కేశినేని శ్వేత
- కేశినేని శ్వేత ప్రాతినిధ్యం వహిస్తున్న విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్ పదవికి రాజీనామా సిద్ధం
- కేశినేని కార్యాలయంలో కార్యకర్తలతో భేటీ
- కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసేందుకు విజయవాడ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లనున్న కేశినేని శ్వేత.
10:00 AM, జనవరి 8, 2024
పచ్చ మీడియాలో ఇప్పుడేం చెబుతుంది?
- టీడీపీ హయాంలో జీఎస్డీపీ వృద్ధి రేటులో ఏపీ 22వ స్థానం
- నేడు సీఎం జగన్ పాలనలో జీఎస్డీపీ వృద్ధి రేటులో దేశంలోనే ఏపీ నంబర్ వన్.
- బాబుకు ఊదరగొట్టే ఎల్లో మీడియాకు ఇవేవీ కనిపించవు.
రాష్ట్రాన్ని ఓ తెగ అభివృద్ధి చేసా అని ఊదరగొట్టే @ncbn పాలనలో GSDP వృద్ధి రేటులో మన రాష్ట్రం 22 వ స్ధానంలో ఉంది. 📉
— YSR Congress Party (@YSRCParty) January 8, 2024
ఇప్పుడు @ysjagan అన్న పాలనలో GSDP వృద్ధి రేటులో మన రాష్ట్రం దేశంలో నెం.1 స్ధానంలో ఉంది. 📈#AapuBabuNatakam#JaganeMaaNammakam
9:30 AM, జనవరి 8, 2024
మతిమరుపు చంద్రబాబు పచ్చ రంగు గుర్తు లేదా?
- మతిమరుపుతో ఏదేదో మాట్లాడతున్న చంద్రబాబు
- టీడీపీ హయాంలో స్మశానాలకు సైతం పచ్చ రంగు వేసిన ఘనడు.
- సభలకు జనం రాక ఫ్రస్టేషన్లో ఏదేదో మాట్లాడుతున్న బాబు.
మీకు మతిమరపుతోబాటు పచ్చకామెర్లు కమ్మేసి కళ్ళు కనిపించడం లేదు కానీ మీ హయాంలో స్మశానాలకు సైతం మీ పచ్చరంగు వేసుకున్నారు. మేము కొత్త వ్యవస్థలను సృష్టించాం.. అసలైన అభివృద్ధికి సరికొత్త నిర్వచనం ఇచ్చాము. అందుకే రాష్ట్రం యావత్తూ జయహో జగన్ అంటున్నారు. మీ సభలకు జనం రాక ప్రస్టేషన్ లో ఏదేదో… https://t.co/TPaQ1cgbcL
— YSR Congress Party (@YSRCParty) January 7, 2024
9:00 AM, జనవరి 8, 2024
విజయవాడ: ఈనాడు ఆఫీసు ఖాళీ చేసిన రామోజీ
- విజయవాడ బెంజ్ సర్కిల్లో ఈనాడు ఆఫీసును ఖాళీ చేసిన రామోజీ
- ఆఫీసును ఆటోనగర్కు తరలించిన రామోజీ
- దాదాపు నాలుగు దశాబ్దాల ఉన్న భవనాన్ని యజమానికి అప్పగించిన రామోజీ.
- పరిస్థితులు ఎదురుతిరగడంతో భవనం ఖాళీ.
సహజంగా తనకు ఎదురులేదని విర్రవీగే రామోజీరావుకు ఈ మధ్య కాలం అంతగా కలిసి రానట్టుంది. విజయవాడలోని బెంజ్ సర్కిల్లో ఉన్న ఈనాడు కార్యాలయాన్ని ఖాళీ చేసి, దానిని ఆ భవనం యజమానికి ఇచ్చేశాడు. తన ఈనాడు కార్యాలయాన్ని ఆటోనగర్కు తరలించాడు. దాదాపు నాలుగు దశాబ్దాల పాటు… pic.twitter.com/Kk3mTgCLpo
— YSR Congress Party (@YSRCParty) January 7, 2024
8:15 AM, జనవరి 8, 2024
ఇదీ నారా పన్నాగం: మంత్రి అంబటి సెటైర్లు
- ఎన్టీఆర్కు జోహార్లు
- జూనియర్ ఎన్టీఆర్కి అవమానాలా?
- ఇదీ నారా పన్నాగం అని కామెంట్స్.
ఎన్టీఆర్ కి జోహార్లు
— Ambati Rambabu (@AmbatiRambabu) January 7, 2024
జూనియర్ కి అవమానాలు
ఇదీ "నారా" పన్నాగం ! pic.twitter.com/cwTo8hrvoo
7:40 AM, జనవరి 8, 2024
రామోజీ ఇది తెలుసుకో..
- దుబాయ్లో ఐఎల్టీ-20 లీగ్ కోసమే వైఎస్సార్సీని వీడిన అంబటి రాయుడు
- రాజకీయాలతో సంబంధం ఉండకూదడనే రాజీనామా నిర్ణయం
- రాష్ట్రంలో ఏది జరిగినా వక్రీకరణకు పచ్చ మీడియా రెడీ
- వాస్తవాలు గ్రహించలేని రామోజీ.
క్రికెటర్ అంబటి రాయుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకు రాజీనామా చేయడం వెనుక వాస్తవాన్ని గ్రహించలేని ఈనాడు రామోజీ చిలవలుపలవలు చేసి ఇష్టానుసారం ఈనాడులో రాసుకుని సంతోషించారు. అయితే యూఏఈ క్రికెట్ బోర్డు నిర్వహించనున్న ఇంటర్నేషనల్ లీగ్ టీ20 లో ముంబై ఇండియన్ ఎమిరేట్స్ జట్టు తరపున తాను… pic.twitter.com/hMKmDivRpE
— YSR Congress Party (@YSRCParty) January 7, 2024
7:20 AM, జనవరి 8, 2024
నేడు బద్వేలులో సామాజిక సాధికార బస్సుయాత్ర
- స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సుధా, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి అధ్వర్యంలో భారీ ఏర్పాట్లు
- ఉదయం 11 గంటలకు ఎన్టీవో కాలనీలోని బంగారు శీనయ్య నివాసంలో మేధావుల సమావేశం.
- ఉదయం 11:30 గంటలకు విలేకరుల సమావేశం
- అనంతరం సిద్దవటం రోడ్డులోని సీఎస్ఐ చర్చి నుంచి ర్యాలీ
- నాలుగు రోడ్ల కూడలిలో సభ
- సభకు హజరుకానున్న డిప్యూటి సిఎం నారాయణస్వామీ. మంత్రి విడదల రజిని, ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు, ప్రముఖ నటుడు అలీ, మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్, మాజీ ఎంపి బుట్టా రేణుక.
7:00 AM, జనవరి 8, 2024
టీడీపీకి మరో షాక్..
- ఎంపీ కేశినేని నాని బాటలోనే కుమార్తె శ్వేత
- టీడీపీకి గుడ్ బై చెప్పనున్న కేశినేని శ్వేత
- విజయవాడ 11వ డివిజన్ కార్పొరేటర్గా శ్వేత
- నా కూతురు కార్పొరేటర్ పదవితో పాటు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుందన్న నాని
- ఈరోజు ఉదయం10:30 గంటలకు మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో శ్వేత తన రాజీనామా లేఖను అందజేస్తుంది: కేశినేని నాని
అందరికీ నమస్కారం 🙏🏼
— Kesineni Nani (@kesineni_nani) January 7, 2024
ఈ రోజు శ్వేతా 10.30 గంటలకు మునిసిపల్ కార్పొరేషన్ ఆఫిసుకు వెళ్ళి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేసి ఆమోదింప చేయించుకొని మరుక్షణం తెలుగుదేశం పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తుంది . pic.twitter.com/gANCVCKrZJ
6:45 AM, జనవరి 8, 2024
రాష్ట్రంలో ఎన్నికల కమిషన్ పర్యటన
- రాష్ట్రంలో మూడు రోజులపాటు కేంద్ర ఎన్నికల కమిషన్ పర్యటన
- నేడు విజయవాడ చేరుకోనున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం
- రాష్ట్రంలో సీఈసీ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్ల పర్యటన
- రేపు రాజకీయ పార్టీలతో భేటీ కానున్న కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం
- ఓటర్ల జాబితాలో తప్పిదాలు.. ఫిర్యాదులపై ఎన్నికల ప్రధానాధికారితో సమీక్ష
- జిల్లాల ఎన్నికల అధికారులు, కలెక్టర్లు, ఎస్పీలతో సీఈసీ సమీక్ష
- ఈ నెల 10న ఎన్నికల సన్నద్ధతపై ప్రజెంటేషన్ ఇవ్వనున్న సీఈవో ముఖేష్ కుమార్ మీనా
- ఈనెల 10న కేంద్ర విభాగాలు, సీఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో సీఈసీ భేటీ
- అదేరోజు సా. 4:30 గంటలకు సీఈసీ, ఎన్నికల కమిషనర్ల మీడియా సమావేశం
- అనంతరం ఢిల్లీకి తిరిగి వెళ్ళనున్న సీఈసీ, ఎన్నికల కమిషనర్లు.
6:30 AM, జనవరి 8, 2024
ఏం చేశాడని బాబు పిలిస్తే రావాలి!
- రా.. కదలిరా అని చంద్రబాబు పిలవగానే జనం ఎందుకు రావాలి?
- టీడీపీ అధినేతపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు
- పగవాడికి కూడా చంద్రబాబుకు పట్టిన గతి పట్టకూడదు
- బెంగళూరు, హైదరాబాద్ లాంటి అవకాశాలను కల్పిస్తానంటూ కనిగిరి ప్రజలకు అరచేతిలో వైకుంఠం చూపించారు
- చంద్రబాబు, పవన్ లకు పిచ్చిమాటలు మాట్లాడే అవలక్షణం ఉంది
- జగన్ 17 మెడికల్ కాలేజీలు, పోర్టులు, సచివాలయాలు, స్కూల్స్ కట్టించారు
- లక్షల కోట్ల విలువైన పరిశ్రమలు రాష్ట్రానికి వచ్చాయి
- చంద్రబాబు లేకపోతే రాష్ట్ర ప్రజలు అసలు విమానాలే ఎక్కనట్లు మాట్లాడుతున్నారు
- అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయని చంద్రబాబు.. అధికారం ఇస్తే అన్నీ చేస్తామంటారు
- బిగ్ బజారులో వాటాలు ఉన్న చంద్రబాబు నిత్యావసర వస్తువులను ఎందుకు అధికంగా అమ్ముతున్నారు
- ప్రజలను తాగుబోతులను చేసేలా చంద్రబాబు మాటలు ఉన్నాయి
- బీసీలకు ఏం చేశావని చంద్రబాబుకు ఓట్లు వేయాలి?
- ఎన్నికల సమయంలో మాత్రమే బీసీలు గుర్తుకు వస్తారా?
- చంద్రబాబుకు ఆయన ఇంట్లో, బంధువుల్లోనూ వ్యతిరేకమే
- ఎన్టీఆర్ కుటుంబం నుండి తోడపుట్టిన సోదరులు, అక్క, వారి పిల్లలు అందరూ వ్యతిరేకమే
- అలాంటి వ్యక్తి ఎదుటివారి గురించి ఎలా మాట్లాడతారు?
- రాష్ట్రాల వారి మ్యానిఫెస్టోని కాపీ కొట్ఠం తప్ప సొంత ఆలోచనలే లేని పార్టీ టీడీపీ
- 2014లో 600 హామీలు ఇచ్చి ఒక్కటీ అమలు చేయని వ్యక్తి చంద్రబాబు
- అలాంటి వ్యక్తిని రాష్ట్ర ప్రజలు ఎందుకు నమ్మాలి?
- కాపులకు ఇచ్చిన హామీలను అమలు చేయమని అప్పట్లో తునిలో మీటింగ్ పెట్టారు
- చంద్రబాబు, పవన్ ఇచ్చిన హామీలను అమలు చేయమనే కాపులు ఉద్యమం చేశారు
- మరి ఇప్పటికీ పవన్, చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదు?
- తనకు కులం లేదన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు?
- అధికారం కోసం, అవసరాల కోసం వచ్చినవారే ఇప్పుడు మా పార్టీ వీడుతున్నారు
- జగన్ని నమ్మిన వారంతా పార్టీలోనే ఉన్నారు
- జనసేనకు నాయకులు లేకనే ఇతర పార్టీల వారిని ఆహ్వానిస్తున్నారు
- షర్మిళ ఒక రాజకీయ నాయకురాలు
- ఆమె ఏపీకి వస్తే మాకేం ఇబ్బంది ఉంటుంది?
- వైసీపిని జగన్ ప్రారంభించారు
- ఆయన్ను చూసే షర్మిళ ఐనా, నేనైనా ఇంకొందరైనా పార్టీలో చేరాం
- కొందరు వదిలేది పోయినంత మాత్రాన ఏం జరుగుతుంది?
- జగన్ బొమ్మ లేకుండా కాపు రామచంద్రారెడ్డి గెలవలేరు