
తిరుపతి, సాక్షి: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఉచిత సర్వదర్శనానికి 31 కంపార్ట్మెంట్లలో వేచివున్న భక్తులు. దర్శనానికి 18 గంటల సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పేర్కొంది.
మరోవైపు.. టైమ్ స్లాట్ ఎస్ఎస్డి దర్శనం కోసం 13 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉండగా.. 12 గంటల సమయం పడుతోంది. ఇక.. నిన్న స్వామివారిని 57,973 భక్తులు దర్శించుకున్నారు. అందులో 21,722 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. స్వామివారి హుండీ ఆదాయం 3.95 కోట్లుగా లెక్క తేలింది.