breaking news
WCL 2025
-
పాక్తో మ్యాచ్ బహిష్కరణ: స్పందించిన ధావన్.. మాలో కొందరు..
పాకిస్తాన్ చాంపియన్స్తో మ్యాచ్ను బహిష్కరించడంపై టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (Shikhar Dhawan) స్పందించాడు. తనపై ఎవరి ఒత్తిడీ లేదని.. తన మనసు చెప్పినట్లు మాత్రమే నడుచుకున్నానని తెలిపాడు. కాగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) -2025 టోర్నమెంట్లో భారత్ పాకిస్తాన్తో మ్యాచ్లను బహిష్కరించిన విషయం తెలిసిందే.సెమీ ఫైనల్లోనూ..లీగ్ దశలో దాయాదితో పోటీ పడాల్సి రాగా ఇండియా చాంపియన్స్ మ్యాచ్ను బాయ్కాట్ చేసింది. అనంతరం ఇరుజట్లు తొలి సెమీ ఫైనల్లో తలపడాల్సి వచ్చింది. ఒకవేళ ఈ మ్యాచ్ను కూడా బహిష్కరిస్తే టోర్నీ నుంచే తప్పుకోవాల్సిన పరిస్థితి. అయినప్పటికీ భారత ఆటగాళ్లు.. తమకు దేశమే ముఖ్యమంటూ చిరకాల ప్రత్యర్థితో మ్యాచ్ ఆడేది లేదని తేల్చిచెప్పారు.పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా ఇండియా చాంపియన్స్ టోర్నీ నుంచి నిష్క్రమించగా.. పాకిస్తాన్ చాంపియన్స్ ఫైనల్ చేరింది. టైటిల్ పోరులో సౌతాఫ్రికా చేతిలో ఓడి పాక్ మరోసారి రన్నరప్తో సరిపెట్టుకుంది.పూర్తి స్పృహలో ఉండే ఈ నిర్ణయంఈ పరిణామాల నేపథ్యంలో ఇండియా చాంపియన్స్ ఓపెనర్ శిఖర్ ధావన్ తాజాగా మాట్లాడుతూ.. ‘‘పాకిస్తాన్తో మ్యాచ్ ఆడటం వ్యక్తిగతంగా నాకు అస్సలు ఇష్టం లేదు. పూర్తి స్పృహలో ఉండి నేను ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాను.మా జట్టులోని కొంత మంది నాతో పాటు ఏకీభవించారు. భజ్జీ పా (హర్భజన్ సింగ్) కూడా ఇదే అభిప్రాయం వ్యక్తపరిచారు. అందుకే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడకూడదని నిశ్చయించుకున్నాం.ఎవరూ ఒత్తిడి చేయలేదుమ్యాచ్ నుంచి తప్పుకోవాలని మాపై ఎవరూ ఒత్తిడి చేయలేదు. పాకిస్తాన్తో ఆడటం మాలో కొందరికి ఏమాత్రం ఇష్టం లేదు. పాక్తో మ్యాచ్ ఆడటానికి మాకు ఎటువంటి సరైన కారణం కనిపించనే లేదు. అంతకుమించి ఏమీ లేదు’’ అని తెలిపాడు. క్రిక్బ్లాగర్తో ముచ్చటిస్తూ ధావన్ ఈ మేరకు తన మనసులోని అభిప్రాయాలు పంచుకున్నాడు.తొలి చాంపియన్ ఇండియాకాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో నిర్వహిస్తున్న టీ20 టోర్నీయే డబ్ల్యూసీఎల్. గతేడాది ఇంగ్లండ్ వేదికగా మొదలైన ఈ పొట్టి ఫార్మాట్ టోర్నీలో ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ చాంపియన్స్ రూపంలో ఆరు జట్లు పాల్గొంటున్నాయి. ఇక అరంగేట్ర సీజన్ ఫైనల్లో యువరాజ్ సింగ్ కెప్టెన్సీలోని ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్ను ఓడించి టైటిల్ గెలిచింది.ఇదిలా ఉంటే.. జమ్మూకశ్మీర్లోని ప్రశాంత పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి.. అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో భారత ఆర్మీ.. పాక్ ఆక్రమిత, పాక్లో ఉన్న ఉగ్రవాద శిబిరాలను నాశనం చేసింది. దీంతో పాక్ ఆర్మీ ప్రతిదాడికి యత్నించగా.. భారత సైన్యం గట్టిగా కౌంటర్ ఇచ్చింది. డబ్ల్యూసీఎల్-2025లో ఇండియా చాంపియన్స్ జట్టు ఇదేయువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.చదవండి: బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం! -
బహిష్కరించిన భారత్.. పాక్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం!
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)-2025 టోర్నమెంట్లో సెమీస్ ఆడకుండానే ఇండియా చాంపియన్స్ వెనుదిరిగింది. సెమీ ఫైనల్లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (IND vs PAK)ను ఎదుర్కోవాల్సి రావడమే ఇందుకు కారణం. పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ ఎలాంటి ‘బంధం’ వద్దంటూ భారత ఆటగాళ్లు ఈ మ్యాచ్ను బహిష్కరించారు.దేశమే ముఖ్యమంటూ..ఫలితంగా ఇండియా చాంపియన్స్ టోర్నమెంట్ నుంచే వెనుదిరిగాల్సి వచ్చినా.. దేశమే తమకు ముఖ్యమంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు.. ఇండియా చాంపియన్స్ తప్పుకోవడంతో పాకిస్తాన్ చాంపియన్స్ నేరుగా ఫైనల్కు చేరుకుంది.సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డువేఇక ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇకపై ప్రైవేట్ క్రికెట్ లీగ్లలో దేశం పేరును వాడటాన్ని పూర్తిగా నిషేధించినట్లు సమాచారం. వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం.. ‘‘ప్రైవేట్ సంస్థలు పాకిస్తాన్ పేరును తమ లీగ్లలో ఉపయోగిస్తే వారిపై చట్టబద్ధమైన చర్యలు తీసుకుంటాం.క్రికెట్ ఈవెంట్లలో దేశం పేరు వాడుకునే సర్వహక్కులు పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు మాత్రమే ఉన్నాయి. గురువారం జరిగిన బోర్డ్ డైరెక్టర్ల సమావేశంలో కూలంకషంగా చర్చించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారు.డబ్ల్యూసీఎల్ రెండో ఎడిషన్లో భారత క్రికెటర్లు పాకిస్తాన్తో ఆడమంటూ తిరస్కరించడం.. దేశ గౌరవానికి భంగం కలిగించింది. అందుకే ప్రైవేటు లీగ్లలో దేశం పేరు వాడవద్దని నిర్ణయించారు’’ అని పీసీబీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.ఆసియా కప్లో మాత్రం దాయాదుల పోరు!ఇదిలా ఉంటే.. ఆసియా కప్-2025లో మాత్రం టీమిండియా పాకిస్తాన్తో ఆడేందుకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చినట్లు తెలుస్తోంది. ఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ టోర్నీకి భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సి ఉంది. అయితే, తటస్థ వేదికలపై మాత్రమే ఆడతామంటూ దాయాదులు గతంలో చేసుకున్న ఒప్పందం ప్రకారం.. యూఏఈలో టోర్నీ జరుగనుంది.ఈ క్రమంలో లీగ్ దశలో ఓసారి, సూపర్ ఫోర్ మ్యాచ్లో ఓసారి చిరకాల ప్రత్యర్థులు తలపడే అవకాశం ఉంది. మరోవైపు.. డబ్ల్యూసీఎల్-2025లో శనివారం నాటి ఫైనల్లో పాకిస్తాన్.. సౌతాఫ్రికా చాంపియన్స్ను ఢీకొట్టనుంది. ఇదిలా ఉంటే.. పహల్గామ్లో ఉగ్రదాడికి బదులు.. భారత్ ‘ఆపరేషన్ సిందూర్’తో పాక్ ఆక్రమిత కశ్మీర్, పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం బదులివ్వగా.. భారత ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.చదవండి: IPL 2026: గైక్వాడ్పై వేటు.. సీఎస్కే కెప్టెన్గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను? -
‘మీకు మరో దారి లేదు’.. ఆఫ్రిది ఓవరాక్షన్.. దిమ్మతిరిగిపోయింది!
పాకిస్తాన్ మాజీ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)కి ఇండియా చాంపియన్స్ దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చింది. ‘ఏ ముఖం పెట్టుకుని వస్తారో చూడాలని ఉంది’ అంటూ అతడు చేసిన ‘అతి’ వ్యాఖ్యలకు.. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఆడకపోవడమే ఉత్తమం అంటూ వాకౌట్ ద్వారా సమాధానం ఇచ్చింది. కాగా ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ (WCL) టోర్నమెంట్లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరిన విషయం తెలిసిందే. అయితే, సెమీ ఫైనల్ పోరులో దాయాది పాకిస్తాన్తో భారత్ తలపడాల్సి వచ్చింది. అయితే, టీమిండియా ఇందుకు నిరాకరించింది.లీగ్ దశలోనూలీగ్ దశలోనూ పాకిస్తాన్తో మ్యాచ్ను బహిష్కరించిన భారత స్టార్లు... దాయాదితో మైదానంలో తలపడేది లేదని మరోసారి తేల్చిచెప్పారు. జమ్మూ కశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని... భారత చాంపియన్స్ జట్టు ప్లేయర్లు శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, సురేశ్ రైనా (Suresh Raina) స్పష్టం చేశారు.ఇక లీగ్ దశలో పాక్తో మ్యాచ్ను బహిష్కరించిన భారత్... మిగిలిన నాలుగు మ్యాచ్ల్లో ఒక దాంట్లో గెలిచి మూడింట ఓడి 3 పాయింట్లు దక్కించుకుంది. అయితే చివరి లీగ్ మ్యాచ్లో వెస్టిండీస్పై భారీ విజయం నమోదు చేసుకున్న భారత్... మెరుగైన రన్రేట్తో సెమీఫైనల్కు దూసుకెళ్లింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన పాకిస్తాన్తో గురువారం ఎడ్జ్బాస్టన్ వేదికగా జరగనున్న తొలి సెమీఫైనల్లో భారత్ తలపడాల్సి ఉండగా... మన ప్లేయర్లు ఈ మ్యాచ్ను సైతం బహిష్కరించారు.వాళ్లకు మరోదారి లేదు.. అస్సలు ఆడముఅయితే, ఈ సెమీ ఫైనల్ కంటే ముందు మీడియాతో మాట్లాడుతూ షాహిద్ ఆఫ్రిది ఓవరాక్షన్ చేశాడు. ‘‘భారత జట్టు ఏ ముఖం పెట్టుకుని మాతో ఆడుతుందో చూడాలని ఉంది. మాతో ఆడటం తప్ప వాళ్లకు ఇప్పుడు మరోదారి లేదు’’ అంటూ వ్యాఖ్యానించాడు. కానీ దేశమే తమకు ముఖ్యమంటూ భారత క్రికెటర్లు పాక్తో మ్యాచ్ను బహిష్కరించారు. అయితే, భారత జట్టు నిర్ణయంతో పాక్ ఫైనల్కు చేరింది. మరోవైపు.. యువీ సేన టోర్నీ నుంచి నిష్క్రమించినా.. దేశ ప్రజల కోసం సరైన పనే చేశామనే సంతోషంతో వెనుదిరిగింది. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో క్రీడల్లోనూ బంధం కొనసాగించడం సరికాదనే అభిప్రాయంతో డిఫెండింగ్ చాంపియన్ స్వయంగా సెమీస్ పోరు నుంచి బయటకు వచ్చింది.నాడు ఆఫ్రిదికి ధావన్ కౌంటర్కాగా షాహిద్ ఆఫ్రిదికి నోటి దురుసు ఎక్కువేనన్న విషయం తెలిసిందే. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడికి బదులుగా భారత సైన్యం ‘ఆపరేషర్ సిందూర్’ పేరిట.. ముష్కరులను మట్టుపెడితే షాహిద్ ఆఫ్రిది బాధపడిపోయాడు. తప్పు మీదేనంటూ భారత ఆర్మీని కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ షాహిద్ ఆఫ్రిదిని ఉద్దేశించి.. ‘‘కార్గిల్ యుద్ధంలో పాకిస్తాన్ను మట్టికరిపించిన భారత సైన్యం గురించి మాట్లాడుతున్నారా? మీకు ఇంకా బుద్ధిరాలేదా? ఇలాంటి వ్యాఖ్యలు చేసే బదులు దేశ అభివృద్ధి మీద దృష్టి పెట్టండి’’ అంటూ చురకలు అంటించాడు.ఆరు జట్లుఇక అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో కూడిన ఆరుజట్లు ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ ఆడుతున్నాయి. 2024లో ఈ టోర్నీ మొదలుకాగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్.. ఫైనల్లో పాకిస్తాన్ చాంపియన్స్ను ఓడించి టైటిల్ గెలిచింది. కాగా భారత్, పాక్తో పాటు ఈ ఈవెంట్లో సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు పాల్గొంటున్నాయి. ఈ సీజన్లో భారత్- పాక్ మధ్య జరగాల్సిన తొలి సెమీ ఫైనల్ రద్దుకాగా.. రెండో సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా గురువారం (జూలై 31) అమీతుమీ తేల్చుకుంటాయి. చదవండి: AUS vs IND: ఆస్ట్రేలియా టూర్కు భారత జట్టు ప్రకటన.. వైభవ్ సూర్యవంశీకి చోటు -
WCL: సెమీస్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్.. తప్పుకొన్నారు!
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)- 2025 సెమీ ఫైనల్ బెర్తులు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో టాపర్గా ఉన్న పాకిస్తాన్ చాంపియన్స్తో పాటు సౌతాఫ్రికా చాంపియన్స్, ఆస్ట్రేలియా చాంపియన్స్ ముందుగానే టాప్-4లో అడుగుపెట్టాయి.తాజాగా వెస్టిండీస్ చాంపియన్స్ను ఓడించి.. మెరుగైన నెట్రన్రేటు సాధించిన ఇండియా చాంపియన్స్ (India Champions) కూడా సెమీస్కు అర్హత సాధించింది. ఈ నేపథ్యంలో తొలి సెమీ ఫైనల్లో టాపర్ పాకిస్తాన్ను ఇండియా ఢీకొట్టనుండగా.. రెండో సెమీస్ మ్యాచ్లో సౌతాఫ్రికా- ఆస్ట్రేలియా తలపడతాయి.బర్మింగ్హామ్ వేదికగా గురువారం సాయంత్రం ఐదు గంటలకు ఇండియా వర్సెస్ పాక్ (Ind vs Pak), రాత్రి తొమ్మిది గంటలకు సౌతాఫ్రికా- ఆసీస్ (SA vs AUS) మ్యాచ్లకు షెడ్యూల్ ఖరారైంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో గ్రూప్ దశలోనే దాయాది పాక్తో ఆడేందుకు భారత జట్టు నిరాకరించిన విషయం తెలిసిందే. దీంతో మ్యాచ్ రద్దు కాగా.. ఇరుజట్లకు చెరో పాయింట్ వచ్చింది.సెమీస్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్అయితే, తాజాగా సెమీస్లోనూ చిరకాల ప్రత్యర్థితో యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ పోటీపడాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఒకవేళ భారత జట్టు ఈ మ్యాచ్ నుంచి తప్పుకొంటే.. టోర్నీ నుంచి నిష్క్రమించాల్సి ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ ఏ నిర్ణయం తీసుకుంటుందోననే ఉత్కంఠ నెలకొంది.ఈ నేపథ్యంలో డబ్ల్యూసీఎల్ టాప్ స్పాన్సర్ ఈజ్మైట్రిప్ మాత్రం భారత్ వర్సెస్ పాకిస్తాన్ సెమీస్ పోరు నుంచి తప్పుకొంది. ఈ మ్యాచ్కు తాము స్పాన్సర్గా వ్యవహరించలేమంటూ సంస్థ వ్యవస్థాపకుడు నిశాంత్ పిట్టి సోషల్ మీడియా వేదికగా బుధవారం వెల్లడించాడు.మాకు దేశమే ముఖ్యం‘‘డబ్ల్యూసీఎల్ సెమీ ఫైనల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్. వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇక్కడి వరకు చేరుకుంది. దేశాన్ని గర్వించేలా చేసింది. అయితే, పాకిస్తాన్తో జరుగబోయే సెమీ ఫైనల్ మ్యాచ్ కేవలం ఆటలో భాగం కాదు.. ఉగ్రవాదం, క్రికెట్ ఒకే ఒరలో ఇమడలేవు. మేము ఎల్లప్పుడూ జాతికి మద్దతుగా నిలబడతాం.ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దేశంతో ఎలాంటి సంబంధాన్ని మేము అంగీకరించము. దేశ ప్రజల మనోభావాలు మేము అర్థం చేసుకుంటాము. అందుకే మేము డబ్ల్యూసీఎల్లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కు అండగా ఉండలేము. కొన్ని విషయాలు క్రీడల కంటే కూడా ముఖ్యమైనవి. ముందు దేశం.. ఆ తర్వాతే వ్యాపారం. జై హింద్ ’’ అంటూ నిశాంత్ పిట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఇంగ్లండ్ వేదికగా డబ్ల్యూసీఎల్ పేరిట టీ20 టోర్నమెంట్ నిర్వహిస్తున్నారు.చదవండి: బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. ఇండియా సెమీస్లో చేరిందిలా! -
బిన్నీ విధ్వంసం, యువీ, పఠాన్ మెరుపులు.. సెమీస్లో ఇండియా
ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025లో ఇండియా చాంపియన్స్ సెమీస్ చేరింది. లీసెస్టర్ వేదికగా తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ చాంపియన్స్ను చిత్తు చేసి సెమీ ఫైనల్ బెర్తు ఖరారు చేసుకుంది. డబ్ల్యూసీఎల్ తాజా సీజన్ (WCL 2025)లో టీమిండియాకు ఇది తొలి విజయమే అయినా.. ఏకంగా టాప్-4కు అర్హత సాధించడం విశేషం.వరుస ఓటములుఈ టీ20 టోర్నమెంట్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగింది ఇండియా. తొలి మ్యాచ్లో పాకిస్తాన్తో తలపడాల్సి ఉండగా.. ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో దాయాదితో మ్యాచ్ను రద్దు చేసుకుంది. అనంతరం సౌతాఫ్రికా చాంపియన్స్తో తలపడి 88 పరుగుల తేడాతో ఓటమిని చవిచూసింది.ఆ తర్వాత ఆస్ట్రేలియా చాంపియన్స్తో మ్యాచ్లో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. అనంతరం ఇంగ్లండ్ చాంపియన్స్ చేతిలో 23 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. ఇలా వరుస ఓటములతో సెమీస్ అవకాశాలు సంక్లిష్టం చేసుకున్న యువరాజ్ సేన.. విండీస్తో తాజా మ్యాచ్లో మాత్రం అదరగొట్టింది.చెలరేగిన భారత బౌలర్లుగ్రేస్ రోడ్ మైదానంలో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ చేసిన ఇండియా.. వెస్టిండీస్ను 144 పరుగులకు కట్టడి చేసింది. ఇండియా బౌలర్ల ధాటికి విండీస్ టాపార్డర్ కుప్పకూలింది. ఓపెనర్లు లెండిల్ సిమ్మన్స్ (2), కెప్టెన్ క్రిస్ గేల్ (9)తో పాటు వన్డౌన్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ (0) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు.మిగతా వారిలో డ్వేన్ స్మిత్ (20) కాస్త ఫర్వాలేదనిపించగా.. కీరన్ పొలార్డ్ వింటేజ్ ఆటను గుర్తుచేశాడు. కేవలం 43 బంతుల్లోనే 3 ఫోర్లు, 8 సిక్సర్లు బాది 74 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఫలితంగా వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు పడగొట్టగా.. వరుణ్ ఆరోన్, స్టువర్ట్ బిన్నీ రెండేసి వికెట్లు కూల్చారు. పవన్ నేగి ఒక వికెట్ దక్కించుకున్నాడు.14 ఓవర్లలోనే ఛేదించాలిఅయితే, సెమీస్ సమీకరణల దృష్ట్యా ఈ లక్ష్యాన్ని ఇండియా చాంపియన్స్ 14 ఓవర్లలోనే ఛేదించాలి. తద్వారా సెమీ ఫైనల్ రేసులో ఉన్న ఇంగ్లండ్ కంటే మెరుగైన రన్రేటుతో ముందుకు వెళ్లే వీలుంటుంది. ఇలాంటి తరుణంలో ఇండియా చాంపియన్స్ అద్భుతమే చేసింది. కేవలం ఐదు వికెట్లు నష్టపోయి 13.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించి సత్తా చాటింది.బిన్ని మెరుపు అర్ధ శతకంస్టువర్ట్ బిన్ని మెరుపు అర్ధ శతకంతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కేవలం 21 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 50 పరుగులతో అజేయంగా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (11 బంతుల్లో 21)తో పాటు యూసఫ్ పఠాన్ (7 బంతుల్లో 21 నాటౌట్) ధనాధన్ దంచికొట్టారు. Mountains are there to be climbed 💪Faced with a stiff target of 145 in 14.1 overs to qualify for the semis, India got there with ease thanks to fireworks from Stuart Binny & Yusuf Pathan 🇮🇳#WCL2025 pic.twitter.com/eGOorYFQbq— FanCode (@FanCode) July 29, 2025మిగతా వారిలో ఓపెనర్ శిఖర్ ధావన్ (18 బంతుల్లో 25) రాణించగా.. రాబిన్ ఊతప్ప (8), గురుకీరత్ సింగ్మాన్ (7), సురేశ్ రైనా (7) విఫలమయ్యారు. ఇక 13.2 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 148 పరుగులు చేసిన ఇండియా చాంపియన్స్ ఇంగ్లండ్ను వెనక్కి నెట్టి సెమీస్లో అడుగుపెట్టింది.పాక్తో సెమీస్... ఇండియా ఆడుతుందా? ఆరుజట్లు పాల్గొంటున్న ఈ టోర్నీలో పాకిస్తాన్, సౌతాఫ్రికా చాంపియన్స్ ఐదింట చెరో నాలుగు గెలిచి ముందుగానే సెమీస్ బెర్తు ఖరారు చేసుకున్నాయి. ఇక ఆస్ట్రేలియా చాంపియన్స్ ఐదింట రెండు, ఇండియా చాంపియన్స్ (రన్రేటు: -0.558) ఒకటి గెలిచి టాప్-4లో నిలిచాయి. ఇంగ్లండ్ ఐదింట ఒకటి (రన్రేటు: -0.809), వెస్టిండీస్ చాంపియన్స్ ఐదింట ఒకటి (రన్రేటు: -2.302) మాత్రమే గెలిచి.. నెట్ రన్రేటు పరంగానూ వెనుకబడి ఎలిమినేట్ అయ్యాయి. ఇదిలా ఉంటే.. తొలి సెమీ ఫైనల్లో ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్తో తలపడాల్సి ఉంది. అయితే, ఈ మ్యాచ్లో ఇండియా ఆడుతుందా? లేదంటే టోర్నీ నుంచే తప్పుకొంటుందా? అనేది తేలాల్సి ఉంది. చదవండి: ‘స్టోక్స్ చేసింది కరెక్టే.. జడ్డూ, వాషీ అలా చేయడం సరికాదు’ -
‘పాక్తో మ్యాచ్ ఆడాలి’!.. గంగూలీపై అభిమానుల ఆగ్రహం
టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ (Sourav Ganguly)పై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదా నుంచి ఇలాంటి వ్యాఖ్యలు ఊహించలేదని వాపోతున్నారు. అసలేం జరిగిందంటే.. ఆసియా కప్-2025 (Asia Cup) టోర్నమెంట్కు ఇటీవలే షెడ్యూల్ విడుదలైన విషయం తెలిసిందే.కుదిరితే మూడుసార్లుఈసారి టీ20 ఫార్మాట్లో నిర్వహించే ఈ మెగా ఈవెంట్లో భారత్, పాకిస్తాన్ ఒకే గ్రూపులో ఉన్నాయి. ఇరుజట్లు సెప్టెంబరు 14న దుబాయ్లో ముఖాముఖి తలపడనున్నాయి. ఆసియా క్రికెట్ మండలి (ACC) ప్రసారకర్తలతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం సూపర్ ఫోర్ దశలో ఇరుజట్లు మరోసారి పరస్పరం ఢీకొట్టే అవకాశం ఉంది. అంతా సవ్యంగా సాగి.. మెరుగైన ప్రదర్శన కనబరిస్తే సెప్టెంబరు 28 నాటి ఫైనల్లోనూ దాయాదులు పోటీపడతాయి. నిజానికి ఈ టోర్నీ ఆతిథ్య హక్కులు భారత్వి. అయితే, అంతకుముందు పాక్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 నిర్వహణ హక్కులు దక్కించుకోగా.. టీమిండియాను అక్కడికి పంపేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిరాకరించింది. తటస్థ వేదికపైనేభద్రతా కారణాల దృష్ట్యా పాక్కు వెళ్లలేమని ఐసీసీకి తేల్చిచెప్పింది. ఈ క్రమంలో దుబాయ్ వేదికగా ఈ టోర్నీ జరుగగా.. టీమిండియా చాంపియన్గా నిలిచింది.అయితే, నాటి చర్చల ప్రకారం 2027 వరకు భారత్- పాక్ ఏ టోర్నీ ఆతిథ్య హక్కులు దక్కించుకున్నా తటస్థ వేదికపైనే ఆడాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇరుదేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల నేపథ్యంలో ఇందుకు అంగీకరించాయి. కానీ.. ఇటీవల పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో మరోసారి పరిస్థితులు శ్రుతిమించాయి.పాక్కు బుద్ధి చెప్పిన భారత సైన్యంప్రశాంతమైన పహల్గామ్ లోయలో ఉగ్రవాదులు కాల్పులకు తెగబడి అమాయక పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. ఇందుకు ప్రతిగా భారత సైన్యం పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. అయితే, ఉగ్రవాదులపై జరిపిన దాడులకు పాక్ సైన్యం స్పందిస్తూ.. ప్రతిదాడికి దిగగా.. ఇండియన్ ఆర్మీ గట్టిగా బుద్ధిచెప్పింది.ఈ నేపథ్యంలో ఇకపై పాకిస్తాన్తో ఎటువంటి సంబంధాలు పెట్టుకోకూడదని.. క్రీడల్లోనూ బంధం తెంచుకోవాలనే డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై గంగూలీ గతంలో స్పందిస్తూ.. ఈ డిమాండ్లకు మద్దతు తెలిపాడు. అయితే, తాజాగా మరోసారి ఆసియా కప్-2025 నేపథ్యంలో ఇందుకు సంబంధించి ప్రశ్న ఎదురుకాగా దాదా భిన్నంగా స్పందించాడు.పాక్తో మ్యాచ్.. ఆటలు కొనసాగాలి‘‘ఇరుజట్లు పరస్పరం పోటీపడటంలో నాకెలాంటి ఇబ్బందీ లేదు. ప్రణాళిక ప్రకారం క్రీడలు కొనసాగాలి. అదే సమయంలో పహల్గామ్ వంటి ఘటనలను అరికట్టాలి. అయితే, ఆటలు మాత్రం కొనసాగుతూనే ఉండాలి. ఉగ్రవాదాన్ని సమూలంగా నాశనం చేయాలి. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ పటిష్టమైన చర్యలు తీసుకుంటోంది. కాబట్టి క్రీడలు కొనసాగించడంలో తప్పులేదు’’ అని బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ చెప్పుకొచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా.. నెటిజన్లు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఇటీవల ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 సీజన్లో భాగంగా ఇండియా- పాకిస్తాన్తో తలపడాల్సి ఉండగా.. విమర్శల నేపథ్యంలో మ్యాచ్ రద్దైపోయింది. ఇండియా చాంపియన్స్ జట్టులో భాగమైన శిఖర్ ధావన్, సురేశ్ రైనా తదితరులు పాక్తో ఆడేందుకు విముఖత వ్యక్తం చేయడంతో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఆసియా కప్ వంటి కీలక టోర్నీలో బీసీసీఐ.. దాయాదితో ముఖాముఖి పోరు నాటికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి!చదవండి: Asia Cup 2025: పూర్తి షెడ్యూల్ విడుదల.. భారత్- పాక్ మ్యాచ్లు ఎప్పుడంటే? #WATCH | Kolkata: On India-Pakistan placed in the same group in the Asia Cup, former Indian cricketer Saurav Ganguly says, "I am okay. The sport must go on. At the same time Pahalgam should not happen, but the sport must go on. Terrorism must not happen; it needs to be stopped.… pic.twitter.com/Qrs17KOKrN— ANI (@ANI) July 27, 2025 -
IND vs AUS: ధావన్ ధనాధన్.. పఠాన్ విధ్వంసం.. యువీ ఫెయిల్
ఆస్ట్రేలియా చాంపియన్స్తో మ్యాచ్లో ఇండియా చాంపియన్స్ (INDCH vs AUSCH) భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ధనాధన్ ఇన్నింగ్స్తో దంచికొట్టగా.. ఆల్రౌండర్ యూసఫ్ పఠాన్ విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. వీరిద్దరి అద్భుత ప్రదర్శన నేపథ్యంలో.. నిర్ణీత 20 ఓవర్లలో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్లు మాత్రమే నష్టపోయి 203 పరుగులు సాధించింది.కాగా ప్రపంచ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL 2025)లో భాగంగా శనివారం నాటి మ్యాచ్లో ఇండియా- ఆస్ట్రేలియా తలపడుతున్నాయి. ఇంగ్లండ్లోని లీడ్స్లో గల హెడింగ్లీ మైదానంలో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ధావన్ సెంచరీ మిస్ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన ఇండియా చాంపియన్స్కు ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (Robin Uthappa), శిఖర్ ధావన్ శుభారంభం అందించారు. ఊతప్ప 21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 37 పరుగులు చేయగా.. ధావన్ మెరుపు ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నాడు. మొత్తంగా 60 బంతులు ఎదుర్కొన్న గబ్బర్ 12 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 91 పరుగులు చేశాడు.The 𝕆𝔾 duo roll back the good 'ol days 🔥Team 🇮🇳 race to 62/2 in six overs all thanks to a flurry of boundaries 🤩Are we in for a 200+ total? Find the answers right away, LIVE on FanCode 😎#WCL2025 pic.twitter.com/PGO86izRKQ— FanCode (@FanCode) July 26, 2025 ఆఖరి వరకు అజేయంగా ఉన్న ధావన్.. దురదృష్టవశాత్తూ.. సెంచరీకి తొమ్మిది పరుగుల దూరంలో నిలిచిపోయాడు. ఇక వన్డౌన్ బ్యాటర్ అంబటి రాయుడు డకౌట్ కాగా.. సురేశ్ రైనా (11) కూడా నిరాశపరిచాడు. కెప్టెన్ యువరాజ్ సింగ్ (3) కూడా విఫలం కాగా.. యూసఫ్ పఠాన్ తుపాన్ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు.పఠాన్ ఫటాఫట్ కేవలం 23 బంతుల్లోనే 52 పరుగులతో పఠాన్ దుమ్ములేపాడు. ధావన్తో కలిసి ఆఖరి వరకు నాటౌట్గా నిలిచిన ఈ బ్యాటింగ్ ఆల్రౌండర్ ఇన్నింగ్స్లో మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి. ఇక ఆస్ట్రేలియా బౌలర్లలో డానియల్ క్రిస్టియన్ ఊతప్ప, అంబటి రాయుడు రూపంలో రెండు వికెట్లు తీయగా.. కెప్టెన్ బ్రెట్ లీ రైనా వికెట్ దక్కించుకున్నాడు. ఇక డీ ఆర్సీ షార్ట్ యువరాజ్ సింగ్ రూపంలో కీలక వికెట్ తనఖాతాలో వేసుకున్నాడు. లక్ష్యాన్ని ఛేదించిన ఆసీస్ చాంపియన్స్ఇండియా చాంపియన్స్ విధించిన 204 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా చాంపియన్స్.. మరో బంతి మిగిలి ఉండగానే ఛేదించింది. ఓపెనర్లు షాన్ మార్ష్ (11), క్రిస్ లిన్ (25).. వన్డౌన్లో వచ్చిన డీ ఆర్సీ షార్ట్ (20) నిరాశపరిచినా.. లోయర్ ఆర్డర్ అద్భుతంగా ఆడింది.డానియెల్ క్రిస్టియన్ 28 బంతుల్లో 39 పరుగులు సాధించగా.. కల్లమ్ ఫెర్గూసన్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 38 బంతుల్లోనే ఐదు ఫోర్లు, నాలుగు సిక్సర్లు బాది 70 పరుగులతో ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. బెన్ కటింగ్ వేగంగా (6 బంతుల్లో 15) ఆడగా.. రాబ్ క్వినీ (8 బంతుల్లో 16 నాటౌట్) కూడా ఆకట్టుకున్నాడు. ఫలితంగా 19.5 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి ఆసీస్ 207 పరుగులు చేసింది. దీంతో ఇండియా చాంపియన్స్ నాలుగు వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. భారత బౌలర్లలో పీయూశ్ చావ్లా మూడు వికెట్లు తీయగా.. హర్భజన్ సింగ్ రెండు, వినయ్ కుమార్ ఒక వికెట్ దక్కించుకున్నారు.యువీ సేనకు భంగపాటుకాగా అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన దిగ్గజాలతో ఇంగ్లండ్ డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్ గతేడాది మొదలైంది. అరంగేట్ర సీజన్లో ఫైనల్ చేరిన యువీ సేన.. టైటిల్ పోరులో దాయాది పాకిస్తాన్ను చిత్తు చేసి ట్రోఫీ గెలిచింది. ఇక 2025 సీజన్లో డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగిన ఇండియా చాంపియన్స్ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది.ఇరుదేశాల మధ్య ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్తో జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. రెండో మ్యాచ్లో సౌతాఫ్రికా చాంపియన్స్ చేతిలో ఓటమిపాలైంది. తాజాగా మూడో మ్యాచ్లో ఆస్ట్రేలియా చాంపియన్స్ చేతిలోనూ ఓడిపోయింది.కాగా ఇండియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, వెస్టిండీస్, ఇంగ్లండ్ పాల్గొంటున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్లో.. సౌతాఫ్రికా చాంపియన్స్ ఇప్పటికి నాలుగు మ్యాచ్లు పూర్తి చేసుకుని మూడు గెలిచింది. తద్వారా ఆరు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు ఇండియా చాంపియన్స్ ఇంకా ఖాతా తెరవలేదు. పాక్తో మ్యాచ్ రద్దైన నేపథ్యంలో ఒక పాయింట్ రాగా.. పట్టికలో అట్టడుగున ఆరో స్థానంలో ఉంది.చదవండి: వైభవ్ సూర్యవంశీ మిస్సయ్యాడు! సౌతాఫ్రికా స్టార్ ప్రపంచ రికార్డు -
ఆసీస్ ఓపెనర్ సునామీ ఇన్నింగ్స్.. కేవలం 27 బంతుల్లోనే....
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఆస్ట్రేలియా ఓపెనర్ క్రిస్ లిన్ పరుగుల విధ్వంసం సృష్టించాడు. కేవలం ఇరవై బంతుల్లోనే అర్ధ శతకం సాధించిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. ఆ తర్వాత సునామీ ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. హాఫ్ సెంచరీ పూర్తైన అనంతరం మరో ఏడు బంతులు ఎదుర్కొన్న క్రిస్ లిన్ (Chris Lynn).. ఏకంగా 31 పరుగులు రాబట్టాడు.27 బంతుల్లోనే35 ఏళ్ల ఈ ఆసీస్ స్టార్ మొత్తంగా 27 బంతుల్లోనే 81 పరుగులతో దుమ్ములేపాడు. ఆరు ఫోర్లు, ఎనిమిది సిక్సర్ల సాయంతో 300 స్ట్రైక్రేటుతో ఈ మేర పరుగులు రాబట్టాడు. క్రిస్ లిన్ సునామీ ఇన్నింగ్స్ కారణంగా.. ఆస్ట్రేలియా చాంపియన్స్ వెస్టిండీస్ చాంపియన్స్ను ఏకంగా ఎనిమిది వికెట్ల తేడాతో చిత్తు చేసింది.డబ్ల్యూసీఎల్-2025లో భాగంగా బుధవారం రాత్రి ఆసీస్- విండీస్ (AUSCH vs WICH) జట్లు తలపడ్డాయి. నార్తాంప్టన్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది.గేల్ మరోసారి విఫలంఓపెనర్ డ్వేన్ స్మిత్ (22), లెండిల్ సిమ్మన్స్ (29), డ్వేన్ బ్రావో (26) ఫర్వాలేదనిపించగా.. కెప్టెన్ క్రిస్ గేల్ (21) మరోసారి తన స్థాయికి తగ్గట్లు రాణించడంలో విఫలమయ్యాడు. మిగతా వాళ్లలో ఒక్కరు కూడా కనీసం 20 పరుగుల మార్కు కూడా అందుకోలేకపోయారు.ఆసీస్ బౌలర్లలో పీటర్ సిడెల్ మూడు వికెట్లు కూల్చగా.. కౌల్టర్-నైల్ రెండు వికెట్లు పడగొట్టాడు. కెప్టెన్ బ్రెట్ లీ, స్టీవ్ ఒకెఫె, ఆర్సీ షార్ట్ ఒక్కో వికెట్ దక్కించుకున్నారు. ఇక లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్ చాంపియన్స్ ఆరంభంలోనే షాన్ మార్ష్ (7) రూపంలో తొలి వికెట్ కోల్పోయింది.బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్అయితే, మరో ఓపెనర్ క్రిస్ లిన్ (27 బంతుల్లో 81) విధ్వంసకర ఇన్నింగ్స్తో విరుచుకుపడ్డాడు. నికిత మిల్లర్ బౌలింగ్లో షెల్డన్ కాట్రెల్కు క్యాచ్ ఇవ్వడంతో లిన్ ఆటకు తెరపడింది. ఈ క్రమంలో డీ ఆర్సీ షార్ట్ (12 బంతుల్లో 18) వేగంగా ఆడగా.. వికెట్ కీపర్ బెన్ డకెట్ మెరుపు ఇన్నింగ్స్ (9 బంతుల్లో 30)తో దుమ్ములేపాడు. ఫలితంగా ఆసీస్ కేవలం 9.3 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఊదేసింది.Lynnsanity Strikes in Style 😎Chris Lynn hammered 81 off just 27 balls, peppering the ground with 8 sixes and 6 fours to power Australia Champions to a dominant win 💪#WCL2025 pic.twitter.com/CZUaP0T4Ui— FanCode (@FanCode) July 23, 2025ఈ క్రమంలో ఎనిమిది వికెట్ల తేడాతో వెస్టిండీస్ చాంపియన్స్ను చిత్తు చేసిన ఆసీస్.. పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంది. కాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో ఇండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్, ఇంగ్లండ్, పాకిస్తాన్ జట్లు పాల్గొంటున్నాయి. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లతో ఈ మెగా టోర్నీ 2024లో మొదలుకాగా.. యువరాజ్ సింగ్ సారథ్యంలో ఇండియా చాంపియన్స్ అరంగేట్ర సీజన్ విజేతగా నిలిచింది. చదవండి: IND vs ENG: రిషబ్ పంత్ గాయంపై బీసీసీఐ కీలక అప్డేట్ -
IND vs SA: డివిలియర్స్ సంచలన ‘రిలే క్యాచ్’.. వీడియో వైరల్
సౌతాఫ్రికా దిగ్గజ బ్యాటర్ ఏబీ డివిలియర్స్ (AB De Villiers) పునరాగమనంలో అదరగొట్టాడు. దాదాపు నాలుగేళ్ల విరామం తర్వాత మైదానంలో రీఎంట్రీ ఇచ్చిన ఏబీడీ బ్యాటింగ్లోనే కాదు.. ఫీల్డింగ్లోనూ అద్భుతం చేశాడు. సంచలన ‘రిలే క్యాచ్’(Relay Catch)తో మెరిసి.. ఇండియా చాంపియన్స్కు ఊహించని షాకిచ్చాడు.సౌతాఫ్రికా తరఫున 2018లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడిన డివిలియర్స్.. 2021లో ఐపీఎల్కూ వీడ్కోలు పలికాడు. ఈ క్రమంలో తాజాగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) సీజన్తో రీఎంట్రీ ఇచ్చాడు. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో సౌతాఫ్రికా చాంపియన్స్ జట్టుకు ఏబీడీ కెప్టెన్గా ఉన్నాడు.అజేయ అర్ధ శతకంఇక ఈ టోర్నీలో తొలుత వెస్టిండీస్ చాంపియన్స్ను బాలౌట్లో ఓడించిన సౌతాఫ్రికా.. తమ రెండో మ్యాచ్లో ఇండియా చాంపియన్స్ను ఢీకొట్టింది. నార్తాంప్టన్లో మంగళవారం రాత్రి జరిగిన ఈ మ్యాచ్లో డివిలియర్స్ ధనాధన్ దంచికొట్టాడు. అజేయ అర్ధ శతకం (30 బంతుల్లో 63, 3 ఫోర్లు, నాలుగు సిక్సర్లు)తో మెరిసి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది సౌతాఫ్రికా.ఇండియా చాంపియన్స్కు ఓటమిఅనంతరం లక్ష్య ఛేదనలో భారత్.. 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 111 పరుగులే చేసింది. ఫలితంగా డక్వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. ఈ మ్యాచ్లో ఇండియా బ్యాటర్ యూసఫ్ పఠాన్ను అవుట్ చేయడంలో డివిలియర్స్ చేసిన ప్రయత్నం హైలైట్గా నిలిచింది.క్యాచ్ పట్టి.. సహచర ఫీల్డర్కు అందించిఇండియా చాంపియన్స్ ఇన్నింగ్స్లో ఎనిమిదో ఓవర్లో ఇమ్రాన్ తాహిర్ బంతితో రంగంలోకి దిగాడు. ఈ క్రమంలో పఠాన్ వైడ్ లాంగాఫ్ దిశగా బంతిని గాల్లోకి లేపగా.. బౌండరీ దిశగా పయనించింది. అయితే, ఇంతలో డివిలియర్స్ వేగంగా పరిగెత్తుకుని వచ్చి బంతిని ఒడిసిపట్టాడు.అయితే, తాను బౌండరీ రోప్ను తాకే ప్రమాదం ఉండటంతో సహచర ఫీల్డర్ సరేల్ ఎర్వీ వైపు బంతిని విసిరాడు. వెంటనే స్పందించిన అతడు బాల్ను సురక్షితంగా క్యాచ్ పట్టాడు. దీంతో ఇమ్రాన్ తాహిర్ సంబరాలు చేసుకోగా.. యూసఫ్ పఠాన్ బిత్తరపోయాడు. ఇలా ఏబీడీ 41 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే అన్నట్లు తన అద్భుత ఫీల్డింగ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.చదవండి: ‘అభ్యంతరకరమైన పదాలు వాడాడు’.. గిల్ స్ట్రాంగ్ కౌంటర్!𝐏𝐞𝐭𝐢𝐭𝐢𝐨𝐧 𝐭𝐨 𝐠𝐞𝐭 𝐀𝐁 𝐝𝐞 𝐕𝐢𝐥𝐥𝐢𝐞𝐫𝐬 𝐨𝐮𝐭 𝐨𝐟 𝐫𝐞𝐭𝐢𝐫𝐞𝐦𝐞𝐧𝐭 📑✍️Even after four years away from the game, he's making the impossible look easy 😮💨#WCL2025 #ABD pic.twitter.com/ixmXJ6YBSK— FanCode (@FanCode) July 22, 2025 -
డివిలియర్స్ విధ్వంసం.. ఇండియా చాంపియన్స్కు షాక్
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)సీజన్ను ఇండియా చాంపియన్స్ ఓటమితో ఆరంభించింది. సౌతాఫ్రికా చాంపియన్స్తో జరిగిన మ్యాచ్లో యువరాజ్ సేన 88 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. నార్తాంప్టన్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన ఇండియా చాంపియన్స్ తొలుత బౌలింగ్ చేసింది.డివిలియర్స్ విధ్వంసంఈ క్రమంలో ఓపెనర్లు హషీమ్ ఆమ్లా (22), జాక్వెస్ రుడాల్ఫ్ (24) సౌతాఫ్రికాకు శుభారంభం అందించారు. వన్డౌన్ బ్యాటర్ సరేల్ ఎర్వీ (15) నిరాశపరచగా.. ఏబీ డివిలియర్స్ కెప్టెన్ ఇన్నింగ్స్తో దుమ్ములేపాడు. రీఎంట్రీలో నాలుగో స్థానంలో బరిలో దిగిన ఈ లెజెండరీ బ్యాటర్ అజేయ అర్ధ శతకం సాధించాడు. కేవలం 30 బంతుల్లోనే మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో 63 పరుగులు సాధించాడు.Ball by ball highlights of AB de Villiers' 63*(30) vs India legends. Still got it.🐐pic.twitter.com/8S1sty9lKU— . (@ABDszn17) July 22, 2025 భారీ స్కోరుమిగతావాళ్లలో స్మట్స్ (17 బంతుల్లో 30), వాన్ విక్ (5 బంతుల్లో 18) ధనాధన్ ఇన్నింగ్స్తో ఆకట్టుకున్నారు. ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో సౌతాఫ్రికా చాంపియన్స్ ఆరు వికెట్ల నష్టానికి ఏకంగా 208 పరుగుల మేర భారీ స్కోరు సాధించింది.ఇండియా చాంపియన్స్ బౌలర్లలో పీయూశ్ చావ్లా, యూసఫ్ పఠాన్ రెండేసి వికెట్లు తీయగా.. అభిమన్యు మిథున్కు ఒక వికెట్ దక్కింది. ఇక లక్ష్య ఛేదనలో ఇండియా చాంపియన్స్ చేతులెత్తేసింది. ఓపెనర్లు రాబిన్ ఊతప్ప (2), శిఖర్ ధావన్ (1) పూర్తిగా విఫలం కాగా.. సురేశ్ రైనా (16), అంబటి రాయుడు (0) నిరాశపరిచారు.బిన్నీ ఒక్కడే.. యువీ గాయం వల్లఈ క్రమంలో స్టువర్ట్ బిన్నీ (39 బంతుల్లో 37 నాటౌట్) ఒంటరి పోరాటం చేశాడు. మిగిలిన వారిలో యూసఫ్ పఠాన్ (5) విఫలం కాగా.. ఇర్ఫాన్ పఠాన్ (10), పీయూశ్ చావ్లా (9), పవన్ నేగి (0), వినయ్ కుమార్ (13) ఇలా వచ్చి అలా వెళ్లిపోయారు. మరోవైపు.. కెప్టెన్ యువరాజ్ సింగ్ గాయం కారణంగా బ్యాటింగ్ చేయలేకపోయాడు. ఈ నేపథ్యంలో 18.2 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయిన ఇండియా చాంపియన్స్ 111 పరుగులు చేయగలిగింది. ఈ మ్యాచ్ వర్షం అంతరాయం కలిగించిన నేపథ్యంలో డీఎల్ఎస్ పద్ధతిలో సౌతాఫ్రికా 88 పరుగుల తేడాతో విజయం సాధించింది. తద్వారా ఈ సీజన్లో రెండో విజయం నమోదు చేసి నాలుగు పాయింట్లతో పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది.చివరన యువీ సేనమరోవైపు.. ఇండియా చాంపియన్స్ పాకిస్తాన్తో ఆడాల్సిన తొలి మ్యాచ్ను రద్దు చేసుకోగా ఒక పాయింట్ వచ్చింది. తాజా మ్యాచ్లో ఓటమి కారణంగా ఆరుజట్ల టోర్నీలో యువీ సేన ప్రస్తుతం ఆఖరి స్థానంలో ఉంది. కాగా అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన ఆటగాళ్లతో కూడిన జట్లతో.. ఇంగ్లండ్లో జరుగుతున్న ఈ టీ20 టోర్నమెంట్లో భారత్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగింది. తొలి సీజన్లో యువీ సేన ఫైనల్లో పాక్ను ఓడించి గెలుపొందిన విషయం తెలిసిందే.చదవండి: రెండు నెలల్లోనే 17 కిలోలు తగ్గాడు.. సర్ఫరాజ్ ఖాన్కు ఇదెలా సాధ్యమైందంటే? -
చాడ్విక్, పొలార్డ్ మెరుపు ఇన్నింగ్స్.. ఇంగ్లండ్కు తప్పని ఓటమి
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025)లో ఇంగ్లండ్ చాంపియన్స్కు మరో చేదు అనుభవం ఎదురైంది. వెస్టిండీస్ చాంపియన్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో ఇంగ్లిష్ జట్టు ఆఖరి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. పది పరుగుల తేడాతో విండీస్ చేతిలో పరాజయం పాలై.. రెండో ఓటమిని మూటగట్టుకుంది.ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న డబ్ల్యూసీఎల్ టీ20 టోర్నమెంట్లో ఆతిథ్య జట్టు తొలుత పాకిస్తాన్ చాంపియన్స్తో తలపడి ఓడిపోయింది. అనంతరం ఆస్ట్రేలియా చాంపియన్స్తో పోటీపడాల్సి ఉండగా.. ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దైపోయింది. తాజాగా తమ మూడో టీ20లో ఇంగ్లండ్ వెస్టిండీస్ను ఢీకొట్టింది.నార్తాంప్టన్ వేదికగా టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లు నష్టపోయి 164 పరుగులు చేసింది. వికెట్ కీపర్ బ్యాటర్ చాడ్విక్ వాల్టన్ మెరుపు అర్ధ శతకం సాధించాడు. 50 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో 83 పరుగులు సాధించాడు.చాడ్విక్కు తోడుగా కీరన్ పొలార్డ్ (16 బంతుల్లో 30) కూడా దంచికొట్టాడు. ఇక కెప్టెన్ క్రిస్ గేల్ (19 బంతుల్లో 21) మాత్రం పూర్తిగా విఫలమయ్యాడు. మరోవైపు.. ఇంగ్లండ్ బౌలర్లలో స్టువర్ట్ మేకర్ నాలుగు వికెట్లతో చెలరేగగా.. అజ్మల్ షెహజాద్ మూడు వికెట్లు పడగొట్టాడు. మిగతా వారిలో సమిత్ పటేల్, ఆర్జే సైడ్బాటమ్ చెరో వికెట్ దక్కించుకున్నారు.విండీస్ విధించిన నామమాత్రపు లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ చాంపియన్స్ ఆది నుంచే తడ‘బ్యా’టుకు గురైంది. ఓపెనర్లలో సర్ అలిస్టర్ కుక్ డకౌట్ కాగా.. ఇయాన్ బెల్ (5) కూడా నిరాశపరిచాడు. వన్డౌన్ బ్యాటర్ మొయిన్ అలీ (0) కూడా చేతులెత్తేయగా.. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (9) కూడా విఫలమయ్యాడు.ఇలా టాపార్డర్ కుదేలైన వేళ రవి బొపారా (24), సమిత్ పటేల్ (36 బంతుల్లో 52) కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ వీరికి మిగతా వారి నుంచి సహకారం లేకపోవడంతో విండీస్ బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ చాంపియన్స్ తలవంచాల్సి వచ్చింది. ఫిడెల్ ఎడ్వర్డ్స్ నాలుగు వికెట్లతో ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించగా.. షనన్ గాబ్రియెల్, డ్వేన్ బ్రావో రెండేసి వికెట్లు పడగొట్టారు. సులేమాన్ బెన్ కూడా ఒక వికెట్ తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్ల ఆట ముగిసేసరికి ఇంగ్లండ్ 154 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా వెస్టిండీస్ చాంపియన్స్ పది పరుగుల తేడాతో గెలుపొందింది. కాగా తమ తొలి మ్యాచ్లో సౌతాఫ్రికా చాంపియన్స్ను ఎదుర్కొన్న విండీస్ బాలౌట్లో ఓటమిపాలైంది.Classic Caribbean flair on display 🔥🌴Chadwick Walton's dazzling 83 off 50 - just the kind of 𝕎𝕚𝕟𝕕𝕚𝕖𝕤 𝕗𝕚𝕣𝕖𝕨𝕠𝕣𝕜𝕤 we love 😍#WCL2025 pic.twitter.com/4OIQC3OIKM— FanCode (@FanCode) July 22, 2025 -
WCL 2025: నీకసలు దేశభక్తి ఉందా?.. ఆఫ్రిదితో ముచ్చట్లు పెడతావా?
పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది (Shahid Afridi)- బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్గణ్ (Ajay Devgan) కలిసి ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. క్రికెట్ మైదానంలో వీరిద్దరు సరదాగా ముచ్చటించుకుంటూ.. పరస్పరం ఆలింగనం చేసుకున్న దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో అజయ్ దేవగణ్పై భారతీయ నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు.నీకసలు దేశభక్తి ఉందా?‘‘నీకసలు దేశభక్తి అనేదే లేదా? ఒకవేళ ఉన్నా సోషల్ మీడియా పోస్టులకు మాత్రమే పరిమితం చేస్తావా?’’ అంటూ అజయ్ దేవగణ్ను భారీ ఎత్తున ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ ఈ ఫొటోలు, వీడియోలు నిజమైనవేనా? అవును.. ఇవేమీ కృత్రిమ మేధ (AI)తో సృష్టించినవి కాదు. నిజమైనవే. అయితే, గతేడాదికి సంబంధించినవి.ఇండియా చాంపియన్స్ సహ యజమానిఅసలు విషయం ఏమిటంటే.. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) పేరిట మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లతో టీ20 టోర్నమెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగమైన ఇండియా చాంపియన్స్ జట్టుకు అజయ్ దేవగణ్ సహ యజమానిగా ఉన్నాడు. గతేడాది ఈ టోర్నీ మొదలు కాగా.. తొలి ఎడిషన్లో యువరాజ్ సింగ్ సారథ్యంలోని భారత్.. ఫైనల్లో పాకిస్తాన్ను ఓడించి ట్రోఫీ గెలిచింది.భారత్ వర్సెస్ పాక్ మ్యాచ్ రద్దుఇక WCL రెండోసీజన్ శుక్రవారం (జూలై 18)న మొదలుకాగా చిరకాల ప్రత్యర్థుల మధ్య ఆదివారం (జూలై 20) మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే, పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో జరిగే మ్యాచ్ను బహిష్కరించాలని కెప్టెన్ యువీతో సహా శిఖర్ ధావన్, సురేశ్ రైనా నిర్ణయించుకున్నట్లు తెలిసింది.గతేడాది ఫొటోలు ఇవిఈ నేపథ్యంలో ఈ టోర్నీని నిర్వహిస్తున్న ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ECB) దాయాదుల పోరును రద్దు చేయాల్సి వచ్చింది. అయితే, అజయ్ దేవగణ్ మాత్రం.. భారత్పై తన వ్యాఖ్యలతో విషం చిమ్మే షాహిద్ ఆఫ్రిదిని కలిసినట్లుగా ఉన్న ఫొటోలు వైరల్ అయ్యాయి. కానీ అవి తాజా సీజన్కు సంబంధించినవి కావు. గతేడాది ఇరుదేశాలు కలిసి టోర్నీలో ఆడాయి.అప్పుడే అంటే అరంగేట్ర సీజన్ (2024)లో అజయ్ ఆఫ్రిదిని కలిశాడు. అయితే, తాజా పరిణామాల నేపథ్యంలో ఈ ఫొటోలు మరోసారి తెరమీదకు రాగా.. అజయ్ దేవగణ్ను ట్రోల్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జమ్మూకశ్మీర్లోని ప్రశాంత పహల్గామ్లో ఉగ్రవాదులు దాడికి తెగబడిన విషయం తెలిసిందే. ఇందుకు బదులుగా భారత సైన్యం ఆపరేషన్ సిందూర్ పేరిట ప్రత్యేక ఆపరేషన్తో పాక్లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసింది. ఇందుకు పాక్ సైన్యం బదులివ్వగా అనుచిత దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టింది. దీంతో ఇరుదేశాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాగా WCL-2025లో తొలి మ్యాచ్ను రద్దు చేసుకున్న యువీ సేన మంగళవారం తమ తదుపరి మ్యాచ్ ఆడనుంది. సౌతాఫ్రికా చాంపియన్స్తో తలపడనుంది.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు Ajay Devgan meets Shahid Afridi happily. These celebs desh bhakti will remain for PR only, rest they will do anything for money and don't care about the people of the country. pic.twitter.com/FqfKTMPNOm— Div🦁 (@div_yumm) July 20, 2025Bollywood star Ajay Devgan with legend Shahid Afridi !! pic.twitter.com/eFlR9Ad5jY— TEAM AFRIDI (@TEAM_AFRIDI) July 6, 2024 -
పాక్తో మ్యాచ్ బహిష్కరణ
బర్మింగ్హామ్: ‘వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్’ (డబ్ల్యూసీఎల్) టోర్నమెంట్లో భాగంగా ఆదివారం పాకిస్తాన్తో జరగాల్సిన మ్యాచ్ను భారత స్టార్లు బహిష్కరించారు. జమ్మూకశ్మీర్ పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్తాన్తో ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడబోమని శిఖర్ ధావన్ సహా భారత ఆటగాళ్లు వెల్లడించడంతో దాయాదుల పోరును రద్దు చేయక తప్పలేదు. ఇంగ్లండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) నిర్వహిస్తున్న ఈ టోర్నీ రెండో సీజన్ పోటీలు గత నెల 18న ఎడ్జ్బాస్టన్ వేదికగా ప్రారంభమయ్యాయి. వచ్చేనెల 2న జరగనున్న ఫైనల్తో టోర్నమెంట్ ముగియనుంది. ఇందులో భారత చాంపియన్స్ జట్టుకు స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ సారథ్యం వహిస్తున్నాడు. జట్టులో హర్భజన్ సింగ్, శిఖర్ ధావన్, ఇర్ఫాన్ పఠాన్, యూసుఫ్ పఠాన్, సురేశ్ రైనా, రాబిన్ ఉతప్ప, వరుణ్ అరోన్ వంటి పలువురు భారత మాజీ ప్లేయర్లు ఉన్నారు. బరి్మంగ్హామ్ వేదికగా జరగాల్సిన భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రద్దు అయినట్లు డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించారు. ‘పాకిస్తాన్ హాకీ జట్టు భారత్లో ఆడనుందనే వార్తలతో పాటు మరి కొన్ని క్రీడల్లో ఇరు దేశాల మధ్య పోటీలు జరుగుతున్న నేపథ్యంలో డబ్ల్యూసీఎల్లో దాయాదుల మ్యాచ్ ద్వారా కొన్ని ఆనంద క్షణాలు పంచుకోవచ్చని అనుకున్నాం. అయితే మా నిర్ణయం చాలా మందికి నచ్చలేదని అర్థమైంది. వారి మనోభావాలను దెబ్బతీయకూడదనే ఉద్దేశంతో మ్యాచ్ను రద్దు చేశాం. ఎవరికైన ఇబ్బంది కలిగించి ఉంటే మన్నించమని కోరుతున్నాం’అని డబ్ల్యూసీఎల్ పేర్కొంది. పాకిస్తాన్ లెజెండ్స్ జట్టుకు షాహిద్ అఫ్రిది కెపె్టన్గా వ్యవహరిస్తుండగా... షోయబ్ మాలిక్, హఫీజ్, యూనిస్ ఖాన్, తన్వీర్, వహాబ్ రియాజ్, కమ్రాన్ అక్మల్ జట్టులో ఉన్నారు. మరోవైపు ఈ మ్యాచ్ ఆడకూడదని ధావన్ ఇప్పటికే సామాజిక మాధ్యమాల వేదికగా వెల్లడించాడు. టోర్నీ ఆరంభం కావడానికి ముందే పాకిస్తాన్తో మ్యాచ్లు ఆడబోనని ధావన్ స్పష్టం చేశాడు. పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రదాడి అనంతరం భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’పేరిట ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్తో పాటు... పాకిస్తాన్లోని ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఎంపీలు యూసుఫ్ పఠాన్, హర్భజన్ సింగ్తో పాటు ఇర్ఫాన్ పఠాన్ కూడా చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్తో మ్యాచ్కు సుముఖత వ్యక్తం చేయలేదని డబ్ల్యూసీఎల్ తెలిపింది. ఎడ్జ్బాస్టన్లో జరిగిన గత ఎడిషన్ ఫైనల్లో పాకిస్తాన్ లెజెండ్స్పై 5 వికెట్ల తేడాతో నెగ్గిన భారత చాంపియన్స్ జట్టు తొలి టైటిల్ కైవసం చేసుకుంది. -
WCL: భారత్-పాక్ మ్యాచ్ రద్దు.. అఫ్రిదిపై వేటు!
వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL) టోర్నీలో నేడు జరగాల్సిన పాకిస్తాన్ భారత్ మ్యాచ్ రద్దైంది. ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా మ్యాచ్ను రద్దు చేస్తున్నట్లు నిర్వాహకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఇంగ్లాండ్ బర్మింగ్హామ్ ఎడ్జ్బాస్టన్ మైదానం వేదికగా షెడ్యూల్ ప్రకారం ఆదివారం రాత్రి 9గం. భారత ఛాంపియన్స్, పాకిస్థాన్ ఛాంపియన్స్ మధ్య జరగాల్సి ఉంది. అయితే పాక్తో మ్యాచ్ను భారత ప్లేయర్లు బాయ్కాట్ చేసిన నేపథ్యం, ప్రజల మనోభావాలు దెబ్బ తిన్న నేపథయంలో నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే పాయింట్ల విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది.పాకిస్థాన్తో ఎలాంటి క్రికెట్ ఆడకూడదని ఇప్పటికే బీసీసీఐ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. పహల్గాం దాడి తర్వాత బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే, ఇప్పుడు డబ్ల్యూసీఎల్లో ఇరు జట్లూ తలపడనున్న నేపథ్యంలో చాలా విమర్శలు వచ్చాయి. ఇంకోవైపు.. పాక్తో మ్యాచ్ ఆడేందుకు మాజీ క్రికెటర్లకు ఎవరు అనుమతి ఇచ్చారంటూ? ప్రశ్నలు తలెత్తాయి. Dear all , pic.twitter.com/ViIlA3ZrLl— World Championship Of Legends (@WclLeague) July 19, 2025ఈ నేఫథ్యంలో.. భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్, మాజీ ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ ఆల్రౌండర్ సురేష్ రైనా, మాజీ ఆల్రౌండర్లు ఇర్ఫాన్, యూసుఫ్ పఠాన్లు డబ్ల్యూసీఎల్ 2025లో పాకిస్తాన్ మ్యాచ్ నుంచి తప్పుకున్నారు. పహల్గామ్ దాడి, ఆ తరువాత జరిగిన పరిణామాలు వారి నిర్ణయంకు కారణంగా తెలుస్తోంది. మరోవైపు.. భారత్ vs పాకిస్తాన్ మ్యాచ్పై సోషల్ మీడియాలోనూ తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నారని స్పష్టమైంది.ఈ మ్యాచ్లో తాను ఆడేది లేదని.. సదరు విషయాన్ని డబ్ల్యూసీఎల్ ఆర్గనైజర్లకు ఇప్పటికే చెప్పినట్లు శిఖర్ ధావన్ వెల్లడించాడు. మే 11నే లీగ్ నిర్వాహకుల దృష్టికి తీసుకెళ్లినట్లు మెయిల్ స్క్రీన్షాట్లను ధావన్ పంచుకున్నాడు. ‘‘ఈ లీగ్లో పాకిస్థాన్తో మ్యాచ్ ఆడకూడదని మే 11నే నిర్ణయం తీసుకున్నా. ఇప్పటికీ అదే నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. నాకు నా దేశమే ముఖ్యం. దేశం కంటే ఏదీ ఎక్కువ కాదు. జై హింద్’’ అని మెయిల్ స్క్రీన్షాట్ను ధావన్ పోస్టు చేశాడు.ఇంకోవైపు.. పాక్ క్రికెటర్ షాహిద్ అఫ్రిదీ భారత్పై, భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయగా దుమారం రేగింది. ఈ పరిణామాల నేపథ్యంలో అఫ్రిదీపై డబ్ల్యూసీఎల్ నిర్వాహకులు వేటు వేసినట్లు తెలుస్తోంది. డబ్ల్యూసీఎల్ పోస్టర్ నుంచి అఫ్రిదీ ఫొటోను నిర్వాహకులు తొలగించారు. మిగతా మ్యాచ్లకూ అతన్ని దూరం పెట్టే యోచనలో నిర్వాహకులు ఉన్నట్లు సమాచారం. -
WCL 2025: హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్.. బోణీ కొట్టిన పాకిస్తాన్
వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్-2025 (WCL 2025) టోర్నమెంట్కు శుక్రవారం తెర లేచింది. ఇంగ్లండ్ వేదికగా జరుగుతున్న ఈ టీ20 టోర్నీ తాజా సీజన్ తొలి మ్యాచ్లో.. ఇంగ్లండ్ చాంపియన్స్- పాకిస్తాన్ చాంపియన్స్ (ENG vs PAK)తో తలపడింది. బర్మింగ్హామ్లోని ఎడ్జ్బాస్టన్లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది.ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన పాకిస్తాన్ చాంపియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఓపెనర్లు కమ్రాన్ అక్మల్ (8), షార్జీల్ ఖాన్ (12) పూర్తిగా విఫలం కాగా.. వన్డౌన్ బ్యాటర్ ఉమర్ అమీన్ (6) కూడా నిరాశపరిచాడు.హఫీజ్ కెప్టెన్ ఇన్నింగ్స్ఇలా టాపార్డర్ కుదేలైన వేళ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మహ్మద్ హఫీజ్ (Mohammad Hafeez) కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్కు దిగిన ఈ కుడిచేతి వాటం బ్యాటర్.. 34 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో 54 పరుగులు సాధించాడు. మిగతా వారిలో ఆమీర్ యామిన్ (13 బంతుల్లో 27 నాటౌట్) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోరు చేశాడు.ఇక ఇంగ్లండ్ చాంపియన్స్ బౌలర్లలో లియామ్ ప్లంకెట్, క్రిస్ ట్రెమ్లెట్ రెండేసి వికెట్లు కూల్చగా.. విన్స్, మాస్కరన్హస్, ఆర్జే సైడ్బాటమ్, స్టువర్ట్ మీకర్ ఒక్కో వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. కాగా లక్ష్య ఛేదనలో ఆఖరి వరకు పోరాడిన ఇంగ్లండ్కు ఓటమి తప్పలేదు.ఆఖరి ఓవర్ వరకు నరాలు తెగే ఉత్కంఠఓపెనర్ ఫిల్ మస్టర్డ్ (58) అర్ధ శతకంతో రాణించగా.. మరో ఓపెనర్ సర్ అలిస్టర్ కుక్ (7)తో పాటు వన్డౌన్లో వచ్చిన జేమ్స్ విన్స్ (7) విఫలమయ్యారు. ఆఖర్లో ఇయాన్ బెల్ (35 బంతుల్లో 51).. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ (16)తో కలిసి జట్టును గెలుపుతీరాలకు చేర్చే దిశగా పయనించాడు. అయితే, ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన పోరులో పాకిస్తాన్ బౌలర్ సొహైల్ ఖాన్ పొదుపుగా బౌలింగ్ చేసి.. బెల్పై పైచేయి సాధించాడు.ఇయాన్ బెల్ పోరాటం వృథాఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 155 పరుగుల వద్ద నిలిచిన ఇంగ్లండ్ చాంపియన్స్.. ఐదు పరుగుల స్వల్ప తేడాతో పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైంది. పాక్ బౌలర్లలో ఆమిర్ యమిన్, రాయిస్, సొహైల్ తన్వీర్ తలా ఒక వికెట్ దక్కించుకున్నారు. కాగా అంతర్జాతీయ క్రికెట్కు స్వస్తి పలికిన మాజీ క్రికెటర్లతో కూడిన ఆరుజట్లు వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్లో తలపడుతున్నాయి. యువరాజ్ సింగ్ సారథ్యంలోని ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్గా ఈసారి బరిలోకి దిగింది.చదవండి: WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు -
WCL 2025: బరిలో యువీ, డివిలియర్స్, బ్రెట్ లీ.. షెడ్యూల్, లైవ్ స్ట్రీమింగ్ వివరాలు
దిగ్గజ క్రికెటర్లు మరోసారి మైదానంలో అభిమానులను అలరించేందుకు సిద్ధమయ్యారు. వింటేజ్ ఇన్నింగ్స్ను గుర్తుచేసేలా మరోసారి బ్యాట్ ఝులిపించేందుకు యువరాజ్ సింగ్, ఏబీ డివిలియర్స్, జాక్వెస్ కలిస్.. వికెట్ల వేట కొనసాగించేందుకు బ్రెట్ లీ, ఇమ్రాన్ తాహిర్ వంటి మాజీలు సన్నద్ధమయ్యారు. ఇంగ్లండ్ వేదికగా వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)తో వినోదం పంచేందుకు సై అంటున్నారు. మరి టీ20 టోర్నమెంట్ షెడ్యూల్, జట్లు, ప్రత్యక్ష ప్రసారం తదితర అంశాలకు సంబంధించిన వివరాలు తెలుసుకుందాం.వరల్డ్ చాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ఆటగాళ్లతో కూడిన ఆరు జట్లు ఈ టీ20 టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి. ఇండియా, పాకిస్తాన్, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, వెస్టిండీస్ జట్లు ఇందులో భాగమయ్యాయి.బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ ఇండియా చాంపియన్స్ జట్టుకు సహ యజమానిగా ఉన్నాడు. రౌండ్ రాబిన్ పద్ధతిలో లీగ్ మ్యాచ్లు జరుగుతాయి. నాకౌట్స్ ద్వారా విజేత ఎవరో తేలుతుంది. ఇండియా చాంపియన్స్ డిఫెండింగ్ చాంపియన్గా బరిలోకి దిగనుంది.జట్లుఇండియా చాంపియన్స్యువరాజ్ సింగ్ (కెప్టెన్), శిఖర్ ధావన్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, యూసఫ్ పఠాన్, రాబిన్ ఊతప్ప, అంబటి రాయుడు, పీయూష్ చావ్లా, స్టువర్ట్ బిన్నీ, వరుణ్ ఆరోన్, వినయ్ కుమార్, అభిమన్యు మిథున్, సిద్దార్థ్ కౌల్, గురుకీరత్ మాన్.ఆస్ట్రేలియా చాంపియన్స్షాన్ మార్ష్, ఆరోన్ ఫించ్, కల్లమ్ ఫెర్గూసన్, టిమ్ పైన్ (వికెట్ కీపర్), బెన్ డంక్, డేనియల్ క్రిస్టియన్, బ్రెట్ లీ (కెప్టెన్), బ్రాడ్ హాడిన్, క్రిస్ లిన్, రాబ్ క్వినీ, జాన్ హేస్టింగ్స్, జేవియర్ దొహర్టి, మోజెస్ హెండ్రిక్స్, పీటర్ సిడిల్, నాథన్-కౌల్టర్ నీల్, డిర్క్ నాన్స్.సౌతాఫ్రికా చాంపియన్స్హర్షల్ గిబ్స్, హషీం ఆమ్లా, ఏబీ డివిలియర్స్, జేపీ డుమిని, జేజే స్మట్స్, డేన్ విల్లాస్, రిచర్డ్ లెవీ, నీల్ మెకంజీ, ఎస్జే ఎర్వీ, మోర్నీ మ్యాన్ విక్, జాక్వెస్ కలిస్, క్రిస్ మోరిస్, రియాన్ మెక్లారెన్, అల్బీ మోర్కెల్, డేల్ స్టెయిన్, ఇమ్రాన్ తాహిర్, వైన్ పార్నెల్, రోరీ క్లెన్వెల్ట్, హార్డస్ విల్జోన్, ఆరోన్ ఫంగిసో, డువాన్ ఓలీవర్.పాకిస్తాన్ చాంపియన్స్సర్ఫరాజ్ అహ్మద్, యూనిస్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ హఫీజ్, కమ్రాన్ అక్మల్, షోయబ్ మసూద్, మిస్బా ఉల్ హక్, షార్జిల్ ఖాన్, ఆసిఫ్ అలీ, షాహిద్ ఆఫ్రిది, ఇమాద్ వాసిం, షోయబ్ మాలిక్, ఆమేర్ యామిన్, వహాబ్ రియాజ్, సయీద్ అజ్మల్, సొహైల్ తన్వీర్, రమన్ రాయీస్.ఇంగ్లండ్ చాంపియన్స్కెవిన్ పీటర్సన్, ఇయాన్ మోర్గాన్, అలిస్టర్ కుక్, ఫిలిప్ మస్టార్డ్, ఇయాన్ బెల్, క్రిస్ షోఫీల్డ్, టిమ్ ఆంబ్రోస్, రవి బొపారా, సమిత్ పటేల్, మొయిన్ అలీ, దిమిత్రి మస్కార్హ్నస్, స్టువర్ట్ మేకర్, రియాన్ సైడ్బాటమ్, లియామ్ ప్లంకెట్, టిమ్ బ్రెస్నాన్, సాజిద్ మహమూద్, అజ్మల్ షెహజాద్.వెస్టిండీస్ చాంపియన్స్క్రిస్ గేల్, శివ్నరైన్ చందర్పాల్, జొనాథన్ కార్టర్, చాడ్విక్ వాల్టన్, విలియమ్ పెర్కిన్స్, డేవ్ మహ్మద్, క్రిస్ గేల్, డారెన్ సామీ, కీరన్ పొలార్డ్, డ్వేన్ బ్రావో, డ్వేన్ స్మిత్, షెల్డన్ కార్టెల్, సామ్యూల్ బద్రీ, షనన్ గాబ్రియెల్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, రవి రాంపాల్, ఆష్లే నర్స్, నికిత మిల్లర్, సులేమాన్ బెన్.షెడ్యూల్, మ్యాచ్ ఆరంభ సమయం👉జూలై 18 (శుక్రవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 19 (శనివారం): వెస్టిండీస్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 19 (శనివారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 20 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇంగ్లండ్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 22 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 23 (బుధవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 24 (గురువారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శుక్రవారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ సౌతాఫ్రికా చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 26 (శనివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 26 (శనివారం): పాకిస్తాన్ చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 27 (ఆదివారం): సౌతాఫ్రికా చాంపియన్స్ వర్సెస్ ఆస్ట్రేలియా చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 27 (ఆదివారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ ఇంగ్లండ్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఆస్ట్రేలియా చాంపియన్స్ వర్సెస్ పాకిస్తాన్ చాంపియన్స్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 29 (మంగళవారం): ఇండియా చాంపియన్స్ వర్సెస్ వెస్టిండీస్ చాంపియన్స్- రాత్రి 9 గంటలకు👉జూలై 31 (గురువారం): తొలి సెమీ ఫైనల్- సాయంత్రం 5 గంటలకు👉జూలై 31 (గురువారం): రెండో సెమీ ఫైనల్- రాత్రి 9 గంటలకు👉ఆగష్టు 2 (శనివారం): ఫైనల్- రాత్రి 9 గంటలకు.వేదికలు: ది ఓవల్, ఎడ్జ్బాస్టన్, హెడింగ్లీ, గ్రేస్ రోడ్, నార్తాంప్టన్ మైదానాలు.ప్రత్యక్ష ప్రసారాలు ఎక్కడ?👉ఇండియాలో..టీవీ: స్టార్ స్పోర్ట్స్ 1డిజిటల్/ఓటీటీ: ఫ్యాన్కోడ్👉అమెరికా, కెనడాలో: విల్లో టీవీ👉యునైటెడ్ కింగ్డమ్: టీఎన్టీ స్పోర్ట్స్👉ఆస్ట్రేలియా: ఫాక్స్ స్పోర్ట్స్ స్ట్రీమ్, కయో స్పోర్ట్స్.👉సౌతాఫ్రికా: సూపర్స్పోర్ట్.చదవండి: BCCI: వైభవ్ సూర్యవంశీ ఎంత సంపాదిస్తున్నాడో తెలుసా?