-
పలాయనవాదమే లక్ష్యం
సాక్షి, అమరావతి : అసెంబ్లీలో ఏం మాట్లాడాలో దిక్కుతోచక, ఏం మాట్లాడితే ఏమవుతుందోననే భయంతో టీడీపీ పలాయనవాదాన్ని నమ్ముకుని, ఆచరిస్తోంది. ఇందులో భాగంగానే చట్టసభల ఖ్యాతిని దిగజారుస్తూ చిల్లర వ్యాఖ్యలతో స్పీకర్, అధికార పక్ష సభ్యులను చిరాకుపరుస్తోంది. తద్వారా సస్పెన్షన్ వేటు వేయించుకుని బయటకు జారుకోవచ్చనే వ్యూహంతో ముందుకు వెళుతోంది. స్కిల్ డెవలప్మెంట్ కుంభకోణంలో చంద్రబాబు అడ్డంగా బుక్కై రాజమహేంద్రవరం సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉండటంతో టీడీపీ సభ్యుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. దీంతో సభలో ‘స్కిల్’ స్కామ్పై మాట్లాడే అవకాశం ఇచ్చినప్పటికీ, జైల్లో సౌకర్యాల గురించి అడ్డగోలుగా తప్పులు పట్టడం మినహా.. ఆయన నేరం చేయలేదని చెప్పేందుకు అవకాశం, ఆధారం లేక సభలో గందరగోళం సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకుంది. గురు, శుక్రవారాల్లో శాసనసభ సమావేశాల్లో టీడీపీ సభ్యుల ప్రవర్తనే ఇందుకు సాక్షంగా నిలుస్తోంది. రెండవ రోజు శుక్రవారం కూడా టీడీపీ ఎమ్మెల్యేలు తమ స్థాయిని మరిచి వ్యవహరించారు. ఆకతాయిల మాదిరిగా స్పీకర్ను చుట్టుముట్టి ఆయనపై కాగితాలు చింపి విసిరేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. నినాదాలు చేస్తూ, బయటి నుంచి తెచ్చుకున్న విజిల్స్ ఊదుతూ అధికార పార్టీ సభ్యులను రెచ్చగొట్టేలా ప్రవర్తించారు. కుర్చీలు, బల్లలపై ఎక్కి తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. చంద్రబాబు అరెస్ట్ అంశంపై సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, దమ్ముంటే చర్చలో పాల్గొనాలని మంత్రులు సవాల్ విసిరినా పట్టించుకోలేదు. çసభా సమయాన్ని వృధా చేయడమే లక్ష్యంగా గొడవ సృష్టించేందుకు యత్నించారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్ఫోన్లలో చిత్రీకరిస్తున్న ఇద్దరు సభ్యులను స్పీకర్ సెషన్ మొత్తం సస్పెన్షన్ వేటు వేయగా, మరో ముగ్గురిని ఒకరోజు సస్పెన్షన్ చేశారు. దీంతో మిగిలిన టీడీపీ సభ్యులు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్–చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై చేపట్టిన స్వల్ప కాలిక చర్చలో పాల్గొనకుండా పలాయనం చిత్తగించారు. సభ ప్రారంభమైంది మొదలు.. రెండో రోజు శాసనసభ ప్రారంభం కాగానే స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రశ్నోత్తరాలు మొదలు పెట్టారు. సభ్యులడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ సిద్ధమయ్యారు. టీడీపీ సభ్యులు ప్లకార్డులతో నినాదాలు చేస్తూ సభలోకి వస్తూనే స్పీకర్ పోడియం వైపునకు దూసుకెళ్లారు. స్పీకర్ చైర్ను చుట్టుముట్టి నినాదాలు చేశారు. చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. ఈ అంశంపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చర్చలో పాల్గొని మీ వాదన వినిపించుకోవచ్చన్నారు. అయినా తక్షణమే చర్చకు పట్టుబడుతూ స్పీకర్పై కాగితాలు విరుసుతూ నినాదాలు చేయడంతో సభను స్పీకర్ వాయిదా వేశారు. రెండోసారి సభ ప్రారంభం కాగానే టీడీపీ సభ్యుల చుట్టూ మార్షల్స్తో మూడంచెల భద్రత వలయాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీ తీరుపై మండిపాటు టీడీపీ సభ్యుల తీరుపై మంత్రులతో సహా పలువురు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేల తీరు చూసి.. ఇలాంటి వారినా మనం ఎన్నుకున్నదని ప్రజలు సిగ్గు పడుతున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అన్నారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్పై చర్చలో పాల్గొనే దమ్ము లేకే టీడీపీ ఎమ్మెల్యేలు ఇలా దిగజారి వ్యవహరిస్తున్నారని మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. అసెంబ్లీలో టీడీపీ రౌడీయిజానికి ఎవరూ భయపడరని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సైకో చంద్రబాబు పాలన ఎప్పుడో పోయిందని మంత్రి జోగి రమేష్ అన్నారు. ఎన్టీఆర్ను పొట్టనపెట్టుకున్న చంద్రబాబే అసలైన సైకో అని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలు అధ్వాన్నంగా ప్రవర్తిస్తున్నారని డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. ప్రజాధనాన్ని దోచుకుని దొరకిపోయిన దొంగ చంద్రబాబు అని మంత్రి మేరుగ నాగార్జున అన్నారు. ఎమ్మెల్యే బాలకృష్ణ మానసిక రోగి అని,ఆయనకు మెంటల్ సర్టిఫికెట్ ఉందని ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆయన్ను ఆస్పత్రికి తరలించకపోతే గన్ను తెచ్చి సభలో ఎవరో ఒకరిని కాల్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. నిషేధం ఉన్నా సెల్ఫోన్లతో చిత్రీకరణ మూడంచెల భద్రతను ఏర్పాటుచేయడంతో టీడీపీ సభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు, బెందాళం అశోక్లు తమ సెల్ఫోన్ల ద్వారా సభలో దృశ్యాలను రికార్డింగ్ చేయడం మొదలుపెట్టారు. నిబంధనను తుంగలో తొక్కి వీడియో రికార్డు చేసిన టీడీపీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ ముదునూరి ప్రసాద్ రాజు స్పీకర్ను కోరారు. వీడియో రికార్డింగ్ చేసిన ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, అశోక్లను సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తూ స్పీకర్ రూల్ పాస్ చేశారు. దీంతో వీరిని మార్షల్స్ బయటకు పంపారు. ఈ దశలో ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, వెలగపూడి రామకృష్ణబాబు, నిమ్మల రామానాయుడుతో సహా సభ్యులందరూ తమ వెంట తీసుకొచ్చిన విజిల్స్ ఊదుతూ సభలో గందరగోళం సృష్టించే యత్నం చేశారు. ఎమ్మెల్యే బాలకృష్ణ, గద్దె రామ్మోహన్ సహా టీడీపీ సభ్యులు కుర్చిలలో నిల్చొని విజిల్స్ ఊదుతూ హంగామా చేశారు. సభా సంప్రదాయాలను తుంగలోకి తొక్కి విలువలను దిగజారుస్తున్న సభ్యులపై చర్యలు తీసుకోవాలని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ కోరగా, ఎమ్మెల్యేలు గోరంట్ల, వెలగపూడి, నిమ్మలపై ఒకరోజు సస్పెన్షన్ వేటు వేస్తూ స్పీకర్ ఆదేశాలు జారీచేశారు. వారిని మార్షల్స్ బయటకు పంపగా, వారి వెంట మిగిలిన సభ్యులు కూడా వెళ్లిపోయారు. కనీసం మిగిలిన వాళ్లయినా చర్చలో పాల్గొనాలని మంత్రులు సహా పలువురు సభ్యులు కోరినా పట్టించుకోకుండా సభ నుంచి వెళ్లిపోయారు. -
అలా గెలిచావా వెలగపూడి రామకృష్ణబాబు..!
సాక్షి, విశాఖపట్నం: మరోసారి ఓటమి భయంతో ఏం చేయాలో పాలుపోక అధికారులపై అడ్డగోలు ఫిర్యాదులు.. ఎల్లో మీడియా అండతో పచ్చి అబద్ధాల రాతలతో రోత పుట్టిస్తున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు. దొంగ ఓట్లకు ఆస్కారం లేకుండా.. ఏ ఒక్కటి డూప్లికేట్ ఓటు లేకుండా ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ చర్యలకు ఉపక్రమించింది. ఈ నేపథ్యంలోనే వలస వెళ్లిపోయిన వారి ఓట్లు, మృతుల ఓట్లు, డూప్లికేట్ ఓట్లని తొలగిస్తున్నారు. అయితే దీనిపై వెలగపూడి రామకృష్ణబాబు విష ప్రచారానికి తెరతీశారు. తూర్పు నియోజకవర్గంలో 40 వేల మంది ఓట్లని తొలగించేశారంటూ పచ్చపత్రిక ఈనాడు సహకారంతో హడావిడి చేశారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలంటూ ఎన్నికల కమిషన్ జిల్లా ఎన్నికల అధికారి అయిన కలెక్టర్ని ఆదేశించింది. తొలగించిన ఓట్లు వివరాలు.. ఎందుకు తొలగించారో సహేతుకంగా వివరిస్తూ.. ఎన్నికల కమిషన్కు నివేదిక సమర్పించారు. ఓట్లు తొలగింపు సక్రమంగానే సాగిందని రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వంపై బురద జల్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడంతో వెలగపూడి మరో కొత్త రాగం ఎత్తుకున్నారు. ఒకే చిరునామాతో 300 ఓట్లు నమోదు చేశారంటూ మరో ఫిర్యాదు చేశారు. దీనిపైనా విచారణ చేస్తే వెలగపూడి బాగోతం బయటపడింది. 73 రోజుల్లో 40 వేల ఓట్లు నమోదు చేసిన టీడీపీ నేతలు వెలగపూడి ఫిర్యాదు చేస్తూ.. హడావిడి చేస్తుండటంతో జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. తప్పు ఎక్కడ జరిగింది.? దీనికి ఎవరు బాధ్యులు అనేది పూర్తిగా అధ్యయనం చేశారు. ఇవన్నీ కూడా 2019 ఎన్నికల ముందు గంపగుత్తగా వెలగపూడి బ్యాచ్ నమోదు చేసిన ఓట్లుగా తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు 2019 జనవరి 11న ఎన్నికల కమిషన్ ఓటరు జాబితాని ప్రచురించింది. ఆ తర్వాత ఓటరు నమోదు, చిరునామాల మార్పులకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో 25 మార్చి 2019న తుది ఎన్నికల ఓటరు జాబితాని ప్రచురించింది. ఈ 73 రోజుల కాల వ్యవధిలో తూర్పు నియోజకవర్గంలో ఏకంగా 40,300 మంది అదనపు ఓటర్లు చేరారు. ఆ తానులో లిస్టే ఇది.. ఇక టీడీపీ ఫిర్యాదు చేసినట్లుగా.. ఒకే ఇంటి నంబర్తో 300 ఓట్లు కూడా అప్పటి ఓటర్ల జాబితాలోని దేనని స్పష్టమైంది. 2019 డ్రాఫ్ట్రోల్లో డోర్ నంబర్ 13–733తో 282, 769తో 186, 790తో 166 ఓట్లు ఉన్నట్లు గుర్తించారు. ఇది కూడా అప్పట్లో టీడీపీ నేతలు నమోదు చేయించిన ఓట్లేనని స్పష్టమవుతోంది. ఇలా 2019 ఎన్నికలకు ముందు నమోదు చేసిన 40,300 అనుమానాస్పద ఓట్లను ఈ మధ్య కాలంలో నిర్వహించిన వెరిఫికేషన్లో గుర్తించిన ఎన్నికల సిబ్బంది వడపోత ప్రక్రియ చేపట్టారు. ఇందులో 13,085 డూప్లికేట్ ఓట్లు, మరణించిన వారి ఓట్లుగా ఉన్న 1226, శాశ్వతంగా విశాఖ తూర్పు నుంచి వలస వెళ్లినట్లుగా గుర్తించిన 17,769 మంది ఓట్లు.. మొత్తం 32,080 ఓట్లను తొలగించేశారు. ఇది ఓర్వలేకపోతున్న టీడీపీ నేతలు.. 2024 ఎన్నికల్లో ఓటమి ఖాయమని భయపడి.. ఆ ఓట్లు తిరిగి చేర్చేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎన్నికల ముందే కథంతా.. 2019 ఎన్నికలు సమీపిస్తుండటంతో పూర్తి స్థాయిలో పరిశీలన చేయకుండా తుది జాబితా ముద్రణ అయ్యింది. అలా ఎన్నికల ముందు టీడీపీ బ్యాచ్ తూర్పు నియోజవర్గంలో ఏకంగా 40,300 దొంగ ఓట్లని నమోదు చేయించారు. 2019 ఎన్నికల్లో వెలగపూడికి 87,073 ఓట్లు రాగా.. వైఎస్సార్సీపీ అభ్యర్థి అక్కరమాని విజయనిర్మలకు 60,599 ఓట్లు వచ్చాయి. అంటే 26,474 ఓట్లు తేడాతో వెలగపూడి విజయం సాధించారు. ఈ విజయం కూడా సదరు టీడీపీ నేతలు నమోదు చేసిన 40,300 ఓట్ల కారణంగానే అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అకారణంగా ఓటు తొలగించే ప్రసక్తే లేదు ఉద్దేశ పూర్వకంగా ఎన్నికల సిబ్బంది ఓట్లు తొలగించారని వస్తున్న ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదు. పూర్తి పారదర్శకంగా ఓటరు నమోదు ప్రక్రియతో పాటు.. వెరిఫికేషన్ కూడా పక్కాగా నిర్వహిస్తున్నాం. ఎక్కడైనా చిన్న తప్పు దొర్లినా బీఎల్వోలపై చర్యలకు ఉపక్రమిస్తున్నాం. 24, 104, 236 పోలింగ్ కేంద్రాల పరిధిలో 222 మంది తాత్కాలిక వలసదారుల ఓట్లని విధుల్లో అలసత్వం కారణంగా తొలగించారు. తుది పరిశీలనలో వీటిని గుర్తించి తిరిగి చేర్చాం. సదరు బీఎల్వోలకు షోకాజ్ నోటీసులు జారీ చేశాం. గతంలో ఉన్న జాబితాలో మూడు కారణాలతో పలు దశల్లో క్షేత్ర స్థాయి పరిశీలనలు చేసిన అనంతరం తొలగించాం. ఎవరైనా ఓటు లేదని భావించినా, చిరునామా మారినా, కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకుంటున్నా ఎన్నికల అధికారులు సిద్ధంగా ఉన్నారు. అకారణంగా ఓటు తొలగించారని తెలిస్తే నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చు. – డా.మల్లికార్జున, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దొంగ ఓట్లు సృష్టించారు 2019 ఎన్నికలకు ముందే తూర్పు నియోజకవర్గంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తన అనుచరుల ద్వారా వేల కొద్దీ దొంగ ఓట్లు సృష్టించారు. ఇప్పుడు అవి తొలగిస్తుంటే భయం పట్టుకుని, అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఎన్నికల అధికారులు పారదర్శకంగా జాబితాని రూపొందిస్తున్నారు. అందులో భాగంగా టీడీపీ దొంగ ఓట్లు బాగోతం బట్టబయలవుతోంది. నియోజకవర్గంలో నమోదైన దొంగ ఓట్లలో ఎక్కువగా గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఉన్నవారి పేర్లే ఉన్నాయి. ప్రతిసారీ దొంగ ఓట్లతోనే విజయం సాధిస్తున్నారన్నది స్పష్టమవుతోంది. ఈ సారి ఆ పప్పులు ఉడకక పోవడంతో అబద్ధపు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారు. – అక్కరమాని విజయనిర్మల, వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త -
విశాఖ ఎయిర్ పోర్ట్ లో వెలగపూడికి చంద్రబాబు క్లాస్
-
ప్రతిదానికి పిల్ ఏమిటి?.. టీడీపీ ఎమ్మెల్యే పిటిషన్పై హైకోర్టు అభ్యంతరం
సాక్షి అమరావతి: విశాఖపట్నం మధురవాడలో రామానాయుడు స్టూడియో కోసం కేటాయించిన భూమిలో రెసిడెన్షియల్ లేఅవుట్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తూ విశాఖ మునిసిపల్ కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ విశాఖపట్నం తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్ను) గురువారం హైకోర్టు కొట్టేసింది. బాధ్యతాయుత ఎమ్మెల్యే పదవిలో ఉంటూ ఇలాంటి పిల్ వేయడం ఏమిటని హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాదం ప్రైవేటు వ్యక్తుల మధ్య ఉంటే దానిపై పిల్ దాఖలు చేయడం ఏమిటని ప్రశ్నించింది. అది ఫిల్మ్ స్టూడియోకి ఇచ్చిన భూమి అని, ప్రైవేట్ భూ వివాదంలో ప్రభుత్వానికి ఏం సంబంధం ఉందని అడిగింది. ఇది ధనికుల మధ్య వివాదమని, ఇందులో తాము జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. చదవండి: తీవ్ర తుపానుగా ‘మోచా’ ప్రతి దాంట్లో ఉల్లంఘన ఉందంటూ పిల్ దాఖలు చేయడం సరికాదని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యంలో ప్రజాప్రయోజనాలు ఎంతమాత్రం లేవని పేర్కొంది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, జస్టిస్ నైనాల జయసూర్య ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. -
‘ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి?’
సాక్షి, విశాఖపట్నం: టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ చౌదరికి కౌంటర్ ఇచ్చారు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. కాగా, విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా..‘ అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి!. అర్రె! 2019 ఎన్నికల అఫిడవిట్లో నీ ఆస్తుల విలువ 15 కోట్లుగా చూపావు. ఇవన్నీ విజయవాడ నుంచి కట్టుబట్టలతో వచ్చినపుడే తెచ్చావా వెలగపూడి రామకృష్ట చౌదరి? నువ్వు అఫిడవిట్లో చూపించింది ఉల్లిపాయ మీద పొట్టేనని అందరికీ తెలుసు. వందల కోట్లు ఎలా దోచుకున్నది ప్రజలకు తెలియదా ఏంటి! — Vijayasai Reddy V (@VSReddy_MP) November 11, 2022 వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజయవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు...అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి. మద్యం సిండికేట్లు, కాంట్రాక్టు పనుల్లో కమీషన్లు, ఆక్రమణలు, కబ్జాలు చేయని అమాయకుడివా? జేబులో చిల్లర డబ్బుతో విశాఖకు వచ్చావు. ఇప్పుడు నీ ఆస్తులు వేల కోట్లు ఎలా అయ్యాయి?.’ అని ప్రశ్నించారు. వంగవీటి రంగా ఎవరో నాకు తెలియదు. ఆయన్ని కిరాతకంగా నరికి చంపిన కేసులో నేను ముద్దాయిని కాదు. నేను విజవాడ నుంచి విశాఖ పారిపోయి రాలేదు...అని నువ్వు నమ్మిన షిర్డీ సాయి సాక్షిగా ప్రమాణం చేయి వెలగపూడి రాము చౌదురి. 1/2 — Vijayasai Reddy V (@VSReddy_MP) November 10, 2022
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
ఆర్మీ ఉద్యోగికి జైలుశిక్ష
హిందూ, ముస్లింలను వేరు చేస్తున్న బీజేపీ
మూగ జీవాలను రక్షించుకోవాలి..
‘గుమ్మనూరు’ను అనర్హుడిగా ప్రకటించాలి
Lok Sabha Election 2024: పేలేది మళ్లీ షాట్ గన్నే!
శ్రీకాంత్ కథలో నటించడం గౌరవంగా ఉంది: జ్యోతిక
సజావుగా పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
స్ట్రాంగ్ రూమ్ల వద్ద పటిష్ట బందోబస్తు
హత్యలు టు నాటుసారా వయా పేకాట
ఎన్నికల విధులకు వెళ్తూ గుండెపోటుతో మృతి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement