హెచ్చరిక బోర్డులనూ వదట్లేదు.!

Tdp Mla Photos On Warning boards - Sakshi

ఆరిలోవ: పైనాపిల్‌కాలనీ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నివాస సముదాయంలో టీడీపీ నాయకులు.. తమ ప్రచారానికి జీవీఎంసీ హెచ్చరిక బోర్డులనూ వదట్లేదు. ప్రభుత్వ స్థలాలను కబ్జాదారుల నుంచి స్వాధీనం చేసుకున్న అనంతరం ‘ఈ స్థలం జీవీఎంసీది.. దీన్ని ఎవరు ఆక్రమించినా శిక్షార్హులవుతారు’ అని రాసిన హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఆ బోర్డులను స్థానిక టీడీపీ నాయకులు తీసుకొచ్చి జనం నడిచిన రోడ్డు పక్కన ఏర్పాటు చేశారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు ఫొటోతో ఫ్లెక్సీ కట్టారు. జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మాత్రం దీన్ని పట్టించుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top