breaking news
top ten
-
రేసర్ అవని
ఈ తరం భారతీయ సమాజానికి అమ్మాయి చేతిలో స్టీరింగ్ విచిత్రం ఏమీ కాదు. స్టీరింగ్ మగవాళ్లదనే అభిప్రాయాన్ని యాభైఏళ్ల కిందటే తుడిచేశారు మహిళలు. ఇప్పుడు ఫార్ములా ఈ కార్ రేసింగ్లోనూ స్టీరింగ్ తిప్పుతున్నారు. కానీ ఈ సంఖ్య చాలా తక్కువ. దేశం మొత్తంమీద చూసినా వేళ్లమీద లెక్కపెట్టేటంత మంది మాత్రమే ఉన్నారు. వీరిలో అత్యంత చిన్నవయసు అమ్మాయి అవని వీరమనేని. మన తెలుగు రాష్ట్రాల్లో తొలి అమ్మాయి కూడా. హైదరాబాద్కు చెందిన పదిహేడేళ్ల అవని ఫార్ములా ఈ రేసింగ్లో దూసుకుపోతోంది. → మగవాళ్లతో పోటీస్టీరింగ్ మీద ఇష్టమే అవనిని ఫార్ములా ఈ రేసింగ్ వైపుకు మళ్లించింది. అన్నయ్య కారు నడుపుతుంటే తనకూ నేర్పించమని మొండిపట్టు పట్టింది. రెండురోజుల్లో స్టీరింగ్ మీద రోడ్ మీద కంట్రోల్ వచ్చేసింది. కానీ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకునే వయసు మాత్రం రాలేదు. కారిచ్చి రోడ్డు మీదకు పంపించరు. స్టీరింగ్ మీద ప్యాషన్ తీరేదెలా? రేసింగ్ గురించి ఇండియాలో ఉన్న అవకాశాల కోసం గూగుల్లో సెర్చ్ చేసింది. ఫార్ములా ఈ రేసింగ్ గురించి తెలియగానే అమ్మానాన్నలను అడిగింది. నిండా పదిహేనేళ్లు లేవు. ఇందులో స్త్రీపురుషులకు పోటీలు విడిగా లేవు. డ్రైవింగ్లో పది–ఇరవై ఏళ్ల అనుభవం ఉన్న నలభైఏళ్ల మగవాళ్లు కూడా అదే ట్రాక్ మీద పోటీలో ఉంటారు. కారువేగం గంటకు 160 నుంచి 170 కిలోమీటర్లు ఉంటుంది. అంత పెద్ద వాళ్ల మధ్య కుందేలు పిల్లలాగ ఉంటుందేమో అనుకున్నారు. కానీ అంతటి క్లిష్టమైన టాస్క్ని తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నప్పుడు వెనక్కు లాగడం ఎందుకు అనుకున్నారు. అవని కోరుకున్నట్లే ఫార్ములా ఈ రేసింగ్ లో శిక్షణ ఇప్పించారు. అవని ఇప్పుడు అహురా రేసింగ్ గ్రూప్తో పోటీల్లో పాల్గొంటోంది. తొలిసారి రేసింగ్ ట్రాక్ మీదకు వెళ్లిన నాటికి ఆమె తొమ్మిదో తరగతి చదువుతోంది. గడచిన మూడేళ్లుగా కోయంబత్తూర్లో, చెన్నైలో జరిగిన జేకే టైర్స్, ఎమ్ఆర్ఎఫ్ కంపెనీలు నిర్వహించిన పోటీల్లో పాల్గొంటున్నది. టాప్ టెన్ ర్యాంకింగ్లో కొనసాగుతోంది. → ఈ తరం టీన్స్అవనితోపాటు ఫార్ములా ఈ రేసింగ్లో స్టీరింగ్ పట్టుకున్న అమ్మాయిల గురించి చెబుతూ ‘‘దేశం మొత్తం మీద చూసినా పెద్ద నంబర్ ఏమీ లేదు. తెలుగువాళ్లెవరూ కనిపించలేదు. తమిళనాడు, మహారాష్ట్రల నుంచి చూశాను. 2023లో నాతోపాటు ఇద్దరమ్మాయిలు ఉన్నారు. 2024లో కూడా మరో ఇద్దరిని చూశానంతే. వాళ్లు కూడా నాకంటే కొద్దిగా పెద్దవాళ్లే తప్ప ఇరవై దాటిన వాళ్లెవరూ లేరు. ఓన్లీ మెన్ ఉన్న ఈ స్పోర్ట్లో ఉమెన్ ఎంట్రీ ఈ జనరేషన్ టీన్స్తో మొదలైందని చెప్పవచ్చు’’ అంటోంది అవని. ఈ పోటీల్లో పాల్గొనడానికి మంచి శక్తినిచ్చే ప్రత్యేకమైన ఆహారం గురించి మాట్లాడుతూ ‘‘అమ్మ డాక్టర్. నేను ఏమి తినాలో, ఎంత తినాలో అమ్మ చూసుకుంటుంది. నాకు తెలిసిందల్లా అమ్మ పెట్టింది తినడమే. నాతోపాటు ట్రైనింగ్కి, పోటీలకు తోడుగా అమ్మ లేదా నాన్న వస్తారు. నాన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనకు కూడా సెలవులు కష్టమే. ఇద్దరికీ వీలుకానప్పుడు అమ్మమ్మ వస్తుంది. నన్ను భద్రంగా చూసుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు. కాబట్టి ఇక నా ఫోకస్ అంతా ట్రాక్ మీదనే’’ అని సంతోషంగా నవ్వేసింది అవని. టెన్త్ క్లాస్ పరీక్ష పెట్టింది! లెవెన్త్ క్లాస్ చదువుతున్నాను. నైన్త్క్లాస్లో ఫార్ములా ఈ కార్ రేసింగ్ మొదలు పెట్టినప్పుడు చదువుకి ఎటువంటి ఇబ్బంది కలగలేదు. టెన్త్లో ట్రైనింగ్ సెషన్స్, బోర్డు ఎగ్జామ్స్ ఒకదానితో ఒకటి పోటీ పడ్డాయి. పగలంతా ట్రైనింగ్, రాత్రి హోటల్ రూమ్కి వచ్చి ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావడం... నిజంగా క్లిష్టసమయం అనే చెప్పాలి. అలాగే బోర్డ్ ఎగ్జామ్ రాశాను. ఫార్ములా ఈ రేసింగ్ చాలా ఖర్చుతో కూడిన ఆట. నా ఇష్టాన్ని మా పేరెంట్స్ ఒప్పుకోవడం నా అదృష్టం. – అవని వీరమనేని, ఫార్ములా ఈ రేసర్– వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి -
వినేష్ ఫోగట్, నితీష్ కుమార్, పూనం పాండే ఎవరు? ఇదే తెగ వెదికేశారట!
ప్రతి సంవత్సరం మాదిరిగానే, ఈ ఏడాదికూడా సెర్చ్ దిగ్గజం గూగుల్లో టాప్-10 మోస్ట్ సెర్చ్డ్ పర్సన్స్ జాబితాను విడుదల చేసింది. భారతదేశంలో 2024లో గూగుల్లో అత్యధికంగా శోధించబడిన వ్యక్తుల జాబితాలో ఒలింపిక్ రెజ్లర్ నుంచి రాజకీయ వేత్తగా మారిన వినేష్ ఫోగట్ అగ్రస్థానంలో నిలిచింది. అలాగే బిలియనీర్ ముఖేష్ అంబానీ చిన్న కోడలు, అనంత్ అంబానీ భార్య రాధికా మర్చంట్ టాప్ టెన్లో ఎనిమిదవ స్థానాన్ని దక్కించుకున్నారు.2024లో భారతదేశంలో గూగుల్లో అత్యధికంగా వెదికిన పదిమంది వ్యక్తులు వినేష్ ఫోగట్నితీష్ కుమార్చిరాగ్ పాశ్వాన్హార్దిక్ పాండ్యాపవన్ కళ్యాణ్శశాంక్ సింగ్పూనమ్ పాండేరాధికా మర్చంట్అభిషేక్ శర్మలక్ష్య సేన్ఇక ప్రపంచవ్యాప్తంగా, 2024లో గ్రహం మీద అత్యధికంగా వెదికిన వ్యక్తిగా అమెరికా కాబోయే అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ నిలిచారు, ఆ తర్వాతి స్థానాల్లో వేల్స్ యువరాణి కేథరీన్, ఇటీవల ముగిసిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ప్రత్యర్థిగా ఉన్న కమలా హారిస్ 3వ స్థానంలో నిలిచారు. ఇంకా ఈ జాబితాలో జేడీ వాన్స్, ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్, రాపర్ డిడ్డీ కూడా ఉన్నారు. -
ప్రపంచంలోనే ఎక్స్లో అత్యధిక ఫాలోవర్లు వీరికే (ఫొటోలు)
-
మెగాస్టార్ టాప్ టెన్ హిట్స్ మీకు తెలుసా?
శివశంకర వరప్రసాద్ అంటే కొందరు గుర్తు పట్టలేరమో తెలియదు కానీ.. మెగాస్టార్ చిరంజీవి అంటే ఇండియాలో ఎవరైనా ఇట్టే గుర్తు పట్టేస్తారు. అంతలా సినీ ఇండస్ట్రీలో తన ముద్ర వేసుకున్నారు మెగాస్టార్. ఆగస్టు 22, 1955న ఆంధ్రప్రదేశ్లోని మొగల్తూరులో జన్మించిన చిరంజీవి తన నట జీవితాన్ని 1970లో ప్రారంభించారు. దాదాపు 150కి పైగా చిత్రాలలో నటించిన మెగాస్టార్ ఖైదీ, గ్యాంగ్ లీడర్, ఠాగూర్ సూపర్ హిట్ చిత్రాలతో స్టార్డమ్ తెచ్చుకున్నారు. 1978లో పునాదిరాళ్లు సినిమాతో నటుడిగా అరంగేట్రం చేసిన మెగాస్టార్ ఆ తర్వాత విజేత, గూఢచారి -116 లాంటి వంటి చిత్రాలలో విభిన్న పాత్రలలో మెప్పించారు. 1980లలో చిరంజీవి ఖైదీ, జ్వాల, ఛాలెంజ్ వంటి చిత్రాలు ఆల్ టైమ్ హిట్స్గా నిలిచాయి. ఆ తర్వాత గ్యాంగ్ లీడర్, స్నేహం కోసం, ఠాగూర్ బ్లాక్ బస్టర్స్ కూడా ఉన్నాయి. ఆగస్టు 22, 2023న మెగాస్టార్ బర్త్ డే సందర్భంగా ఆయన నటించిన చిత్రాలపై ఓ లుక్కేద్దాం. ఆయన కెరీర్లో బ్లాక్ బస్టర్గా చిత్రాలేవో తెలుసుకుందాం. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో ఇరవైకి పైగా సినిమాలు చేశారు మెగాస్టార్. చిరంజీవి- కోదండరామిరెడ్డి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం ఓ రేంజ్లో క్రేజ్ను తెచ్చి పెట్టింది . అలాగే కె.విశ్వనాథ్ దర్శకత్వంలో తెరకెక్కించిన స్వయంకృషి ఆయన ప్రతిభను ఓ రేంజ్కు తీసుకెళ్లింది. ఉత్తమ నటుడిగా నంది అవార్డును కూడా ఈ సినిమాకు అందుకున్నారు. 1.పసివాడి ప్రాణం 2. స్వయంకృషి 3. జగదేకవీరుడు అతిలోకసుందరి 4.గ్యాంగ్ లీడర్ 5.ఖైదీ 6. ముఠామేస్త్రి 7.ఘరానా మొగుడు 8.చూడాలని ఉంది 9.ఠాగూర్ 10.ఇంద్ర ఇవే కాకుండా అప్పట్లో చిరు ఎన్నో సూపర్ హిట్స్ చిత్రాల్లో నటించారు. ఛాలెంజ్, రుద్రవీణ, అడవి దొంగ , విజేత, చంటబ్బాయి, ఆరాధన, స్టేట్ రౌడీ, ఆపద్బాంధవుడు, ముగ్గురు మొనగాళ్లు, హిట్లర్, స్నేహం కోసం, సైరా నరసింహా రెడ్డి, ఖైదీ నెంబర్ 150 వంటి సినిమా లు చిరు కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్స్గా నిలిచాయి. అయితే ఇటీవల రిలీజైన మెగాస్టార్ 156వ చిత్రం భోళాశంకర్ మాత్రం అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. -
అత్యంత తేలికైన టాప్ 10 స్మార్ట్ ఫోన్లు ఇవే.. (ఫొటోలు)
-
IMDb: ఈ ఏడాది టాప్ 10 మూవీస్ ఇవే.. అగ్రస్థానంలో 'ఆర్ఆర్ఆర్'
ఈ ఏడాది ఇండియాలో టాప్ టెన్ మూవీస్లో రాజమౌళి 'ఆర్ఆర్ఆర్' అగ్రస్థానంలో నిలిచింది. ప్రముఖ ఎంటర్టైన్మెంట్ పోర్టల్ ఐఎండీబి ఈ జాబితాను విడుదల చేసింది. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్ ఆఫ్ 2022’ పేరుతో విడుదల చేసిన జాబితాలో ‘ఆర్ఆర్ఆర్’ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అత్యంత భారీ బడ్జెడ్ ఆర్ఆర్ఆర్తో బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది. మొదటిస్థానంలో ఆర్ఆర్ఆర్, రెండోస్థానంలో ది కశ్మీర్ ఫైల్స్, మూడోస్థానంలో కేజీఎఫ్-2, నాలుగో స్థానంలో విక్రమ్, ఐదో ప్లేస్లో కాంతార నిలిచింది. ఆ తర్వాత వరుసగా రాకెట్రీ, మేజర్, సీతారామం, పొన్నియిన్ సెల్వన్, చార్లీ 777 చిత్రాలు టాప్ టెన్లో స్థానం దక్కించుకున్నాయి. ఈ ఏడాది భారీ బడ్జెట్ చిత్రాలతో పాటు.. తక్కువ బడ్జెట్తో తెరకెక్కిన కన్నడ హీరో రిషబ్ శెట్టి చిత్రం కాంతార మూవీ సూపర్ హిట్గా నిలిచింది. ఈ ఏడాది చిన్న చిత్రాలు సైతం బాక్సాఫీస్ వద్ద సందడి చేశాయి. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా కంటెంట్ ఉంటే బ్రహ్మరథం పట్టారు. టాప్ 10 మోస్ట్ పాపులర్ ఇండియన్ మూవీస్- 2022 ఆర్ఆర్ఆర్ ది కశ్మీర్ ఫైల్స్ కేజీయఫ్-2 విక్రమ్ కాంతార రాకెట్రీ మేజర్ సీతారామం పొన్నియిన్ సెల్వన్ 777 చార్లీ Presenting the IMDb Top 10 Most Popular Indian Movies of the year 2022 🥁💛 How many of your favourites made it to the list?#IMDbBestof2022 pic.twitter.com/0GggT44fG8 — IMDb India (@IMDb_in) December 14, 2022 -
టుడే మార్నింగ్ టాప్ 10 న్యూస్
1. సికింద్రాబాద్లో ఘోర అగ్నిప్రమాదం సికింద్రాబాద్లోని రూబీ లాడ్జిలో ఘోర ప్రమాదం సంభవించింది. అగ్నిప్రమాదం కారణంగా ఎనిమిది మంది దుర్మరణం పాలయ్యారు. నిబంధనలకు విరుద్ధంగా సెల్లార్లో ఈ-బైక్స్ నిర్వహణ కారణంగానే ఈ ప్రమాదం సంభవించి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ.. పరిహారం ప్రకటించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ సీఎం జగన్ పర్యటన కంటే ముందే చంద్రబాబు నియోజకవర్గం కుప్పంలో టీడీపీకి భారీ దెబ్బ తగిలింది. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం, గుడుపల్లె మండలాలకు చెందిన టీడీపీ క్రియాశీలక కార్యకర్తలు 200 మంది సోమవారం వైఎస్సార్సీపీలో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. తెలంగాణ అసెంబ్లీ నుంచి ఎమ్మెల్యే ఈటల సస్పెండ్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ను సభ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. తనపై అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పని తరుణంలోనే స్పీకర్ పోచారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సెషన్ మొత్తానికి సస్పెన్షన్ వేటు వర్తిస్తుందని స్పీకర్ స్పష్టం చేస్తూ.. బయటకు పొమ్మని ఈటలకు సూచించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. సౌతాఫ్రికా హెచ్కోచ్ పదవికి బౌచర్ గుడ్బై ఇంగ్లండ్ చేతిలో 1-2 తేడాతో టెస్ట్ సిరీస్ కోల్పోయి బాధలో ఉన్న సౌతాఫ్రికా క్రికెట్ జట్టుకు మరో భారీ షాక్ తగిలింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్ కప్ అనంతరం జట్టు హెడ్ కోచ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నట్లు మార్క్ బౌచర్ ప్రకటించాడు. ఈ విషయాన్ని క్రికెట్ సౌతాఫ్రికా(సీఎస్ఏ) సైతం ధృవీకరించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. బిగ్బాస్-6 రెండోవారం నామినేషన్స్.. చివర్లో ట్విస్ట్ ఇచ్చిన బిగ్బాస్ బిగ్బాస్ సీజన్-6 మొదటివారం పూర్తిచేసుకుని రెండోవారంలోకి అడుగుపెట్టింది. మొదటివారం నో ఎలిమినేషన్ అంటూ బిగ్బాస్ ట్విస్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక రెండోవారం నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఇందులో గతంలో మాదిరి కాకుండా ఈసారి ఒక్కో హౌస్మేట్కు నామినేట్ చేయడానికి కేవలం ఒక్క ఓటు మాత్రమే లభిస్తుందని బిగ్బాస్ తెలిపాడు. మరి ఈ ప్రక్రియలో ఎవరు ఎవర్ని నామినేట్ చేశారు? చివర్లో బిగ్బాస్ ఇచ్చిన ట్విస్ట్ ఏంటి.. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఆటోలో కేజ్రీవాల్.. అడ్డుకున్న పోలీసులు గుజరాత్ పర్యటనలో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఓ ఆటోడ్రైవర్ కోరిక మేరకు అతని ఇంట్లో భోజనం చేశారు. అయితే అతని ఇంటికి వెళ్లే క్రమంలో భారీ హైడ్రామా నడిచింది. చివరకు కేజ్రీవాల్ తగ్గకపోవడంతో.. పోలీసులే వెనక్కి తగ్గారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. గోదావరి మళ్లీ ఉగ్రరూపం గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. పరీవాహక ప్రాంతం (బేసిన్)లో మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్గఢ్, తెలంగాణ, మన రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లో విస్తృతంగా శనివారం, ఆదివారం వర్షాలు కురువడంతో ప్రధాన పాయతోపాటు ఉపనదులు మంజీర, మానేరు, ప్రాణహిత, ఇంద్రావతి, వాగులు, వంకలు ఉప్పొంగుతుండటంతో గోదావరిలో వరద ఉద్ధృతి పెరుగుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. త్రివిక్రమ్ కోసం సరికొత్తగా సూపర్స్టార్ సెట్స్లో మహేశ్బాబు యాక్షన్ ఆరంభమైంది. హీరో మహేశ్బాబు, దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇందులో పూజా హెగ్డే హీరోయిన్. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రారంభమైంది. ముందు యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించేందుకు చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేసినట్లుగా తెలిసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. రెండేళ్ల తర్వాత చైనా బయటకు జిన్పింగ్.. ఒకే వేదికపై ముగ్గురూ! చైనా అధినేత జిన్పింగ్ రెండేళ్ల తర్వాత దేశం బయట అడుగుపెట్టబోతున్నారు. ఈ నెల 14 నుంచి 16 దాకా ఆయన కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ల్లో పర్యటించనున్నట్లు చైనా ప్రభుత్వం సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఉజ్బెకిస్తాన్లో షాంఘై సహకార సంఘం (ఎస్సీఓ) 22వ సదస్సులో జిన్పింగ్ పాల్గొననున్నారు. ఈ సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా పాల్గొనే అవకాశముంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. చైనా కంపెనీల మాస్టర్ మైండ్కు భారీ షాక్ : వివరాలివిగో! చైనా లింకులతో భారత్లో పెద్ద సంఖ్యలో డొల్ల కంపెనీలను నడిపించిన మాస్టర్మైండ్ను సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (ఎస్ఎఫ్ఐవో) అరెస్టు చేసింది. దేశంలో పనిచేస్తున్న అనేక చైనీస్ షెల్ కంపెనీలపై కొరడా ఝళిపిస్తున్న కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ మరో భారీ విజయాన్ని సాధించింది. ఈ చైనా కంపెనీలకు నకిలీ డైరెక్టర్లను సరఫరా చేసేసూత్రధారి జిలియన్ ఇండియా అనే సంస్థ బోర్డు సభ్యుడైన డోర్సె అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు కార్పొరేట్ వ్యవహారాల శాఖ (ఎంసీఏ) ఆదివారం ఒక ప్రకటనలో తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
మార్నింగ్ టాప్-10 న్యూస్ రౌండప్
1. కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు, కారణం ఏంటంటే.. రెబల్స్టార్ కృష్ణంరాజు అంత్యక్రియల్లో మార్పులు జరిగాయి. జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కాకుండా మొయినాబాద్లోని ఆయన ఫామ్హౌజ్లో జరపాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. అంతేకాదు.. ప్రభాస్ కాకుండా అతని సోదరుడు ప్రభోద్ చేతుల మీదుగా కార్యక్రమం జరగనుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. వైఎస్ఆర్ కల్యాణమస్తూ.. బాలికల విద్యకూ ప్రోత్సాహాం పేద వర్గాల యువతుల వివాహాలకు అండగా నిలవడంతో పాటు బాలికల్లో అక్షరాస్యత శాతం పెంపుదలే లక్ష్యంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి వైఎస్సార్ కళ్యాణమస్తు, వైఎస్సార్ షాదీ తోఫాను అమలు చేస్తామని ప్రకటించడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మిక వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ‘పదవ తరగతి పూర్తి చేసి ఉండాలి’ అన్నదాన్ని ‘పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి’ అని సవరిస్తూ ఆదివారం సాంఘిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు (కొరిజెండమ్) జారీ చేసింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. జ్ఞానవాపి తీర్పు.. వారణాసిలో 144 సెక్షన్ ఉత్తర ప్రదేశ్లోని ప్రసిద్ధ శృంగర్ గౌరీ జ్ఞానవాపి మసీదు కేసుకు సంబంధించి వారణాసి జిల్లా కోర్టు ఇవాళ(సెప్టెంబర్ 12) కీలక తీర్పును వెలువరించనుంది. మసీదుకాంప్లెక్స్లో హిందూ దేవతలను పూజించేందుకు అనుమతి కోరుతూ దాఖలైన పిటిషన్పైనే ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వనుంది. ఈ తరుణంలో అక్కడ ఉత్కంఠ వాతావరణం నెలకొంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. నానమ్మ మరణంతో యువరాజుల ఐక్యత! రాణి ఎలిజబెత్–2 చివరియాత్ర లాంఛనంగా మొదలైంది. రాణి భౌతికకాయాన్ని ఆమె తుదిశ్వాస విడిచిన బాల్మోరల్ కోట నుంచి ఆదివారం స్కాట్లండ్ రాజధాని ఎడింబర్గ్లోని రాణి అధికారిక నివాసం హోలీ రుడ్హౌస్ ప్యాలెస్కు తరలించారు. మరోవైపు.. విభేదాల వార్తల నేపథ్యంలో దివంగత రాణి మనవలు, కింగ్ చార్లెస్–3 కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీ దంపతులు శనివారం కలసికట్టుగా ప్రజలకు కన్పించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. యూఎస్ ఓపెన్లో 19 ఏళ్ల కుర్రాడి సంచలనం యూఎస్ ఓపెన్లో స్పానిష్ యువ సంచలనం 19 ఏళ్ల కార్లోస్ అల్కరాజ్ సరి కొత్త చరిత్ర సృష్టించాడు. న్యూయార్క్ వేదికగా ఆదివారం ఆర్ధ రాత్రి జరిగిన యూఎస్ ఓపెన్ పురుషుల సింగిల్స్ ఫైనల్లో నార్వేజియన్ కాస్పర్ రూడ్ను ఓడించి తొలి గ్రాండ్ స్లామ్ టైటిల్ను అల్కరాజ్ కైవసం చేసుకున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. పాక్లో వరద బాధితులను... అక్కున చేర్చుకున్న ఆలయం కనీవిని ఎరగని వరదలతో అతలాకుతలమవుతున్న పాకిస్తాన్లో ఓ చిన్న గ్రామంలోని హిందూ దేవాలయం అందిస్తున్న సేవలు అందరి ప్రశంసలూ అందుకుంటున్నాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్లోని జలాల్ ఖాన్ అనే మారుమూల కుగ్రామంలో ఉన్న బాబా మధోదాస్ మందిర్ వరదలో సర్వం కోల్పోయిన కనీసం 300 మంది ముస్లింలకు ఆశ్రయంతో పాటు భోజనం తదితర సదుపాయాలు కల్పిస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7.చెన్నై-బెంగళూరు రూట్లో ఆకాశ ఎయిర్ సర్వీసులు విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ తాజాగా చెన్నై–బెంగళూరు రూట్లో ఫ్లయిట్ సర్వీసులు ప్రారంభించింది. చెన్నై రాకతో తమ నెట్వర్క్లో అయిదో నగరం చేరినట్లయిందని సంస్థ తెలిపింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కృష్ణం‘రాజసం’.. ఆరడుగుల ఆజానుబాహుడు ‘అక్కా చెల్లెలు’ సినిమా తీసిన పద్మనాభరావు ఓ రోజు కృష్ణంరాజుని చూసి ‘సినిమాల్లో నటిస్తావా?’ అని అడగడం, అటు మూర్తిరాజు, ఇటు స్నేహితులు ప్రయత్నించి చూడమనడంతో పద్మనాభరావుతో కలిసి హైదరాబాద్ నుంచి మద్రాస్ (చెన్నై) వెళ్లారు కృష్ణంరాజు. అయితే ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆ సినిమా పట్టాలెక్కకపోవడంతో హైదరాబాద్కి తిరిగొచ్చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. ఆ హిమానీనదం.. కరిగితే ప్రళయమే! థ్వాయిట్స్ హిమానీనదం. అంటార్కిటికా ఖండం పశ్చిమ భాగంలోని అత్యంత భారీ మంచు కొండ. వైశాల్యం ఎంతంటే.. అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్ర వైశాల్యంతో సమానం. శతాబ్దాలుగా స్థిరంగా నిలిచి ఉన్న థ్వాయిట్స్ కొంతకాలంగా వాతావరణ మార్పుల కారణంగా శరవేగంగా కరిగిపోతోందట. ఎంతలా అంటే ఇప్పుడిది మునివేళ్లపై నిలబడి ఉందట! అందుకే శాస్తవేత్తలు థ్వాయిట్స్కు ప్రళయకాల హిమానీనదం (డూమ్స్డే గ్లేసియర్) అని మరోపేరు పెట్టారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఉగ్రగోదావరి.. సీఎం కేసీఆర్ కీలక ఆదేశాలు ఎగువన కురుస్తున్న వర్షాలతో మరోసారి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నదీ ప్రవాహం పెరుగుతోంది. గోదావరి దగ్గర 9 లక్షల క్యూసెక్కులు దాటింది వరద. దీంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. వరద పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు పరిస్థితిని సమీకక్షించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
భారత్లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాలేవో తెలుసా మీకు?
న్యూఢిల్లీ: వివిధ రంగాల్లో మారుతున్న అవసరాలకు అనుగుణంగా డిమాండ్ కలిగిన నైపుణ్యాలను నేర్చుకోవడం ద్వారా మెరుగైన ఉపాధి అవకాశాలకు వీలుంటుందని లింక్డ్ఇన్ నివేదిక తెలిపింది. ఈ తరహా నైపుణ్యాల విషయంలో ఉద్యోగార్థులకు సాయం చేయడం, వారి కెరీర్కు రక్షణ కల్పించే ఉద్దేశ్యంతో.. ‘స్కిల్స్ ఎవల్యూషన్ 2022’, ‘ఫ్యూచర్ ఆఫ్ స్కిల్స్ 2022’ డేటాను లింక్డ్ఇన్ విడుదల చేసింది. లింక్డ్ఇన్కు భారత్లో 9.2 కోట్ల మంది సభ్యులుగా ఉన్నారు. వారి నైపుణ్యాల డేటా ఆధారంగా.. వృద్ధి చెందుతున్న టాప్10 నైపుణ్యాలు, భవిష్యత్ నైపుణ్యాల వివరాలను తెలియజేసింది. గడిచిన ఐదేళ్ల కాలంలో అంతర్జాతీయంగా ఉద్యోగాలకు కావాల్సిన నైపుణ్యాల్లో 25 శాతం మార్పు చోటు చేసుకుందని.. 2025 నాటికి 41 శాతం మార్పు చోటు చేసుకుంటుందని తెలిపింది. భారత్లో వీటికి డిమాండ్.. భారత్లో డిమాండ్ ఉన్న టాప్-10 నైపుణ్యాల వివరాలను లింక్డ్ఇన్ తెలియజేసింది. బిజినెస్ డెవలప్మెంట్, మార్కెటింగ్, సేల్స్ అండ్ మార్కెటింగ్, ఇంజనీరింగ్, ఎస్క్యూఎల్, సేల్స్, జావా, సేల్స్ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ అజూర్, స్ప్రింగ్బూట్ డిమాండ్ నైపుణ్యాలుగా ఉన్నాయి. 2015 నుంచి చూస్తే కార్పొరేట్ సేవల పరంగా నైపుణ్యాల్లో 41.6 శాతం మార్పు చోటు చేసుకుంది. ఫైనాన్షియల్ రంగంలో.. జీఎస్టీ, టీడీఎస్, స్టాట్యుటరీ ఆడిట్, ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి నైపుణ్యాలకు డిమాండ్ నెలకొంది. సాఫ్ట్వేర్, ఐటీ సేవల పరంగా పదింటికి గాను ఆరు నైపుణ్యాలు కొత్తవే ఉన్నాయి. మీడియా ఆన్లైన్ మాధ్యమంలో విస్తరిస్తున్న క్రమంలో.. సెర్చ్ ఇంజన్ ఆప్టిమైజేషన్ (ఎస్ఈవో), వెబ్ కంటెంట్ రైటింగ్, డిజిటల్ మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, బ్లాగింగ్, సోషల్ మీడియా ఆప్టిమైజేషన్, సెర్చ్ ఇంజన్ మార్కెటింగ్ ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. బ్రాంచ్ బ్యాంకింగ్, బ్రాంచ్ ఆపరేషన్స్ నైపుణ్యాలకు ఫైనాన్షియల్లో డిమాండ్ నెలకొంది. అంటే ఆఫ్లైన్ బ్యాంకింగ్ సేవలకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉందని తెలుస్తోంది. హెల్త్కేర్ రంగంలో నైపుణ్యాల పరంగా 2015 తర్వాత 30 శాతం మార్పు చోటు చేసుకుంది. -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. Azadi Ka Amrit Mahotsav: ఇంటింటా ‘తిరంగ’ ఎటు చూసినా మువ్వన్నెలే.. అన్ని వైపులా త్రివర్ణ పతాక రెపరెపలే..ప్రముఖులే కాదు ప్రతి ఒక్కరి ఇంటిపై జాతీయ జెండా కనిపిస్తోంది. ‘హర్ ఘర్ తిరంగా’ అంటూ దేశం నినదిస్తోంది. 75 వసంతాల స్వాతంత్య్రాన్ని పురస్కరించుకుని అన్ని రాష్ట్రాల లోనూ అమృత మహోత్సవాలు జరుగుతున్నాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. Rakesh Jhunjhunwala: ప్రముఖ వ్యాపారవేత్త రాకేష్ ఝున్ఝున్వాలా కన్నుమూత ఇండియన్ వారెన్ బఫెట్, దేశీయ స్టాక్ మార్కెట్ మాంత్రికుడు రాకేష్ ఝున్ఝున్ వాలా కన్నుమూశారు. గత కొంత కాలంగా కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన చికిత్స నిమిత్తం క్యాండీ బ్రీచ్ హాస్పిటల్లో చేరారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. వెంటిలేటర్పై రష్దీ.. తెగిపోయిన చేతుల్లోని నరాలు, దెబ్బతిన్న కాలేయం భారత మూలాలున్న ప్రముఖ రచయిత, బుకర్ బహుమతి విజేత సల్మాన్ రష్దీ ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉంది. ది సతానిక్ వర్సెస్ రచన తర్వాత దశాబ్దాలుగా ఇస్లామిక్ బెదిరింపులను ఎదుర్కొంటున్న రష్దీపై ఓ ఆగంతకుడు అమెరికాలో చర్చావేదికపైనే కత్తితో విచక్షణారహితంగా దాడిచేసిన విషయం విదితమే. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. Azadi Ka Amrit Mahotsav: దేశానికి పండుగొచ్చింది దేశానికి పండుగ కళ వచ్చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు త్రివర్ణ పతాక శోభ ఉట్టిపడుతోంది. మువ్వన్నెల రెపరెపలతో ప్రతీ ఇల్లు కళకళలాడుతోంది. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృతోత్సవ్లో భాగంగా హర్ ఘర్ తిరంగా కార్యక్రమం శనివారం ప్రారంభమైంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. రీ సర్వే కొత్తపుంతలు.. విమానాలతో ఏరియల్ సర్వే ద్వారా భూముల కొలత వందేళ్ల తర్వాత దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా భూముల రీ సర్వే చేపట్టిన ప్రభుత్వం దాన్ని మరింత వేగంగా ముందుకు తీసుకువెళ్లేందుకు దేశంలోనే తొలిసారిగా విమానాలను ఉపయోగించనుంది. ఇప్పటికే డ్రోన్లతో ఆధునిక తరహాలో రీ సర్వే చేయిస్తున్న ప్రభుత్వం.. దాన్ని ఇంకా ఆధునికంగా నిర్వహించేందుకు ఏరియల్ రీ సర్వేకు శ్రీకారం చుట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. ఉపఎన్నిక వేడిలో ఉడుకుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ.. రంగంలోకి ప్రియాంక? రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలపై ఆ పార్టీ అధిష్టానం ప్రత్యేకంగా ఫోకస్ చేసిందా? తెలంగాణతోపాటు దక్షిణాది రాష్ట్రాలన్నింటిపైనా మరింత దృష్టి పెట్టేందుకు సిద్ధమైందా? ఇందులో భాగంగా పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకా గాంధీకి దక్షిణాది రాష్ట్రాల బాధ్యతలను అప్పగించనున్నారా? పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. డకౌట్ అయ్యానని ఆ ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ నా చెంపపై కొట్టాడు: టేలర్ ఇటీవల న్యూజిలాండ్ క్రికెట్పై సంచలన ఆరోపణులు చేసిన ఆ జట్టు మాజీ ఆటగాడు రాస్ టేలర్.. తన ఆత్మకథ ద్వారా మరో దిగ్భ్రాంతికర సంఘటనను బయట పెట్టాడు. ఐపీఎల్ 2011 సీజన్లో రాజస్థాన్ రాయల్స్ యజమాని తనను చెంపదెబ్బ కొట్టినట్లు టేలర్ తెలిపాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. Vijay Deverakonda: ఆయన కొట్టిన దెబ్బకు రోజంతా బాధపడ్డా నటుడు విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం లైగర్. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే కథానాయికగా నటించింది. బాక్సింగ్ దిగ్గజం మైక్టైసన్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం ఈ నెల 25వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. స్వాతంత్య్ర దినోత్సవ సంరంభం: పిల్లల్లారా పాపల్లారా భావి భారత పౌరుల్లారా రేపు ఆగస్టు 15. భారత దేశ పురోగామి పథంలో ఒక అమృత ఘట్టం. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు నిండాయి. పెద్దలు సాధించారు. యువకులు నిర్మించారు. బాలలు భవిష్యత్తుకు వెలుతురై ప్రసరిస్తారు. ఆగస్టు 15న పిల్లలతో ఉపన్యాసాలు ఇప్పించండి. ఫ్యాన్సీ డ్రెస్సులు వేయించండి. పాటలు పాడించండి. దేశభక్తిని తెలిపే ఆటలు ఆడించండి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10. ఐప్యాక్ నివేదిక.. దిద్దుబాటు చర్యలపై టీఆర్ఎస్ ఫోకస్.. ‘సోషల్’గా వెళ్లాల్సిందే! పార్టీ అనుబంధ సోషల్ మీడియా విభాగాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా టీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. ఇందులోభాగంగా కరడుగట్టిన సోషల్ మీడియా వారియర్స్ (సామాజిక మాధ్యమ ప్రచారకర్తలు)ను తయారు చేసుకోవడంపై దృష్టిపెట్టింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
Morning Top News: తెలుగు ప్రధాన వార్తలు 10 మీకోసం
1.. ఎస్ఎస్ఎల్వీ-డీ1 రాకెట్ ప్రయోగం విజయవంతం చిన్నచిన్న ఉపగ్రహాలను తక్కువ దూరంలో ఉన్న కక్ష్యలోకి ప్రవేశపెట్టడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) రూపొందించిన స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్(ఎస్ఎస్ఎల్వీ డీ1) ఆదివారం నింగిలోకి దూసుకెళ్లింది. ఈ రాకెట్ ప్రయోగం విజయవంతమైంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. చైనా అరాచకం.. తైవాన్ రక్షణ శాఖ అధికారి ఖతం! ఉద్రిక్తతల నేపథ్యంలో తైవాన్ రక్షణ శాఖ అధికారి అనుమానాస్పద మృతి సంచలనం సృష్టించింది. తైవాన్ రక్షణ శాఖకు చెందిన పరిశోధన, అభివృద్ధి విభాగం ఉన్నతాధికారి ఔ యాంగ్ లీ–సింగ్ శనివారం ఉదయం దక్షిణ తైవాన్లోని ఓ హోటల్ గదిలో శవమై కనిపించారు. ఆయన మృతికి కారణం ఏమిటన్నది ఇంకా నిర్ధారించలేదని రక్షణ శాఖ వెల్లడించింది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. బీజేపీలో చేరిన దాసోజు శ్రవణ్ కాంగ్రెస్కు రాజీనామా చేసిన ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ కమలం గూటికి చేరారు. ఢిల్లీలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జీ తరుణ్ చుగ్ సమక్షంలో ఆదివారం బీజేపీలో చేరారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి శ్రవణ్కు కషాయ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. ఏపీ వైపు ఐటీ దిగ్గజాల చూపు.. అంతర్జాతీయ ఐటీ కంపెనీలు రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించడానికి ఆసక్తి వ్యక్తం చేస్తున్నాయి. కోవిడ్ సంక్షోభం తర్వాత ఐటీ కంపెనీలు చిన్న పట్టణాల వైపు చూస్తుండటంతో ఆ అవకాశాన్ని అందిపుచ్చుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5.. Keerthy Suresh: పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్, వరుడు ఎవరంటే.. హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్లు వస్తూనే ఉంటాయి. మొన్న ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లికి కుదిరిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా కీర్తీ సురేష్ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్లో హాట్ హాట్గా జరుగుతుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. CWG 2022 IND vs AUS Final: చరిత్రకు అడుగుదూరంలో.. ఫైనల్లో తలపడనున్న భారత్, ఆస్ట్రేలియా కామన్వెల్త్ గేమ్స్లో స్వర్ణ పతకం సాధించడానికి భారత మహిళల జట్టు ఒక్క అడుగుదూరంలో ఉంది. ఆగస్టు 8(ఆదివారం) రాత్రి జరగనున్న ఫైనల్లో ఆస్ట్రేలియాను భారత్ ఎదుర్కోనుంది. ముఖాముఖి రికార్డులో భారత్పై ఆస్ట్రేలియాదే పైచేయి అయినప్పటికి.. ఆత్మవిశ్వాసంతో ఉన్న భారత్ను ఆసీస్ ఏ మేరకు నిలువరిస్తుందనే వేచి చూడాలి. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. మునుగోడులో బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే పోటీ.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి మధ్య ఏం జరుగు తోందో తనకు తెలియదని.. మునుగోడు సభ విషయంలో వెంకట్రెడ్డికి ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి అభిప్రాయపడ్డారు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. తల్లి పాల వారోత్సవం: ప్రాణదాతలకు వందనం బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తల్లి మనసు గ్రహించే సూక్ష్మం అది. తల్లిపాలకు నోచుకోని బిడ్డలెందరో? ఆ బిడ్డల తల్లుల మనోవేదనకు అంతే ఉండదు. ఒక తల్లి మనసు మరో తల్లికే అర్థమవుతుంది. తన బిడ్డతోపాటు ఆ తల్లి బిడ్డకూ పాలిస్తుంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. మీరు పీఎఫ్ ఖాతాదారులా? యూఏఎన్ నెంబరు ఎలా పొందాలో తెలుసా? ప్రావిడెంట్ ఫండ్ ఖాతాదారులు ఆన్లైన్లో యూఏఎన్ (యూనివర్సల్ నంబర్)ను క్రియేట్ చేసుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నంబర్ అనేది ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ తన ప్రావిడెంట్ ఫండ్ ఖాతా సభ్యులకు కేటాయించే 12-అంకెల కోడ్. ఉద్యోగులు ఈపీఎఫ్ పోర్టల్లో యూఏఎన్ నెంబర్ను క్రియేట్ చేసుకోవచ్చు. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. కన్నబిడ్డ హత్యకు వరుస ప్లాన్లు.. కసాయి తల్లిపై విచారణ నగరంలో సంపంగిరామనగర సీకేసీ గార్డెన్ అద్విత్ అపార్టుమెంటులో నాలుగో అంతస్తు నుంచి ఐదేళ్ల బిడ్డను కిందకు విసిరేసి హత్య చేసిన తల్లి, దంత వైద్యురాలు సుష్మాపై విచారణ సాగుతోంది. 👉పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Morning 10 AM Top News: మార్నింగ్ టాప్ 10 తెలుగు న్యూస్
1. YS Rajasekhara Reddy Jayanthi: మహా మనిషి పంట పండినా.. ఎండినా నష్టపోమనే ధీమా రైతులకు కల్పించి వ్యవసాయాన్ని పండుగలా మార్చారు. ఫీజు రీయింబర్స్మెంట్తో పేద బిడ్డలను విద్యావంతులుగా తీర్చిదిద్ది ఉన్నత కొలువులకు చేర్చారు. ఆరోగ్యశ్రీతో ఖరీదైన కార్పొరేట్ వైద్యాన్ని నిరుపేదల చెంతకు తెచ్చి ప్రజారోగ్యానికి భరోసానిచ్చారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2. Shinzo Abe: జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు జపాన్ మాజీ ప్రధాని షింజో అబేపై కాల్పులు కలకలం రేపాయి. జపాన్ పశ్చిమ ప్రాంతమైన నర పట్టణంలో ఓ సభలో మాట్లాడుతుండగా ఆయనపై కాల్పులు జరిగాయి. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయనను ఆస్పత్రికి తరలించారు. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన అబే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాయి. అయితే, ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3. YSR Jayanthi 2022: వైఎస్సార్కు నివాళులర్పించిన సీఎం జగన్, కుటుంబ సభ్యులు మహానేత, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 73వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులు నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సమాధి వద్ద కుటుంబ సభ్యులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4. సేవకుల తయారీ విధానమది బ్రిటిష్ వలస పాలకులు రూపొందించిన విద్యావిధానం ముఖ్యోద్దేశం వారి అవసరాలను తీర్చేలా సేవకులకు తయారు చేయడమేనని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ఆ విధానంలోని చాలా అంశాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5. కాంగ్రెస్లో చేరికలు.. అలకలు ‘ఒక్క చేరిక.. రెండు అసంతృప్తులు’ అన్నట్లుగా కాంగ్రెస్ పరిస్థితి ఉందనే చర్చ కార్యకర్తల్లో సాగుతోంది. కొత్త చేరికలు పాతవారి అలకలకు కారణమవుతున్నాయి. చేరికలతో కాంగ్రెస్ పార్టీ బలపడుతోందని భావిస్తున్న తరుణంలో కొంతమంది పాతనేతల అసంతృప్తి క్యాడర్ను నిరుత్సాహానికి గురిచేస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6. YSRCP Plenary 2022: దారులన్నీ ప్లీనరీ వైపే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని శుక్ర, శనివారాల్లో వైఎస్సార్సీపీ నిర్వహించనున్న ప్లీనరీకి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. విజయవాడ – గుంటూరు ప్రధాన రహదారికి సమీపంలో నాగార్జున విశ్వవిద్యాలయం ఎదురుగా 2017 జూలై 8 – 9న రెండో ప్లీనరీ నిర్వహించిన ప్రదేశంలోనే మూడో ప్లీనరీని నిర్వహిస్తోంది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7. The Warrior-Ram Pothineni: ఇది అందరికీ సూట్ అయ్యే టైటిల్ ‘‘నేను ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రాన్ని హైదరాబాద్లో షూట్ చేస్తున్నప్పుడు లింగుసామి ‘ది వారియర్’ సినిమా తీస్తున్నారు. అయితే ఆయన తర్వగా షూటింగ్ పూర్తి చేసేశారు. సినిమాను విడుదల కూడా చేసేస్తున్నారు. మేం మెల్లిగా చేస్తూ వస్తున్నాం. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8. Rohit Sharma: ప్రపంచ రికార్డు సృష్టించిన రోహిత్ శర్మ.. ఎవరికీ సాధ్యం కాని రీతిలో! టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి ఫార్మాట్లో ప్రపంచ రికార్డు సృష్టించాడు. టీ20 ఫార్మాట్లో వరుసగా 13 విజయాలు అందుకున్న తొలి సారథిగా నిలిచాడు. ఇంగ్లండ్తో సౌతాంప్టన్ వేదికగా జరిగిన మొదటి టీ20లో విజయంతో ఈ ఘనతను రోహిత్ శర్మ తన ఖాతాలో వేసుకున్నాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9. విమాన ప్రయాణికులకు బంపరాఫర్! విమాన ప్రయాణికులకు ఎయిర్ ఏసియా బంపరాఫర్ ప్రకటించింది. 'స్ప్లాష్ సేల్'ను నిర్వహిస్తున్నట్లు తెలిపింది. ఈ సేల్లో ప్రయాణికులు ఢిల్లీ - జైపూర్ వంటి మార్గాల్లో తక్కువ ధరకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేసుకోవచ్చని వెల్లడించింది. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10. సక్సెస్ స్టోరీ: జేమ్స్బ్రాండ్ ప్రపంచంలోని టాప్ ఫ్యాషన్ స్కూళ్ళ ముఖం ఎప్పుడూ చూడలేదు కరణ్ తొరాని. అయితేనేం...‘మోస్ట్ ప్రామిసింగ్ ఇండియన్ డిజైనర్’గా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందాడు. తానే ఒక బ్రాండ్గా మారాడు. ► పూర్తి ఆర్టికల్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
Trending News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 ఈవెనింగ్ న్యూస్
1.. CM Jagan: 24 ఏళ్ల కల నెరవేర్చిన సీఎం జగన్కు కృతజ్ఞతలు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో 1998 డీఎస్సీ అభ్యర్థులు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి, కృతజ్ఞతలు తెలియజేశారు. 24 ఏళ్ల నాటి సమస్యను పరిష్కరించడం ద్వారా తమను, తమ కుటుంబాలను ఆదుకున్నారని ముఖ్యమంత్రి వద్ద అభ్యర్థులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 2.. Maharashtra Political Crisis: మీడియాకు చిక్కిన ఏక్నాథ్ షిండే.. పరుగే పరుగు! ముంబై: మహారాష్ట్రలోని సంకీర్ణ సర్కారును కూలదోయడానికి ప్రయత్నిస్తున్న శివసేన పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే (58) మీడియా కంటపడ్డారు. గుజరాత్లోని సూరత్ విమానాశ్రయంలో ఆయన మీడియాకు చిక్కారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 3.. Maharashtra Political Crisis: రెబల్ ఎమ్మెల్యేలకు శివసేన అల్టీమేటం.. వెక్కివెక్కి ఏడ్చిన కార్యకర్తలు మహారాష్ట్ర మంత్రి, శివసేన అగ్రనేత ఏక్నాథ్ షిండే తన అనుచర ఎమ్మెల్యేలతో కలిసి క్యాంప్ రాజకీయాలకు తెరలేపడంతో మహా వికాస్ అఘాడి ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. ముందుగా గుజరాత్లోని సూరత్ హోటల్లో బస చేసిన రెబల్ ఎమ్మెల్యేలు ప్రస్తుతం అస్సాంకు మకాం మార్చారు. దేశవాప్తంగా ‘మహా’ సంక్షోభం తాజాగా హాట్ టాపిక్గా మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 4.. CM Jagan Srikakulam Tour: శ్రీకాకుళం జిల్లా పర్యటనకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 27న శ్రీకాకుళం రాను న్నారు. అమ్మఒడి పథకం మూడో విడత పంపిణీ కార్యక్రమాన్ని ఇక్కడి నుంచే సీఎం చేపట్టనున్నా రు. ఇదే సందర్భంలో శ్రీకాకుళం–ఆమదాలవలస రోడ్డు నాలుగు లైన్ల విస్తరణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 5..: నేనైతే పంత్ కెప్టెన్ కాకుండా కచ్చితంగా అడ్డుకునేవాడిని! స్వదేశంలో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్కు రిషభ్ పంత్ను కెప్టెన్గా నియమించాల్సి కాదని టీమిండియా మాజీ ఆల్రౌండర్ మదన్ లాల్ అన్నాడు. తనకే గనుక అధికారం ఉండి ఉంటే కచ్చితంగా 24 ఏళ్ల ఈ యువ బ్యాటర్ను సారథిగా ఎంపిక చేసేవాడిని కాదన్నాడు. ఆటగాడిగా పంత్ మరింత మెరుగుపడాల్సి ఉందని, పూర్తి స్థాయిలో పరిణతి చెందిన తర్వాతే కెప్టెన్గా భారాన్ని మోయగలుగుతాడని అభిప్రాయపడ్డాడు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 6.. Chinmayi Sripada: ఎలా కన్నావని అడుగుతున్నారు? వారికి నా ఆన్సరేంటంటే.. ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది సింగర్. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 7.. దటీజ్ టాటా.. ఆ కంపెనీకంటూ కొన్ని విలువలు ఉన్నాయ్! ఉక్రెయిన్పై రష్యా చేపట్టిన యుద్ధం పట్ల ఇండియన్ కార్పోరేట్ కంపెనీలు తమ వైఖరికి బయటపడకుండా జాగ్రత్త పడ్డాయి. కానీ టాటాగ్రూపు ఇలా ఊరుకోలేదు. యుద్ధం కారణంగా పెచ్చరిల్లే హింస, రక్తపాతాలు, ఆర్తానాదాలను నిరసిస్తూ రష్యాతో వ్యాపార సంబంధాలు గుడ్బై చెప్పింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 8.. భారత్, చైనా, జపాన్లతో దాతల సమావేశం...సాయం కోరుతున్న శ్రీలంక శ్రీలంక తీవ్ర ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే శ్రీలంకలో ఏర్పడిన కొత్త ప్రభుత్వానికి తమ దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేయటం ఒక పెద్ద సవాలుగా మారింది. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 9.. Monica Khanna: ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నా ధైర్యం కోల్పోక.. 185 మందిని కాపాడి సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 10.. 'ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం' ఫోన్ నెంబర్ ఇవ్వకపోవడంతో కొందరు యువకులు బెదిరింపులకు పాల్పడ్డట్లు ఓ యువతి రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. యువతి వెంట వచ్చిన బాక్సర్ దాడి చేయడంతో గాయాలయ్యాయని మరో యువకుడు ఫిర్యాదు చేయడంతో ఇరు వర్గాలపై కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
టుడే ట్రెండింగ్ & టాప్ 10 మార్నింగ్ న్యూస్
1. మారుతున్న మహా రాజకీయం మహారాష్ట్రలో రాజకీయం ఒక్కసారిగా హీటెక్కింది. బీజేపీ ‘ఆపరేషన్ కమలం’ దెబ్బకు మహారాష్ట్రలో శివసేన నేతృత్వంలోని పాలక సంకీర్ణం సంక్షోభంలో పడింది. శివసేన చీఫ్, సీఎం ఉద్ధవ్ ఠాక్రేపై కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న పార్టీ కీలక నేత, రాష్ట్ర పట్టణాభివృద్ధి మంత్రి ఏక్నాథ్ షిండే మహా రాజకీయాలను ఊహించని మలుపు తిప్పబోతున్నట్లు తెలుస్తోంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 2. ఆటంకాలున్నా.. ఏపీలో అభివృద్ధి బాటే సంక్షేమాన్ని అడ్డుకోవడమే విపక్షం ఏకైక అజెండా. అయినా కూడా అభివృద్ధి బాటలో ఏపీ సర్కార్. గత సర్కారు అసంపూర్తిగా వదిలేసిన వంతెనలు, ఆర్వోబీలు, ఫ్లై ఓవర్ల పనుల పూర్తికి ప్రాధాన్యం. రోడ్ల నిర్మాణంతోపాటు మెరుగైన నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలన్న సీఎం జగన్. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 3. ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఇవాళే ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలను జూన్ 22వ తేదీ(బుధవారం) విడుదల చేయనున్నారు. ఈ ఫలితాలను మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేయనున్నారు. డైరెక్ట్ లింక్ కోసం పూర్తి కథనం మీద క్లిక్ చేయండి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 4. అమెరికాలో కాల్పులు.. నల్గొండ సాయి చరణ్ కన్నుమూత అమెరికా మేరీల్యాండ్లో జరిగిన కాల్పుల్లో నల్గొండ వాసి మృతి చెందాడు. దుండగుడి కాల్పుల్లో సాఫ్ట్వేర్ ఉద్యోగి సాయిచరణ్ (26)మృతి చెందాడు. గత రెండేళ్లుగా సాయిచరణ్ అక్కడ పని చేస్తున్నాడు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 5. ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ షురూ ఆత్మకూరు ఉప ఎన్నికల పోలింగ్కు కౌంట్డౌన్ మొదలైంది. ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీకి అధికారులు ఎన్నికల సామాగ్రిని తరలించారు. 279 పోలింగ్ కేంద్రాల్లో 377 ఈవీఎంలను ఎన్నికల అధికారులు సిద్ధం చేశారు. కాగా, ఈ ఉప ఎన్నికల కోసం 1300 మంది సిబ్బంది విధుల్లో పాల్గొననున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 6. 30 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై సిరీస్ నెగ్గిన లంక సొంతగడ్డపై 1992 తర్వాత తొలిసారి శ్రీలంక జట్టు ఆస్ట్రేలియాపై వన్డే సిరీస్ను గెలుచుకుంది. మంగళవారం చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా సాగిన నాలుగో వన్డేలో లంక 4 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 7. మరింత దూకుడుగా ఎలన్ మస్క్ ఉద్యోగుల తొలగింపు అంశంలో టెస్లా అధినేత ఎలన్ మస్క్ ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. లేబర్ చట్టాల్ని ఉల్లంఘిస్తున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నా.. మరింత దూకుడు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న మస్క్ ఉద్యోగుల కోత విషయంపై క్లారిటీ ఇచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 8. కొలంబియా ఉపాధ్యక్షురాలిగా మార్కెజ్ దక్షిణ అమెరికా దేశం కొలంబియా ఓటర్లు ఆదివారం జరిగిన ఎన్నికల్లో విలక్షణ తీర్పునిచ్చారు. మాజీ కమ్యూనిస్ట్ నేతకు అధ్యక్ష పదవి పగ్గాలు అప్పగించడంతోపాటు, మొదటిసారిగా ఫ్రాన్సియా మార్కెజ్ అనే నల్లజాతీయురాలిని ఉపాధ్యక్ష పదవికి ఎన్నుకున్నారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 9. కవలలకు జన్మనిచ్చిన ప్రముఖ సింగర్ ప్రమఖ సింగర్ చిన్మయి శ్రీపాద తల్లయ్యారు. ఆమె పండంటి కవలలకు జన్మనిచ్చారు. ఈ విషయాన్ని చిన్మయితో పాటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఇద్దరి పిల్లల చేతులను చిన్మయి, ఆమె భర్త పట్టుకున్న ఫోటోలను షేర్ చేస్తూ.. పిల్లల పేర్లను కూడా వెల్లడించారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి 10.అన్నాడీఎంకే వర్గపోరు.. ‘అమ్మ’ సమాధి వద్ద ఉద్రిక్తత అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి -
డాక్యుమెంటరీ ఫిల్మ్: ఇది నా ఇల్లు
ఎవరినైనా కలిసినప్పుడు మంచీ చెడు మధ్యలో తప్పక వచ్చే ప్రశ్న ‘మీ ఇల్లెక్కడ?!’ ‘ఇదే ప్రశ్నను లద్దాఖ్లోని ఓ పెద్ద మనిషిని అడిగినప్పుడు అక్కడి చుట్టూ కొండలు, విశాల మైదానాలు చూపిస్తూ... ఈ ప్రకృతి ఒడే నా ఇల్లు అని పరిచయం చేస్తే... ఆ ప్రపంచంలో 45 రోజులు ఉండి తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్ ‘ఇది నా ఇల్లు’ అని వివరించారు దీపాకిరణ్. ప్రపంచ వ్యాప్తంగా 75 వేల మందికి పైగా స్టోరీ టెల్లర్స్ను చేరుకున్న దీపాకిరణ్ హైదరాబాద్ వాసి. స్టోరీ ఆర్ట్ ఫౌండేషన్ ఫౌండర్, ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్, ఆర్ట్–బేస్డ్ ఎడ్యుకేషనలిస్ట్. ఈ స్టోరీ టెల్లర్ ఇటీవల ‘దిస్ ఈజ్ మై హోమ్’ అనే డాక్యుమెంటరీ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ యేడాది ముంబై ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్(ఎమ్ఐఎఫ్ఎఫ్) లో ప్రదర్శనకు వచ్చిన 800 ఎంట్రీలలో ‘దిస్ ఈజ్ మై హోమ్’ టాప్ టెన్ జాబితాలో నిలిచింది. ఈ సందర్భంగా ఆమెతో మాట్లాడినప్పుడు డాక్యుమెంటరీ ఫిల్మ్ రూపకల్పన గురించి ఇలా పంచుకున్నారు. ‘‘సముద్రం నుండి 3,700 మీటర్ల ఎత్తులో లద్దాఖ్ పర్వతాలలోని మారుమూల గ్రామంలో ఒక యువ గ్రాఫిక్ డిజైనర్ జీవితాన్ని డాక్యుమెంటరీని రూపొందించాను. లెహ్–లదాఖ్లోని రెసిడెన్షియల్ కోర్సులో భాగంగా, వర్క్ నేర్చుకుంటూ తీసిన మొదటి డాక్యుమెంటరీ ఫిల్మ్ ఇది. కథ కలిపిన పరిచయాలు కిందటేడాది ఆగస్టులో రెండు వర్క్షాప్స్ కోసం చేసిన ప్లాన్లో భాగంగా లదాఖ్కు వెళ్లాను. లైఫ్లో ఒక ఛేంజ్ కోసం చేసిన ప్రయాణం కూడా. నాతో పాటు వర్క్షాప్ కోసం వచ్చిన స్నేహితులున్నారు. లద్దాఖ్లో ఒక మారుమూల ప్రాంతం అది. విసిరేసినట్టుగా ఉన్నాయి అక్కడి ఇల్లు. ఒక చిన్న కాఫీ షాప్లో కూర్చుని, ఫ్రెండ్స్తో సరదాగా ఓ కథ చెబుతున్నాను. మమ్మల్నే గమనిస్తున్న ఓ యువకుడు మేము చెబుతున్న కథ వింటూ తనని తాను పరిచయం చేసుకున్నాడు. మేమూ అతని గురించి తెలుసుకున్నాం. గ్రాఫిక్ డిజైనర్ అయిన తన పేరు వరుణ్. పట్టణాన్ని వదిలి లద్దాఖ్లో కుండలు తయారు చేసే పనిని నేర్చుకుంటున్నాడని తెలిసి చాలా ఆసక్తిగా అనిపించింది. వరుణ్ ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి ఎన్నో కుటుంబాలను కలిశాం. అలాగే, వరుణ్తో పాటు, వారి జీవన శైలిని ఒక కథగా తీసుకోవాలనిపించింది. అక్కడ నుంచి ప్రతీది ఒక ఆసక్తిగా మారిపోయింది. ఒక థీమ్ ప్లాన్ చేసి, వరుణ్తో మాట్లాడి డాక్యుమెంటరీ తీయడం ఆరంభించాను. దిస్ ఈజ్ మై హోమ్ వరుణ్ స్థానికులను కలిసి, ఒక్కో వ్యక్తిని కొన్ని ప్రశ్నలు అడగుతుండగా వారు ఇచ్చిన సమాధానాలను తీసుకున్నాను. ఒక వృద్ధుడిని కలిసి మాట్లాడినప్పుడు అతను తన ఇంటికి తీసుకెళ్లాడు. ఆ ఇల్లు చాలా చిన్నది. కానీ, వారి ముఖాల్లో కనిపించిన సంతోషాన్ని చూసి ‘పట్ణణాల్లో పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్నా, ఈ సంతోషం ఎక్కడా కనిపించదు ఎందుకు?’ అని అడిగినప్పుడు... ‘గదులు ఉండటం ఇల్లు కాదు. అలా చూడండి, చుట్టూ కొండలు, చూసినంత మేర పచ్చదనం. ఇంత పెద్ద ఇల్లు ఉంటే ఎంత సంతోషంగా ఉంటుంది’ అన్నాడు. అతని మాటలు నాకు బాగా నచ్చాయి. ఒక కామిక్ స్ట్రిప్ కూడా నేను అంతకుముందే చూసి ఉన్నాను. అన్నీ కలిపి డాక్యుమెంటరీ ఫిల్మ్కి ‘దిస్ ఈజ్ మై హోమ్’ టైటిల్ సరైనదనుకున్నాను. ఈ మూవీ చూసిన కొందరు డైరెక్టర్లు ‘మేమూ ఆ గ్రామంలో ఉన్నట్టు, అక్కడ వాళ్లను కలుసుకున్నట్టుగా ఉంది’ అని చెప్పారు. చాలా ఆనందంగా అనిపించింది. చాలా శక్తిమంతులు మంచుకొండల్లో అతి చల్లటి వాతావరణం లద్దాఖ్. అలాంటి చోట మాతోపాటు టౌన్కి బయల్దేరాలనుకున్న ఒక బామ్మ తెల్లవారు ఝామున నాలుగ్గంటలకే లేచి, చల్లటి నీళ్లతో తలస్నానం చేసి, రెడీ అయిపోయారు. నాకు ఆమె శక్తిని చూసి చాలా అద్భుతం అనిపించింది. మిగతావారూ అలాగే ఉన్నారు. కొత్తగా జీవించాలి.. నా రైటింగ్ బ్యాక్ గ్రౌండ్, స్టోరీ టెల్లింగ్.. నా డాక్యుమెంటరీ వర్క్కి బాగా పనికొచ్చాయి. ఎడిటింగ్ వర్క్, వాయిస్ ఓవర్ పూర్తయ్యాక ముందు వరుణ్కి పంపించాను. వాళ్ల కుటుంబం మొత్తం ఆ డాక్యుమెంటరీ చూసి, చాలా సంతోషించారు. ఆ తర్వాత ఫిల్మ్ కాంపిటిషన్కు పంపించాను. టాప్టెన్లో నిలిచింది. అంతటితో నా పని పూర్తవ్వలేదు. మరిన్ని కొత్త పనులవైపు చూశాను. ఇటీవలే ఒక సర్టిఫికెట్ లైఫ్ కోచ్గా జాయిన్ అయ్యాను. కరోనా సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి మానసిక శక్తిని అందించింది లద్దాఖ్లో తీసిన డాక్యుమెంటరీ ఫిల్మ్. అక్కడి స్థానికులతో సంభాషణ, ప్రయాణం ఏదీ అంత సులువు కాలేదు. ప్రతిది ఛాలెంజింగ్. అదే నాలో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచింది. అక్కడి మనుషులు, ప్రకృతి, నేర్చుకున్న కొత్త వర్క్ నుంచి.. మళ్లీ జీవించడం నేర్చుకున్నాను’’ అని వివరించారు ఈ స్టోరీ టెల్లర్ అండ్ డైరెక్టర్. దీపాకిరణ్ – నిర్మలారెడ్డి -
Trending Top 10 News: టుడే ట్రెండింగ్ & టాప్ 10 న్యూస్
1. Cyclone Asani: తీరంలో ‘అసని’ అలజడి ఆగ్నేయ బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ బంగాళాఖాతంపై ఉన్న ‘అసని’ తీవ్ర తుపాను గంటకు 25 కి.మీ. వేగంతో వాయవ్య దిశగా ప్రయాణిస్తోంది. ప్రస్తుతం ఇది కాకినాడకు ఆగ్నేయంగా 390 కి.మీ., విశాఖకు ఆగ్నేయంగా 390 కి.మీ., గోపాల్పూర్కు 510 కి.మీ., పూరీకి దక్షిణ దిశగా 580 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 2. మేలు జరిగిన వారు రుణం తీర్చుకోండి.. సోనియా కీలక వ్యాఖ్యలు త్వరలో జరగనున్న చింతన్ శిబిర్ తప్పనిసరి తంతుగా మారటానికి వీల్లేదని కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీ స్పష్టం చేశారు. ఎన్నికల సవాళ్లను, సైద్ధాంతిక సవాళ్లను దీటుగా ఎదుర్కొనేలా పార్టీ తిరిగి జవసత్వాలు కూడదీసుకోవాలి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 3. Russia-Ukraine war: యుద్ధ పాపం పశ్చిమ దేశాలదే పొరుగుదేశం ఉక్రెయిన్పై తాము ప్రారంభించిన సైనిక చర్యను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి సమర్థించుకున్నారు. పశ్చిమ దేశాల విధానాలే తమను ఉక్రెయిన్పై యుద్ధానికి పురికొల్పాయని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 4. Andhra Pradesh: సర్కారు ఆస్పత్రుల్లో నిరంతర వైద్యం ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం, అలసత్వానికి ఏమాత్రం తావులేదని అధికార యంత్రాంగానికి సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో చాలా ప్రభుత్వాలు మారినా ప్రజా సమస్యలకు పరిష్కారం చూపడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని, ఇప్పుడు అలాంటి వాటికి చోటులేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 5. పంజాబ్ పోలీసు ఇంటెలిజెన్స్ కార్యాలయంలో పేలుడు పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన కార్యాలయంపై రాకెట్ దాడి జరి గింది. మొహాలీలో సోమవారం రాత్రి ఈ సంఘటన జరిగినట్లు పోలీసులు చెప్పారు. కార్యాలయం మూడో అంతస్తులోకి దుండగులు రాకెట్–ప్రొపెల్డ్ గ్రెనేడ్(ఆర్పీజీ) విసిరినట్లు వెల్లడించారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 6. Telangana VRAs Pay Scale Issue: పది పాసైతేనే పేస్కేల్! గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్ఏ) పేస్కేల్ అంశాన్ని పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది. వీఆర్ఏల విద్యార్హతలను పరిగణనలోకి తీసుకోవాలని.. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు ఉత్తీర్ణులైన వీఆర్ఏలకు పేస్కేల్ ఇవ్వాలని, మిగతా వారందరికీ గౌరవ వేతనంతోనే సరిపెట్టాలనే ప్రతిపాదన సిద్ధమైందని రెవెన్యూ వర్గాలు చెప్తున్నాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 7. ఎవరి కెరీర్ను ఎవరూ డిసైడ్ చేయలేరు హిట్ వచ్చినప్పుడు ఎగరకూడదు. ఫ్లాప్ వచ్చినప్పుడు కుమిలిపోకూడదు. మా నాన్నగారి(ఈవీవీ సత్యనారాయణ) ఫ్రెండ్ అని, తెలిసినవారనీ.. ఆబ్లిగేషన్స్తో కొన్ని సినిమాలు చేశాను. వరుస ఫ్లాప్స్ తర్వాత నేను నేర్చుకున్నది ఏంటంటే... ఆబ్లిగేషన్స్ కోసం సినిమా చేయకూడదని, కథ నచ్చితేనే చేద్దామని ఫిక్సయ్యాను’’ అని ‘అల్లరి’ నరేశ్ అన్నారు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 8. కోల్కథ...ఇంకా ఉంది! తొలి పది మ్యాచ్లలో తీసింది 5 వికెట్లే... ఫామ్లో లేక ఇబ్బంది పడుతున్న ముంబై ఇండియన్స్ స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈసారి తన సత్తా చూపించాడు. 9 బంతుల వ్యవధిలో 5 వికెట్లు పడగొట్టి ప్రత్యర్థిని కుప్పకూల్చాడు. ముంబైకి మంచి విజయావకాశం సృష్టించాడు. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 9. డెలివరీ గర్ల్స్ ఫుడ్ యాప్లు వచ్చాక మనకు డెలివరీ బాయ్స్ బాగా పరిచయం అయ్యారు. ఆర్డర్ ఇచ్చిన అరగంటలో గడపముందుకే ఫుడ్ రావడం చాలా సౌకర్యంగా మారింది. అయితే, ఇప్పటి వరకు ఈ డెలివరీ రంగంలో మగవారిదే ఆధిపత్యంగా ఉంది. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి 10. వడ్డింపు బాటలో మరో ఐదు బ్యాంకులు మూడు ప్రభుత్వ రంగ, రెండు ప్రైవేటు రంగ బ్యాంకులు సోమవారం వడ్డీరేట్ల పెంపు బాటన నిలిచాయి. వీటిలో ప్రైవేటు రంగ దిగ్గజం హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఒకటికాగా, కరూర్ వైశ్యా బ్యాంక్ మరొకటి. ప్రభుత్వ రంగంలోని కెనరాబ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (బీఓఎం), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (ఐఓబీ)లు కూడా వడ్డీరేట్లను పెంచాయి. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి -
ఐపీఎల్-2022 గెలుపు గుర్రాలకోసం ఫ్రాంఛైజీ వేట షురూ
-
లాజిస్టిక్స్ సూచీలో టాప్ 10లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
న్యూఢిల్లీ:ఎగుమతులు, ఆర్థిక వృద్ధికి ఊతంగా నిల్చే లాజిస్టిక్స్ సర్వీసుల పనితీరులో గుజరాత్ అగ్ర స్థానంలో కొనసాగుతోంది. ఇందుకు సంబంధించిన 2021 సూచీలో వరుసగా మూడోసారి టాప్లో నిల్చింది. కేంద్ర వాణిజ్య శాఖ సోమవారం విడుదల చేసిన ఈ జాబితాలో 21 రాష్ట్రాలు ఉన్నాయి. వీటిలో గుజరాత్ తర్వాత స్థానాల్లో హర్యానా (2), పంజాబ్ (3), తమిళనాడు (4), మహారాష్ట్ర (5) నిల్చాయి. టాప్ 10లో ఉత్తర్ ప్రదేశ్ (6), ఒరిస్సా (7), కర్ణాటక (8), ఆంధ్రప్రదేశ్ (9), తెలంగాణ (10) రాష్ట్రాలు ఉన్నాయి. ఆయా రాష్ట్రాల్లో లాజిస్టిక్స్ వ్యవస్థ, వివిధ వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లు, వాటిని పరిష్కరించేందుకు సూచనలు మొదలైన వాటితో 2021 నివేదిక రూపొందింది. దీన్ని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్ ఆవిష్కరించారు. సూచీకి సంబంధించి మొత్తం 21 అంశాల్లో వివిధ రాష్ట్రాల పనితీరును కేంద్రం మదింపు చేసింది. ఈ ఏడాది మే–ఆగస్టు మధ్య కాలంలో ఇందుకోసం సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1,405 మంది నుంచి అభిప్రాయాలు తీసుకుంది. వచ్చే అయిదేళ్లలో లాజిస్టిక్స్ వ్యయాలను అయిదు శాతం మేర తగ్గించుకునేందుకు ఆయా వర్గాల అభిప్రాయాలు దోహదపడగలవి గోయల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఇవి స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 13–14 శాతం స్థాయిలో ఉన్నాయి. -
‘వాతావరణ’ పెట్టుబడులు.. టాప్ 10 దేశాల్లో భారత్..
లండన్: గత అయిదేళ్లుగా వాతావరణ పరిరక్షణ టెక్నాలజీ పెట్టుబడులకు ఆకర్షణీయంగా నిలుస్తున్న టాప్ 10 దేశాల జాబితాలో భారత్ చోటు దక్కించుకుంది. తొమ్మిదో స్థానంలో నిల్చింది. దేశీ క్లైమేట్ టెక్ సంస్థలు 2016–2021 మధ్య కాలంలో 1 బిలియన్ డాలర్ల మేర వెంచర్ క్యాపిటల్ పెట్టుబడులు దక్కించుకున్నాయి. ప్యారిస్ ఒప్పందం అనంతరం అయిదేళ్లుగా చోటు చేసుకున్న పరిణామాలపై లండన్ అండ్ పార్ట్నర్స్, డీల్రూమ్డాట్కామ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. నంబర్ వన్ అమెరికా తాజా నివేదిక ప్రకారం ప్యారిస్ ఒప్పందం తర్వాత ప్రపంచవ్యాప్తంగా క్లైమేట్ టెక్ కంపెనీల్లోకి పెట్టుబడులు గణనీయంగా పెరిగాయి. ఈ పెట్టుబడులు అందుకున్న టాప్ 10 దేశాల్లో 48 బిలియన్ డాలర్లతో అమెరికా అగ్రస్థానంలో, 18.6 బిలియన్ డాలర్లతో చైనా రెండో స్థానంలో, 5.8 బిలియన్ డాలర్లతో స్వీడన్ మూడో స్థానంలో నిలిచాయి. కాలుష్యకారక ఉద్గారాలను సున్నా స్థాయికి తగ్గించే దిశగా అంతా సమిష్టిగా పనిచేయడంపై ప్రపంచ దేశాలు దృష్టి పెట్టాలని నివేదిక పేర్కొంది. పర్యావరణంపై బహుళజాతి బ్యాంకులు దృష్టి పెట్టాలి - నిర్మాలాసీతారామన్ న్యూఢిల్లీ: పర్యావరణం, తత్సబంధ ప్రాజెక్టులు, పురోగతిపై ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) వంటి బహుళజాతి బ్యాంకులు దృష్టి సారించాలని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. ఇందుకు ప్రైవేటు మూలధనం సమకూర్చడానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. ఈ మేరకు ఆమె చైనా కేంద్రంగా పనిచేస్తున్న ఏఐఐబీ గవర్నర్ల బోర్డ్ ఆరవ వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. సామాజిక మౌలిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి పెట్టుబడుల అవకాశాలను ఏఐఐబీ అన్వేషించాలని ఆమె ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. ఏఐఐబీకి భారత్ అన్ని విషయాల్లో తగిన సహకారం అందిస్తుందన్నారు. రెసిడెంట్ బోర్డ్, రీజినల్ ఆఫీస్లను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఏఐఐబీకి విజ్ఞప్తి చేశారు. దీనివల్ల బ్యాంక్ కార్యకలాపాల్లో పారదర్శకత మరింత పెరుగుతుందన్నారు. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
పవన్ కల్యాణ్ ఆటలో అరటిపండు జనసేన అధినేత పవన్కల్యాణ్పై రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని చెప్పి.. ప్రశ్నించడం మర్చిపోయారని ఆయన మంగళవారం ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. నో పార్టీ.. ఓన్లీ సేవ రాజకీయపార్టీ స్థాపనపై వస్తున్న ఊహాగానాలకు తమిళనాడు సూపర్స్టార్ రజనీకాంత్ తెరదించేశారు. ఈనెల 31న పార్టీని ప్రకటించడం లేదని మంగళవారం తెలిపారు. పూర్తి వివరాలు.. వెనక్కి తగ్గిన రజనీ.. కమల్ కామెంట్ ఇప్పట్లో రాజకీయ పార్టీని ప్రారంభించలేనని సూపర్ స్టార్ రజనీకాంత్ చేసిన రాజకీయ ప్రకటనపై మక్కల్ నీది మయ్యమ్ పార్టీ అధినేత కమల్హాసన్ స్పందించారు. రజనీకాంత్ ప్రకటనతో ఎంతో నిరాశ చెందినట్లు తెలిపారు. అయితే రజనీకాంత్ ఆరోగ్యమే తనకు ముఖ్యమని, ఎన్నికల ప్రచారం తరువాత రజనీని కలుస్తానని మంగళవారం కమల్ హాసన్ తెలిపారు. పూర్తి వివరాలు.. రైతు శ్రేయస్సే లక్ష్యం ‘రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుందని నమ్మిన ప్రభుత్వం ఇది. అందుకే తొలి రోజు నుంచీ రైతుల పక్షపాతంగా, రైతు శ్రేయస్సే లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తున్నాం. ఈ దిశగా అన్నదాతల కోసం ఈ 18 నెలల కాలంలో ఏకంగా రూ.61,400 కోట్లు చిరునవ్వుతో వెచ్చించాం’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. పూర్తి వివరాలు.. పోలవరం అంచనా వ్యయం రూ.47,725.74 కోట్లు పోలవరం జాతీయ ప్రాజెక్టుకు 2017–18 ధరల ప్రకారం రూ.47,725.74 కోట్ల అంచనా వ్యయానికి కేంద్ర జల్ శక్తి శాఖ ఇన్వెస్ట్మెంట్ క్లియరెన్స్ (పెట్టుబడి అనుమతి) ఇచ్చేందుకు మార్గం సుగమమైంది. పూర్తి వివరాలు.. నేడు విజయనగరానికి సీఎం వైఎస్ జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు. విస్తీర్ణంలో రాష్ట్రంలోనే అతి పెద్దదైన గుంకలాంలోని వైఎస్సార్ జగనన్న కాలనీలో సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించి, లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తారు. పూర్తి వివరాలు.. ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ గుడ్న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అదిరిపోయే నూతన సంవత్సర కానుక అందించారు. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, ఉద్యోగ విరమణ వయసు పెంచాలని.. అన్ని శాఖల్లో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయించారు. పూర్తి వివరాలు.. తాగి నడిపేవాళ్లు తీవ్రవాదులే.. మద్యం తాగి వాహనం నడిపేవాళ్లు టెర్రరిస్టులతో సమానమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం అన్నారు. ‘మద్యం సేవించి బండి నడిపేవాళ్లు రోడ్డుపై ఏంచేస్తారో వాళ్లకే తెలియదు. పూర్తి వివరాలు.. ఇదీ మా ఎజెండా చర్చలకు సంబంధించి తమ షరతులను రైతు సంఘాలు మరోసారి కేంద్ర ప్రభుత్వానికి స్పష్టం చేశాయి. ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య బుధవారం జరగనున్న చర్చల ఎజెండాను మంగళవారం ఒక లేఖలో ప్రభుత్వానికి పంపించారు. పూర్తి వివరాలు.. ప్రపంచానికి తాళం ప్రపంచానికే తాళం పడింది. మార్కెట్లన్నీ మూత పడ్డాయి. రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. మొత్తంగా ప్రపంచమే స్తంభించిపోయింది. 2020ని కరోనా వైరస్ కాలనాగై కాటేసింది. పూర్తి వివరాలు.. 2020లో ప్రపంచాన్ని నడిపించిన స్త్రీ మూర్తులు ఊరి మీదకు రాక్షసుడొచ్చి పడ్డాడు. కొత్త ముఖం రాక్షసుడు. బండెడన్నం కాదు వాడి డిష్. రోజుకు బండెడు మనుషులు. ఊరు ఇంట్లోకి పరుగులు తీసి తలుపేసుకుంది. దబా.. దబా.. దబా.. దబా.. రాక్షసుడు తలుపు తడుతున్నాడు. పూర్తి వివరాలు.. 22 ఏళ్ల తర్వాత.. కమల్హాసన్–ప్రభుదేవా మళ్లీ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారా? అంటే కోలీవుడ్ వర్గాలు అవుననే అంటున్నాయి. ఈ వార్త నిజమైతే 22 ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరూ స్క్రీన్ షేర్ చేసుకున్నట్లు అవుతుంది. పూర్తి వివరాలు.. డీమ్యాట్ ఖాతాల జోరు స్టాక్ మార్కెట్ రోజు రోజుకూ కొత్త శిఖరాలకు ఎగబాకుతుండటంతో షేర్లపై రిటైల్ ఇన్వెస్టర్లకు మోజు, క్రేజు పెరుగుతోంది. అక్టోబర్లో కొత్తగా పదిలక్షలకు పైగా డీమ్యాట్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. పూర్తి వివరాలు.. విజయ మధురం ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ను భారత్ 1–1తో సమం చేసింది. మంగళవారం నాలుగో రోజే ముగిసిన రెండో టెస్టులో భారత్ 8 వికెట్ల తేడాతో ఆసీస్పై ఘన విజయం సాధించింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
దళితుల్లో చిచ్చుకు టీడీపీ కుట్ర ‘విభజించు.. పాలించు’ విధానంతో దుష్ట రాజకీయాలు చేయడంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు బ్రిటీష్ పాలకులను మించిపోతున్నారు. ఇప్పటికే అధికారం కోల్పోయి నిస్పృహలో కొట్టుమిట్టాడుతున్న ఆయన రాజకీయ పబ్బం గడుపుకునేందుకు దళితుల మధ్య చిచ్చు పెడుతున్నారు. పూర్తి వివరాలు.. టీఆర్ఎస్లో రచ్చ: నువ్వెంతంటే.. నువ్వెంత! ఒకరు ఎమ్మెల్యే, మరొకరు ఎమ్మెల్సీ. సమావేశంలో ఆవేశకావేశాలకు లోనయ్యారు. నువ్వెంత అంటే.. నువ్వెంత అంటూ మాటలయుద్ధానికి దిగారు. పూర్తి వివరాలు.. సీఎంతో హీరో విజయ్ భేటీ..! సీఎం పళనిస్వామితో సినీ నటుడు విజయ్ భేటీ అయ్యారు. అత్యంత రహస్యంగా ఆదివారం రాత్రి గ్రీన్వేస్ రోడ్డులోని సీఎం నివాసంలో ఆయన్ను కలిశారు. పూర్తి వివరాలు.. నేడు రైతు ఖాతాల్లోకి రూ.1,766కోట్లు రైతు సంక్షేమం కోసం నిరంతరం కృషిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన రైతుల బ్యాంకు ఖాతాల్లో మంగళవారం రూ.1,766 కోట్లను జమచేయనుంది. పూర్తి వివరాలు.. నరసన్న రథం రెడీ భక్తుల మనోభావాలకు పెద్దపీట వేస్తూ.. ప్రకటించిన గడువు కంటే ముందుగానే అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథ నిర్మాణాన్ని ప్రభుత్వం పూర్తి చేయించింది. పూర్తి వివరాలు.. కరోనా ప్యాకేజీపై ట్రంప్ సంతకం కరోనా ప్యాకేజీపై మొండిపట్టు పడుతున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టకేలకు మొండితనాన్ని వీడారు. పూర్తి వివరాలు.. 2025 నాటికి 25 నగరాల్లో మెట్రో ఢిల్లీ మెట్రోలో తొలి డ్రైవర్లెస్ ట్రైన్ను సోమవారం ప్రధాని మోదీ ప్రారంభించారు. 2025 నాటికి దేశవ్యాప్తంగా మెట్రో రైలు సేవలను 25 నగరాలకు విస్తరిస్తామని ప్రకటించారు. పూర్తి వివరాలు.. 30న చర్చలకు రండి వ్యవసాయ చట్టాల విషయంలో ప్రతిష్టంభన కొనసాగుతోంది..ఈ నెల 30న చర్చలకు రావాల్సిందిగా కేంద్రం ఆహ్వానం పంపితే, తమ ఎజెండాను అంగీకరించకుండా కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తోందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి విమర్శించింది. పూర్తి వివరాలు.. ఒకే గొడుకు కిందకు నీటి పారుదల శాఖలు రాష్ట్రంలో నీటిపారుదల రంగంలో వచ్చిన పెను మార్పులకు అనుగుణంగా జల వనరుల శాఖను ప్రభుత్వం పునర్వ్యవస్థీకరించింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు సోమవారం ప్రగతిభవన్లో జలవనరుల శాఖ అధికారులతో సమావేశమై ఆ శాఖ స్వరూపాన్ని ఖరారు చేశారు. పూర్తి వివరాలు.. బ్రహ్మోత్సవాలలోపే యాదాద్రి ప్రారంభం? బ్రహ్మోత్సవాలకు ముందే యాదాద్రి ప్రధానాలయం ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరిలో యాదాద్రి లక్ష్మీనారసింహుని బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. పూర్తి వివరాలు.. రామ్ చరణ్కి కరోనా పాజిటివ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ఈ మేరకు ‘నాకు కరోనా పాజిటివ్గా తేలింది. పూర్తి వివరాలు.. భారత్కు టెస్లా వస్తోంది అమెరికాకు చెందిన ఎలక్ట్రిక్ వాహన దిగ్గజం టెస్లా ఎట్టకేలకు భారత్కు ఎంట్రీ ఇస్తోంది. 2021 ప్రథమార్ధంలోనే మన రోడ్లపై కంపెనీ కార్లు పరుగులు తీయనున్నాయి. పూర్తి వివరాలు.. ఆసీస్ 200 ఆలౌట్, భారత్ టార్గెట్ 70 పరుగులు బాక్సింగ్ డే టెస్టులో భారత్ లక్ష్యం ఖరారైంది. రెండో ఇన్నింగ్స్లో ఆసీస్ 200 ఆలౌట్ అయింది. దీంతో విజయం సాధించేందుకు టీమిండియా 70 పరుగులు చేయాల్సి ఉంది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
ఆ నిర్ణయాన్ని కేసీఆర్ వెనక్కి తీసుకోవాలి కొనుగోలు కేంద్రాల ఎత్తివేతని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఉపసంహరించుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ ఆదివారం డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు.. వైదొలిగిన నితీష్.. కొత్త వ్యక్తికి బాధ్యతలు బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్ కుమార్ రాజకీయపరంగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాలు.. మహిళా కమిషన్ చైర్పర్సన్గా సునీతా లక్ష్మారెడ్డి తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తొలి చైర్పర్సన్గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆదివారం నియమితులయ్యారు. పూర్తి వివరాలు.. నేడు చిత్తూరు జిల్లాకు సీఎం జగన్ రాక సీఎం వైఎస్ జగన్ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్తి వివరాలు.. కళ్ల నిండా ఆనందం సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు.. నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్ భారత్లో కరోనా టీకా పంపిణీకి యంత్రాంగం సన్నద్ధమైంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియ కానుంది. పూర్తి వివరాలు. నేడు పట్టాలపైకి డ్రైవర్ రహిత తొలి ట్రైన్ మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్ రహిత ట్రైన్ సర్వీసు తొలిసారిగా మన దేశంలో సోమవారం పట్టాలెక్కనుంది. పూర్తి వివరాలు.. ఉద్యమం నుంచి ఉద్యమం వరకు కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. పూర్తి వివరాలు.. న్యూ ఇయర్ కానుకగా పీఆర్సీ! కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్రావు ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశముంది. పూర్తి వివరాలు.. పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు! ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. పూర్తి వివరాలు. జీఎస్టీ టీజర్ బాగుంది ‘‘నా శిష్యుడు జానకిరామ్ తొలిసారి దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘జీఎస్టీ’(దేవుడు సైతాన్ టెక్నాలజీ). ఈ సినిమా టీజర్ చాలా బాగుందని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. పూర్తి వివరాలు.. కార్డులు, ఖాతాలు భద్రంగా ఉన్నాయా? మొబైల్ ఫోన్ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్ సేవలు, డెబిట్/క్రెడిట్ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్టాప్లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. పూర్తి వివరాలు.. నాయకుడు నడిపించాడు టీమిండియాదే జోరు! తొలి రోజు బౌలింగ్తో ప్రత్యర్థిని పడగొట్టింది. రెండో రోజు బ్యాటింగ్లో నిలిచింది. ఇలా ‘బాక్సింగ్ డే’ టెస్టులో రెండు రోజులు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చాటింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
ప్రజాస్వామ్యంపై మీ పాఠాలా? ప్రజాస్వామ్యం గురించి కొందరు వ్యక్తులు తనకు నిత్యం పాఠాలు చెబుతున్నారని, వారి నిజస్వరూపం ఈరోజు బయటపెడతానని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పరోక్షంగా కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీపై విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు.. కొండా సురేఖకు కీలక పదవి? రాష్ట్ర పార్టీలో మహిళా నాయకత్వానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. త్వరలో జరగనున్న టీపీసీసీ సంస్థాగత మార్పుల్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మహిళా నాయకురాలికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు.. శుభవార్త: రైతు బంధు ఇక ఇంటికే..! రైతుల బ్యాంకు ఖాతాలో నేటి నుంచి రైతు బంధు డబ్బు జమ కానుంది. నేరుగా రైతు చేతికే రైతుబంధు సొమ్ము అందనుంది. ఈ మేరకు తపాలా శాఖ పక్కా ఏర్పాట్లు చేసింది. తపాలా కార్యాలయంలో ఖాతా ఉండాల్సిన అవసరం లేకుండానే ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. ఆదివారం నుంచి ఈ సేవలు అందుబాటులోకి రానున్నాయి. పూర్తి వివరాలు.. ఇళ్లు.. పుష్కలంగా నీళ్లు ప్రస్తుతం పట్టాలు పంపిణీ జరుగుతున్న వైఎస్సార్ జగనన్న కాలనీలన్నింటిలో లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే నీటి వసతి కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. పూర్తి వివరాలు.. ఆక్స్ఫర్డ్ టీకాకే తొలి ఛాన్స్ దేశవ్యాప్తంగా జనవరిలో కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రారంభించేందుకు ఏర్పాట్లు ఒక పక్క ముమ్మరం కాగా, అత్యవసర వినియోగానికి ఆక్స్ఫర్డ్ కోవిడ్–19 టీకాకు వచ్చే వారంలో ప్రభుత్వం అనుమతి మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. పూర్తి వివరాలు.. కొత్త వైరస్ ఆందోళన వద్దు! కరోనా కొత్త వైరస్తో తీవ్రమైన వ్యాధిగా మారకపోయినా.. ఎక్కువ మందికి సోకి కేసుల సంఖ్య పెరుగుతుందని ప్రముఖ వైద్యులు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా. కె. శ్రీనాథ్రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ఫ్రాన్స్కు పాకిన కొత్త కరోనా ఫ్రాన్స్లో తొలిసారి కొత్తరకం కరోనా వైరస్ బయటపడినట్లు ఫ్రెంచ్ వైద్యాధికారులు నిర్ధారించారు. దీంతో బ్రిటన్ నుంచి వచ్చే విమానాల రాకపోకలపై కఠిన లాక్డౌన్ ఆంక్షలు విధించారు. ఇంగ్లండులో నివసించే ఫ్రాన్స్కి చెందిన వ్యక్తి 19న ఫ్రాన్స్కి తిరిగి వచ్చారు. ఈయనకు పరీక్షలు జరపగా కొత్తరకం కరోనా వైరస్ సోకినట్లు తేలింది. పూర్తి వివరాల కోసం.. హీరో ఈసైకిల్@ 49,000 హీరో సైకిల్స్ తాజాగా ఎలక్ట్రిక్ సైకిల్ను మార్కెట్లో విడుదల చేసింది. F6i పేరుతో ప్రవేశపెట్టిన ఈ-సైకిల్ ఖరీదు రూ. 49,000. ఈసైకిళ్ల బ్రాండ్.. హీరో లెక్ట్రో ద్వారా విడుదలైన ఈ సైకిల్ను 2020 మొదట్లో ఇక్కడ జరిగిన ఆటో ఎక్స్పోలో తొలుత ఆవిష్కరించింది. పూర్తి వివరాలు.. 2020 ఇంట్లో కూడా సినిమా చూపించింది ఈ సంవత్సరం మనకు అన్ని సినిమాలూ పడ్డాయి కరోనా వల్ల. బయట లాక్డౌన్ సినిమా. హాస్పిటల్స్లో వెంటిలేటర్ల సినిమా. వ్యాన్లొచ్చి పట్టుకెళ్లే క్వారంటైన్ సినిమా. మాస్క్ సినిమా. కాఫ్ సినిమా. కోల్డ్ సినిమా...అన్నీ పడ్డాయి. వాటితో పాటు ఇంట్లో కూడా సినిమాలు పడ్డాయి. పూర్తి వివరాలు.. పైన్ అద్భుత క్యాచ్కు పుజారా బలి ఆసీస్తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఆచితూచి ఆడుతుంది. 36/1 క్రితంరోజు స్కోరుతో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత జట్టులో ఓపెనర్ గిల్ కొన్ని మంచి షాట్లు ఆడాడు. హాఫ్ సెంచరీకి చేరువవుతున్న క్రమంలో కమిన్స్ వేసిన బంతిని అంచనా వేయడంలో పొరబడ్డ గిల్ కీపర్ పైన్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. పూర్తి వివరాల కోసం... -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
21 ఏళ్లకే విజయం.. దేశంలో తొలి మేయర్ వయసు కేవలం 21 సంవత్సరాలు. చదువుతున్నది బీఎస్సీ రెండో సంవత్సరం. దక్కిన పదవి కీలకమైన నగరానికి మేయర్. కేరళ రాజధాని తిరువనంతపురం మేయర్గా ఆర్య రాజేంద్రన్. పూర్తి వివరాలు సొంతింటి కల సాకారం క్రిస్మస్, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఏకంగా 30.75 లక్షల ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమం వల్ల లక్షలాది మంది అక్కచెల్లెమ్మల ముఖంలో చిరునవ్వు చూడగలుగుతున్నానని చెప్పారు. పూర్తి వివరాలు హైదరాబాద్లో న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం న్యూ ఇయర్ వేడుకలపై నిషేధం ఉందని సైబరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. డిసెంబర్ 31న పబ్లు, బార్లు, హోటళ్లు, రిసార్ట్లు నిర్దేశించిన సమయానికే మూసేయాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు కోవిడ్ నేపథ్యంలో ఎలాంటి వేడుకలు నిర్వహించొద్దని తెలిపారు. పూర్తి వివరాలు ధాబా బాబా.. కొత్త రెస్టారెంట్ విధి ఎవరిని ఎప్పుడు గెలిపిస్తుందో ఎవరికీ తెలియదు. కొందరికి లేటు వయసులో అదృష్టం తలుపుతడుతుంది. అప్పుడు మనం ఎలా స్పందిస్తామనేదానిపై తదుపరి భవిష్యత్ ఆధారపడుతుంది. 80 సంవత్సరాల కాంతా ప్రసాద్కు చాలా లేటు వయసులో అదృష్టం. పూర్తి వివరాలు మీ భూములు సురక్షితం ఒప్పంద వ్యవసాయం(కాంట్రాక్ట్ ఫా మింగ్) వల్ల రైతుల భూమిని కార్పొరేట్లు స్వాధీనం చేసుకుంటారన్నది అవాస్తవమని, ఆ భయాలు పెట్టుకోవద్దని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ రైతులకు భరోసా ఇచ్చారు. కొందరు కావాలనే స్వార్థ ప్రయోజనాల కోసం ఈ అపోహలను ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. పూర్తి వివరాలు వారంలోనే 2,75,310 కేసులు ఇంగ్లాండ్లో కరోనా వైరస్ కొత్త వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. నేషనల్ హెల్త్ సర్వీసెస్(ఎన్హెచ్ఎస్) గణాంకాల ప్రకారం.. డిసెంబర్ 10 నుంచి 16వ తేదీ వరకు కేవలం వారం రోజుల్లో 1,73,875 పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. పూర్తి వివరాలు ఘోర రోడ్డు ప్రమాదం; ముగ్గురు మృతి జిల్లాలోని పాకాల మండలం నేండ్రగుంట వద్ద శనివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. లారీ-ఓమ్ని వ్యాన్ ఢీకొని ముగ్గురు మృతి చెందారు. పూర్తి వివరాలు బాక్సింగ్ డే టెస్టు : స్టీవ్ స్మిత్ డకౌట్ బోర్డర్ గావస్కర్ ట్రోపీలో భాగంగా ఆసీస్తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో భారత బౌలర్లు మెరిశారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్కు టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా తొలిషాక్ ఇచ్చాడు. పూర్తి వివరాలు అదానీ బ్రాండింగ్... నిబంధనలకు విరుద్ధం నిర్వహణ, అభివృద్ధి పనుల కోసం లీజుకిచ్చిన మూడు విమానాశ్రయాల్లో అదానీ ఎంటర్ప్రైజెస్ తన సొంత బ్రాండ్ పేరును ఉపయోగిస్తుండటంపై ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) అభ్యంతరం వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు ఫాస్ట్ఫుడ్ సెంటర్లో సోనూసూద్ ప్రముఖ సినీనటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన స్ఫూర్తితో హైదరాబాద్లోని బేగంపేటలో ఓ యువకుడు నిర్వహిస్తున్న ‘లక్ష్మీ సోనూ సూద్ ఫాస్ట్ఫుడ్ సెంటర్’ను శుక్రవారం సందర్శించారు. పూర్తి వివరాలు యూనిఫామ్ ఆమె తొడుక్కుంటారు 2019 ఏప్రిల్లో భారత నావికాదళం వారి ఐ.ఎన్.ఎస్. విక్రమాదిత్యలో అగ్నిప్రమాదం జరిగి లెఫ్టినెంట్ కమాండర్ ధర్మేంద్ర సింగ్ చౌహాన్ మరణించేనాటికి అతనికి పెళ్లయ్యి నలభై రోజులు. భార్య కరుణ సింగ్ అతని వీర మరణాన్ని తొణకక స్వీకరించారు. పూర్తి వివరాలు -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
రాయపాటి లూటీలో బాబు వాటా ఎంత? బ్యాంకులను కొల్లగొట్టడంలో చంద్రబాబు అండ్ కో గ్యాంగ్స్టర్స్ని, స్కామ్స్టర్స్ని మించిపోయిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే, పార్టీ అధికార ప్రతినిధి జోగి రమేష్ బుధవారం ధ్వజమెత్తారు. పూర్తి వివరాలు.. అర్థంపర్థం లేని సవరణలు అక్కర్లేదు కొత్త వ్యవసాయ చట్టాల్లో అర్థంపర్థం లేని సవరణల అంశాన్ని ప్రస్తావించడం, తమకు ప్రేమ లేఖలు రాయడం మానుకోవాలని రైతులు బుధవారం కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. పూర్తి వివరాలు.. దక్షిణాఆఫ్రికాలో కొత్త వేరియంట్ దక్షిణాఫ్రికాలో మరో కొత్త కరోనా వైరస్ వేరియంట్ను గుర్తించారు. దీనివల్లనే అక్కడ కేసుల సంఖ్యతో పాటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య భారీగా పెరుగుతోందని నిర్ధారించారు. పూర్తి వివరాలు.. పార్టీ ఏర్పాటుతో 24 గంటల్లో అధికారమా? ప్రజాకర్షణ లక్ష్యంగా గ్రామసభలకు డీఎంకే బుధవారం శ్రీకారం చుట్టింది. శ్రీపెరంబదూరు సమీపంలోని కున్నం గ్రామంలో డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పర్యటించారు. పూర్తి వివరాలు.. మరింత సమర్థవంతంగా సచివాలయాల పనితీరు గ్రామ, వార్డు సచివాలయాలు మరింత మెరుగ్గా, సమర్థవంతంగా పని చేసేలా చూడాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. పూర్తి వివరాలు.. పులివెందులలో నేడు అపాచీ ఫుట్వేర్కు సీఎం జగన్ శంకుస్థాపన వైఎస్సార్ జిల్లా పులివెందులలో ప్రముఖ పాదరక్షల తయారీ సంస్థ ఇంటెలిజెంట్ సెజ్ (అపాచీ) ఏర్పాటు యూనిట్కు సీఎం జగన్ గురువారం శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలు.. 'దొంగలు..' బాబో! టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు సన్నిహితుడైన ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు బ్యాంకులను మోసం చేయడంలో నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ, విజయ మాల్యాలను తలదన్నాడు. పూర్తి వివరాలు.. పీవీ భారతదేశ చరిత్రలో నిలిచిపోతారు: కేసీఆర్ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు నిరంతర సంస్కరణ శీలిగా భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతారని సీఎం కేసీఆర్ అన్నారు. బుధవారం పీవీ వర్ధంతి సందర్భంగా కేసీఆర్ ఆయనను స్మరించుకుంటూ నివాళులర్పించారు. పూర్తి వివరాలు.. కలకలం: పోలీసు అధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా జూబ్లీహిల్స్ ఎంపీ, ఎమ్మెల్యే కాలనీలో నివసించే కొందరు పోలీసు ఉన్నతాధికారుల ఇళ్లపై డ్రోన్ కెమెరా తిరుగుతుండటం కలకలం రేపింది. పూర్తి వివరాలు.. న్యూజెర్సీలో తెలంగాణ వాసి మృతి అమెరికాలోని న్యూజెర్సీలో హన్మకొండ భవానీనగర్కు చెందిన వ్యక్తి ప్రమాదవశాత్తు రైలు కిందపడి చనిపోయాడు. ప్రవీణ్కుమార్ (37) డిసెంబర్ 22న న్యూజెర్సీలోని ఎడిసన్ టౌన్షిప్ నుంచి న్యూయార్క్లోని ఆఫీసుకు వెళ్తుండగా సమీపంలో ఉన్న రైల్వే స్టేషన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పూర్తి వివరాలు.. యూత్ఫుల్ సబ్జెక్ట్ అయినప్పటికీ ఫ్యామిలీ యాంగిల్ ‘‘ఈ లాక్డౌన్ ఒక్కసారి ఆగి, నన్ను నేను తెలుసుకోవడానికి ఉపయోగపడింది. మా ఇంటి చుట్టూ ఎన్ని రకాల పక్షులు సందడి చేస్తాయో ఈ లాక్డౌన్లోనే గమనించాను. పూర్తి వివరాలు.. మెస్సీ ప్రపంచ రికార్డు ఫుట్బాల్ క్రీడలో 46 ఏళ్లుగా చెక్కుచెదరకుండా ఉన్న ప్రపంచ రికార్డును బార్సిలోనా స్టార్ ప్లేయర్, అర్జెంటీనా జట్టు కెప్టెన్ లయనెల్ మెస్సీ బద్దలు కొట్టాడు. పూర్తి వివరాలు.. డీల్ స్ట్రీట్లో డాన్.. రిలయన్స్ కరోనా కల్లోలం ఉన్నా, ఈ ఏడాది డీల్స్ జోరుగా జరిగాయి. అంతర్జాతీయంగా ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నా, పలు విదేశీ సంస్థలు మన కంపెనీలతో డీల్స్ కుదుర్చుకున్నాయని పీడబ్ల్యూసీ ఇండియా తెలిపింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
చైనాకు మరో షాకిచ్చిన అమెరికా రెండు ఆధిపత్ యరాజ్యాల మధ్య పోరు రోజురోజుకు మరింత ముదురుతోంది. తాజాగా అమెరికా చైనాకు షాకిచ్చే మరో బిల్లును పాస్ చేసింది. ఆధ్యాత్మిక గురువు దలైలామా వారసుడిని ఎంచుకునే హక్కు టిబెటన్లకే కల్పించే బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం తెలిపింది. పూర్తి వివరాలు. ‘హోదా’ రాకపోవడానికి బాబు ప్యాకేజే కారణం రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు నాయుడే కారణమని, ఆయన అధికారంలో ఉన్నప్పుడు హోదా కంటే ప్యాకేజీ ముఖ్యమని భావించారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. పూర్తి వివరాలు.. రజనీ రాజకీయ పార్టీ పొంగల్కు పక్కా! సూపర్స్టార్ రజనీ ఎంట్రీ దగ్గర నుంచి తమిళ రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీ పేరుగా మక్కల్ సేవై కర్చీ, పార్టీ గుర్తుగా ఆటో రిక్షాను ఎంపికచేసినట్లు సమాచారం. పూర్తి వివరాలు.. బ్రిటన్లో రికార్డు కేసులు కొత్త రకం కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో బ్రిటన్లో కోవిడ్–19 కేసుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ మహమ్మారి దేశంలో అడుగుపెట్టిన నాటి నుంచి నమోదు కానంత భారీగా, రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. పూర్తి వివరాలు.. నేడు వైఎస్సార్ జిల్లాకు సీఎం జగన్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం నుంచి మూడు రోజుల పాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. పూర్తి వివరాలు.. ‘పోలవరం’ క్రెడిట్ వైఎస్దే పోలవరం ప్రాజెక్ట్ క్రెడిట్ అంతా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డిదేనని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్కుమార్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ఏపీ పోలీస్.. దేశానికే ఆదర్శం సమర్థవంతమైన సేవలందిస్తున్న ఏపీ పోలీస్ అనేక విషయాల్లో దేశానికే రోల్ మోడల్గా నిలుస్తోందని డీజీపీ డి.గౌతమ్ సవాంగ్ అన్నారు. ఏపీఎస్పీ బెటాలియన్స్లో గత ఏడాది అత్యుత్తమ సేవలందించిన వారికి మంగళవారం అవార్డులను అందజేశారు. పూర్తి వివరాలు.. కరోనా–2 కలకలం బ్రిటన్లో తాజాగా గుర్తించిన కొత్త రకం కరోనా వైరస్ భారత్లో కూడా అడుగుపెట్టిందనే భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. లండన్ నుంచి భారత్ లోని వివిధ రాష్ట్రాలకు వచ్చిన విమాన ప్రయాణికులకు నిర్వహించిన పరీక్షల్లో 20 మందికి కరోనా పాజిటివ్గా తేలింది. పూర్తి వివరాలు.. కొత్త వైరస్ కేసు రాష్ట్రంలో ఒక్కటి కూడా లేదు! కొత్తరకం కరోనా వైరస్కు సంబంధించి రాష్ట్రంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని, రాష్ట్రం లోకి ఇంకా కొత్త వైరస్ రాలేదని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పూర్తి వివరాలు.. 'కోబ్రా'కి ఇంకా టైముంది ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ను మళ్లీ స్క్రీన్ మీద చూపించడానికి రెడీ అయ్యారు వెంకటేశ్ అతని కో బ్రదర్ (కోబ్రా) వరుణ్ తేజ్. కానీ కోబ్రా లేకుండానే సెట్లోకి ఎంటర్ అవుతున్నారు వెంకీ. పూర్తి వివరాలు.. ‘క్యూ2’ కిక్! కరోనా కల్లోలం నుంచి భారత కంపెనీలు కోలుకుంటున్నాయి. సెప్టెంబర్ క్వార్టర్ (క్యూ2) ఫలితాలు దీనికి స్పష్టమైన సంకేతాలిచ్చాయి. చాలా కంపెనీల క్యూ2 ఫలితాలు అంచనాలను మించాయి. పూర్తి వివరాలు.. ప్రేయసితో యువ క్రికెటర్ పెళ్లి టీమిండియా లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్ మంగళవారం ఒక ఇంటివాడయ్యాడు. కొరియోగ్రాఫర్ కమ్ యూట్యూబ్ స్టార్ ధనశ్రీ వర్మతో చహల్ కొంతకాలంగా ప్రేమాయణం సాగిస్తున్నాడు. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
యడియూరప్పకు పదవీ గండం తప్పదా? సమీప భవిష్యత్తులో సీఎం పదవి నుంచి యడియూరప్పని తప్పించే అవకాశం ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.పూర్తి వివరాలు.. బ్రిటన్ విమానాలపై నిషేధం కొత్త రకం కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. మహమ్మారి ముప్పు త్వరలో తొలగిపోనుందన్న ఆశలపై నీళ్లు చల్లుతూ.. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ప్రమాదకర వైరస్గా గుర్తింపు పొంది, ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసింది. పూర్తి వివరాలు.. పార్టీ మారిన భార్యకు విడాకులన్న ఎంపీ పశ్చిమ బెంగాల్కు చెందిన భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యులు సౌమిత్రా ఖాన్ భార్య సుజాతా మండల్ ఖాన్ సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్లో చేరారు. పూర్తి వివరాలు.. కరోనా కొత్త రూపం! సమస్త దేశాల్లో కంగారు పుట్టిస్తున్న కరోనా కొత్త రూపు దాల్చింది. వైరస్ల్లో జన్యుమార్పులు సహజంగానే జరుగుతుంటాయి. పూర్తి వివరాలు.. ప్రభుత్వం పరిష్కారం చూపాల్సిందే కేంద్ర ప్రభుత్వం రైతులకు తాజాగా రాసిన లేఖలో కొత్తదనం ఏమీ లేదని రైతు సంఘాల నేతలు విమర్శించారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సరైన పరిష్కార మార్గంతో ముందుకొస్తే చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని ఉద్ఘాటించారు. పూర్తి వివరాలు.. ఆస్తులకు సర్కారు భరోసా ప్రజల ఆస్తులకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూముల రీ సర్వే ప్రాజెక్టు దేశానికే రోల్ మోడల్ కానుందని సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. వణికిస్తున్న చలి రాష్ట్రంలో చలి విజృంభిస్తోంది. ఈశాన్య, తూర్పు దిశల నుంచి వీస్తున్న గాలుల వల్ల చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. పూర్తి వివరాలు.. టిడ్కో ఇళ్ల పండుగకు అంతా రెడీ ‘అందరికీ ఇళ్ల పథకం’ కింద ఈ నెల 25న లబ్ధిదారులకు ఇళ్లను పంపిణీ చేసేందుకు రాష్ట్ర టౌన్షిప్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (ఏపీ టిడ్కో) సన్నద్ధమవుతోంది. పూర్తి వివరాలు.. భూమి పొరల్లో మాగాణి.. సింగరేణి.. బొగ్గు నిల్వల గుర్తింపు, ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి లెక్కిస్తే 131 ఏళ్ల చరిత్ర సింగరేణి సొంతం. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ సంస్థగా గుర్తింపు పొందింది. పూర్తి వివరాలు.. లెక్చరర్ల బదిలీలపై మంత్రి సబిత ఆగ్రహం రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్టు (టీఆర్టీ) నిర్వహించడానికి కంటే ముందే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) నిర్వహించేలా పాఠశాల విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పూర్తి వివరాలు.. గల్ఫ్ వెళ్లే కార్మికుల వేతనాల్లో కోతకు ఉత్తర్వులు? అవ్వ పెట్టదు అడుక్కు తిననివ్వదు.. అన్నట్లుగా ఉంది వలస కార్మికుల పట్ల కేంద్ర ప్రభుత్వం తీరు. పూర్తి వివరాలు.. కోచ్ జ్వాలా రెడ్డి ‘సీటీ మార్’ కోసం కబడ్డీ కోచ్ అయ్యారు తమన్నా. ప్రత్యర్థి టీమ్కి దొరక్కుండా తన టీమ్ను తయారు చేసే కోచ్ పాత్రలో ఆమె కనిపిస్తారు. పూర్తి వివరాలు.. జడేజా కమ్బ్యాక్ ఇవ్వనున్నాడా! మెల్బోర్న్ టెస్టులో ఐదుగురు స్పెషలిస్ట్ బౌలర్లతో ఆడాలని భారత్ భావిస్తే తుది జట్టులో రవీంద్ర జడేజా వచ్చే అవకాశం ఉంది. తొలి టి20 మ్యాచ్లో కన్కషన్కు గురైన తర్వాత కోలుకున్న జడేజా తన ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. పూర్తి వివరాలు.. మార్కెట్లను బెంబేలెత్తించిన కొత్త రకం కరోనా రోజుకో కొత్త రికార్డును తిరగరాస్తూ జోరుమీదున్న సూచీలకు సోమవారం అమ్మకాల షాక్ తగిలింది. కొత్త రకం కరోనా వైరస్ భయాలు మార్కెట్ను మరోసారి వెంటాడడంతో పాటు జీవితకాల గరిష్టస్థాయిల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు ఏడు నెలల్లో అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
ఐదేళ్లలో ‘బంగారు బెంగాల్’ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలన పట్ల రాష్ట్ర ప్రజలంతా తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, వారు మార్పును కోరుకుంటున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఉద్ఘాటించారు. పూర్తి వివరాలు.. టీడీపీ మైండ్ గేమ్ ఆడుతుంది.. మన్యంలో బాక్సైట్ తవ్వకాలకు అనుమతిస్తున్నట్లు టీడీపీ దుష్ప్రచారం చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎలాంటి తవ్వకాలకు అనుమతి ఇవ్వలేదని స్పష్టం చేశారు. పూర్తి వివరాలు.. నేపాల్ పార్లమెంటు రద్దు అధికార పక్షంలోని ప్రత్యర్థులకు నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలి ఊహించని షాక్ ఇచ్చారు. పార్లమెంటును రద్దు చేయాలని అధ్యక్షురాలు విద్యాదేవి భండారీకి సిఫారసు చేశారు. పూర్తి వివరాలు.. పతంజలి ‘కరోనిల్’తో ఉపయోగం నిల్ ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ స్థాపించిన పతంజలి ఆయుర్వేద సంస్థ తయారు చేసిన స్వసారి–కరోనిల్ కిట్ సృష్టించిన సంచలనం అంతాఇంతా కాదు. ఈ ఔషధం కరోనాను తరిమికొడుతుందని, మహమ్మారి నుంచి పూర్తి రక్షణ కల్పిస్తుందంటూ విస్తృతంగా ప్రచారం సాగింది. పూర్తి వివరాలు.. యూరప్ను వణికిస్తున్న కరోనా కొత్త రూపం యూరప్ దేశాలను అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పుడు మరో రూపం సంతరించుకుని మరింత తీవ్రంగా విజృంభిస్తోంది. ఈ వైరస్ కొత్త రూపం 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతోందంటూ బ్రిటన్ ప్రభుత్వం ఆదివారం నుంచి కఠిన ఆంక్షలు అమల్లోకి తెచ్చింది. పూర్తి వివరాలు.. నేడు రిలే నిరాహార దీక్షలు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమిస్తున్న రైతులు సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు. పూర్తి వివరాలు.. సీఎం జగన్కి ప్రధాని పుట్టిన రోజు శుభాకాంక్షలు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ.. సీఎం జగన్కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పూర్తి వివరాలు.. తెలంగాణకు 2,508 కోట్లు ఏపీకి 2,525 కోట్లు సులభతర వాణిజ్యంలో నిర్దేశిత సంస్కరణలను అమలు చేసినందుకుగాను తెలంగాణ రూ. 2,508 కోట్లు, ఆంధ్రప్రదేశ్ రూ. 2,525 కోట్ల మేర బహిరంగ మార్కెట్ ద్వారా అదనపు రుణాలను సమీకరించుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. పూర్తి వివరాలు.. బిగ్బాస్– 4 విజేత అభిజిత్ బుల్లితెర వీక్షకులను 106 రోజులపాటు అలరించిన ప్రముఖ తెలుగు రియాలిటీ షో బిగ్బాస్–4 గ్రాండ్ ఫినాలే ఆదివారం ముగిసింది. స్టార్ మా ప్రసారం చేసిన ఈ రియాలిటీ షో విజేతగా వర్ధమాన నటుడు, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం ఫేమ్ అభిజిత్ నిలిచాడు. పూర్తి వివరాలు.. అమెజాన్ కోటీశ్వరులు 4,152 మంది ఈ ఏడాది 1.5 లక్షల మంది వర్తకులు తమ వేదికపైకి కొత్తగా వచ్చారని ఈ–కామర్స్ సంస్థ అమెజాన్ ఆదివారం వెల్లడించింది. కోవిడ్–19 ఉన్నప్పటికీ ఇక్కడి విక్రేతలు విజయవంతం అయ్యారని తెలిపింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
చంద్రబాబూ.. అవాస్తవాలు మానండి పోలీసులను లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్ష నేత చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్న విషయం మరోసారి బయటపడింది. పూర్తి వివరాలు.. మమత మాత్రమే మిగులుతారు! రాబోయే బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల నాటికి అధికార తృణమూల్ కాంగ్రెస్లో ఎవరూ మిగలరని, కేవలం మమతా బెనర్జీ మాత్రమే పార్టీలో ఉంటారని శనివారం బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు.. బాబు అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందే అమరావతికి చంద్రబాబు ఖర్చు చేసిన రూ.7,200 కోట్లు, అందుకు సంబంధించిన అవినీతిపై రెఫరెండం పెట్టాల్సిందేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు శనివారం డిమాండ్ చేశారు. పూర్తి వివరాలు.. ఆదిలాబాద్ ఎంఐఎం శాఖ రద్దు కాల్పుల ఘటన కలకలం రేపిన నేపథ్యంలో ఎంఐఎం ఆదిలాబాద్ శాఖ రద్దు అయింది. పూర్తి వివరాలు.. జీ–23 నేతలతో సోనియా భేటీ కరోనా మహమ్మారి విజృంభణ తర్వాత తొలిసారిగా కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పార్టీ నాయకులతో శనివారం తన నివాసంలో భేటీ అయ్యారు. పూర్తి వివరాలు.. కేసీఆర్ ఫాంహౌజ్ను చెక్ చేయాలి ఎంఐఎం పార్టీ నేతలు తుపాకులతో నానాయాగీ చేస్తున్నా హోం మంత్రి ఎందుకు స్పందించడం లేదని శనివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రశ్నించారు. పూర్తి వివరాలు.. ఏపీ మహిళలే అత్యధికంగా పొదుపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయం సహాయక సంఘాలు (ఎస్హెచ్జీ) మళ్లీ జీవం పోసుకున్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లోకెల్లా ఆంధ్రప్రదేశ్ స్వయం సహాయక సంఘాల మహిళలు పొదుపులో అగ్ర స్థానంలో నిలిచారు. పూర్తి వివరాలు.. రీసర్వేకు సర్వం సిద్ధం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తలపెట్టిన అత్యంత ప్రతిష్టాత్మక భూమి రీసర్వే ప్రాజెక్టు అమలుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధమైంది. పూర్తి వివరాలు.. అయోధ్యలో మసీదు.. వచ్చే యేడాది అయోధ్యలో మసీదు నిర్మాణానికి సంబంధించిన భవన ఆకృతిని అయోధ్య మసీదు ట్రస్టు శనివారం విడుదల చేసింది. పూర్తి వివరాలు.. టీకా తీసుకుంటే మొసళ్లుగా మారతారు! కరోనాపై తొలి నుంచి నిర్లక్ష్య ధోరణి ప్రదరిస్తున్న బ్రెజిల్ అధ్యక్షుడు బొల్సొనారో శనివారం మరోమారు తన వ్యంగ్య ధోరణిని ప్రదర్శించారు. పూర్తి వివరాలు.. పాత పద్ధతిలోనే ఆస్తుల రిజిస్ట్రేషన్లు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను కొంతకాలంపాటు పాత పద్ధతిలోనే చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు.. చైనాపై మరోసారి అమెరికా మండిపాటు ప్రాణాంతక కరోనా వైరస్ పుట్టుకకు చైనాదే బాధ్యతంటూ ఇప్పటికే పలుమార్లు ఆగ్రహం వ్యక్తం చేసిన అగ్రరాజ్యం అమెరికా ఇదే విషయమై మరోసారి పలు తీవ్ర ఆరోపణలు చేసింది. పూర్తి వివరాలు.. మరీ అంత డర్టీ కాదు! ఒకటే పాట. అంతకు మించి పాటలు లేవు. కామెడీ లేదు. అడల్ట్ సీన్లు మినహాయిస్తే... రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో కనపడేవేవీ లేవు. పూర్తి వివరాలు.. భారత్ ఘోర పరాజయం రెండేళ్ల క్రితం ఇదే మైదానంలో అద్భుత విజయంతో ఆస్ట్రేలియా పర్యటనను ఘనంగా ప్రారంభించిన భారత్ ఇప్పుడు అక్కడే పరాజయంతో సిరీస్లో వెనుకంజ వేసింది. పూర్తి వివరాలు.. హైదరాబాద్ కంపెనీ ఎంటీఏఆర్ ఐపీవో బాట ఇంజినీరింగ్ సొల్యూషన్స్ కంపెనీ ఎంటీఏఆర్ టెక్నాలజీస్ పబ్లిక్ ఇష్యూ బాట పట్టింది. ఇందుకు అనుమతించమంటూ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి దరఖాస్తు చేసింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
మమతకు వరుస షాక్లు.. బీజేపీ సెటైర్లు! అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ పశ్చిమ బెంగాల్లో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. పూర్తి వివరాలు.. కుటుంబ పాలనతో లూటీ తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ తరుణ్ చుగ్ తెలిపారు. పూర్తి వివరాలు.. ఏపీ హైకోర్టు ఉత్తర్వులు ఆందోళనకరం ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం వైఫల్యం చెందిందా? లేదా?.. అనేది తేలుస్తామంటూ ఈ ఏడాది అక్టోబర్ 1న హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ రాకేశ్ కుమార్, జస్టిస్ జె.ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. పూర్తి వివరాలు.. ఏపీ కేబినెట్ నిర్ణయాలు ఇవే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూర్తి వివరాలు.. టీడీపీ మాజీ ఎంపీ.. రాయపాటిపై సీబీఐ దాడులు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ శుక్రవారం ఆకస్మిక దాడులు చేసింది. పూర్తి వివరాలు.. విద్యుత్ వివాదం వీడింది! ఏపీ, తెలంగాణ మధ్య ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఉన్న విద్యుత్ ఉద్యోగుల విభజన వివాదం ఎట్టకేలకు ముగింపు దశకు వచ్చింది. పూర్తి వివరాలు.. సుప్రీంకు వెళ్దామా? వద్దా? వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లపై హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ఎలా ముందుకు వెళ్లాలనే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తర్జనభర్జన పడుతోంది. పూర్తి వివరాలు.. చిచ్చురేపిన క్రికెట్.. కాల్పుల కలకలం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం జిల్లా అధ్యక్షుడు, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫారూఖ్ అహ్మద్ శుక్రవారం వీరంగం సృష్టించాడు. పూర్తి వివరాలు.. వ్యాక్సిన్ వేసుకున్నాక జ్వరం రావొచ్చు దేశ ప్రజలందరికీ కరోనా వ్యాక్సిన్ స్వచ్ఛందమేనని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. పూర్తి వివరాలు.. హాథ్రస్ కేసులో చార్జ్షీట్ సంచలనం సృష్టించిన హాథ్రస్ కేసులో సీబీఐ చార్జ్షీటు దాఖలు చేసింది. పూర్తి వివరాలు.. రైతుల వాదనకే మద్దతు వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు విషయంలో రైతుల వాదనకే మద్దతిస్తున్నానని ప్రఖ్యాత జర్నలిస్ట్ పి.సాయినాథ్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. చైనా దుశ్చర్య.. సరిహద్దులో 2000 కి.మీ గోడ ప్రపంచ దేశాలన్ని చీదరించుకున్నా.. ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా డ్రాగన్ దేశం మాత్రం తాను అనుకున్నదే చేస్తుంది. పూర్తి వివరాలు.. వెండితెర సోగ్గాడు @45 ఇయర్స్ ఒక్కో హీరో కెరీర్లో ఒక్కో సినిమా ఉంటుంది... కెరీర్ను మలుపు తిప్పిన సినిమా. జనం మనసు దోచి, బాక్సాఫీస్ను కొల్లగొట్టిన సినిమా. కాలం మారినా... మరపురాని సినిమా. పూర్తి వివరాలు.. గెట్.. సెట్.. స్టార్టప్! కరోనా వైరస్... స్టార్టప్ కంపెనీల ఐపీఓ(ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్) ప్రణాళికలను ముందుకు జరుపుతోంది. పూర్తి వివరాలు.. మన బంతి మెరిసింది తొలి టెస్టులో బౌలర్ల ప్రదర్శన భారత్ను ఆధిక్యంలో నిలబెట్టింది. మన బౌలర్లను సమర్థంగా ఎదుర్కోవడంలో విఫలమైన ఆస్ట్రేలియా తమ తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులకే ఆలౌటైంది. పూర్తి వివరాలు.. -
టాప్-10 న్యూస్; మిస్కాకండి..
చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలి ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును ముద్దాయిగా చేర్చాలంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బోబ్డేను ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తరఫు సీనియర్ న్యాయవాది ప్రశాంత్భూషణ్ అభ్యర్థించారు. పూర్తి వివరాలు.. ముందే వచ్చిన సంక్రాంతి బీసీ కార్పొరేషన్ల చైర్పర్సన్లు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో సందడి చూస్తుంటే సంక్రాంతి పండుగ నెల రోజులు ముందే వచ్చినట్లుగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 56 బీసీ కార్పొరేషన్లకు పాలకవర్గాల ప్రమాణ స్వీకారోత్సవాన్ని గురువారం విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో నిర్వహించారు. పూర్తి వివరాలు.. ఆధార్ అడగొద్దు.. కులం వివరాలు కోరొద్దు వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్కు స్లాట్ బుక్ చేసుకునే సమయంలో ఆధార్, కులం వివరాలను అడగడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. ఆస్తులు అమ్మే, కొనేవారి ఆధార్ నంబర్లు, కులంతోపాటు కుటుంబ సభ్యుల వివరాలు, సామాజిక హోదా, సాక్షుల ఆధార్ నంబర్లను కోరడంపై ఆగ్రహం వ్యక్తంచేసింది. పూర్తి వివరాలు.. జనవరి 27న విడుదలకానున్న చిన్నమ్మ..! జైలు జీవితాన్ని వీడి బాహ్య ప్రపంచంలోకి అడుగుపెట్టేందుకు శశికళ మార్గం సుగమమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఆమె వచ్చే ఏడాది జనవరి 27న విడుదల కానున్నారు. విడుదల సమయంలో చేపట్టాల్సిన బందోబస్తు చర్యలపై కర్ణాటక ప్రభుత్వం గురువారం జారీ చేసిన సర్క్యులర్ చిన్నమ్మ విడుదల విషయాన్ని అనధికారికంగా ధ్రువీకరించింది. పూర్తి వివరాలు.. ‘గులాబీ’ గుచ్చుకుంది.. పింక్ పోరులో టీమిండియా తడబడింది. ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్ట్లో టాస్ నెగ్గి మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 89 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 233 పరుగులు చేసింది. కోహ్లి (180 బంతుల్లో 74; 8 ఫోర్లు) భారత ఇన్నింగ్స్కు వెన్నెముకగా నిలిచాడు. పూర్తి వివరాలు.. చట్టాలకు బ్రేకులేయండి అహింసాయుతంగా నిరసన తెలిపే హక్కు రైతులకు ఉందని సుప్రీంకోర్టు గురువారం ఉద్ఘాటించింది. రైతు సమస్యల పరిష్కారానికి వ్యవసాయ నిపుణులు, రైతు సంఘాలతో ‘నిష్పాక్షిక, స్వతంత్ర’ కమిటీని ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో.. మూడు కొత్త వ్యవసాయ చట్టాల అమలును తాత్కాలికంగా నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. పూర్తి వివరాలు.. నిరాడంబరంగా బైడెన్ ప్రమాణం జనవరి 20న అమెరికా 46వ అధ్యక్షుడిగా జో బైడెన్ బాధ్యతలు స్వీకరించే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కోవిడ్–19 ముప్పు నేపథ్యంలో నిరాడంబరంగా జరపాలని భావిస్తున్నారు. ఎంపిక చేసిన కొద్దిమంది సమక్షంలోనే అధ్యక్షుడిగా బైడెన్, ఉపాధ్యక్షురాలిగా కమలా హ్యారిస్ ప్రమాణ స్వీకారం చేస్తారని జాయింట్ కాంగ్రెషనల్ కమిటీ ఆన్ ఇనాగరల్ సెరిమనీస్(జేసీసీఐసీ) వెల్లడించింది. పూర్తి వివరాలు.. భారత్, బంగ్లా మధ్య ఏడు ఒప్పందాలు భారత్, బంగ్లాదేశ్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడనున్నాయి. మొత్తం ఏడు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరుపక్షాలు ఒప్పందం కుదుర్చుకున్నాయి. ప్రధాని మోదీ, బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా మధ్య గురువారం జరిగిన ఆన్లైన్ సదస్సులో ఈ మేరకు ఒప్పందాలు కుదిరాయి. పూర్తి వివరాలు.. మరిన్ని భాషల్లో గూగుల్ సేవలు దేశీయంగా వినియోగదారులకు చేరువయ్యేందుకు టెక్ దిగ్గజం గూగుల్ మరింత దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా స్థానిక భాషల్లో సెర్చ్ సేవలపై మరింత దృష్టి పెట్టనుంది. పూర్తి వివరాలు.. నవ్వులకు క్లాప్ వెంకటేశ్, వరుణ్తేజ్, తమన్నా, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న చిత్రం ‘ఎఫ్3’. గతేడాది సంక్రాంతికి విడుదలై ఘనవిజయం సాధించిన ‘ఎఫ్2’కి ఇది సీక్వెల్. గురువారం హైదరాబాద్లో పూజా కార్యక్రమాలతో ‘ఎఫ్3’ని ప్రారంభించారు. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
టీడీపీ హయాంలోనే.. గుళ్లు కూల్చేశారు రాష్ట్రంలో రాజకీయ లబ్ధి పొందేందుకు, తిరుపతి ఉపఎన్నిక కోసమే బీజేపీ నేతలు డ్రామాలాడుతున్నారని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ మండిపడ్డారు. పూర్తి వివరాలు.. తెలంగాణలో చిచ్చు రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన ప్రక్రియ పార్టీలో చిచ్చు రాజేస్తుంది. ఇప్పటికే పదవి కోసం కాంగ్రెస్ ముఖ్య నాయకులు ఢిల్లీ బాట పట్టారు. పూర్తి వివరాలు.. వీడియోలో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు! ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు కుట్ర రాజకీయాలు మరోసారి బట్టబయలు అయ్యాయి. పోలీసులపైకి టీడీపీ కార్యకర్తలను ఎగదోస్తున్న బాబు వ్యవహారం బయటపడింది. పూర్తి వివరాలు.. నేను ఎంజీఆర్ రాజకీయ వారసుడ్ని: కమల్ దివంగత ఎంజీఆర్ కలను సాకారం చేస్తే, ఆయనకు తానే రాజకీయ వారసుడ్ని అని మక్కల్ నీది మయ్యం నేత కమలహాసన్ వ్యాఖ్యానించారు. పూర్తి వివరాలు.. 9 రాష్ట్రాలకు కొత్త సీజేలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశవ్యాప్తంగా తొమ్మిది రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు (సీజే) రానున్నారు. పూర్తి వివరాలు.. సత్వరమే పోలవరం ఫలాలు జాతీయ ప్రాజెక్టు పోలవరానికి సవరించిన వ్యయ అంచనాల మేరకు సత్వరమే నిధులు మంజూరు చేయాలని కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పూర్తి వివరాలు.. ధరణిలో ప్రక్రియ షురూ.. తహసీల్దార్లకు లాగిన్ ఆప్షన్ వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా ధరణి వెబ్సైట్ ద్వారా మార్చుకునేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు.. నిరసన గళం వారిదే వ్యవసాయ చట్టాలు రద్దు చేయాలంటూ వారి గళం దేశమంతా ప్రతిధ్వనిస్తోంది. కేంద్రం బుజ్జగించినా వినడం లేదు, కరుకు లాఠీ దెబ్బలకి వెరవడం లేదు. పూర్తి వివరాలు.. నేడు పీఎస్ఎల్వీ సీ50 ప్రయోగం సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 3.41 గంటలకు ప్రయోగించనున్న పీఎస్ఎల్వీ సీ50 ఉపగ్రహ వాహక నౌకకు బుధవారం మధ్యాహ్నం 2.41 గంటలకు కౌంట్డౌన్ను లాంఛనంగా ప్రారంభించారు. పూర్తి వివరాలు.. రైతులకు మద్దతుగా ఆత్మహత్య వివాదాస్పద వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా హరియాణాలోని కర్నాల్కు చెందిన మత ప్రబోధకుడు సంత్ బాబా రామ్ సింగ్(65) బుధవారం ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు.. సంక్రాంతికి 1,500 ఆర్టీసీ బస్సులు! ఈ సంక్రాంతి పండక్కి ఆర్టీసీ 1,500 ప్రత్యేక సర్వీసులు తిప్పేందుకు ప్రణాళికలు రూపొందించింది. పూర్తి వివరాలు.. మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు మాజీ మంత్రి అఖిలప్రియపై కేసు నమోదు చేసినట్టు కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. పూర్తి వివరాలు.. సినిమా కోసం కదలి వచ్చిన ఊళ్లు మారేడుమిల్లి అటవీ ప్రాంతం భాగ్యనగరానికి వచ్చింది. నేను కూడా అంటూ ఇటలీ వచ్చేసింది. నేనూ వస్తా అంటూ అమెరికా వచ్చింది. పూర్తి వివరాలు.. ‘పింక్’ సమరం.. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న అసలు సమరానికి సమయం ఆసన్నమైంది. సంప్రదాయ టెస్టు క్రికెట్లో ప్రస్తుతం సమఉజ్జీల్లాంటి రెండు జట్ల మధ్య ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. పూర్తి వివరాలు.. స్పెక్ట్రమ్ వేలానికి సై! దేశీ టెలికం రంగంలో భారీ స్థాయి స్పెక్ట్రమ్ వేలానికి రంగం సిద్ధమైంది. వచ్చే ఏడాది మార్చిలో మరో రౌండ్ స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించే ప్రతిపాదనకు కేంద్ర కేబినెట్ బుధవారం ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
► రజనీ పార్టీ ‘మక్కల్ సేవై కట్చి’ ! తమిళ సూపర్స్టార్ రజనీకాంత్ పార్టీ పేరు ‘మక్కల్ సేవై కట్చి’ (ప్రజాసేవ పార్టీ) అని తెలుస్తోంది. ఈ నెలాఖరులో పార్టీ, చిహ్నం వెల్లడి, వచ్చే ఏడాది జనవరిలో పార్టీ స్థాపన అంటూ ఇటీవల ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు.. ► రైతులను మోసం చేస్తున్నారు నూతన వ్యవసాయ చట్టాలపై ప్రతిపక్షాలు రైతులను తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పునరుద్ఘాటించారు. రైతులను గందరగోళ పరిచే కుట్రకు విపక్షాలు తెర తీశాయని ఆరోపించారు. పూర్తి వివరాలు.. ► రణరంగమైన విధాన పరిషత్ కర్ణాటక ఎగువసభ విధాన పరిషత్ మంగళవారం రణరంగమైంది. అధికార, ప్రతిపక్ష సభ్యులు చైర్మన్ పీఠం కోసం ముష్టియుద్ధానికి, దూషణలకు దిగడంతో చట్టసభ చరిత్రలోనే చీకటిరోజుగా మిగిలిపోయింది. పూర్తి వివరాలు.. అమెరికా 46వ అధ్యక్షుడు బైడెన్ అగ్రరాజ్యం 46వ అధ్యక్షుడిగా డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ విజయం అధికారికంగా నిర్ధారణ అయింది. 538 మంది సభ్యుల ఎలక్టోరల్ కాలేజీలో 306 ఓట్లతో బైడెన్ ముందంజలో నిలబడగా, ట్రంప్కి 232 ఓట్లు వచ్చాయి. పూర్తి వివరాలు.. ► పోలవరం ప్రాణాధారం జాతీయ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్కు ప్రాణాధారమైన పోలవరం ఫలాలను వీలైనంత త్వరగా ప్రజలకు అందచేసేలా కేంద్ర ప్రభుత్వం సహకారం అందించాలని కేంద్ర హోం మంత్రి అమిత్షాను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పూర్తి వివరాలు.. ► రిజిస్ట్రేషన్ల ప్రక్రియ వారం రోజుల్లో గాడిలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వారం రోజుల్లో గాడిలో పెడతామని, సాంకేతికపరంగా ఎదురవుతున్న అన్ని సమస్యలను పరిష్కరించి ప్రజలకు సులభతరంగా రిజిస్ట్రేషన్ సేవలు అందుబాటులోకి తెస్తామని తెలంగాణ ఆర్ అండ్ బీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ► ప్రణబ్ పుస్తకం.. ఇంట్లోనే వైరం దివంగత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాసిన చివరి పుస్తకం ‘ది ప్రెసిడెన్షియల్ ఇయర్స్’ ఆయన ఇంట్లోనే విభేదాలకు దారి తీసింది. పూర్తి వివరాలు.. ► లండన్లో నేటి నుంచి కఠిన ఆంక్షలు కరోనా కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో లండన్లో బుధవారం నుంచి అత్యంత కఠిన స్థాయి ఆంక్షలను(టయర్ 3) విధించాలని యూకే ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు.. ► సైనికుడి పాత్రలో విజయ్ దేవరకొండ సుకుమార్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ఓ సినిమా ఉంటుందనే సంగతి తెలిసిందే. 2022లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందని ప్రకటించారు కూడా. పూర్తి వివరాలు.. ► రెండు దశాబ్దాల్లో టాప్–3లోకి.. వచ్చే రెండు దశాబ్దాల్లో భారత్ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా ఎదుగుతుందని పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ ధీమా వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. ఇటు శ్రీశాంత్... అటు యువీ స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఏడేళ్ల పాటు క్రికెట్కు దూరమైన పేస్ బౌలర్ ఎస్. శ్రీశాంత్ తొలిసారి ప్రధాన స్రవంతిలోకి అడుగు పెట్టేందుకు చేరువయ్యాడు. పూర్తి వివరాలు.. -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
► ఆంధ్రాకు టూరిస్టు చంద్రబాబు నారా చంద్రబాబునాయుడు బినామీ భూములను చూసుకునేందుకే టూరిస్టులా అమరావతికి విచ్చేశారని, వచ్చి రావటంతోనే కుట్రలు మొదలుపెట్టారని వైఎస్సార్సీపీ ఎంపీ నందిగం సురేష్ మండిపడ్డారు. పూర్తి వివరాలు.. ► అధ్యక్షుడి ఎంపిక.. ఆలస్యం! తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకానికి సంబంధించిన సంప్రదింపుల ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ తెలిపారు. పూర్తి వివరాలు.. ► కమల్తో అసద్.. దోస్తీ! తమిళనాట పతంగి ఎగిరేనా? కమల్తో కలిసి కమాల్ చేయగలదా? మజ్లిస్ పార్టీ అక్కడ కూడా అడుగు పెట్టగలదా? ఈ ప్రశ్నలంటికీ వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే అసెంబ్లీ ఎన్నికలే సమాధానమిస్తాయి. పూర్తి వివరాలు.. ► నిమ్మగడ్డ రమేష్ది మోసమే.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కుమార్ రాష్ట్రంలో నివసించడం లేదని, కానీ ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తూ ప్రతి నెలా ఇంటి అద్దె అలవెన్స్ పొందుతున్నారని సమాచార హక్కు ఉద్యమ ఐక్య వేదిక (యునైటెడ్ ఫోరం ఫర్ ఆర్టీఐ క్యాంపెయిన్), గవర్నర్ విశ్వభూషణ్కు ఫిర్యాదు చేసింది. పూర్తి వివరాలు.. ► 2022లో పోలవరం ఆయకట్టుకు సాగునీరు పోలవరం ఆయకట్టు కింద పంటలకు 2022 ఖరీఫ్ సీజన్లో నీళ్లు అందించాల్సి ఉన్నందున వచ్చే ఏడాది డిసెంబర్ నాటికే ప్రాజెక్టు పనులు పూర్తయ్యేలా ప్రణాళికను అమలు చేయాలని అధికారులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశానిర్దేశం చేశారు. పూర్తి వివరాలు.. ► అదనపు టీఎంసీ... ఆగినట్లే! కాళేశ్వరం ప్రాజెక్టులో అదనంగా మరో టీఎంసీ నీటిని తరలించేలా చేపట్టిన పనులకు బ్రేక్ పడనుంది. పూర్తి వివరాలు.. ► నేడు ఢిల్లీకి సీఎం జగన్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లనున్నారు. పూర్తి వివరాలు.. ► లండన్లో కఠిన ఆంక్షలు! కరోనా కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో.. లండన్లో ఆంక్షలను మరింత కఠినం చేయనున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు.. ► ఫైజర్ టీకా ఖరీదెక్కువే.. కరోనా మహమ్మారిని అంతం చేసే వ్యాక్సిన్ అభివృద్ధి కోసం ప్రపంచవ్యాప్తంగా ప్రయోగాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పూర్తి వివరాలు.. ► ట్విట్టర్ ఇండియా టాప్ 10 జాబితా స్టార్స్ తాజా చిత్రాల అప్డేట్స్, హాలిడేస్, ఇంకా ఇతర విశేషాల గురించి తెలుసుకోవాలని అభిమానులు అనుకుంటారు. అందుకే ఏదైనా అప్డేట్ దొరుకుతుందేమోనని సోషల్ మీడియాలో వెతుకుతారు. పూర్తి వివరాలు.. ► ఎయిరిండియాపై టాటా గురి.. ఆర్థిక భారంతో కుంగుతున్న ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ ఎయిరిండియాను కొనుగోలు చేసేందుకు పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, ఎయిరిండియా ఉద్యోగులు బరిలోకి దిగారు. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
ఆపిల్ ఫ్యాక్టరీలో విధ్వంసం: రాజకీయ ప్రకంపనలు.. కర్ణాటక కోలార్ జిల్లాలోని ఆపిల్ ఐఫోన్ తయారీ ప్లాంట్లో ఉద్యోగుల విధ్వంసం ప్రకంపనలు రేపుతోంది. వేతనాలు చెల్లించలేదనే ఆగ్రహంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు ప్లాంట్ పై దాడిచేసిన ఘటనపై దర్యాప్తు చేపట్టాలని రాజకీయ పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. పూర్తి వివరాలు.. తప్పుడు ప్రచారాలపై సీఎం జగన్ ఆగ్రహం రాష్ట్ర ప్రజలకు ఫలాలను అందచేసే దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న సీఎం జగన్.. పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించి గడువులోగా పూర్తి చేసేలా అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2022 ఖరీఫ్ నాటికి పోలవరం ద్వారా నీరందించేలా పనులు పూర్తి చేయాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. పోలవరం ఎత్తు తగ్గిస్తున్నారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు.. మన్యంలో మావోయిస్టుల ఘాతుకం జిల్లాలోని సింహాచలం ప్రాంతంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. పోలీస్ ఇన్ఫార్మర్గా అనుమానించి గెమ్మెలి కృష్ణారావు అనే గిరిజనుడిని దారుణంగా హతమార్చారు. ఈ ఘటన జి.మాడుగుల మండలం వాక పల్లె గ్రామం సోమవారం జరిగింది. కృష్ణారావును హత్య చేసి మావోయిస్టులు అక్కడ ఒక లేఖనును వదిలి వెళ్లారు. పూర్తి వివరాలు.. టీపీసీసీ చీఫ్ ఎంపిక మరింత ఆలస్యం! తెలంగాణ పీసీసీ చీఫ్ ఎంపిక ప్రక్రియ ప్రారంభించామని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్ తెలిపారు. ఇప్పటివరకు 162 మంది నేతల అభిప్రాయాలను సేకరించామని అన్నారు. తెలంగాణకు చెందిన ఏఐసీసీ నేతల నుంచి జిల్లా స్థాయి నేతల వరకు అభిప్రాయాలు తెలుసుకున్నామని ఢిల్లీలో సోమవారం ఆయన మీడియాతో పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. ‘తెలంగాణలో నయా రాచరికం’ తెలంగాణలో పాలన అంతా అయోమయంగా సాగుతోందని.. ముఖ్యమంత్రి కేసీఆర్ అటు మంత్రులను, ఇటు ప్రజలను కలవకుండా ఫామ్ హౌస్ నుంచి నయా రాచరిక పాలన చేస్తున్నారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. పూర్తి వివరాలు.. రానున్న 4-6 నెలలు జాగ్రత్త: బిల్ గేట్స్.. రానున్న 4-6 నెలల్లో కరోనా వైరస్ మరిన్ని సవాళ్లు విసరవచ్చని గ్లోబల్ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సహవ్యవస్థాపకులు బిల్ గేట్స్ తాజాగా పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలకు అనారోగ్య సమస్యలు సృష్ఠిస్తున్న వైరస్ను ఎదుర్కొనేందుకు ప్రజలు మాస్కులు ధరించడం, సామాజిక దూరం, పరిశుభ్రతను పాటించడం వంటివి విధిగా చేయవలసి ఉన్నట్లు నొక్కి చెప్పారు. లేదంటే వైరస్ మరింత విజృంభించవచ్చని, దీంతో మరణాల సంఖ్య సైతం పెరిగే అవకాశముందని అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాలు.. ఈ వారంలో టాప్ - 10 ట్రెండింగ్ ఫోన్స్ ఇవే! ప్రస్తుత ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ లేని ఇల్లు లేదంటే నమ్మశక్యం కాదు, అంతలా విస్తరించింది ఈ మొబైల్ ప్రపంచం. అందుకే మార్కెట్ లో ఏ కొత్త ఫోన్ వచ్చిన తెగ వెతికేస్తుంటాం. అలా ఈ వారంలో ప్రజలు బాగా వెతికే వాటిలో టాప్-10 ట్రెండింగ్లో ఉన్న ఫోన్ లు మీకోసం అందిస్తున్నాం. పూర్తి వివరాలు.. తప్పయిపోయింది మహాప్రభో, క్షమించండి.. దివంగత నటుడు కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ విష్ణువర్థన్పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు తెలుగు నటుడు విజయ్ రంగరాజు క్షమాపణలు కోరారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన కన్నడ సూపర్ స్టార్ విష్ణువర్థన్ను ఎకవచనంలో సంబోధిస్తు.. అవమానకర రీతిలో పదజాలాన్ని వాడారు. దీంతో కన్నడ ప్రజలు, హీరో విష్ణువర్థన్ అభిమాన సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విరుచుకుపడ్డారు. పూర్తి వివరాలు.. ఎన్నికల బరిలోకి మరో స్టార్ హీరో! తమిళ సినీ హీరో విశాల్ త్వరలోనే పోలీటికల్ ఎంట్రి ఇవ్వబోతున్నాడు. నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా, తమిళ చిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడిగా విశాల్ పోటీ చేసి గెలుపోందిన విషయం తెలిసిందే. ప్రైవేటు రంగంలో రెండు కీలక పదవులు చేపట్టి సత్తా చాటుకున్న విశాల్ రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.. పూర్తి వివరాలు.. చిర్రెత్తిపోయింది.. అందుకే హిట్టింగ్కు దిగా.. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో భాగంగా టీమిండియా-ఆసీస్ ’ఎ’ జట్ల మధ్య జరిగిన మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ను భారత్ గెలుస్తుందని భావించినా ఆసీస్ ’ఎ’ ఆటగాళ్ల పోరాటంతో ఆ జట్టు ఊపిరి పీల్చుకుంది. కానీ ఇక్కడ భారత్కు మంచి ప్రాక్టీస్ లభించింది. టెస్టు సిరీస్కు జట్టును ఎలా ఎంపిక చేయాలనే దానిపై స్పష్టత వచ్చింది. ప్రధానంగా రిషభ్ పంత్ను ఎంపిక చేయాలా.. వద్దా అనే విషయంలో క్లారిటీ వచ్చేసింది. పూర్తి వివరాలు.. -
2020లో సౌత్ ఇండియా నెంబర్వన్ స్టార్ అతడే..!
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తోంది. తమకు నచ్చిన వారిగురించి సోషల్ మీడియాలో చర్చించడం, హ్యాష్టాగ్లతో పోస్టులు చేయడం నెటిజన్లకు అలవాటుగా మారిపోయింది. ఈ మధ్యకాలంలో ఏ హీరోలు, హీరోయిన్ల గురించి ట్విటర్లో అత్యధికంగా చర్చ జరిగింది. ఎవరి పేరుతో ఎక్కువ ట్వీట్స్ చేశారు అనేది ట్విటర్ అధికారికంగా వెల్లడించింది. 'మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది..! 2020లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత సూపర్స్టార్స్ వీరే' అంటూ టాప్-10 జాబితాను ట్విటర్ ఇండియా షేర్ చేసింది. ఆ జాబితాలో టాలీవుడ్ సూపర్స్టార్ మహేష్బాబు నెంబర్వన్ స్థానాన్ని ఆక్రమించుకోగా.. పవర్స్టార్ పవన్కళ్యాణ్ 2వ స్థానాన్ని దక్కించుకున్నారు. తమిళ సూపర్స్టార్ విజయ్ 3వ స్థానం, ఎన్టీఆర్ 4, సూర్య 5వ స్థానాన్ని దక్కించుకున్నారు. దక్షిణాది హీరోయిన్ల విషయానికొస్తే.. మహానటి కీర్తి సురేష్ నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. తర్వాత స్థానాలను కాజల్, సమంత, రష్మిక మందన్నా, పూజా హెగ్డే దక్కించుకోవడం విశేషం. చదవండి: (ట్విటర్ ట్రెండింగ్.. విక్రమ్ సినిమాకు 21 ఏళ్లు) మీరందరూ ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది! 2020 లో ఎక్కువగా ట్వీట్ చేయబడిన దక్షిణ భారత సూపర్ స్టార్స్ 🥁#ఇదిజరిగింది pic.twitter.com/W8mhmNwiWK — Twitter India (@TwitterIndia) December 14, 2020 -
టుడే హెడ్లైన్స్; ఆసక్తికర విశేషాలు
దేవాలయాలు కూల్చిన దుర్మార్గుడు బాబు అధికారంలో ఉండగా విజయవాడలో 40 ఆలయాలకు పైగా కూల్చేసిన దుర్మార్గుడు చంద్రబాబని బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు విమర్శించారు. మత రాజకీయాలు చేసే చంద్రబాబు నిద్రలేచినప్పుడల్లా తాను హిందువునని ప్రకటించుకునే ప్రయత్నం చేస్తుంటారని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలు గిరిజనుల హక్కులు కాలరాసిన చంద్రబాబు గిరిజన సంక్షేమంపై మాట్లాడే అర్హత టీడీపీ నేత చంద్రబాబుకు లేదని డిప్యూటీ సీఎం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి పాముల పుష్ప శ్రీవాణి పేర్కొన్నారు. గిరిజనులను చంద్రబాబు అంటరాని వారిగా చూసి కేబినెట్లో కూడా అవకాశం ఇవ్వలేదని మండిపడ్డారు. పూర్తి వివరాలు ఉత్కంఠ రేపుతున్న పీసీసీ చీఫ్ ఎంపిక తెలంగాణ పీపీసీ కొత్త అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం రాష్ట్ర కాంగ్రెస్లో కాక రేపుతోంది. బంతి అధిష్టానం కోర్టుకు చేరడంతో సీన్ ఢిల్లీకి మారుతోంది. అభిప్రాయ సేకరణపై సోనియాకు ఫిర్యాదు చేయాలని పలువురు నేతలు భావిస్తున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు పోరాటం ముగియలేదు: ట్రంప్ అధ్యక్ష ఎన్నికల ఫలితాలపై తన పోరాటం ఇంకా ముగియలేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. స్వింగ్ స్టేట్స్లో అక్రమాలకు సంబంధించి ట్రంప్ తరఫున వేసిన ఒక వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు తాజాగా కొట్టివేసిన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తివివరాలు ► తొలి దశలో కోటి మందికి టీకా కేంద్రం నుంచి రాష్ట్రానికి కోవిడ్ వ్యాక్సిన్ (టీకా) రాగానే నెలలో కోటిమందికి వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. కేంద్రం పంపే డోసుల్ని బట్టి ఎంతమందికి వస్తే అంతమందికి టీకా వేస్తారు. పూర్తి వివరాలు.. ఏలూరు బాధితులకు అండగా ప్రభుత్వం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధితో అనారోగ్యం బారిన పడిన బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచింది. 650 బాధిత కుటుంబాలకు వలంటీర్లు, సచివాలయ సిబ్బంది ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేసింది. పూర్తి వివరాలు ► ఆ ఏడు ప్రాజెక్టులు ఆపండి.. కేంద్ర జల్శక్తి శాఖ తాజాగా తెలంగాణకు ఓ లేఖ రాసింది. అదిప్పుడు చర్చనీయాంశమైంది. ఇంతకీ ఆ లేఖలో ఏం ఉందంటే? కాళేశ్వరం ఎత్తిపోతల మూడో టీఎంసీ ప్రతిపాదిత ప్రాజెక్టుసహా ఏడు ప్రాజెక్టులు కొత్త ప్రాజెక్టుల నిర్వచనం పరిధిలోకి వస్తున్నందున వాటిపై ముందుకు వెళ్లొద్దని పేర్కొంది. పూర్తి వివరాలు.. ► అమెరికాలో గాంధీ విగ్రహానికి అవమానం అమెరికాలోని వాషింగ్టన్లో మహాత్మాగాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేయడానికి కొందరు ఖలిస్తానీ వేర్పాటు వాదులు విఫల యత్నం చేశారు. పూర్తి వివరాలు.. ► ఐటీ రిటర్నుల దాఖలుకు మార్గాలివే.. ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు మరో రెండు వారాల వ్యవధే మిగిలి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు వాస్తవానికి జూలైతోనే ముగియాలి. పూర్తి వివరాలు.. ► ఎస్పీబీ పేరిట ప్రత్యేకమైన పార్కు గాన గంధర్వుడు ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం పేరుతో తమిళనాడులోని కోయంబత్తూరులో ఓ ప్రత్యేకమైన పార్కు ఏర్పాటైంది. ‘సిరు తుళి’ అనే స్వచ్ఛంద సేవా సంస్థ ‘ఎస్.పి.బి. వనం’ పేరిట ఈ పార్కును ఏర్పాటు చేసింది. పూర్తి వివరాలు.. ► ప్రాక్టీస్ ప్రతిఫలం మనకే ఆఖరి ప్రాక్టీస్ మ్యాచ్లో ఆఖరి రోజు ఆస్ట్రేలియన్ బ్యాట్స్మెన్ శతక్కొట్టి ఉండవచ్చు... తుదకు మ్యాచ్ ‘డ్రా’ అయిండొచ్చు... కానీ ఓవరాల్గా బోలెడు లాభాలు ఒరిగింది మాత్రం కచ్చితంగా టీమిండియాకే. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
రేపు సీఎం వైఎస్ జగన్ పోలవరం పర్యటన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం పోలవరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం పోలవరం పర్యటనకు సంబంధించి జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణ పనులతో పాటు స్పిల్ వే, స్పిల్ చానల్ పనులను స్వయంగా పరిశీలించనున్నారు. పూర్తి వివరాలు.. జనసేనతో కలిసి పోటీ చేస్తాం: ఎంపీ జీవీఎల్ తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేనతో కలిసి పోటీ చేస్తామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఢిల్లీలో రైతుల ఆందోళన వెనుక కొన్ని పార్టీల కుట్ర ఉందని విమర్శించారు. పూర్తి వివరాలు.. తెలంగాణలో కొలువుల జాతర.. తెలంగాణలో కొలువుల జాతర మొదలవనుంది. పోలీస్ శాఖ, విద్యా శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ఆదివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. సీఎం నిర్ణయంతో దాదాపు 50 వేల ఉద్యోగాలు భర్తీ చేసే అవకాశమున్నట్టుగా తెలుస్తోంది. పూర్తి వివరాలు.. అవినీతికి తావివ్వొద్దు: సీఎం కేసీఆర్ ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా అత్యంత పారదర్శకంగా, సులభంగా ఉండే విధంగా వ్యవసాయేతర ఆస్తులు, భూముల రిజిస్ట్రేషన్ జరగాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు (కేసీఆర్) అధికారులను ఆదేశించారు. దీనికి అవసరమైన విధి విధానాలు, మార్గదర్శకాలు ఖరారు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాలు.. మోదీపై ప్రశ్నల వర్షం కురిపించిన కమల్ నూతన పార్లమెంట్ నిర్మాణానికి ప్రధాని నరేంద్ర మోదీ పునాదిరాయి వేసిన నేపథ్యంలో మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ పలు ప్రశ్నలు సంధించారు. దేశంలోని సగం జనాభా తిండీతిప్పలు లేకుండా అల్లాడుతుంటే ఈ సమయంలో కొత్తగా మరో పార్లమెంట్ భవనం అవసరమా అని సూటిగా ప్రశ్నించారు. పూర్తి వివరాలు.. విషమంగా లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమించింది. రాంచీలోని రాజేంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (రిమ్స్)లో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం పరిస్థితి ప్రస్తుతం బాగా క్షీణించినట్లు సమాచారం. ఈ మేరకు డాక్టర్ ఉమేష్ ప్రసాద్ మాట్లాడుతూ.. 'లాలూ ప్రసాద్ యాదవ్ కిడ్నీలు ప్రస్తుతం 25 శాతం మాత్రమే పనిచేస్తున్నాయి. పూర్తి వివరాలు.. వైట్హౌస్ నుంచి వెళ్లాల్సిందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అ««ధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. జార్జియా, మిషిగాన్, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల్ని నిలిపివేయాలని దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు న్యాయ మూర్తులు శామ్యూల్ అలిటో, క్లారెన్స్ థామస్లు శుక్రవారం కొట్టేశారు. అవకతవకలు జరిగాయనడానికి ఎలాంటి ఆధారాలు లేవన్నారు. పూర్తి వివరాలు.. ఫార్మా విద్యార్థినికి సోనుసూద్ సాయం ప్రముఖ బాలీవుడ్ నటుడు సోనుసూద్ తన ఊదారతను మరోసారి చాటుకున్నారు. ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్ ఇనిస్టిట్యూషన్స్’లో ఫార్మా సెకండ్ ఇయర్ చదువుతున్న దేవికారెడ్డికి ఆర్థిక సాయం అందజేశారు. జోగులాంబ గద్వాల జిల్లా అయిజ గ్రామానికి చెందిన దేవికారెడ్డికి గత సంవత్సరం కన్వీనర్ కోటాలో ఫార్మా.డి సీటు ఇబ్రహీంపట్నంలోని ‘గురునానక్ ఇనిస్టిట్యూషన్స్’లో వచ్చింది. పూర్తి వివరాలు.. అంపైర్ చీటింగ్.. అసలు అది ఔట్ కాదు ఆస్ట్రేలియా -ఎతో జరుగుతున్న మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్లో టీమిండియా ఆటగాడు శుబ్మన్ గిల్ అవుటైన విధానం సోషల్ మీడియాలో కాంట్రవర్సీగా మారింది. అసలు అంపైర్ దేనిని పరిగణలోకి తీసుకొని గిల్ విషయంలో ఔట్ ఇచ్చాడో అర్థం కావడం లేదని నెటిజన్లు తలగోక్కున్నారు. అసలు విషయంలోకి వెళితే.. పూర్తి వివరాలు.. మళ్లీ 11 ఏళ్ళకి నోకియా ల్యాప్టాప్ భారతదేశంలో ప్యూర్బుక్ సిరీస్లో భాగంగా నోకియా ప్యూర్బుక్ ఎక్స్ 14ని మొట్టమొదటి నోకియా ల్యాప్టాప్గా తీసుకొస్తునట్లు ఫ్లిప్కార్ట్లో అప్డేట్ వచ్చిన అప్డేట్ ద్వారా తెలుస్తుంది. నోకియా ప్యూర్బుక్ సిరీస్ను భారత్లో లాంచ్ చేయనున్నట్లు గత వారం ప్రకటించిన సంగతి మనకు తెలిసిందే. పూర్తి వివరాలు.. -
టాప్-10 న్యూస్; ఆసక్తికర వార్తలు
► ప్రతి ఇంచూ కొలుస్తారు రాష్ట్రంలో వందేళ్ల తర్వాత చేపడుతున్న అతి పెద్ద రీ సర్వేలో కచ్చితమైన కొలతలు, భూ యజమానుల సంతృప్తి ప్రధాన లక్ష్యాలుగా రెవెన్యూ శాఖ నాలుగు ఐచ్ఛికాలను సిద్ధం చేసింది. పూర్తి వివరాలు.. ► 14 నెలల తర్వాత ప్రధానిని కలిసిన సీఎం ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శనివారం సమావేశమయ్యారు. దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య రాజకీయ ఘర్షణ వాతావరణం తలెత్తిన అనంతరం తొలిసారిగా ప్రధానితో జరిగిన ఈ సమావేశం ఢిల్లీ రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తించింది. పూర్తి వివరాలు.. ► జనవరి 15 తర్వాత సెకండ్ వేవ్! రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ వచ్చే అవకాశం ఉన్నట్టు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతానికి సగటున రోజూ 600 కేసులు నమోదవుతున్నాయి. పూర్తి వివరాలు.. ► వైట్హౌస్ నుంచి వెళ్లాల్సిందే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైట్ హౌస్ను వీడి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలతో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన ఆయనకి ఎదురు దెబ్బ తగిలింది. పూర్తి వివరాలు.. ► ఇక మహా పోరాటమే తమ డిమాండ్ల విషయంలో వెనక్కి తగ్గబోమని రైతు సంఘాల నేతలు తేల్చిచెబుతున్నారు. ప్రభుత్వం దిగిరాకపోతే మహా పోరాటం తప్పదని తేల్చిచెప్పారు. పూర్తి వివరాలు.. ► అందుకే రాజీనామా చేస్తున్నా తెలుగు ఫిల్మ్ చాంబర్ జాయింట్ సెక్రటరీ పదవికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్ పదవికి దర్శక–నిర్మాత నట్టి కుమార్ శనివారం రాజీనామా చేశారు. పూర్తి వివరాలు.. ► రోహిత్ ఫిట్గా ఉన్నా.. జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ)లో శుక్రవారం ఫిట్నెస్ పరీక్ష పాస్ అయిన టాప్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ గురించి బీసీసీఐ మరింత స్పష్టతనిచ్చింది. పూర్తి వివరాలు.. ► అద్భుతమైన సోలార్ కారు అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా అద్భుతమైన ఓ కార్ల మోడల్ను తీసుకొస్తోంది. పూర్తి వివరాలు.. ► జాతీయ స్థాయిలో షణ్ముఖ స్వరం దాదాపు పదేళ్ల క్రితం ‘జీ తెలుగు’లో వచ్చిన లిటిల్ చాంప్స్ కార్యక్రమం గుర్తుందా? అయితే మీకు తన మధురమైన గళంతో అందరినీ అలరించిన షణ్ముఖ ప్రియ గుర్తుండే ఉంటుంది. పూర్తి వివరాలు.. ► గచ్చిబౌలిలో ఘోర రోడ్డు ప్రమాదం నగరంలో విషాదం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం గచ్చిబౌలిలోని విప్రో సర్కిల్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
నకిలీ వెబ్సైట్లను నమ్మొద్దు: టీటీడీ ఈవో వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని వైకుంఠ ద్వారాన్ని డిసెంబరు 25 నుండి జనవరి 3వ తేదీ వరకు 10 రోజుల పాటు తెరిచి ఉంచి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తామని టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్.జవహర్రెడ్డి తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో శనివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. పూర్తి వివరాలు.. ట్రిపుల్ ఐటీ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల రాజీవ్గాంధీ యూనివర్శిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-CET) ప్రవేశ పరీక్షలు శనివారం విడుదలయ్యాయి. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఫలితాలు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో టాప్ టెన్ ర్యాంకుల్లో ప్రభుత్వ పాఠశాల విద్యార్ధులే నిలిచారు. పూర్తి వివరాలు.. కొత్త విమానాశ్రయాలకు అనుమతివ్వండి: కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్రావు రెండోరోజు శనివారం కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశం అయ్యారు. ఢిల్లీలో టీఆర్ఎస్కు పార్టీ కార్యాలయానికి స్థలం కేటాయించినందుకు ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. పూర్తి వివరాలు.. కాంగ్రెస్ను రోడ్డుపాలు చేసే కుట్ర.. టీపీసీసీ పదవిపై కాంగ్రెస్లో హీట్ పెరిగింది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ)కి కొత్త అధ్యక్షుడు ఎవరన్న దానిపై కసరత్తు అధికారికంగా ప్రారంభమైంది. టీపీసీసీ కొత్త అధ్యక్షుడిగా ఎవరిని నియమిస్తే బాగుంటుందన్న అంశంపై అభిప్రాయసేకరణ కొనసాగుతుంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మణిక్యం ఠాకూర్ దీనిపై గాంధీభవన్లో పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నారు. పూర్తి వివరాలు.. చైనా ఆరోపణలు అవాస్తవం: భారత్ ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు ఏర్పడి 70 ఏళ్లు పూర్తైన సందర్భంగా స్మారక స్టాంపుల విడుదల అంశంలో చైనా ఆరోపణలను భారత్ కొట్టిపారేసింది. ఈ కార్యక్రమానికి సంబంధించి డ్రాగన్ చేస్తున్న ప్రకటనలు అవాస్తవాలు అని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పూర్తి వివరాలు.. హ్యపీ బర్త్డే సూపర్స్టార్: మోదీ నేడు సూపర్స్టార్ రజనీకాంత్ 70 పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా రజనీ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆయనకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరాలని తమినాడు వ్యాప్తంగా అనేక కార్యక్రమాలతో సందడి చేస్తున్నారు. త్వరలో ఆయన రాజకీయాల్లో నేరుగా రంగ ప్రవేశం చేయనున్నట్లు గతవారం పేర్కొన్న విషయం తెలిసిందే. పూర్తి వివరాలు.. ట్రంప్కు సుప్రీం షాక్.. ఆధారాల్లేవ్ అధ్యక్ష ఎన్నికల్లో ఓడిన డొనాల్డ్ ట్రంప్.. ఓటమిని అంగికరించకుండా మరోసారి అధ్యక్ష పదవిని చేపట్టాలనుకుంటున్నారు. ఇందుకోసం పోలింగ్ ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు చేస్తూ అమెరికా సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. అయితే రిపబ్లికన్లు వేసిన ఈ పిటిషన్ను విచారించిన సుప్రీం తాజాగా కొట్టివేసింది. పూర్తి వివరాలు.. సన్నీలియోన్కు 20 ఏళ్ల కొడుకు? ఫన్నీ రిప్లై! బాలీవుడ్ తారలు ఇమ్రాన్ హష్మీ, సన్నీ లియోన్ ఇద్దరూ కేవలం ఓ పాటలో మాత్రమే కలిసి నటించారు. కానీ వీళ్లకు పెళ్లైందని, బిహార్కు మకాం మార్చారని, ఈ జోడీకి డిగ్రీ చదివే కొడుకున్నాడంటూ ఈ మధ్య ఓవార్త తెగ హల్చల్ అవుతోంది. ఇది కాస్తా సన్నీలియోన్ కంటపడగా ఆమె తేలికగా నవ్వేశారు. ఆ విద్యార్థి చేసిన తుంటరి పనికి ఏమీ అనలేక మెచ్చుకోలుగా చమత్కరించారు. అసలేం జరిగిందంటే.. పూర్తి వివరాలు.. వైరల్ : రనౌట్ తప్పించుకునేందుకే.. బిగ్బాష్ లీగ్ 2020లో శనివారం మెల్బోర్న్ స్టార్స్, సిడ్నీ థండర్స్ మధ్య జరిగిన లీగ్ మ్యాచ్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మెల్బోర్న్ స్టార్స్ ఇన్నింగ్ ఆఖరి ఓవర్లో డేనియల్ సామ్స్ వేసిన బంతిని బ్యాట్స్మెన్ లార్కిన్ ఫ్లిక్ చేశాడు. అయితే పొరపాటున బంతి లార్కిన్ జెర్సీలోకి దూరిపోయింది. పూర్తి వివరాలు.. అద్భుతమైన సోలార్ కారు.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన అప్టెరా ఎలక్ట్రిక్ కార్ల కంపెనీ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానంతో భవిష్యత్తు అవసరాలకు తగిన విధంగా ఉండేలా అద్భుతమైన ఓ కార్ల మోడల్ను తీసుకొస్తోంది. గంటకు 110 మైళ్ల వేగంతో దూసుకెళ్లే ఈ కార్లను ఎన్నడూ 24 గంటల లోపల చార్జింగ్ చేయాల్సిన అవసరమే లేదట. పూర్తి వివరాలు.. -
టాప్-10 న్యూస్; ఆసక్తికర వార్తలు
► రైతుల ఆదాయం రెట్టింపు రైతుల ఆదాయం ఎలా రెట్టింపు అవుతుందన్న దానిపై బ్యాంకులు ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. పెట్టుబడి వ్యయం తగ్గడం, పంటలకు సరైన మార్కెటింగ్ సదుపాయాలు, విపత్తుల సమయంలో ఆదుకోవడం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు. పూర్తి వివరాలు.. ► నష్టపోయాం ఆదుకోండి: సీఎం కేసీఆర్ విజ్ఞప్తి చరిత్రలో మునుపెన్నడూ లేని రీతిలో కురిసిన వర్షాలతో హైదరాబాద్ తీవ్రంగా అతలాకుతలమైందని, ఈ నేపథ్యంలో జాతీయ విపత్తు నిధి నుంచి సాయం చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షాకు ముఖ్యమంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. పూర్తి వివరాలు.. ► 'దివీస్'పై దిగజారుడు రాజకీయం అధికారంలో ఉండగా చంద్రబాబు నాయుడి దృష్టిలో అది వేల మందికి ఉపాధి కల్పించే సంస్థ. అధికారం లేకుంటే మాత్రం కాలుష్యం వెదజల్లే పరిశ్రమ!!. ఇదీ తెలుగుదేశం పార్టీ ద్వంద్వ నీతి. పూర్తి వివరాలు.. ► కుంగ్ ఫూ నన్స్ హిమాలయాల్లో గ్రామాల వెంట ఎర్రటి దుస్తుల్లో తిరిగే బౌద్ధ సన్యాసినులు కనిపిస్తారు. వీరు కొండ ప్రాంత ప్రజలకు కోవిడ్ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రచారం చేస్తారు. సహాయం అందిస్తారు. వ్యాధిగ్రస్తుల వైద్యానికి సాయం చేస్తారు. పూర్తి వివరాలు.. ► ఐదు సినిమాలు చేసి ఊరెళ్లిపోతానన్నాడు ‘దర్శకుడు సుబ్బు నిబద్ధత ఉన్న వ్యక్తి. ఈ సినిమా కోసం కన్విక్షన్తో పని చేశాడు. నాకు కథను ఎంత కసితో చెప్పాడో సినిమాను అంతే కసిగా తీశాడు’’ అని హీరో సాయితేజ్ అన్నారు. పూర్తి వివరాలు.. ► సుప్రీం మెట్లెక్కిన రైతులు కొత్త వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలనే ప్రధాన డిమాండ్తో రైతు సంఘాలు చేపట్టిన ఆందోళన మరో మలుపు తిరిగింది. ఈ చట్టాల రద్దుకు బదులుగా కొన్ని సవరణలు చేస్తా మంటూ కేంద్రం ప్రకటించడం, పలు దఫాలుగా జరిగిన చర్చలు విఫలం కావడంతో రైతు సంఘాలు సుప్రీంకోర్టు తలుపుతట్టాయి. పూర్తి వివరాలు.. ► ఫైజర్ వ్యాక్సిన్ వినియోగానికి అమెరికా ఓకే అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీకి చెందిన బయోఎన్టెక్ సంయుక్తంగా రూపొందించిన వ్యాక్సిన్ అత్యవసర వినియోగానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వైద్య నిపుణుల ప్రత్యేక సలహా మండలి సిఫారసు చేసింది. పూర్తి వివరాలు.. ► బూమ్ బూమ్ బ్యాటింగ్ బుమ్రా అంటే భారత బౌలింగ్ తురుపుముక్క. పేస్ దళానికి ఏస్ బౌలర్. పదునైన బంతులతో నిప్పులు చెరగడం, యార్కర్లతో వికెట్లను కూల్చడం అతనికి బాగా తెలిసిన పని. మరి బ్యాటింగ్లో అర్ధ సెంచరీ చేయడం మనమెప్పుడు చూడలేదు కదా! ఇప్పుడు ఆ ముచ్చట కూడా చూపించేశాడు.పూర్తి వివరాలు.. ► పరిశ్రమలు రయ్రయ్..! తయారీ, కన్జూమర్ గూడ్స్, విద్యుదుత్పత్తి రంగాల ఊతంతో పారిశ్రామికోత్పత్తి సూచీ (ఐఐపీ) వరుసగా రెండో నెలా పెరిగింది. అక్టోబర్లో 3.6 శాతం వృద్ధి నమోదు చేసింది. ఇది ఎనిమిది నెలల గరిష్ట స్థాయి. 2019 అక్టోబర్లో ఐఐపీ 6.6 శాతం క్షీణించింది. పూర్తి వివరాలు.. ► మొన్న ఉరిశిక్ష.. నేడు యావజ్జీవం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘గొర్రెకుంట’ సామూహిక హత్యల కేసులో ఉరిశిక్ష పడిన నేరస్తుడికి మరోశిక్ష పడింది. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
రైతుల ఆదాయం రెట్టింపు చేయాలి: సీఎం జగన్ రైతులకు 99 శాతం పంటరుణాలు ఇచ్చారని, వారి ఆదాయం రెట్టింపుపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం 213వ ఎస్ఎల్బీసీ సమావేశం నిర్వహించారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కురసాల కన్నబాబు, గౌతమ్రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్ మాట్లాడుతూ విపత్తులు వచ్చినప్పుడు రైతులను ఆదుకోవాలన్నారు. పూర్తి వివరాలు.. ఏలూరులో తాగునీరు సురక్షితమే.. ఏలూరులో తాగునీరు సురక్షితంగానే ఉన్నట్లు ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు పేర్కొన్నారు. తాగునీటి శాంపిల్స్లో ప్రమాదకరమైనవి లేవని స్పష్టం చేశారు. 16 తాగునీటి శాంపిల్స్ను పరిశీలించగా.. ఒక శాంపిల్లో మాత్రమే లెడ్ మోతాదు ఎక్కువగా ఉందని వైద్యులు తెలిపారు. పూర్తి వివరాలు.. అక్కడ నాకు అణువణువు తెలుసు వరంగల్ నగరాన్ని అభివృద్ధి చేయడానికి భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. సికింద్రాబాద్ ఎంపీగా గెలిచిన తరువాత కేంద్ర మంత్రిగా ప్రమాణస్వీకారం చేశానని, పార్లమెంట్లో ఆర్టికల్ 370 లాంటి ముఖ్యమైన బిల్లులు, కరోనా వైరస్ వల్ల వరంగల్కి రావడం ఆలస్యమైందని చెప్పారు. పూర్తి వివరాలు.. స్లాట్ బుకింగ్: మొరాయిస్తున్న వెబ్సైట్ వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లను ఆపాల్సిన అవసరం లేదని తెలంగాణ హై కోర్టు ప్రకటించిన సంగతి తేలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ ప్రస్తుతానికి స్లాట్ బుక్ చేసుకుని పాత పద్దతిలోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియ కొనసాగించాలని సూచించారు. మరి కొద్ది సేపట్లో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్లాట్ బుకింగ్ ప్రక్రియను సీఎస్ సోమేష్ కుమార్ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాలు.. నిప్పుతో చెలగాటం వద్దు మేడం: గవర్నర్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్పై జరిగిన దాడి పశ్చిమ బెంగాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ నేతలు పరస్పరం ఆరోపణలతో మాటల యుద్ధానికి దిగుతున్నారు. పూర్తి వివరాలు.. 107 ఏళ్ల ప్రయాణానికి ముగింపు..! దాదాపు 100 సంవత్సరాలకు పైగా సేవలందించిన బిల్లిమోరా-వాఘై హెరిటేజ్ రైలు ప్రయాణానికి శుభం కార్డు పడనుంది. ఆర్థిక భారం కారణంగా ఈ రైలును నిలిపివేస్తున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. 107 సంవత్సరాలుగా పశ్చిమ రైల్వే అధ్వర్యంలో ఉత్తర గుజరాత్లో ఈ నారోగేజ్ రైలు సేవలందించింది. పూర్తి వివరాలు.. బైడెన్, కమలా హారిస్లకు అరుదైన గౌరవం అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్, ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన కమలా హారిస్లు.. ఈ యేటి టైమ్ మ్యాగజైన్ పర్సన్ ఆఫ్ ద ఇయర్గా ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ఆ పత్రిక ప్రకటించింది. హెల్త్ కేర్ వర్కర్లు, అంటువ్యాధుల నిపుణుడు ఆంథోనీ ఫౌసీ, డోనాల్డ్ ట్రంప్ పోటీ పడ్డా.. పూర్తి వివరాలు.. లాట్స్ ఆఫ్ లవ్ స్వప్నిక: విజయ్ దేవరకొండ నటీనటులపై తమకున్న ఇష్టాన్ని పలు విధాలుగా చాటుకుంటారు అభిమానులు. కొంతమంది భారీ కటౌట్లు ఏర్పాటు చేస్తే.. మరికొంత పాలాభిషేకాలు, వారి పుట్టినరోజున రక్తదానాలు వంటి సేవా కార్యక్రమాలు చేపడతారు. ఇక మరికొంత మందైతే ఏకంగా గుడి కట్టి మరీ పూజలు కూడా చేస్తారు. పూర్తి వివరాలు.. ఈసారి పుజారా ఎవరో చూడాలి : ద్రవిడ్ ఆసీస్తో జరగబోయే నాలుగు టెస్టు మ్యాచ్ల సిరీస్లో ఈసారి పుజారా ఎవరు కానున్నారనేది చూడాల్సి ఉందని టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ అభిప్రాయపడ్డాడు. డిసెంబర్ 17 నుంచి ప్రారంభం కానున్న టెస్టు సిరీస్ను ఉద్దేశించి ఈఎస్పీఎన్ క్రిక్ఇన్ఫోకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాలు.. అమెజాన్ లో మరో సేల్ మీరు అమెజాన్ లో ఇంటి అవసరాల కోసం ఏదైనా వస్తువు కొనాలనుకుంటున్నారా? అయితే, ఒక రోజు ఆగండి మీ కోసం మంచి డీల్ ని తీసుకొచ్చింది అమెజాన్. అమెజాన్ ఇండియా తన స్మాల్ బిజినెస్ డే 2020 యొక్క 4వ ఎడిషన్ను 2020 డిసెంబర్ 12 శనివారం నిర్వహిస్తుంది. ఈ సేల్ డిసెంబర్ 12 అర్ధరాత్రి నుండి అదే రోజు రాత్రి 11:59 వరకు కొనసాగుతుంది. పూర్తి వివరాలు.. -
టాప్-10 న్యూస్; ఆసక్తికర వార్తలు
నలువైపులా ఐటీ హైదరాబాద్లోని ఐటీ రంగాన్ని నగరం నలువైపులా విస్తరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు వ్యవసాయేతర రిజిస్ట్రేషన్లు షురూ తెలంగాణలో దాదాపు 3 నెలల ఎదురు చూపుల తర్వాత వ్యవసాయేతర భూములు, ఆస్తుల రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. పూర్తి వివరాలు రైతన్నలు చర్చలకు రండి నూతన వ్యవసాయ చట్టాల విషయంలో రైతు సంఘాల నేతలతో తదుపరి చర్చలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చెప్పారు. పూర్తి వివరాలు నేడు రోహిత్ శర్మ ఫిట్నెస్ పరీక్ష ఇటీవల వివాదానికి కేంద్రంగా మారిన రోహిత్ శర్మ ఫిట్నెస్ వ్యవహారంపై ఎట్టకేలకు నేడు స్పష్టత రానుంది. పూర్తి వివరాలు ఆత్మ నిర్బర్ భారతం నూతన పార్లమెంటు భవనం దేశ ప్రజాస్వామ్య చరిత్రలో కీలక మైలురాయని ప్రధాని నరేంద్రమోదీ అభివర్ణించారు. పూర్తి వివరాలు కారు పల్లె‘టూరు’ కారు అమ్మకాలు దారుణంగా పడిపోవడంతో దిక్కు తోచని వాహన కంపెనీలు పల్లెబాట పట్టాయి. పూర్తి వివరాలు తెలుగింట్లో తమిళ కోడలు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ఫేమ్ అగస్త్య మంజు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కరోనా వైరస్’. రామ్గోపాల్ వర్మ నిర్మించిన ఈ సినిమా నేడు విడుదల కానుంది. పూర్తి వివరాలు సిద్దిపేటలో ఎయిర్పోర్ట్ ‘సిద్దిపేటలో త్వరలో రైలు సౌకర్యం కూడా వస్తుంది. ఇక ఒక్కటే మిగిలింది.. ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు ఏర్పాటు చేస్తాం. ఈ కల కూడా నెరవేరుస్తా’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. పూర్తి వివరాలు అక్క చెల్లెమ్మలు బాగుంటేనే రాష్ట్రం బాగు వ్యవసాయం, పాడి పశువుల రంగంలో ఉన్న రైతులు, అక్క చెల్లెమ్మలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు నిండా ముంచేస్తారు.. ‘యాప్గాళ్లు’ కంటికి కూడా కనిపించకుండా అప్పులిచ్చే యాప్స్ గూగుల్ ప్లేస్టోర్స్లో 250 ఉన్నాయి. ఇందులో హోస్ట్ కాకుండా లింకుల రూపంలో పనిచేసే వాటికి కొదవే లేదు. పూర్తి వివరాలు యూపీఏకు పవార్ సారథ్యం? మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ను యూపీఏకు సారథ్యం వహించే దిశగా అడుగులు పడుతున్నాయని రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. పూర్తి వివరాలు -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
మహిళలకు మెరుగైన జీవనోపాధే లక్ష్యంగా.. వైఎస్సార్ చేయూత, ఆసరా పథకాల్లో అక్క చెల్లెమ్మలకు స్వయం ఉపాధి కల్పించే దిశలో చేపట్టిన మేకలు, గొర్రెల పంపిణీ ‘జగనన్న జీవక్రాంతి’ పథకాన్ని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా మేలు జాతికి చెందిన 2.49 లక్షల మేకలు, గొర్రెల యూనిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టగా, మొత్తం రూ.1869 కోట్ల వ్యయంతో పథకం అమలు చేస్తున్నారు. పూర్తి వివరాలు.. ఏలూరు వింత వ్యాధి; కీలక విషయాలు పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అంతుచిక్కని వ్యాధి తీవ్రత నెమ్మదిస్తోంది. అయిదోరోజు బాధితుల సంఖ్య తగ్గడంతో ఏలూరు ఊపిరి పీల్చుకుంది. ఇప్పటి వరకు స్థానిక పరీక్షల ఫలితాలు పరిశీలించిన అధికారులు ప్రస్తుతం కేంద్ర సంస్థలు ఇచ్చే నివేదికల కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తి వివరాలు.. సిద్ధిపేటపై సీఎం కేసీఆర్ వరాల జల్లు సిద్ధిపేట జిల్లాపై ముఖ్యమంత్రి కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా గురువారం ఆయన మంత్రి తన్నీరు హరీశ్రావుతో కలిసి రూ.45 కోట్లతో సిద్ధిపేట శివారులో నిర్మించనున్న ఐటీ టవర్ నిర్మాణంకు శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు.. పీసీసీ ఇస్తే పార్టీని గాడిలో పెడతా: కోమటిరెడ్డి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) కొత్త అధ్యక్షుడు ఎంపిక ప్రక్రియ కాంగ్రెస్లో కాక రేపుతోంది. అధ్యక్షుడి పదవికి పలువురు సీనియర్ నేతలు పోటీ పడుతుండగా.. హైకమాండ్ అందరి అభిప్రాయాలను సేకరించే పనిలో పడింది. రాష్ట్రంలో మకాం వేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ గురువారం గాంధీ భవన్లో మరోసారి కోర్కమిటీ నేతలతో సమావేశమయ్యారు. పూర్తి వివరాలు.. భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక: మోదీ నూతన పార్లమెంట్ భవనం దేశ ప్రజలందరికీ గర్వకారణమని, భారతీయుల ఆకాంక్షలకు ప్రతీక అని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రస్తుత భవనం భారత ప్రజాస్వామ్యాన్ని పరిపుష్టం చేసిందని పేర్కొన్నారు. గురువారం మధ్యాహ్నం దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్లో నూతనంగా అన్ని వసతులతో నిర్మించనున్న పార్లమెంట్ భవనానికి ప్రధాని భూమి పూజ చేశారు. నడ్డా కాన్వాయ్పై రాళ్ల దాడి రెండు రోజుల పర్యటన నిమిత్తం పశ్చిమ బెంగాల్లో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు చేదు అనుభవం ఎదురయ్యింది. టీఎంసీ కార్యకర్తలు నడ్డా కాన్వాయ్పై దాడి చేశారు.. రాళ్లు రువ్వారు. పూర్తి వివరాలు.. ‘వ్యాక్సిన్ల’ పై బ్రెజిల్ గుణపాఠం ప్రాణాంతక కరోనా వైరస్ను ఎదుర్కొనే పలు కోవిడ్ వ్యాక్సిన్ల కోసం ప్రపంచమంతా ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండగా, బ్రెజిల్ అధ్యక్షుడు జెయిర్ బోల్సోనారో మాత్రం పూర్తి నిర్లిప్తంగా ఉన్నారు. ‘నేను వ్యాక్సిన్ తీసుకునే ప్రసక్తే లేదు’ అంటూ ఆయన నవంబర్ 26వ తేదీ నుంచి సోషల్ మీడియా ముఖంగా చెబుతూ వస్తున్నారు. ఆయన మాస్కులు ధరించడాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. పూర్తి వివరాలు.. కాన్సర్తో ప్రముఖ డ్యాన్సర్ కన్నుమూత భారతీయ ప్రముఖ నాట్యకారుడు అస్తాద్ డెబూ(73) కన్నుమూశారు. గత కొంతకాలంగా కాన్సర్తో బాధపడుతున్న ఆయన గురువారం ఉదయం తుదిశ్వాస విడిచారు. ముంబైలోని నివాసంలో అస్తాద్ మరణించినట్లు ఆయన కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. పూర్తి వివరాలు... దుమ్మురేపిన కోహ్లి.. రెండో స్థానంలో రోహిత్ 2020 ఏడాది ముగింపు సందర్భంగా గురువారం ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్ను ప్రకటించింది. ఆసీస్ టూర్లో రెండు హాఫ్ సెంచరీలతో స్థిరమైన ప్రదర్శన కనబరిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి 870 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. పూర్తి వివరాలు.. ఆ ఫోన్లు కొనకండి అంటున్న నాగార్జున దాదాపు నాలుగు దశాబ్దాలుగా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేకతను సంపాదించుకొని ఇప్పటికి అగ్ర హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నారు అక్కినేని నాగార్జున. ఆరు పదుల వయస్సులోనూ కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని విధంగా కష్టపడుతూ హ్యాండ్సమ్ లుక్స్తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. తాజాగా నాగార్జున ఆపిల్పై తన ఆగ్రహాన్ని ట్వీట్ చేశారు. పూర్తి వివరాలు.. -
టాప్-10 న్యూస్; ఆసక్తికర వార్తలు
కొత్త పార్లమెంట్కు పునాదిరాయి దేశ రాజధాని ఢిల్లీలోని సంసద్ మార్గ్లో నూతన పార్లమెంట్ భవన నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం భూమి పూజ చేయనున్నారు. పూర్తి వివరాలు.. అర్హుల నమోదుకు‘కోవిడ్’ యాప్! కరోనా వ్యాక్సిన్ కు అర్హులైన వారు తమ పేర్లను నమో దు చేసుకోవడానికి తెలంగాణ ప్రభు త్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు.. ‘జగనన్న జీవ క్రాంతి’కి నేడు శ్రీకారం అక్క చెల్లెమ్మలు జీవన స్థాయిని, ప్రమాణాలను పెంచుకోవాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం జగనన్న జీవ క్రాంతి పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. పూర్తి వివరాలు.. ఉద్యమం ఇక ఉధృతం వివాదాస్పద వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ రైతులు చేస్తున్న ఉద్యమం మరింత ఉధృతం కానుంది. పూర్తి వివరాలు.. 5 నిమిషాల్లోనే ల్యాండ్ రికార్డులు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సమగ్ర రీసర్వేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత పకడ్బందీగా, లోపరహితంగా పూర్తిచేస్తామని సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియా లెఫ్టినెంట్ జనరల్ గిరీష్కుమార్ చెప్పారు. పూర్తి వివరాలు.. వైఫై బూత్లు వస్తున్నాయ్! దేశంలో బ్రాడ్బ్యాండ్ ఇంటర్నెట్ను మరింత అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు.. మెగా పెళ్ళి సందడి బుధవారం రాత్రి జొన్నలగడ్డ వెంకట చైతన్య, నిహారికల పెళ్లి కుటుంబ సభ్యులు, బంధువులు, సన్నిహితుల సమక్షంలో జరిగింది. పూర్తి వివరాలు.. ఘోర రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గురువారం ఉదయం జగ్గయ్యపేట మండలంలోని గరికపాడు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూర్తి వివరాలు.. ‘పాలబుగ్గల’ పార్థివ్ రిటైర్ భారత క్రికెట్లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న పార్థివ్ పటేల్. సుదీర్ఘ కెరీర్ తర్వాత తాను అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అవుతున్నట్లు పార్థివ్ బుధవారం ప్రకటించాడు. పూర్తి వివరాలు.. అలర్జీ ఉంటే వ్యాక్సిన్ వద్దు కరోనాను తరిమికొట్టేందుకు బ్రిటన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి 24 గంటలు గడవకుండానే సమస్యలు తలెత్తాయి. పూర్తి వివరాలు.. -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
ఏలూరులో పరిస్థితులపై సీఎం జగన్ ఆరా ఏలూరు అధికారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఇప్పటికే సాంపిల్స్ సేకరించిన ఎన్ఐఎన్ సైంటిస్టుల బృందంతో సీఎం జగన్ మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాలు.. మూడు రిజర్వాయర్లకు సీఎం జగన్ శంకుస్థాపన రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగు నీరందిస్తామంటూ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ముట్టాల, తోపుదుర్తి, దేవరకొండ రిజర్వాయర్ల నిర్మాణానికి బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. పూర్తి వివరాలు.. శ్యామల ఎవరో నాకు తెలియదు: మల్లారెడ్డి తనపై వచ్చిన ఆరోపణలపై రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి స్పందించారు. భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలలో వాస్తవం లేదని ఆయన అన్నారు. పూర్తి వివరాలు.. సిరిసిల్లాలో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్కు నిరసన సెగ తగిలింది. ఎల్లారెడ్డిపేటలో మున్నూరు కాపు సంఘ భవనాన్ని ప్రారంభించి, కార్యకర్త వివాహ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మంత్రి కేటీఆర్ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తలు యత్నించారు. పూర్తి వివరాలు.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు దేశంలో త్వరలోనే పబ్లిక్ డేటా సెంటర్లు ప్రారంభం కానున్నాయని కేంద్ర ఐటీ, న్యాయ శాఖా మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. వీటికి ఎటువంటి లైసెన్స్, ఫీజు, రిజిస్ట్రేషన్ అవసరం లేదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు.. భారత్ బయోటెక్, సీరం ప్రతిపాదనలకు నో! దేశీ దిగ్గజాలు భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ల ఎమర్జెన్సీ వినియోగానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. పూర్తి వివరాలు.. ట్రంప్కు మరో పరాజయం అమెరికా నుంచి పెన్సిల్వేనియా రాష్ట్రం నుంచి జో బైడెన్ ఎన్నిక చెల్లదంటూ రిపబ్లికన్ పార్టీ ప్రతినిధి మైక్ కెల్లీ దాఖలు చేసిన పిటిషన్ను అమెరికా సుప్రీం కోర్టు విచారించకుండానే కొట్టివేసింది. పూర్తి వివరాలు.. ప్రముఖ నటి వీజే చిత్ర ఆత్మహత్య ప్రముఖ తమిళనటి వీజే చిత్ర (28) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందారు. చెన్నైలోని ఓ హోటల్లో ఆమె బలవన్మరణానికి పాల్పడినట్టు ప్రాథమిక సమాచారం. పూర్తి వివరాలు.. టీమిండియాకు మరో షాక్ ఆసీస్తో జరిగిన మూడో టీ20లో ఓటమి పాలైన టీమిండియాకు మరో షాక్ తగిలింది. సిడ్నీ వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి టీ20లో భారత జట్టు నిర్ధిష్ట సమయానికి ఒక ఓవర్ తక్కువగా వేసిందని మ్యాచ్ రిఫరీ డేవిడ్ బూన్ తెలిపాడు. పూర్తి వివరాలు.. చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీపై ఐటీ దాడులు చెట్టినాడు గ్రూప్ ఆఫ్ కంపెనీస్ మీద నేటి ఉదయం నుండి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. చెన్నై, ఆంధ్ర, తెలంగాణ కలిపి మొత్తం 50 ప్రాంతాల్లో 100 టీమ్స్ తో కలిసి ఐటీ బృందం సోదాలు జరుపుతుంది. పూర్తి వివరాలు.. -
టాప్-10 న్యూస్; ఆసక్తికర వార్తలు
కోలుకున్న ఏలూరు అంతుచిక్కని అనారోగ్యం బారిన పడిన బాధితులకు అత్యున్నత వైద్య చికిత్స అందిస్తూనే కారణాలను గుర్తించేందుకు వివిధ రకాల నమూనాల విశ్లేషణ కొనసాగుతోంది. ఇక ఆస్పత్రులకు వస్తున్న బాధితుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. కోలుకుని ఇంటికి తిరిగి వెళ్లిపోతున్న వారి సంఖ్య ఎక్కువగా ఉంది. పూర్తి వివరాలు సీఎం జగన్ ఉదారత ఏలూరులో వింత వ్యాధికి గురై అస్వస్థతతో బాధపడుతున్న బాధితులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బాసటగా నిలిచారు. అత్యుత్తమ వైద్య సదుపాయాలతోపాటు ఆరోగ్యశ్రీలో 3 రకాల చికిత్సలకు ప్యాకేజీ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వివరాలు నేరేడ్మెట్ : ప్రారంభమైన కౌంటింగ్ జీహెచ్ఎంసీ ఎన్నికల కౌటింగ్ సందర్భంగా నిలిచిపోయిన నేరేడ్మెట్ డివిజన్ ఓట్ల లెక్కింపు బుధవారం ఉదయం ముగిసింది. నేరేడ్మెట్లో టీఆర్ఎస్ అభ్యర్థి మీనా ఉపేందర్ రెడ్డి గెలిచినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. పూర్తి వివరాలు హోరెత్తిన 'జై కిసాన్' నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు పిలుపునిచ్చిన భారత్ బంద్ విజయవంతమైంది. రైతులు, వారి మద్దతుదారుల దేశవ్యాప్త నిరసన ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, విజయవంతంగా ముగిసింది. పూర్తి వివరాలు మంత్రి మల్లారెడ్డిపై కేసు తెలంగాణ కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైంది. ఓ మహిళకు చెందిన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారన్న ఆరోపణలపై దుండిగల్ ఠాణాలో ఆరో తేదీన ఎఫ్ఐఆర్ నమోదయింది. పూర్తి వివరాలు మొబైల్ టెక్నాలజీతో టీకాలు.. భారీ స్థాయిలో చేపట్టనున్న కోవిడ్–19 టీకాల కార్యక్రమంలో మొబైల్ టెక్నాలజీని వినియోగించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. పూర్తి వివరాలు బ్రిటన్లో ఫైజర్ టీకా మొదలు యూకే తన చరిత్రలోనే అతి పెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి మంగళవారం శ్రీకారం చుట్టింది. కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ఫైజర్, బయోఎన్టెక్ సంయుక్తంగా అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను ప్రజలకు ఇవ్వడం ప్రారంభించింది. పూర్తి వివరాలు నిహారికకు మెగాస్టార్ స్పెషల్ గిఫ్ట్ తన పిల్లలతోపాటు, తమ్ముడు, చెల్లెల పిల్లలను కూడా సమానంగా చూసే చిరంజీవి కొత్తపెళ్లి కూతురు నిహారికక కోసం ఓ స్పెషల్ గిఫ్ట్ తీసుకున్నారట. పూర్తి వివరాలు చివరిది చేజారింది భారత్–ఆ్రస్టేలియా మధ్య పరిమిత ఓవర్ల సిరీస్లు సమంగా ముగిశాయి. మంగళవారం జరిగిన మూడో టి20లో ఆసీస్ 12 పరుగుల తేడాతో భారత్ను ఓడించింది. పూర్తి వివరాలు ఒక్క కిడ్నీ.. వేయి విజయాలు అంజూ జార్జ్ ఇవాళ ట్విటర్ ద్వారా క్రీడా ప్రపంచాన్ని, అభిమానుల్ని ఉలిక్కిపడేలా చేశారు. 2003లో భారత్కు ప్రపంచ పతకం సాధించే సమయానికి నేను ఒక్క కిడ్నీతోనే ఉన్నానని వెల్లడించారు. పూర్తి వివరాలు -
టాప్ న్యూస్.. నేటి విశేషాలు
♦విజయవంతంగా ముగిసిన భారత్ బంద్ భారత్ బంద్ విజయవంతంగా ముగిసింది. రైతులకు వివిధ రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచాయి. తెలంగాణలోనూ బంద్ విజయవంతంగా సాగింది. పూర్తి వివరాలు.. ♦భారత్ బంద్ ఎఫెక్ట్.. రంగంలోకి అమిత్ షా భారత్ బంద్ ఎఫెక్ట్తో కేంద్ర హోమంత్రి అమిత్ షా రంగంలోకి దిగారు. రైతు సంఘాల నేతలతో చర్చించేందుకు సిద్ధమయ్యారు. పూర్తి వివరాలు.. ♦సమగ్ర భూ సర్వేతో ప్రజలకు మేలు సమగ్ర సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలు ప్రచారం చేస్తున్నాయని.. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. పూర్తి వివరాలు.. ♦ఎవరెస్ట్ ఎత్తు పెరిగింది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ ఎత్తును నేపాల్ ప్రభుత్వం ప్రకటించింది. పూర్తి వివరాలు.. ♦ఏలూరు బాధితులకు వైద్య పరీక్షలపై సీఎం ఆరా పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో అస్వస్థతకు గురైన వారికి నిర్వహిస్తున్న పరీక్షలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆరా తీశారు. పూర్తి వివరాలు.. ♦కృత్రిమ సూర్యుడిని తయారు చేసిన చైనా సృష్టికి ప్రతిసృష్టి అన్నట్టుగా తాజాగా కృత్రిమ సూర్యుడిని తయారు చేసింది చైనా. పూర్తి వివరాలు.. ♦పోరాడి ఓడిన టీమిండియా ఆసీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది.187 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 20 ఓవర్లలో 174 పరుగులు మాత్రమే చేయగలిగింది. పూర్తి వివరాలు.. ♦మళ్లీ రగులుకున్న ‘ఈశాన్యం’ అస్సాం, త్రిపుర, ఇతర ఈశాన్య రాష్ట్రాల్లో మళ్లీ అగ్గి రాజుకుంది. ఏడాది క్రితం డిసెంబర్ 11, 2019లో పార్లమెంట్ ఆమోదించిన పౌరసత్వ బిల్లుకు వ్యతిరేకంగా ఈశాన్య రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా ఆందోళనలు చెలరేగాయి. పూర్తి వివరాలు.. ♦ఈ యాప్స్ ని వెంటనే డిలీట్ చేయండి బంబుల్, ఓక్కుపిడ్, గ్రైండర్, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్, సిస్కో టీమ్స్, వైబర్ వంటి ప్రముఖ డేటింగ్, ట్రావెల్, వీడియో కాలింగ్ యాప్స్ లలో ఇటీవల ఒక పెద్ద బగ్ గుర్తించినట్లు చెక్పాయింట్ పరిశోధకులు తెలిపారు. పూర్తి వివరాలు.. ♦వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే పొడిగింపు ధరణిలో వ్యవసాయేతర ఆస్తుల నమోదుపై స్టే ఈ నెల 10 వరకు తెలంగాణ హైకోర్టు పొడిగించింది. పూర్తి వివరాలు.. -
Top News; మిస్కాకండి!
రైతన్నకు దన్నుగా.. మేమంతా ఉండగా... అన్నదాతలకు మద్దతు దేశవ్యాప్తంగా బంద్ కొనసాగుతోంది. బీజేపీ మినహా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు రైతులకు అండగా నిలబడటంతో బంద్ సంపూర్ణంగా జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ బంద్ పాటిస్తున్నారు. పూర్తి వివరాలు.. ఏలూరుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో అంతుబట్టని వ్యాధికి కారణాలను అన్వేషించేందుకు అత్యున్నత స్థాయి వైద్య నిపుణుల బృందాలు నేడు రానున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రతినిధులు, ఐఐసీటీ బృందం ఏలూరులో పర్యటించనున్నాయి. పూర్తి వివరాలు తెలంగాణ పత్తికి బ్రాండ్ ఇమేజ్ తెలంగాణలో పండే పత్తికి బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలని అధికారులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. తమ రాష్ట్రంలో పండే పత్తి దేశంలో కెల్లా అత్యంత నాణ్యమైనదిగా గుర్తింపు పొందిందని, ప్రపంచంలోకెల్లా అత్యంత నాణ్యమైన పత్తిని ఉత్పత్తి చేసే ప్రాంతాల్లో తెలంగాణ ఒకటని ఆయన తెలిపారు. పూర్తి వివరాలు సోషల్ మీడియాపై అణచివేతలొద్దు సోషల్ మీడియాను అణచివేయాలనుకోవడం సరైంది కాదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ చెప్పారు. ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్యానికి అది ఎంతమాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. పూర్తి వివరాలు పెరగనున్న టీవీల ధరలు టీవీ, వాషింగ్ మెషీన్, ఫ్రిజ్, ఏసీ, మైక్రోవేవ్ ఓవెన్ తదితర వైట్ గూడ్స్ ధరలు త్వరలోనే పెరగనున్నాయి. ఉత్పత్తి, రవాణా వ్యయాలు పెరుగుతుండటంతో ఈ వస్తువుల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. పూర్తి వివరాలు ఆరోహణ రేఖ రేఖారావుది హైదరాబాద్, కూకట్పల్లి. ఆమె ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ బచేంద్రిపాల్ దగ్గర పర్వతారోహణం నేర్చుకున్నారు. పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లయిన తర్వాత కూడా హిమాలయ పర్వతాల ఆరోహణ చేశారు! పూర్తి వివరాలు క్లీన్స్వీప్పై టీమిండియా గురి భారత్–ఆస్ట్రేలియా చివరి టి20 నేడు జరగనుంది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే ఆస్ట్రేలియాతో టి20 సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ క్లీన్స్వీప్పై గురిపెట్టింది. పూర్తి వివరాలు మాట్రిమోనియల్ ఫ్రాడ్ విదేశీ వధువుగా రిజిస్టర్ చేసుకున్న ఓ మహిళ వల్లో పడిన హైదరాబాద్ నగర వాసి రూ.5 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితుడు సోమవారం సిటీ సైబర్ ఏసీపీ కేవీఎం ప్రసాద్కు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. పూర్తి వివరాలు వైరల్: భయపెట్టిన దెయ్యం ఓ వ్యక్తి తన గదిలో తన పని చేసుకుంటుంటే అకస్మాత్తుగా శబ్ధాలు వినిపించాయి. ఆ సమయంలో అతడు తప్ప అక్కడ మరెవరూ లేరు. దీంతో ఇది ప్రాంక్ కాదని అతడికి అర్థమైంది. పూర్తి వివరాలు అమెరికా హెల్త్ సెక్రటరీగా హావియర్ అమెరికా ఆరోగ్య శాఖ (సెక్రెటరీ ఆఫ్ హెల్త్), హ్యూమన్ సర్వీసెస్ మంత్రిగా హావియర్ బసెరా ఎంపికయ్యారు. అలాగే, భారతీయ అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తిని సర్జన్ జనరల్గా కాబోయే అధ్యక్షుడు జో బైడెన్ ఎంపిక చేసుకున్నారు. పూర్తి వివరాలు రాజకీయాల్లోకి వస్తాను: హీరోయిన్ ‘భవిష్యత్తులో పక్కాగా రాజకీయాల్లోకి వెళ్తాను. అంతకంటే ముందు ఓ ఎన్జీవో ప్రారంభిస్తాను. నాకు రాజకీయాలు ఎలా చేయాలో తెలియదు. కానీ సహాయం ఎలా చేయాలో తెలుసు’ అంటున్న రాశీ ఖన్నా. పూర్తి వివరాలు -
విజేత హారిక
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ గ్రాండ్మాస్టర్ ద్రోణవల్లి హారిక ‘ఐల్ ఆఫ్ మ్యాన్’ స్విస్ గ్రాండ్ అంతర్జాతీయ చెస్ టోర్నమెంట్లో అద్భుత ప్రదర్శన చేసింది. యునైటెడ్ కింగ్డమ్లో జరిగిన ఈ టోర్నీలో హారిక మహిళల విభాగంలో విజేతగా నిలిచింది. 11 రౌండ్లపాటు జరిగిన ఈ టోర్నీలో హారిక 5.5 పాయింట్లతో దినారా (కజకిస్తాన్)తో కలిసి సమఉజ్జీగా నిలిచింది. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్ను వర్గీకరించగా హారికకు తొలి స్థానం, దినారాకు రెండో స్థానం లభించాయి. హారిక 11 మంది గ్రాండ్మాస్టర్లతో గేమ్లు ఆడింది. రెండు గేముల్లో గెలిచింది. ఏడు గేమ్లను ‘డ్రా’ చేసుకొని, రెండు గేముల్లో ఓడింది. తాజా ప్రదర్శనతో హారిక త్వరలో వెలువడే ప్రపంచ ర్యాంకింగ్స్లో 13వ స్థానం నుంచి 9వ స్థానానికి చేరుకుంటుంది. -
ప్రభం‘జన’ తొలి పది దేశాలు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచ జనాభా నానాటికీ పెరుగుతోంది. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.5 కోట్ల జనాభా పెరుగుతోంది. 2018 జూలై నాటికి ప్రపంచ జనాభా 760 కోట్లు ఉన్నట్లు అంచనా. ఇదేవిధంగా పెరుగుతూ పోతే భవిష్యత్తులో ప్రపంచ వ్యాప్తంగా 2030 నాటికి 840 కోట్లు, 2050 నాటికి 960 కోట్లకు జనాభా చేరుకుంటుంది. నేడు (జులై 11) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా పాపులేషన్లో ముందున్న పది దేశాల గురించి తెలుసుకుందాం. చైనా 1,415,171,198తో ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనా తొలి స్థానంలో నిలించింది. ప్రపంచ జనాభాలో అత్యధికంగా 18.54 శాతం జనాభా చైనాలోనే ఉంది. ఒక చదరపు కిలోమీటరులో 151 మంది ప్రజలు నివసిస్తున్నారు. చైనా జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు. ఇండియా 1,354,464,444 జనాభాతో భారతదేశం ప్రపంచంలో రెండో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో 17.74 శాతం ప్రజలు భారత్లో నివశిస్తున్నారు. ఒక చదరపు కిలోమీటర్కు 455 మంది ప్రజలు జీవిస్తున్నారు. ఇది చైనా కంటే రెండింతులు ఎక్కువ. భారతీయ జనాభాలో సగటు వయసు 27 ఏళ్లు. ప్రపంచంలో అత్యధిక యువత ఉన్న దేశంగా భారత్ తొలి స్థానంలో ఉంది. అమెరికా 326,830,645 జనాభాతో అమెరికా ప్రస్తుతం మూడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో అమెరికన్లు 4.28 శాతం మంది ఉన్నారు. ఒక చదరపు కిలోమీటర్కు కేవలం 36 మంది మాత్రమే నివశిస్తున్నారు. అమెరికన్ల జనాభాలో సగటు వయస్సు 37 ఏళ్లు. ఇండోనేషియా 266,872,775 జనాభాతో దీవుల దేశం ఇండోనేషియా నాలుగో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 3.5 శాతం. ఒక చదరపు కిలోమీటర్కు 147 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 28 ఏళ్లు. బ్రెజిల్ 266,872,775 జనాభాతో ప్రపంచంలో బ్రెజిల్ ఐదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.76 శాతం. ఒక చదరపు కిలోమీటర్కు కేవలం 26 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 31 ఏళ్లు. పాకిస్తాన్ 200,919,769 జనాభాతో ఆరో స్థానంలో ఉంది. ప్రపంచంలో పాక్ జనాభా శాతం 2.63. ఒక చదరపు కిలోమీటర్కి 260 మంది ప్రజలు నివశిస్తున్నారు. వీరి జనాభా సగట వయసు 22 ఏళ్లు. నైజీరియా 196,041,916 జనాభాతో నైజీరియా ప్రపంచంలో ఏడో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో నైజీరియన్ల్ శాతం 2.57. ఒక చదరపు కిలోమీటర్కి 215 మంది నైజీరియన్లు నివశిస్తున్నారు. బంగ్లాదేశ్ 166,415,337 జనాభాతో భారత సరిహద్దు దేశం బంగ్లాదేశ్ ఎనిమిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 2.18. ఒక చదరపు కిలోమీటర్కి అత్యధికంగా 1278 మంది నివశిస్తున్నారు. వీరి జనాభా సగటు వయసు 26 ఏళ్లు. రష్యా 143,964,017 జనాభాతో రష్యా ప్రపంచంలో తొమ్మిదో స్థానంలో ఉంది. ప్రపంచ జనాభాలో వీరి శాతం 1.89 శాతం. ఒక చదరపు కిలోమీటర్కు కేవలం 9 మంది మాత్రమే నివశిస్తున్నారు. వీరి సగటు వయసు 38 ఏళ్లు. మెక్సికో 130,803,510 జనాభాతో మెక్సికో ప్రపంచంలో పదో స్థానం ఆక్రమించింది. ప్రపంచంలో వీరి జనాభా 1.71 శాతం. -
ఏపీ ఎంసెట్ ఫలితాల్లో తెలంగాణ విద్యార్థుల హవా
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఇంజనీరింగ్ ఫలితాలలో తెలంగాణ విద్యార్థులు సత్తా చాటారు. టాప్ టెన్ ర్యాంకుల్లో నాలుగు తెలంగాణ విద్యార్థులకే దక్కాయి. రంగారెడ్డి జిల్లా నుంచి ముగ్గురు విద్యార్థులు టాప్టెన్లో చోటు దక్కించుకోగా.. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఓ విద్యార్థి టాప్ టెన్లో నిలిచాడు. టాప్టెన్లో నిలిచిన విద్యార్థులు వీరే.. మొదటి ర్యాంక్- వంశీకృష్ణారెడ్డి రెండో ర్యాంక్- లక్ష్మీనారాయణ మూడో ర్యాంక్- విఘ్నేష్ రెడ్డి నాలుగో ర్యాంక్- ప్రశాంత్ రెడ్డి ఐదో ర్యాంక్- గౌతమ్ ఆరో ర్యాంక్- చేతన్ సాయి ఏడో ర్యాంక్- సాయితేజ ఎనిమిదో ర్యాంక్- జార్జ్ తొమ్మిదో ర్యాంక్- సంజీవ్ పదో ర్యాంక్- జయకృష్ణసాయి ఫలితాల్లో టాప్టెన్లో నిలిచిన వారంతా అబ్బాయిలే కావటం గమనార్హం. గతేడాదితో పోలిస్తే ఈసారి 10 శాతం ఉత్తీర్ణత తగ్గింది. నీట్ను తప్పనిసరి చేస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు వెలువరించిన నేపథ్యంలో మెడికల్ ఫలితాలను నిలిపేస్తున్నట్లు మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. -
టాప్ టెక్నాలజీ సంపన్నులెవరో తెలుసా..
న్యూయార్క్: సాధారణంగా ఫోర్బ్స్ ప్రపంచ కుబేరుల వార్షిక నివేదికను ప్రతి ఏడాది విడుదల చేస్తుంది. 2016కు కూడా వందలమందితో ఆ జాబితాను ప్రకటించింది. అయితే, వీరిలో కేవలం సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుని కుబేరులుగా ఎదిగినవారు చాలామంది ఉన్నారు. సాంకేతిక పరిజ్ఞానం విలువ ఈ రోజుల్లో అంతాఇంతా కాదు. ఇది వ్యక్తుల అవసరాలు తీర్చడంలో ఎంత వేగంగా ఉపయోగపడుతుందో అంతేవేగంగా దీనిని అందించేవారికి సంపదను కూడా ఆర్జించి పెడుతుంది. ఇలా సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకుంటూ ప్రపంచంలోనే కుబేరులైనవారు ఎంతోమంది ఉన్నారు. వారిలో టాప్ టెన్ జాబితా ఒకసారి పరిశీలిస్తే అందులో తొమ్మిదిమంది అమెరికన్లు ఉండగా చైనా నుంచి ఒక్కరు మాత్రమే ఉన్నారు. ఒకసారి వివరాలు పరిశీలిస్తే.. 1. బిల్ గేట్స్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు (సంపద 75 బిలియన్ డాలర్లు, అమెరికా) 2. జెఫ్ బెజోస్, అమెజాన్ స్థాపకుడు, సీఈవో (సంపద 45.2బిలియన్ డాలర్లు, అమెరికా) 3. మార్క్ జూకర్ బర్గ్, ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు (సంపద 45.6 బిలియన్ డాలర్లు, అమెరికా) 4. లారీ ఎల్లిసన్, ఒరాకిల్ సంస్థ వ్యవస్థాపకుడు (సంపద 43.6 బిలియన్ డాలర్లు, అమెరికా) 5. లారీ పేజ్, గూగుల్ వ్యవస్థాపకుడు, ఆల్పాబెట్ సీఈవో, (సంపద 35.2డాలర్లు, అమెరికా) 6. సెర్జీ బ్రిన్, అల్పాబెట్ అధ్యక్షుడు (సంపద 34.4 బిలియన్ డాలర్లు, అమెరికా) 7. స్టీవ్ బామర్, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో (సంపద 23.5 బిలియన్ డాలర్లు, అమెరికా) 8. జాక్ మా, అలీబాబా వ్యవస్థాపకుడు (సంపద 20.5 బిలియన్ డాలర్లు, అమెరికా) 9. మైఖెల్ డెల్, డెల్ కంపెనీ బోర్డు చైర్మన్ (సంపద 19.8 బిలియన్ డాలర్లు, అమెరికా) 10. మా హువాతెంగ్, టెన్సెంట్ హోల్డింగ్ కంపెనీ సహ వ్యవస్థాపకుడు (సంపద 16.6 బిలియన్ డాలర్లు, చైనా -
స్వచ్ఛ విద్యాలయ.. అచ్ఛా మెదక్!
♦ జాతీయ స్థాయిలో జిల్లా ఎంపిక ♦ టాప్ టెన్లో నిలవడమే తరువాయి.. ♦ ఎంపికైతే ప్రధాని చేతుల మీదుగా పురస్కారం ♦ టార్గెట్ కోసం కలెక్టర్ కార్యాచరణ ప్రణాళిక పాపన్నపేట: ‘స్వచ్ఛ విద్యాలయ’ రేసులో మెదక్ జిల్లా మెరిసింది. దేశంలో ఎంపికైన 74 జిల్లాల్లో మెదక్ ఒకటిగా నిలిచింది. తిరిగి వీటి నుంచి దేశవ్యాప్తంగా పది జిల్లాలను ఎంపిక చేస్తారు. ఈ టాప్టెన్ జిల్లాలకు ప్రధాని చేతుల మీదుగా పురస్కారం అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో ‘టాప్ టెన్’లో మెదక్ నిలిచేలా జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్ ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ఈ మేరకు 18 రోజుల్లో సర్కార్ బడులను స్వచ్ఛ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించారు. సర్కార్ బడులు సమస్యలకు నిలయాలుగా ఉన్నాయని, కనీసం బాల బాలికలు టాయిలెట్కు వెళ్లేందుకు వీలుగా లేవని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో ఓ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలైంది. ఈ మేరకు స్పందించిన కోర్టు రాష్ట్రంలోని అన్ని పాఠశాలల్లో కనీస మౌలిక సౌకర్యాలను పరిశీలించి నివేదిక పంపాలని ఆదేశిస్తూ, ఒక బృందాన్ని సైతం ఏర్పాటు చేసింది. స్వచ్ఛ విద్యాలయ నేపథ్యమిదీ.. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల నేపథ్యంలో మెదక్ జిల్లాలో గతేడాది డిసెంబర్ 3వ వారంలో బృందం ప్రత్యేక పరిశీలన జరిపింది. ఈ మేరకు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న స్థితిగతులతో నివేదికకు రూపొం దించి కోర్టుకు సమర్పించింది. దేశవ్యాప్తంగా కూడా ఆయా రాష్ట్రాల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం.. ఈ మేరకు దేశంలోని 74 జిల్లాల్లో స్వచ్ఛ విద్యాలయ కార్యక్రమం అత్యుత్తమంగా ఉందని గుర్తించింది. అందులో జిల్లా కూడా ఒకటి కావడం విశేషం. టాప్-10లో చేరితే పండగే.. దేశవ్యాప్తంగా ఎంపికైన 74 జిల్లాల నుంచి మరింత అత్యుత్తమ జిల్లాలను పది ఎంపిక చేయనున్నారు. చోటు దక్కిన జిల్లాలకు ఏప్రిల్లో ప్రధాని చేతుల మీదుగా పురస్కారం అందజేయనున్నారు. ప్రభుత్వ బడుల్లోని స్వచ్ఛ పరిస్థితులను, తాగునీరు, పచ్చదనం, టాయిలెట్ల నిర్వహణ, వాష్ ప్రోగ్రాంలను పరిశీలించేందుకు మార్చి మొదటి వారంలో కేంద్ర బృందం రానున్నట్లు సమాచారం. గ్రామీణ ప్రాంతాల్లోని పాఠశాలలను సందర్శించి పరిస్థితులను అంచనా వేయనున్నారు. అలాగే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి 8 ప్రశ్నలను అడిగే అవ కాశం ఉన్నట్లు తెలుస్తోంది. కలెక్టర్ యాక్షన్ప్లాన్ జాతీయ స్థాయిలో ఈ పురస్కారం మెదక్ జిల్లాకు దక్కాలనే లక్ష్యంతో జిల్లా కలెక్టర్ రోనాల్డ్రాస్ ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు. మండల స్థాయిలో స్పెషల్ ఆఫీసర్, తహసీల్దార్, ఎంపీడీఓ, మండల విద్యాధికారితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేశారు. వారిని ఈ దిశగా చైతన్యపరిచేందుకు ఈనెల 24 న వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇంకా ఇంజనీరింగ్ సిబ్బంది, ప్రధానోపాధ్యాయులు, ఎస్ఎంసీలు, గ్రామ పెద్దలు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో పాఠశాలల్లో స్వచ్ఛ కార్యక్రమాన్ని కొనసాగించాలని ఆదేశించారు. ఫిబ్రవరి 26 నుండి మార్చి 15 వరకు రోజూ కనీసం ఐదు స్కూళ్లు పర్యవేక్షించి, అక్కడి స్వచ్ఛ పరిస్థితులను పరిశీలించి చర్యలు తీసుకోవాలని సూచిం చారు. వివరాలను రోజూ టెలిగ్రాం యాప్లో అప్లోడ్ చేయాలని సూచించారు. ఈ యత్నాలన్నీ సాకారమైతే మెతుకుసీమలోని ప్రభుత్వ బడులు పచ్చని వనాలను తలపించనున్నాయి. -
‘టాప్ టెన్’లో ఐదుగురు తెలుగువారే!
లోక్సభ మెజారిటీ రికార్డుల్లో హవా జాబితాలో పీవీ, జగన్, వైఎస్, కేసీఆర్ తాజాగా ఏడో స్థానంలో పసునూరి సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా అత్యధిక మెజారిటీ సాధించిన వారిలో తాజా వరంగల్ ఉప ఎన్నిక విజయంతో పసునూరి దయాకర్ ఏడో స్థానంలో నిలిచారు. 1952లో జరిగిన లోక్సభ తొలి ఎన్నికల నుంచి ఇప్పటిదాకా దేశవ్యాప్తంగా టాప్ టెన్ అత్యధిక మెజారిటీ జాబితాలో ఏకంగా ఐదుగురు తెలుగువారే ఉండటం విశేషం. వారు... దివంగత ప్రధాని పీవీ నరసింహారావు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్యమంత్రి కేసీఆర్, దయాకర్. బీజేపీ దివంగత నేత గోపీనాథ్ ముండే కూతురు ప్రీతమ్ ముండే 2014 ఎన్నికల్లో ఏకంగా 6.92 లక్షల మెజారిటీతో ప్రథమ స్థానంలో ఉన్నారు.