టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు | Today Morning News Headlines (28-12-2020) | Sakshi
Sakshi News home page

టుడే హెడ్‌లైన్స్‌; ఆసక్తికర విశేషాలు

Dec 28 2020 8:14 AM | Updated on Dec 28 2020 10:35 AM

Today Morning News Headlines (28-12-2020) - Sakshi

ఆ నిర్ణయాన్ని కేసీఆర్‌ వెనక్కి తీసుకోవాలి
కొనుగోలు కేంద్రాల ఎత్తివేతని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉపసంహరించుకోవాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ ఆదివారం డిమాండ్‌ చేశారు. పూర్తి వివరాలు..


వైదొలిగిన నితీష్‌.. కొత్త వ్యక్తికి బాధ్యతలు

బిహార్‌ ముఖ్యమంత్రి, జేడీయూ అధ్యక్షుడు నితీష్‌ కుమార్‌ రాజకీయపరంగా ఆదివారం కీలక నిర్ణయం తీసుకున్నారు. జేడీయూ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకున్నారు. పూర్తి వివరాలు..

మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌గా సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్‌ తొలి చైర్‌పర్సన్‌గా మాజీ మంత్రి వాకిటి సునీతా లక్ష్మారెడ్డి ఆదివారం నియమితులయ్యారు. పూర్తి వివరాలు..

నేడు చిత్తూరు జిల్లాకు సీఎం జగన్‌ రాక

సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ కార్యక్రమంలో భాగంగా  శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని ఊరందూరులో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. పూర్తి వివరాలు..

కళ్ల నిండా ఆనందం

సొంతింటి కల ఇంత త్వరగా సాకారం అవుతుందని అనుకోలేదని చెబుతున్నారు. అద్దె కోసం ఇతర ఖర్చులు తగ్గించుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నామని, ఇకపై ఈ కష్టం ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాలు..

నేడు 4 రాష్ట్రాల్లో డ్రై రన్‌

భారత్‌లో కరోనా టీకా పంపిణీకి  యంత్రాంగం సన్నద్ధమైంది. ఇది దేశ చరిత్రలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్‌ ప్రక్రియ కానుంది. పూర్తి వివరాలు.


నేడు పట్టాలపైకి డ్రైవర్‌ రహిత తొలి ట్రైన్‌

మానవ తప్పిదాలను తగ్గించే లక్ష్యంతో సిద్ధమైన డ్రైవర్‌ రహిత ట్రైన్‌ సర్వీసు తొలిసారిగా మన దేశంలో సోమవారం పట్టాలెక్కనుంది. పూర్తి వివరాలు..

ఉద్యమం నుంచి ఉద్యమం వరకు

కాలగర్భంలో మరో ఏడాది కలిసిపోతోంది. ఒక ఉద్యమంతో మొదలై, ఒక మహమ్మారితో తీవ్రంగా వణికిపోయి, మరో మహోద్యమంతో 2020 ముగుస్తోంది. పూర్తి వివరాలు..

న్యూ ఇయర్‌ కానుకగా పీఆర్సీ!

కొత్త సంవత్సరం కానుకగా ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్సీ)పై తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఒకట్రెండు రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశముంది. పూర్తి వివరాలు..

పల్లెల్లో పంట కొనుగోలు కుదరదు!

ఈ ఏడాది కరోనా నేపథ్యంలో రైతులు నష్టపోవద్దని ప్రభుత్వం గ్రామాల్లోనే సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేసి, పంటలను కొనుగోలు చేసింది. పూర్తి వివరాలు.

జీఎస్‌టీ టీజర్‌ బాగుంది

‘‘నా శిష్యుడు జానకిరామ్‌ తొలిసారి దర్శకత్వం చేస్తున్న చిత్రం ‘జీఎస్‌టీ’(దేవుడు సైతాన్‌ టెక్నాలజీ). ఈ సినిమా టీజర్‌ చాలా బాగుందని నటుడు, దర్శకుడు పోసాని కృష్ణమురళి అన్నారు. పూర్తి వివరాలు..

కార్డులు, ఖాతాలు భద్రంగా ఉన్నాయా?

మొబైల్‌ ఫోన్‌ నుంచే వ్యాలెట్ల వినియోగం, బ్యాంకింగ్‌ సేవలు, డెబిట్‌/క్రెడిట్‌ కార్డుల వినియోగం బాగా విస్తృతమవుతోంది. అత్యాధునిక టెక్నాలజీలతో.. వినియోగదారులు ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి డిజిటల్‌ లావాదేవీలు చక్కబెట్టేస్తున్నారు. పూర్తి వివరాలు..

నాయకుడు నడిపించాడు

టీమిండియాదే జోరు! తొలి రోజు బౌలింగ్‌తో ప్రత్యర్థిని పడగొట్టింది. రెండో రోజు బ్యాటింగ్‌లో నిలిచింది. ఇలా ‘బాక్సింగ్‌ డే’ టెస్టులో రెండు రోజులు ఆతిథ్య జట్టుపై ఆధిపత్యం చాటింది. పూర్తి వివరాలు..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement