-
IPL 2024: ధోని ఆటగాడిగా కొనసాగడంపై బిగ్ అప్డేట్
ఐపీఎల్లో సీఎస్కే మాజీ సారధి ఎంఎస్ ధోని ఆటగాడిగా కొనసాగడంపై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఐపీఎల్ 2024 సీజన్ మొత్తానికి ధోని అందుబాటులో ఉంటాడని ఆ ఫ్రాంచైజీ సీఈఓ కాశీ విశ్వనాథ్ స్పష్టం చేశాడు. ఇదే విషయాన్ని సీఎస్కే హెడ్ కోచ్ ష్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం పునరుద్ఘాటించాడు. ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్న విషయం చాలా మందికి ముందే తెలిసినప్పటికీ.. తనకు మాత్రం ఆలస్యంగా తెలిసిందని కాశీ విశ్వనాథ్ వాపోయాడు. ధోని ఏ నిర్ణయం తీసుకున్నా తాము గౌరవిస్తామని, అది తమ జట్టుకు మంచే చేస్తుందని కాశీ విశ్వనాథ్ విశ్వాసం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. ధోని 2023 సీజన్లో కంటే ఈ సీజన్లోనే ఎక్కువ ఫిట్గా కనిపిస్తున్నాడని కితాబునిచ్చాడు. ధోని ఈ సీజన్తో పాటు మున్ముందు జరిగే సీజన్లలోనూ సీఎస్కేతోనే ఉంటాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఆర్సీబీతో మ్యాచ్కు ముందు జరిగిన ఓ కార్యక్రమంలో సీఎస్కే నూతన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మాట్లాడుతూ.. కెప్టెన్సీ విషయాన్ని ధోని తనకు గత సీజన్కు ముందు చెప్పాడని తెలిపాడు. ధోని గత సీజన్లోనే తనతో పరోక్ష కెప్టెన్సీ చేయించాడని పేర్కొన్నాడు. గత సీజన్ చివర్లో తాను కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టేందుకు ఒప్పుకున్నట్లు వెల్లడించాడు. కెప్టెన్సీ చేపట్టే విషయంలో ధోని తనలో మానసిక స్థైర్యాన్ని నింపాడని తెలిపాడు. కాగా, లీగ్ ప్రారంభానికి కొద్ది గంటల ముందు డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తమ నూతన కెప్టెన్గా రుతురాజ్ గైక్వాడ్ను ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించింది. మాజీ కెప్టెన్ ధోని స్వచ్ఛందంగా కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంతో రుతురాజ్ బాధ్యతలు చేపట్టాడు. మరికొద్ది గంటల్లో (మార్చి 22, రాత్రి 7:30 గంటలు) ఫైవ్ టైమ్ ఛాంపియన్ చెన్నై సూపర్కింగ్స్ (సీఎస్కే), ఇప్పటివరకు ఒక్క టైటిల్ కూడా గెలవని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్ల ఐపీఎల్ 2024 సీజన్ తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగనుంది. తుది జట్లు (అంచనా): సీఎస్కే: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), రచిన్ రవీంద్ర, అజింక్య రహానే, డారిల్ మిచెల్, శివమ్ దూబే, రవీంద్ర జడేజా, ఎంఎస్ ధోని (వికెట్కీపర్), శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహీశ్ తీక్షణ, ముస్తాఫిజుర్ రెహ్మాన్ ఆర్సీబీ: విరాట్ కోహ్లి, ఫాఫ్ డుప్లెసిస్ (కెప్టెన్), రజత్ పాటిదార్, కెమరూన్ గ్రీన్, గ్లెన్ మ్యాక్స్వెల్, దినేశ్ కార్తీక్ (వికెట్కీపర్), అనూజ్ రావత్, అల్జరీ జోసఫ్, సిరాజ్, కర్ణ్ శర్మ, ఆకాశ్దీప్ -
IPL 2024 Auction: సీఎస్కేపై స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం
చెన్నై సూపర్ కింగ్స్పై ఆ జట్టు హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ప్రభావం భారీగా ఉన్నట్లు ఇవాళ జరిగిన ఐపీఎల్ వేలం తర్వాత స్పష్టంగా తెలుస్తుంది. న్యూజిలాండ్ మాజీ కెప్టెన్, కోచ్ అయిన ఫ్లెమింగ్ సీఎస్కే కోచింగ్ బాధ్యతలు చేపట్టాక ఆ జట్టుపై తన మార్కు ప్రభావం చూపిస్తున్నాడు. ఇప్పటికే డెవాన్ కాన్వే (కోటి), మిచెల్ సాంట్నర్ (1.9 కోట్లు) లాంటి కివీస్ ఆటగాళ్లను పంచన చేర్చుకున్న ఫ్లెమింగ్.. ఇవాళ జరిగిన వేలంలో మరో ఇద్దరు కివీస్ ఆటగాళ్లను జట్టులో చేర్చుకుని సీఎస్కేపై బ్లాక్ క్యాప్స్ మార్కు స్పష్టంగా కనిపించేలా చేశాడు. ఇవాళ జరిగిన వేలంలో సీఎస్కే మేనేజ్మెంట్ డారిల్ మిచెల్ను 14 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేయగా.. వన్డే వరల్డ్కప్ హీరో రచిన్ రవీంద్రను 1.8 కోట్లకు సొంతం చేసుకుంది. ఈ ఇద్దరితో పాటు సీఎస్కే ఇవాల్టి వేలంలో మరో భారీ కొనుగోలు చేసింది. ఆ జట్టు యాజమాన్యం శార్దూల్ ఠాకూర్ను 4 కోట్లకు సొంతం చేసుకుంది. చెన్నై సూపర్ కింగ్స్: ఎంఎస్ ధోని (కెప్టెన్), మొయిన్ అలీ, దీపక్ చాహర్, డెవాన్ కాన్వే, తుషార్ దేశ్పాండే, శివమ్ దూబే, రుతురాజ్ గైక్వాడ్, రాజవర్ధన్ హంగర్గేకర్, రవీంద్ర జడేజా, అజయ్ మండల్, ముఖేష్ చౌదరి, మతీషా పతిరణ, అజింక్య రహానే, షేక్ రషీద్, మిచెల్ సాంట్నర్, సిమర్జీత్ సింగ్, నిశాంత్ సింధు, ప్రశాంత్ సోలంకి, మహేశ్ తీక్షణ ఐపీఎల్ 2024 వేలంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లు: డారిల్ మిచెల్ (14 కోట్లు), రచిన రవీంద్ర (1.8 కోట్లు), శార్దూల్ ఠాకూర్ (4 కోట్లు) -
#MS Dhoni: ఆ ఒక్క ఫోన్ కాల్ వల్లే ఇలా! అది నిజంగా విచారకరం.. అయితే
IPL 2023 Winner CSK: వెస్టిండీస్ దిగ్గజ క్రికెటర్ డ్వేన్ బ్రావోకు చెన్నై సూపర్ కింగ్స్తో ఉన్న అనుబంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దాదాపు దశాబ్ద కాలం పాటు చెన్నై ఫ్రాంఛైజీతో కొనసాగిన బ్రావో.. జట్టు విజయాల్లో తన వంతు పాత్ర పోషించాడు. 2011లో సీఎస్కేకు తొలిసారి ప్రాతినిథ్యం వహించిన అతడు.. 2011, 2018, 2021 సీజన్లలో ధోని సేన టైటిల్ విజేతగా నిలపడంలో కీలకంగా వ్యవహరించాడు. అదే విధంగా 2014 నాటి చాంపియన్స్ లీగ్ గెలిచిన ధోని సేనలో బ్రావో సభ్యుడు కూడా! అంతేగాక క్యాష్ రిచ్లీగ్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా కూడా ఈ రైట్ ఆర్మ్ పేసర్ ముందు వరుసలో నిలిచాడు. 161 మ్యాచ్లు ఆడిన ఈ ఆల్రౌండర్ 183 వికెట్లు తీయడంతో పాటుగా.. 1560 పరుగులు సాధించాడు. సీఎస్కే బౌలింగ్ కోచ్గా ఇలా సీఎస్కేతో అనుబంధం పెనవేసుకున్న డ్వేన్ బ్రావో గతేడాది ఐపీఎల్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో అతడిని బౌలింగ్ కోచ్ నియమిస్తూ తమతోనే కొనసాగేలా చేసింది ఫ్రాంఛైజీ. ఇక సీఎస్కే ముఖచిత్రమైన కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే ఇందుకు ప్రధాన కారణం అంటున్నాడు బ్రావో. ధోని నుంచి వచ్చిన ఆ ఒక్క కాల్ వల్లే ‘‘ఎలా మొదలుపెట్టాలో అర్థం కావడం లేదు! విజయవంతమైన ఐపీఎల్ కెరీర్కు గతేడాది రిటైర్మెంట్ ప్రకటించడం నా జీవితంలో విచారకరమైన సమయం. అయితే, ఆటగాడిగా తప్పుకున్నప్పటికీ ఐపీఎల్లో కొనసాగాలని నా నుదుటి రాతలో రాసిపెట్టింది. మహేంద్ర సింగ్ ధోని.. స్టీఫెన్ ఫ్లెమింగ్ నుంచి వచ్చిన ఒ్క ఫోన్ కాల్ నన్ను కోచింగ్ స్టాఫ్లో భాగం చేసింది. నా క్రికెట్ కెరీర్లో ముందుకు సాగేందుకు ఇదే సరైన దిశ అనిపించింది. కంగ్రాట్స్ ఆ దేవుడు.. క్రికెటర్గా నాకు ప్రసాదించిన నైపుణ్యాలను ఇకపై ఎలా కొనసాగించాలా అని ఆలోచిస్తున్న సమయంలో కోచ్గా కొత్త అవతారం ఎత్తడం.. అది కూడా ఐపీఎల్ హిస్టరీలో విజయవంతమైన చరిత్ర ఉన్న జట్టుకు కోచ్గా ఉండటం అద్భుతం’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యాడు. ఈ మేరకు ఇన్స్టా వేదికగా తన మనసులోని మాటను పంచుకన్న బ్రావో.. సీఎస్కే బౌలర్లు దీపక్ చహర్, మతీశ పతిరణ, రాజ్యవర్థన్ హంగార్కర్, రవీంద్ర జడేజా తదితరులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా ఐపీఎల్-2023 విజేత చెన్నై సూపర్కింగ్స్కు విజయోత్సవాలకు సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. చదవండి: Dhoni: అత్యంత చెత్త రికార్డు.. అయినా అండగా! నన్ను సరైన మార్గంలో నడిపిస్తారని తెలుసు మధ్యలో డిస్టర్బ్ చేయడం ఎందుకో? హార్దిక్ను ఏకిపారేసిన గావస్కర్..పైగా.. View this post on Instagram A post shared by Dwayne Bravo aka SIR Champion🏆🇹🇹 (@djbravo47) -
అతడిని వదులుకున్నందుకు చాలా బాధగా ఉంది.. మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు: సీఎస్కే కోచ్
ఐపీఎల్-2023లో కోల్కతా నైట్రైడర్స్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రత్యర్ధి బ్యాటర్లకు చుక్కలు చూపిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆదివారం చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో వరుణ్ చక్రవర్తి మరో సారి తన స్పిన్ మయాజాలన్ని ప్రదర్శించాడు. తన 4 ఓవర్ల కోటాలో 36 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు పడగొట్టాడు. అతడితో పాటు సునీల్ నరైన్ కూడా కేవలం 15 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు సాధించాడు. ఈ ఏడాది సీజన్లో ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన వరుణ్.. 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు. ఇక అద్భుతంగా రాణిస్తున్న వరుణ్ చక్రవర్తిపై సీఎస్కే హెడ్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. వరుణ్ చక్రవర్తి నెట్ బౌలర్గా ఉన్నప్పుడు తీవ్ర ఇబ్బంది పెట్టేవాడని ఫ్లెమింగ్ అన్నాడు. సీసీఎస్కే, కేకేఆర్ మ్యాచ్ అనంతరం ఫ్లెమింగ్ మాట్లాడుతూ.. "వరుణ్ను వదులుకున్నందుకు మేము ఇప్పటికీ బాధపడుతున్నాం. అతడు నెట్స్ లో మమ్మల్ని టార్చర్ పెట్టేవాడు. అతడొక అద్భుతమైన మిస్టరీ స్పిన్నర్. నెట్స్లో అతడి బౌలింగ్ చూసి మేము చాలా ఆశ్చర్యపోయాం. అయితే దురదృష్టవశాత్తూ వేలంలో అతడిని మేము సొంతం చేసుకోలేకపోయాం. గతేడాది వేలంలో కూడా అతడిని దక్కించుకోవడానికి ప్రయత్నించాం. కానీ మళ్లీ అతడిని కేకేఆర్ భారీ ధరకు సొంతం చేసుకుంది. చెపాక్ వంటి స్పిన్ పిచ్లపై చక్రవర్తి మరింత అద్భుతంగా రాణించగలడు. నేటి మ్యాచ్లో కూడా చక్రవర్తి చాలా బాగా బౌలింగ్ చేశాడు" అతడు పేర్కొన్నాడు. చదవండి: అతడిని భారత జట్టులోకి తీసుకోండి.. సరిగ్గా వాడుకుంటే అద్భుతాలు సృష్టిస్తాడు -
Viral: మిస్టర్ కూల్కు ఆగ్రహం! నీకసలు బుద్ధుందా? జట్టులో నుంచి తీసిపారేయండి!
IPL 2023 CSK Vs PBKS- MS Dhoni Loses Cool: ఇండియన్ ప్రీమియర్ లీగ్లో చెన్నై సూపర్ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న శ్రీలంక బౌలర్లు మహీశ్ తీక్షణ, మతీష పతిరణ. ఐపీఎల్-2023లో సీఎస్కే ఇప్పటి వరకు ఆడిన దాదాపు అన్ని మ్యాచ్లలోనూ తుది జట్టులో వీరు చోటు దక్కించుకున్నారు. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ తమకు అప్పగించిన బాధ్యతలు నెరవేరుస్తూ.. ముందుకు సాగుతున్నారు. మిస్టర్ కూల్కు కోపం ఎందుకొచ్చింది? ఈ సీజన్లో ఇప్పటి వరకు తీక్షణ, పతిరణ ఐదేసి వికెట్ల చొప్పున తమ ఖాతాలో వేసుకున్నారు. ధోని కూడా వీరికి వరుస అవకాశాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నాడు. అయితే, పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కీలక సమయంలో తీక్షణ చేసిన తప్పు మిస్టర్ కూల్ ధోనికి కూడా కోపం తెప్పించింది. నరాలు తెగే ఉత్కంఠ చెన్నైలోని చెపాక్ వేదికగా సీఎస్కే ఆదివారం పంజాబ్ కింగ్స్తో తలపడింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ధోని సేన తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగులు చేసింది. ఇక లక్ష్య ఛేదనకు దిగిన పంజాబ్ ఆఖరి బంతి వరకు నరాలు తెగే ఉత్కంఠ రేపిన మ్యాచ్లో ఎట్టకేలకు విజయం సాధించింది. పతిరణ వేసిన చివరి ఓవర్లో ఆఖరి బంతికి పంజాబ్ బ్యాటర్లు సికిందర్ రజా, షారుక్ ఖాన్ మూడు పరుగులు పూర్తి చేసి తమ జట్టును విజయతీరాలకు చేర్చారు. చెత్త ఫీల్డింగ్ కాగా తీక్షణపై ధోని ఆగ్రహానికి కారణం ఏమిటంటే.. పంజాబ్ ఇన్నింగ్స్లో 16వ ఓవర్లో బంతిని ధోని.. తుషార్ దేశ్పాండేకు అందించాడు. ఆ సమయంలో క్రీజులో ఉన్న పవర్ హిట్టర్ లియామ్ లివింగ్స్టోన్ మొదటి రెండు బంతుల్లో సిక్సర్లు బాదాడు. ఆ తర్వాత షార్ట్ బాల్ను సంధించాడు ఫాస్ట్బౌలర్ తుషార్. దానిని పుల్షాట్ ఆడబోయిన లివింగ్స్టోన్ లెక్క తప్పడంతో బంతి బౌండరీ దిశగా పయనించింది. ఈ క్రమంలో థర్డ్మ్యాన్లో ఫీల్డింగ్ చేస్తున్న తీక్షణ బంతిని తప్పుగా అంచనా వేశాడు. బాల్ మిస్ చేశాడు.. ఏకంగా 4 పరుగులు క్యాచ్ అందుకోవడానికి విఫలయత్నం చేశాడు. అనవసరంగా ముందుకు డైవ్ చేసి బాల్ను మిస్ చేశాడు. బంతి బౌండరీని తాకడంతో పంజాబ్కు నాలుగు పరుగులు వచ్చాయి. ఈ నేపథ్యంలో కోపోద్రిక్తుడైన ధోని.. మిస్ ఫీల్డింగ్ చేసిన మహీశ్ తీక్షణపై ఫైర్ అయ్యాడు. జట్టు నుంచి తీసిపారేయండి అసలేం ఏం చేస్తున్నావో అర్థం అవుతోందా? అన్నట్లు సీరియస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. డగౌట్లో ఉన్న కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ సైతం తీక్షణ చేసిన పనికి గుస్సా అయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘నీకసలు బుద్ధుందా? బౌలింగ్ అంతంత మాత్రమే. చెత్త ఫీల్డింగ్. జట్టులో నుంచి తీసిపారేయండి’’ అని కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ మ్యాచ్లో మహీశ్ తీక్షణ 4 ఓవర్ల బౌలింగ్ కోటా పూర్తి చేసి 36 పరుగులు సమర్పించుకున్నాడు. చదవండి: MI Vs RR: గ్రహణం వీడింది..! అతడు భవిష్యత్ సూపర్స్టార్.. నో డౌట్! ఆసియా కప్ రద్దు? పాక్కు దిమ్మతిరిగే షాక్.. బీసీసీఐ మాస్టర్ ప్లాన్!? pic.twitter.com/iAB4MTdg4p — CricDekho (@Hanji_CricDekho) April 30, 2023 𝙎𝙈𝙊𝙊𝙏𝙃 𝙖𝙨 𝙚𝙫𝙚𝙧 😎@imjadeja & @msdhoni combine to get Prabhsimran Singh OUT! Follow the match ▶️ https://t.co/FS5brqfoVq#TATAIPL | #CSKvPBKS pic.twitter.com/1qS9t5DJ8k — IndianPremierLeague (@IPL) April 30, 2023 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4381453179.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } });
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
టీమిండియా టీ20 వరల్డ్ కప్ జెర్సీ లీక్.. ఫోటోలు వైరల్
పాఠశాల నేపథ్యంలో వస్తోన్న సత్య.. ఆసక్తిగా ట్రైలర్!
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (06-05-2024)
Video: కేసీఆర్ బస్సును తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు
'దేవర' షూటింగ్లో తేనెటీగల కలకలం.. 20 మందికి గాయాలు
ఎస్ఆర్హెచ్తో ముంబై కీలక పోరు.. కొత్త ప్లేయర్ ఎంట్రీ
వారితో భయంకరమైన అనుభవాలు ఎదుర్కొన్నా: హీరామండి నటి
కేజ్రీవాల్కు మరో షాక్.. ‘ఎల్జీ’ సంచలన నిర్ణయం
మచిలీపట్నం: జననేత కోసం కదిలి వచ్చిన జనసంద్రం (ఫోటోలు)
గాలివానలో చిక్కుకున్న హెలికాఫ్టర్.. నవీన్ పట్నాయక్కు తప్పిన ప్రమాదం
తప్పక చదవండి
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- సూపర్ మచ్చీ.. ఇలాంటి గ్రూపు డ్యాన్స్ మీరెపుడైనా చూశారా?
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- ‘SRH కాదు.. పరుగుల విధ్వంసానికి మారు పేరు ఆ జట్టే’
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- అందుకేనా అమిత్ షా అలా మాట్లాడింది!
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement