-
చంద్రబాబు మోసాలతో పోటీ పడలేం: సీఎం జగన్
సాక్షి, వెంకటాచలంపల్లి: రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలులేని, విశ్వసనీయతలేని రాజకీయాలు వచ్చేశాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నాను అని అన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. చంద్రబాబుకు అవ్వాతాతల మీద ప్రేమే లేదన్నారు. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే అని సూచించారు. కాగా, సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర పదకొండో రోజు ప్రకాశం జిల్లాలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా సీఎం జగన్ అక్కడ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతూ..‘గత ప్రభుత్వంలో ఎంత మందికి పెన్షన్ వచ్చేది. అప్పట్లో పెన్షన్ ఎంత వచ్చేదో మీకు గుర్తుందా?. కొన్ని విషయాలు ఆలోచించాలని అవ్వాతాతలను కోరుతున్నాను. గత ఎన్నికలకు ఆరు నెలల ముందు వరకు 39 లక్షల మందికి మాత్రమే పెన్షన్ వచ్చేది. మీ బిడ్డ ప్రభుత్వంలో 66 లక్షల మందికి పెన్షన్ ఇస్తున్నాం. ఇప్పుడు మీ బిడ్డ ప్రభుత్వంలో వచ్చిన మార్పు గమనించండి. అవ్వాతాతలు పెన్షన్ కోసం అవస్థలు పడకూడదనేది నా కోరిక. అవ్వాతాతల ఆత్మగౌరవం గురించి నేను ఆలోచన చేశాను. దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చాం. వాలంటీర్లతో నేరుగా అవ్వతాతల ఇంటికే పెన్షన్ పంపించాం. 56 నెలలుగా మన ప్రభుత్వం ప్రతీ నెల ఒకటో తేదీన ఉదయమే పెన్షన్ అందించాం. గత ప్రభుత్వం అరకొరగా పెన్షన్ ఇస్తూ ఉంటే దానిని మార్పు చేశాం. అర్హత ఉంటే చాలు ప్రతీ ఒక్కరికీ పెన్షన్ అందించాం. ప్రతీ గ్రామంలో ఒక సచివాలయం ఏర్పాటు చేశాం. చంద్రబాబు ఏ ఒక్కరోజు కూడా మీ బిడ్డలాగా అవ్వాతాతల గురించి ఆలోచన చేయలేదు. అవ్వాతాతల గురించి పట్టించుకోవాలంటే ప్రేమ ఉండాలి. 14 ఏళ్లు సీఎంగా చేశానని చంద్రబాబు చెబుతుంటారు. ఏ రోజైనా చంద్రబాబు మీ గురించి ఆలోచన చేశాడా?. రాజకీయాలు ఇప్పుడు పాతాళానికి వెళ్లిపోయాయి. విలువలులేని విశ్వసనీయతలేని రాజకీయాలు వచ్చేశాయి. వీటిని మార్చేందుకు మీ బిడ్డగా అడుగులు ముందుకు వేస్తున్నాను. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారు. ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేశారు. మీ బిడ్డకు అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం రాదు. చంద్రబాబు, వారి కూటమిలా నొటికొచ్చిన అబద్ధాలు చెప్పలేను. మీ బిడ్డ ఏదైనా చెప్పాడంటే చేసి చూపిస్తాడు. జనాభా ప్రకారం అత్యధిక పెన్షన్లు ఇస్తున్న రాష్ట్రం మనదే. రూ.3వేలు ఇస్తున్న రాష్ట్రం దేశంలో ఎక్కడా లేదు. నెలకు రూ.2వేల కోట్లు పెన్షన్లలకే ఇస్తున్నాం. చంద్రబాబు మోసం చేసేందుకు ఎంతైనా ఇస్తానంటాడు జాగ్రత్తగా ఉండాలి. మీ బిడ్డ ప్రభుత్వంలో 99 శాతం హామీలను అమలు చేశాం. రంగు రంగుల హామీలతో వస్తున్న చంద్రబాబును నమ్మెదు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీలను అసలు నమ్మకండి. చంద్రబాబుకు ఓటు వేస్తే పులి నోట్లో తల పెట్టినట్లే’ అని అన్నారు. -
అప్పుడు దేవుడన్నారు.. ఇప్పుడు వద్దంటున్నారు!
వాడుకోవడం.. వదిలేయడం అనే కామెంట్ వినిపిస్తే వెంటనే గుర్తుకొచ్చే పేరు నారా చంద్రబాబు. పచ్చ పార్టీ అధినేతగా వెన్నుపోటుకు బ్రాండ్ అంబాసిడర్గా పేరుపొందారు చంద్రబాబునాయుడు. ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఓ నియోజకవర్గంలో కూడా ఇదే సీన్ కనిపిస్తోంది. అక్కడ నాలుగేళ్ళుగా పార్టీని నడిపించిన నేతకు చెక్ పెడుతున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా మా ఇన్చార్జ్ దేవుడు అన్న కొందరు నేతలు ఇప్పుడు ఆయన వద్దని డిమాండ్ చేస్తున్నారట. అసలు ఆ నేత ఎవరు? ఆ నియోజకవర్గం ఎక్కడుంది? ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు నియోజకవర్గానికి ఓ రాజకీయ ప్రత్యేకత ఉంది. ఇక్కడ కమ్మ సామాజికవర్గం ఓట్లు అధికంగా ఉండటంతో సహజంగానే తెలుగుదేశం పార్టీలో టిక్కెట్ పోటీ ఎక్కువగానే కనిపిస్తుంది. ఇక్కడి నుంచి టీడీపీ తరపున 2014లో గెలిచిన పోతుల రామారావు 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ హవాలో ఓడిపోయారు. ఎన్నికల్లో ఓడిపోగానే పోతుల రామారావు ఒక్కసారిగా రాజకీయాలకు దూరం జరిగారు. టీడీపీ కార్యక్రమాల్లో ఎక్కడా కనిపించడంలేదు. దీంతో ఆయన స్థానంలో ఇంటూరి నాగేశ్వరరావును కందుకూరు ఇన్చార్జ్గా టీడీపీ అధినేత చంద్రబాబు నియమించారు. అప్పటి నుండి నియోజకవర్గంలో టీడీపీకి కొత్త తలనొప్పులు ప్రారంభం అయ్యాయి. కందుకూరులో కచ్చితంగా ఏడాది క్రితం చంద్రబాబు నిర్వహించిన సభలో తొమ్మిది మంది చనిపోవడంతో చంద్రబాబు సభలంటే ప్రజలలో ఒకరకమైన భయం ఏర్పడింది. కందుకూరులో సభ ఏర్పాట్లపై ఇంటూరి నిర్లక్ష్యం, తప్పిదాల వల్లే తొక్కిసలాట జరిగిందంటూ పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ ఇన్చార్జ్గా ఉన్న ఇంటూరికి బాబాయి కొడుకు ఇంటూరి రాజేష్ రూపంలో అసమ్మతి వర్గం ఏర్పడింది. సొంత కుటుంబంలోనే ఏర్పడిన అసమ్మతిని తగ్గించుకోవడంలో ఇంటూరి నాగేశ్వరరావు విఫలం అయ్యారని కార్యకర్తలే అంటున్నారు. వివాదరహితుడిగా పేరున్న ఇంటూరి నాగేశ్వరరావుని ఆ పార్టీలోని రెండో వర్గమే వివాదాస్పదుడిగా చిత్రీకరించిందని ఆయన వర్గం మండిపడుతోంది. నాలుగు సంవత్సరాలపాటు తనతో డబ్బు ఖర్చుపెట్టించి ఎన్నికలు వచ్చేసరికి తనకు టిక్కెట్ దక్కకుండా చేయాలనే దుష్ప్రచారం ప్రారంభించారని ఇంటూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇంటూరి నాగేశ్వరరావుకు పార్టీలోను, సొంత కుటుంబంలోనూ సవాళ్లు ఎదురవుతున్నాయి. బాబాయి కొడుకు ఇంటూరి రాజేష్, మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుతో కలిసి తన వ్యతిరేక వర్గంగా ఏర్పడటాన్ని నాగేశ్వరరావు వర్గీయులు జీర్నించుకోలేకపోతున్నారు. కొత్తగా తెలుగుదేశం పార్టీలో చేరిన బిజేపి మహిళా మోర్చా అద్యక్షురాలు ఉన్నం నళినీదేవి పార్టీలో సీనియర్ నాయకుడుగా ఉన్న మాజీ ఎమ్మెల్యే దివి శివరామ్ కలిసి మరో వర్గంగా ఏర్పడటం కూడా నాగేశ్వరరావుకు మింగుడు పడటంలేదు. వాడుకొని వదిలేసే అలవాటు ఉన్న తమ పార్టీ అధినేత చంద్రబాబు..ఇప్పుడు ఇంటూరి నాగేశ్వరరావుని వదిలించుకోవడానికే బీజేపీ నుంచి నళినీదేవిని పార్టీలోకి తీసుకున్నారని తెలుగుతమ్మళ్లే చెబుతున్నారు. అందుకే కొంతమంది కార్యకర్తలను ఉసిగొల్పి నాగేశ్వరరావుకు వ్యతిరేకంగా ప్రచారం చేయిస్తున్నారనే టాక్ నడుస్తోంది. చంద్రబాబు యూజ్ అండ్ త్రో విధానానికి కందుకూరులో ఇంటూరి నాగేశ్వరరావు బలవుతున్నారని రాజకీయ విశ్లేషకులు కామెంట్ చేస్తున్నారు. ఇంటూరితో నాలుగు సంవత్సరాల పాటు పార్టీ కోసం ఖర్చు పెట్టించి ఇప్పుడు పక్కన పెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తోంది. మరి టిక్కెట్ రాకపోతే ఇంటూరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. -
కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్
సాక్షి, ప్రకాశం జిల్లా: కనిగిరిలో చంద్రబాబు సభ అట్టర్ ప్లాప్ అయ్యింది. భారీగా జనం వస్తారని ఆశ పడ్డ టీడీపీకి నిరాశే ఎదురైంది. ఊహించిన రీతిలో సభ సక్సెస్ కాకపోవడంతో టీడీపీ నేతలు షాక్ తిన్నారు. చంద్రబాబు ప్రసంగం కొనసాగిస్తుండగానే జనం కుర్చీలు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఖాళీ కుర్చీలు ఎదురుగా దర్శనమిస్తున్నప్పటికీ తన ప్రసంగాన్ని చంద్రబాబు కొనసాగించారు. తన పాత స్టైల్లోనే వెలిగొండ ప్రాజెక్టుకు తానే శిలా ఫలకం వేశానని, తానే ప్రారంభిస్తానంటూ ఊదరగొట్టారు. పశ్చిమ ప్రకాశంలోని మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు, కనిగిరి నియోజకవర్గాలంటే చంద్రబాబుకు ముందు నుంచి చిన్నచూపు. తాగునీటికి, సాగునీటికి రైతులు, ప్రజలు అవస్థలు పడుతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాల్లేవు. అధికారంలో ఉన్న ఐదేళ్లు పశ్చిమ ప్రకాశం వైపు చంద్రబాబు కన్నెత్తి చూడలేదు. డివిజన్ కేంద్రమైన మార్కాపురం పట్టణానికి రెండో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, పొదిలి పెద్దచెరువుకు సాగర్ నీటి సరఫరా, వైద్యశాల అభివృద్ధిపై ఎమ్మెల్యేలు అడిగినా వారిపై కన్నెర్రచేశారు. ఆయన పాలనలో ఈ ప్రాంతమంతా దుర్భిక్షంగా మారింది. 2019లో అధికారంలోనికి వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెలిగొండ ప్రాజెక్టుకు నిధులు కేటాయించడంతో పాటు, మార్కాపురానికి రూ.475 కోట్లతో మెడికల్ కాలేజీ మంజూరు చేయడం, రూ.720 కోట్లతో వెలిగొండ ప్రాజెక్టు నీటిని అన్నీ గ్రామాలకు అందించే ఇన్టెక్వెల్ ప్రాజెక్టు పనులు ప్రారంభించడం, జిల్లా వైద్యశాలలో అభివృద్ధితో పాటు, ఏడుగురు ఉన్న డాక్టర్ పోస్టులను 34 మందికి పెంచారు. 100 బెడ్లను 330 బెడ్ల స్థాయికి పెంచడంతో ఇప్పుడిప్పుడే పశ్చిమ ప్రకాశం అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఇదీ చదవండి: కేశినేని నాని సంచలన వ్యాఖ్యలు -
కన్నీళ్లు పెట్టుకున్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి
సాక్షి, ప్రకాశం జిల్లా: తనపై కొద్ది రోజులుగా పనిగట్టుకుని ఆరోపణ చేస్తున్నారని, రాజకీయంగా తనను హింసించడమే ధ్యేయంగా కొన్ని శక్తులు పని చేస్తున్నాయని ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఒంగోలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ, వైఎస్సార్ మరణం తర్వాత పార్టీని అంటిపెట్టుకొని ఉన్నానని అయినా తనపైన నిత్యం బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని బాలినేని వాపోయారు. హవాలా కుంభకోణం నుంచి భూ కుంభకోణం దాకా అన్నీ నా మీద రుద్ది ఒక పద్ధతి ప్రకారం అభాసుపాలు చేస్తున్నారని బాలినేని మీడియా ముందు కంటతడి పెట్టుకున్నారు. తనను తన కుమారుడిని రాజకీయంగా వేధించడమే పనిగా పెట్టుకున్నారని ఎవరు ఏం చేసినా తాను వైఎస్సార్సీపీ పార్టీ కార్యకర్తల కోసం ఏ త్యాగానికైనా సిద్ధమేనని బాలినేని స్పష్టం చేశారు. పార్టీలో బాధ్యత గల వ్యక్తిగా తను ఒకరి గురించి మాట్లాడనని బాలినేని అన్నారు. చదవండి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్సిగ్నల్ -
‘చంద్రబాబు వీధి రౌడీ మాదిరిగా వ్యవహరిస్తున్నారు’
సాక్షి, తాడేపల్లి : ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారని మంత్రి మేరుగ నాగార్జున మండిపడ్డారు. చంద్రబాబుకు దళితులపై ఎందుకంత కక్ష్య అని ప్రశ్నించారు మంత్రి మేరుగ. ‘ నిన్న చంద్రబాబు వీధి రౌడీలా వ్యవహరించారు. ఎన్ని అఘాయిత్యాలు చేయాలనుకున్నారో చూశాం. దళితులపై ఎలా దాడులు చేయించారో చూశాం. చంద్రబాబు కూసాలు కదులుతున్నాయని దిక్కులేక రోడ్డున పడ్డారు. తండ్రి, కొడుకులు బరితెగించిన రాక్షసులు. దళితుల్లో ఎవరైనా పుట్టాలని కోరుకుంటారా? అన్నారు. దళితులు ఏం పీకుతారు? అని లోకేష్ అన్నాడు. అనలేదని కుటుంబం మీద ఒట్టేసి చెప్పగలవా?, అమలాపురంలో కూడా దళితుల ఇళ్లపై దాడులు చేయించారు. మా దళితులపై ఎందుకంత కక్ష? , మమ్మల్ని అవమానించిన చంద్రబాబును రాజకీయంగా భూస్థాపితం చేస్తాం. ఒళ్లు దగ్గర పెట్టుకుని రాజకీయాలు చేయమని హెచ్చరిస్తున్నాం. అంబేద్కర్ విగ్రహాన్ని ముళ్లపొదల్లో పడేయించిన వ్యక్తి చంద్రబాబు. సీఎం జగన్ 125 అడుగుల ఎత్తుతో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టిస్తున్నారు. అదీ జగన్కి దళితులపై ఉన్న ప్రేమ. రాజధానిలో దళితులు ఉండకూడదని అడ్డుకున్న వ్యక్తి చంద్రబాబు. వచ్చే ఎన్నికల్లో వైఎఎస్సార్సీపీకి 24 నుంచి 25 ఎంపీ సీట్లు వస్తాయని సర్వేలో తేలటంతో చంద్రబాబుకు వణుకు పుట్టింది.అందుకే దాడులకు పాల్పడుతున్నారు. మావాళ్లపై రాళ్లతో దాడి చేశారు.కుట్రలు చేయటంలో చంద్రబాబు సిద్దహస్తుడు’అని ధ్వజమెత్తారు మంత్రి మేరుగ నాగార్జున
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
Advertisement