చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారు?: మంత్రి బాలినేని
కష్టకాలంలో దాక్కుని.. ఇప్పుడు దొంగ దీక్షలా..
చంద్రబాబుపై మంత్రి బాలినేని ఫైర్
సాక్షి, ప్రకాశం జిల్లా: కరోనా కష్టకాలంలో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఎక్కడ దాక్కున్నారని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కష్టకాలంలో దాక్కుని ఇప్పుడు దొంగ దీక్షలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం అమలు చేస్తోన్న సంక్షేమ పథకాలు ప్రజలకు సక్రమంగా అందుతున్నాయని.. వాటిని పక్కదారి పట్టించడానికే చంద్రబాబు డ్రామాలాడుతున్నారని ధ్వజమెత్తారు. జడ్పీటీసీ ఎన్నికలను బహిష్కరించినప్పుడే ప్రతిపక్షం పోయిందన్నారు. టీడీపీని బీజేపీలో విలీనం చేయడం మంచిదని మంత్రి బాలినేని ఎద్దేవా చేశారు.