
సాక్షి, ప్రకాశం: సీఎం జగన్ ముఖ్యఅతిథిగా పాల్గొన్న చీమకుర్తి విగ్రహావిష్కరణ సభలో సరదా సన్నివేశం జరిగింది. జిల్లా జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ ప్రసంగ సమయంలో.. విగ్రహావిష్కరణ కార్యక్రమానికి హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం.. ఆమె మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డిని ఉద్దేశిస్తూ.. పాట పాడడంతో అభిమానుల కోలాహాలం నెలకొంది.
అయితే సభా సమయం మించి పోతుండడంతో ఆమెను వచ్చి కూర్చోవాలంటూ సైగ చేశారు సీఎం జగన్. అయినా ఆమె వినిపించుకోకపోవడంతో.. స్వయంగా ఆయనే వెళ్లి అమ్మా అని పిలుచుకునే వెంకాయమ్మను వెంటపెట్టి తీసుకొచ్చి తన పక్కన కూర్చోబెట్టుకున్నారు.