ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో వైఎస్ జగన్ భేటీ
పలు కీలక అంశాలపై దిశానిర్దేశం
సాక్షి,అమరావతి: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన బుధవారం ఉదయం 10.30 గంటలకు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశం జరగనుంది.
ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై వైఎస్ జగన్ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.


