సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ శాసనసభా పక్షం రేపు)బుధవారం) భేటీ కానుంది. ఈ సమావేశానికి మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ హాజరుకానున్నారు.
ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో తాజా రాజకీయ పరిణామాలు, డీఎస్సీలో జరిగిన అవతవకలు, అక్రమాలకు సంబంధించిన భవిష్యత్ కార్యాచరణతో పాటు ప్రజా సమస్యలపై చర్చించనున్నారు. మండలి సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై నాయకులకు వైఎస్ జగన్ దిశానిర్దేశం చేయనున్నారు.


