సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన మరికాసేపట్లో తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులతో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలు, ప్రజా సమస్యలు, పార్టీ చేపట్టాల్సిన తదుపరి కార్యక్రమాలు తదితర కీలక అంశాలపై వైఎస్ జగన్ చర్చించి, దిశానిర్దేశం చేయనున్నారు.


