breaking news
PPP
-
‘తెల్ల’బోయిన ప్రభుత్వ వైద్యం
సాక్షి, అమరావతి: దేశంలోని చిన్న రాష్ట్రాలు సైతం ప్రభుత్వ వైద్య కళాశాలల ఏర్పాటులో రికార్డులు సృష్టిస్తూ ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తుంటే.. ఏపీలో మాత్రం అందుకు భిన్నంగా ప్రభుత్వ వైద్యరంగాన్ని ప్రైవేట్పరం చేసే కుట్రలు సాగుతూనే ఉన్నాయి. గత వైఎస్ జగన్ ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత వైద్య విద్యను, సామాన్యుడికి ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని అందించే లక్ష్యంతో ప్రతిష్టాత్మకంగా 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని చేపట్టింది. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం వీటిలో ఏకంగా 10 కళాశాలలను పీపీపీ విధానం పేరిట కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు కట్టబెడుతుండటం తీవ్ర చర్చనీయాంశంగా మారిన తరుణంలో నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) విడుదల చేసిన నివేదిక ఏపీలోని ప్రభుత్వ వైద్యరంగం దుస్థితిని బట్టబయలు చేసింది.ఏపీకంటే తెలంగాణ మిన్నఎన్ఎంసీ 2026–27 విద్యా సంవత్సర సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం.. జనాభాపరంగా ఏపీ కంటే చిన్నదైన తెలంగాణలో ప్రతి 10 లక్షల జనాభాకు 116 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లు, హిమాచల్ప్రదేశ్లో 96 సీట్లు ఉంటే.. ఏపీలో ఆ సంఖ్య కేవలం 66 సీట్లకే పరిమితమై హిమాచల్ కంటే హీనమైన స్థితికి చేరుకుంది. తెలంగాణ, తమిళనాడు లేదా దేశంలోనే అత్యంత వెనుకబడిన ఛత్తీస్గఢ్, నాగాలాండ్ వంటి రాష్ట్రాల్లో ఎక్కడా లేనివిధంగా.. ఏపీలో ఎకరం భూమిని కేవలం రూ.100 లీజుకు ఇస్తూ.. ప్రజల నుంచి వైద్య సేవలకు డబ్బు వసూలు చేసుకునేలా ప్రైవేట్ శక్తులకు ప్రజా సంపదను ధారాదత్తం చేస్తున్నారు. బాబు సర్కార్ తీసుకున్న ఈ వివాదాస్పద నిర్ణయాల వల్ల రాష్ట్ర విద్యార్థులు ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లను కోల్పోతుండగా.. ప్రతిభావంతులైన నిరుపేద, మధ్యతరగతి విద్యార్థుల డాక్టర్ కలలు కల్లలవుతున్నాయి. మరోవైపు సామాన్యుడికి ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారుతోంది.ఎన్ఎంసీ విడుదల చేసిన సీట్ మ్యాట్రిక్స్ ప్రకారం..⇒ రాష్ట్రాల వారీగా ప్రతి 10 లక్షల జనాభాకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్ల వివరాలను పరిశీలిస్తే ఏపీ ఇతర రాష్ట్రాల కంటే చాలా వెనుకబడి ఉంది.⇒ తెలంగాణలో 36 ప్రభుత్వ వైద్య కళాశాలలు ఉండగా.. వీటిలో 4,400 సీట్లు ఉన్నాయి. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు 116 సీట్లు అందుబాటులో ఉన్నాయి.⇒ జమ్మూ, కశ్మీర్లో 10 ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 1,525 సీట్లు ఉన్నాయి. అక్కడ ప్రతి 10 లక్షల జనాభాకు 112 సీట్లు అందుబాటులో ఉన్నాయి.⇒ హిమాచల్ప్రదేశ్లో 6 ప్రభుత్వ వైద్య కళాశాలల ద్వారా సీట్లు అందుబాటులో ఉన్నాయి. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు 96 సీట్లు అందుబాటులో ఉన్నాయి.⇒ ఏపీలో 5.3 కోట్ల జనాభాకు 19 ప్రభుత్వ వైద్య కళాశాలలు మాత్రమే ఉన్నాయి. ఇందులో 3,515 సీట్లు ఉన్నాయి. అంటే ప్రతి 10 లక్షల జనాభాకు కేవలం 66 సీట్లు మాత్రమే ప్రభుత్వం ద్వారా అందుబాటులో ఉన్నాయి.పీపీపీ విధానంతో సీట్ల నష్టం ఇలావైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించాలని ప్రతిపాదించి.. పనులు కూడా ప్రారంభించారు. ఆ పనులు వివిధ దశల్లో ఉండగా.. చంద్రబాబు గద్దెనెక్కారు. ఆ వెంటనే ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని ప్రైవేటుకు అప్పగించారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం 10 కళాశాలలను పీపీపీ (ప్రైవేట్ పార్టనర్షిప్) విధానంలోకి మారుస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో గత రెండేళ్లలో రాష్ట్ర విద్యార్థులు పెద్ద సంఖ్యలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లను కోల్పోయారు. 2024–25 విద్యా సంవత్సరంలో 700 సీట్లు, 2025–26 విద్యా సంవత్సరం 1,750 సీట్ల చొప్పున రెండేళ్లలో ఏపీ విద్యార్థులు 2,450 ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లను నష్టపోవాల్సి వచ్చింది. మరోవైపు 2026–27 విద్యా సంవత్సరంలో ఎన్ఎంసీ దేశంలో ఈ విద్యా సంవత్సరానికి కొత్తగా 7 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతులు ఇచ్చింది. వీటిలో ఏకంగా 4 కళాశాలలు ఒక్క ఛత్తీస్గఢ్ నుంచే అనుమతి పొందాయి. ఏపీకి సంబంధించి జగన్ హయాంలో నిర్మించిన ఒక్క పిడుగురాళ్ల ప్రభుత్వ వైద్య కళాశాలకు మాత్రమే ఈ ఏడాది అనుమతి లభించింది. -
ప్రైవేటుకు ‘సంజీవని’.. సర్కారు వైద్యానికి సమాధి
సాక్షి, అమరావతి: సర్కారు వైద్యానికి చంద్రబాబు సమాధి కడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం (పీపీపీ) మోజులో ప్రైవేటుకు ప్రజాధనాన్ని దోచి పెడుతున్నారు. ఇప్పటికే రెండేళ్లలో గత ప్రభుత్వం అభివృద్ధి చేసిన వైద్యవనరులను నిర్వీర్యం చేసిన చంద్రబాబు తాజాగా పక్క రాష్ట్రాల్లో ఘోరంగా విఫలమైన కార్యక్రమాలను ఏపీ ప్రజల నెత్తిన రుద్దుతున్నారు. గతేడాది జూలైలో ప్రైవేట్ భాగస్వామ్యంతో తన సొంత జిల్లా చిత్తూరులో ప్రారంభించిన సంజీవని కార్యక్రమంలో గతంలో కర్ణాటకలో విఫలమైన ప్రోగ్రామే. త్వరలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమలుకు ఇటీవల క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇందుకోసం మొదటి ఏడాది రూ.149 కోట్లు, తర్వాతి ఏడాది నుంచి రూ.55.5 కోట్లు వెచ్చించబోతున్నట్టు ప్రకటించింది. ఇప్పటికే కుప్పం, చిత్తూరు జిల్లాల్లో పైలట్ కార్యక్రమం కోసం రూ.10 కోట్ల వరకూ ప్రభుత్వం ఖర్చుచేసింది. 2029 నాటికి ఏకంగా రూ.260 కోట్ల మేర ప్రైవేట్ సంస్థకు దోచిపెట్టేందుకే నీకింత–నాకింత సూత్రంతో ఈ విఫల ప్రాజెక్టును చంద్రబాబు ఏపీ ప్రజల నెత్తిన రుద్దుతున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. వద్దని విరమించుకున్న కన్నడ సర్కార్ పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ప్రైవేట్ భాగస్వామ్యంతో 2017లో ‘డిజిటల్ నెర్వ్ సెంటర్’ (డీఐఎన్సీ(డింక్) కార్యక్రమాన్ని సిద్ధరామయ్య సర్కారు మొదలు పెట్టింది. తొలుత పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసింది. అయితే ఆ కార్యక్రమం ఘోరంగా విఫలం కావడంతో అప్పటి ప్రభుత్వం అడుగు ముందుకేయలేకపోయింది. ఇదే సందర్భంలో దేశంలో డిజిటల్ వైద్య సేవలను బలోపేతం చేస్తూ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్(ఏబీడీఎం), ఈ–సంజీవని వంటి కార్యక్రమాలను కేంద్ర ఆరోగ్య శాఖ ప్రారంభించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా ఒక ప్రత్యేక నెట్వర్క్ను నడపడం కంటే, కేంద్రం అందించే నిధులతో ప్రభుత్వ రంగంలోనే ఆరోగ్య సేవలను అభివృద్ధి చేయాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే దీనిని సంజీవని అంటూ మన రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం వైద్యవర్గాలనే విస్మయపరుస్తోంది. గత ప్రభుత్వం నుంచే అమలు వాస్తవానికి సంజీవని కార్యక్రమం గతంలో వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ రంగంలోనే దిగ్విజయంగా అమలైన కార్యక్రమమే. అప్పట్లో టెలీ మెడిసిన్ ద్వారా రోగులకు స్పెషలిస్ట్ వైద్యుల కన్సల్టేషన్ సేవలను వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రారంభించింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికే రాష్ట్రంలోని 85 శాతం మేర పౌరులకు ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ అకౌంట్లు (ఆభా) రూపొందించారు. అంతేకాకుండా పౌరులందరికీ స్క్రీనింగ్ చేసి, ఆరోగ్య వివరాలను డిజిటల్ హెల్త్ అకౌంట్స్లో నిక్షిప్తం చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పథకం కింద పొందిన చికిత్సల వివరాలన్నింటినీ కూడా డిజిటలైజ్ చేశారు. ఏబీడీఎం, టెలీ మెడిసిన్ సేవల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో నిలిచి అనేక సందర్భాల్లో కేంద్ర ప్రభుత్వ కితాబు పొందింది. మిగిలిన రాష్ట్రాలన్నింటికీ ఏపీ ఆదర్శం అంటూ పలు సందర్భాల్లో కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఇలా 2024 నాటికే ఎంతో కీలకమైన ప్రీవెంటివ్ కేర్లో గ్రామ స్థాయిలో సమర్థ వ్యవస్థ ప్రభుత్వ రంగంలో ఉంది. దీనంతటిని నిర్వీర్యం చేస్తూ చంద్రబాబు పీపీపీ పేరిట విఫలమైన కార్యక్రమాన్ని మళ్లీ భుజానికి ఎత్తుకోవడం గమనార్హం. ప్రజల సమాచార గోప్యతకు ముప్పు ఏబీడీఎం కార్యక్రమాన్ని నేరుగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ప్రజల ఆరోగ్య భద్రత, వ్యక్తిగత వివరాలు, గోప్యతకు ఏ మాత్రం భంగం వాటిల్లకుండా నేషనల్ హెల్త్ అథారిటీ(ఎన్హెచ్ఏ) అత్యంత సేఫ్ అండ్ సెక్యూర్గా సాఫ్ట్వేర్లను రూపొందించి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఇంతటి పటిష్టమైన వ్యవస్థను కాదని సంజీవని పేరిట ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో రాష్ట్ర ప్రజల డేటాను చంద్రబాబు పెడుతున్నారు. ఇది ప్రజల ఆరోగ్య భద్రత, వ్యక్తిగత గోప్యతకు అత్యంత ముప్పు తెచ్చే అంశమని వైద్య వర్గాల్లో చర్చ నడుస్తోంది. చిన్నారులపై వికృత లైంగిక దాడులకు సంబంధించిన ఎప్స్టిన్ ఫైల్స్లో ఆరోపణలు ఎదుర్కొన్న మైక్రోసాఫ్ట్ అధ్యక్షుడు బిల్గేట్స్కు చెందిన గేట్స్ ఫౌండేషన్ కూడా బాబు సంజీవని కార్యక్రమంలో భాగస్వామిగా ఉంది. ఈ క్రమంలో బిల్గేట్స్ను ఈఏడాది ఫిబ్రవరి నెలలో రాష్ట్రానికి పిలిపించి చంద్రబాబు హడావుడి చేశారు. వాస్తవానికి హెల్త్కేర్ రంగంలో టెలీ కన్సల్టేషన్లు, ఇతర డిజిటల్ హెల్త్ సేవలు అందిస్తున్న ప్రైవేట్ సంస్థలు సైతం ఎన్హెచ్ఏతో కలిసి పనిచేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వమే నేరుగా నిర్వహిస్తున్న కార్యక్రమం కావడంతో భద్రత పరమైన ఇబ్బందులు తలెత్తవు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఏబీడీఎం అమలుకు జై కొడుతుంటే బాబు మాత్రం ప్రైవేట్పై మోజు చూపడం గమనార్హం.వైఎస్ జగన్ ప్రభుత్వంలోనే మైల్ స్టోన్స్» ప్రైవేట్ వ్యక్తుల ప్రమేయం లేకుండా దేశంలోనే అత్యంత సమర్థంగా డిజిటల్ హెల్త్, టెలి మెడిసిన్ సేవలను బలోపేతం చేస్తూ వైఎస్ జగన్ ప్రభుత్వం గతంలోనే పలు చర్యలు తీసుకుంది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా గిరిజన, మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ వైద్య సేవలను చేరువ చేస్తూ 2,500 జనాభాకు ఒకటి చొప్పున 10,032 విలేజ్ క్లినిక్స్ను నెలకొల్పింది. » మరోవైపు స్మార్ట్ఫోన్ ఉన్నవారు ఈ సంజీవని (ఓపీడీ) యాప్ ద్వారా ఇంటి నుంచే వైద్య సేవలు పొందడానికి ఆస్కారం కల్పించారు. స్మార్ట్ఫోన్ లేనివారు ఆశా వర్కర్లు సహాయపడ్డారు. ఇందుకోసం రాష్ట్రంలోని 42 వేల మంది ఆశా వర్కర్లకు నాటి ప్రభుత్వం స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసి, వాటన్నింటినీ హబ్లకు అనుసంధానించింది. » రాష్ట్ర వ్యాప్తంగా వైద్య కళాశాలలు, జిల్లా ఆస్పత్రుల్లో 27 హబ్లను వైఎస్ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ హబ్లకు 1,400కు పైగా పీహెచ్సీలు, 562 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 10,032 విలేజ్ క్లినిక్లను అనుసంధానించింది. ఒక్కో హబ్లో ఇద్దరు జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పీడియాట్రిక్స్ లాంటి స్పెషలిస్ట్ వైద్యులతో పాటు ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సేవలు అందుబాటులో ఉంచింది. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్కు వచ్చిన రోగులకు స్పెషాలిటీ వైద్యుల సేవలు అవసరమైన సందర్భాల్లో టెలి మెడిసిన్ ద్వారా హబ్లోని వైద్యులను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స అందించింది. హబ్లోని వైద్యులు ఆడియో, వీడియో కాల్ ద్వారా రోగులతో మాట్లాడి ప్రిస్క్రిప్షన్ సూచించేవారు. పీహెచ్సీ, విలేజ్ క్లినిక్లోని వైద్య సిబ్బంది ఈ మందులను రోగులకు అందజేసే యంత్రాంగం అప్పట్లో పని చేసింది. » 2019 నుంచి 2023 డిసెంబర్ నాటికి దేశ వ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే, ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా అందులో 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ అంశాన్ని అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్లో ప్రకటించింది. » 2019 నుంచి 2023 డిసెంబరు నాటికి దేశవ్యాప్తంగా 18.3 కోట్ల టెలి కన్సల్టేషన్లు నమోదైతే ఒక్క ఏపీ నుంచే అత్యధికంగా 25 శాతం అంటే 4,61,01,963 కన్సల్టేషన్లు నమోదయ్యాయి. ఈ అంశాన్ని అప్పట్లో కేంద్ర ఆరోగ్య శాఖ పార్లమెంట్లో ప్రకటించింది. » రూ.8500 కోట్లతో 17 కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల నిర్మాణాన్ని వైఎస్ జగన్ చేపట్టారు. ఇవన్నీ ప్రభుత్వ రంగంలోనే పూర్తయి అందుబాటులోకి వస్తే అన్ని జిల్లాల్లో ప్రభుత్వ రంగంలో ఉచిత సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందేవి. -
డేటా సెంటర్లకు శుద్ధి చేసిన మురుగునీరు
సాక్షి, హైదరాబాద్: ఐటీ వినియోగం అంతకంతకూ పెరుగుతుండటంతో డేటా సెంటర్లకు డిమాండ్ అదే స్థాయిలో ఉంటోంది. వీటికి పెద్ద ఎత్తున నీరు అవసరం. హైదరాబాద్ సమీపంలో డేటా సెంటర్లు ఒకదాని వెంట ఒకటి ఏర్పాటు అవుతుండడంతో సహజ వనరులను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పారిశ్రామిక హబ్లకు, ముఖ్యంగా డేటా సెంటర్ల అవసరాలను తీర్చడం కోసం శుద్ధి చేసిన నీటిని పెద్దఎత్తున సరఫరా చేసేలా బృహత్ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. ఈ వ్యూహాత్మక ప్రాజెక్ట్ను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో అమలు చేయాలని భావిస్తోంది. నగరంలోని ప్రధాన డిమాండ్ కేంద్రాలకు మురుగునీటి శుద్ధి ప్లాంట్ల (ఎస్టీపీ) నుంచి శుద్ధి చేసిన మురుగునీటిని దీర్ఘకాలంపాటు సరఫరా చేయడానికి, వాడుకోవడానికి సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (డీపీఆర్) సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.పదిలంగా నీటి వనరులు..ప్రస్తుతం నగరంలో రోజుకు 1,750 మిలియన్ లీటర్ల కంటే ఎక్కువ శుద్ధి సామర్థ్యంతో మొత్తం 41 ఎస్టీపీలను జలమండలి నిర్వహిస్తోంది. చందన్వెల్లి ప్రాంతంలోని పారిశ్రామిక క్లస్టర్, ప్రతిపాదిత ఫ్యూచర్ సిటీ కోసం రోజుకు 530 మిలియన్ లీటర్ల డిమాండ్ అంచనాతో సరఫరా మౌలిక సదుపాయాల అభివృద్ధికి డీపీఆర్ సిద్ధం చేస్తారు. అలాగే, అత్తాపూర్లో ఉన్న ఎస్టీపీ నుంచి చందన్వెల్లి వరకు 41 కి.మీ. దూరంలో పైప్లైన్ మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తారు. దీని ద్వారా 2035 నాటికి ఈ క్లస్టర్లో రోజుకు 239 మిలియన్ లీటర్ల డిమాండ్ చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. నాగోల్లో ఉన్న ఎస్టీపీల నుంచి ఫ్యూచర్ సిటీ వరకు 56.6 కి.మీ. దూరంలో మరొక పంపిణీ మౌలిక సదుపాయాల మార్గం ప్లాన్ చేశారు. 2035 నాటికి రోజుకు 290 మిలియన్ లీటర్ల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అంచనా వేస్తున్నారు. ఈ వ్యవస్థ ఇప్పటికే ఉన్న, అలాగే రాబోయే డేటాసెంటర్లకు ఉపయోగపడుతుంది. ఇప్పటికే ఉన్న పార్కులకు..రెండు పైప్లైన్లు కూడా ఓఆర్ఆర్, ఇతర ముఖ్యమైన రహదారుల వెంబడి వెళ్తుండటం వల్ల రామచంద్రాపురంలోని అసిస్టెడ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్, పటాన్చెరు ఇండస్ట్రియల్ పార్క్, ఐడీఏ పటాన్చెరు, బీహెచ్ఈఎల్, సుల్తాన్పూర్ ఇండస్ట్రియల్ పార్క్, గుండ్లపోచంపల్లి అపారెల్ ఎక్స్పోర్ట్ పార్క్, ఎల్ఈఏపీతో సహా ఇతర పారిశ్రామిక క్లస్టర్లు, సంస్థల అవసరాలను తీర్చడానికి వీటిని ఉపయోగించుకోవచ్చు. గాజులరా మారం, ఐడీఏ జీడిమెట్ల, ఎస్వీసీఐఈ జీడిమెట్ల, సీసీ జీడిమెట్ల, ఇండస్ట్రియల్ పార్క్ మౌలాలీ, 158 కి.మీ. ఓఆర్ఆర్ హరితహారం నిర్వహణతోపాటు అగ్నిమా పక, వినోద, ల్యాండ్స్కేపింగ్ అవసరాలకూ ఈ శుద్ధి చేసిన నీటిని సరఫరా చేయొచ్చు. -
ప్రైవేటూ రాజ్యమేలుకో!
సాక్షి, అమరావతి: ప్రభుత్వ వైద్యకళాశాలల ప్రైవేటుపరం(పీపీపీ)పై చంద్రబాబు సర్కారు మొండి వైఖరి వీడడం లేదు. కారుచౌకగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టేందుకు ముందుకెళుతోంది. దీనికోసం అనేక ప్రయోజనాలను ఇప్పటికే ప్రకటించిన ప్రభుత్వం... పీపీపీకి ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపకపోవడంతో మరో కుట్రకు తెరతీసింది. అదనపు మేలు చేకూర్చేందుకూ సిద్ధమైంది. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ పేరుతో ఖజానాపై అదనపు భారం వేసేందుకు కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. ఎన్నో ప్రయోజనాలు ‘ఎకరం భూమికి ఏడాదికి రూ.100 లీజు చెల్లిస్తే చాలు. బోధనాస్పత్రుల్లో 70 శాతం ఇన్పేషెంట్ పడకలకు ఆరోగ్యశ్రీ ద్వారా నిధులు సమకూరుస్తాం. మిగిలిన 30 శాతం పడకల్లో ప్రైవేట్ ఆస్పత్రుల్లో మాదిరిగా ఫీజులు గుంజుకునే వీలు. సగం ఎంబీబీఎస్ సీట్లకు యాజమాన్య కోటా కింద ఫీజులు వసూలు చేసుకోవచ్చు. వైద్య కళాశాల, బోధనాస్పత్రిపై 66 ఏళ్ల పాటు యాజమాన్య హక్కుల కల్పన. రెండేళ్లపాటు బోధనాస్పత్రుల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి ప్రభుత్వమే జీతాల చెల్లింపు’ అంటూ ఇప్పటికే ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీకి ఇవ్వడం కోసం చంద్రబాబు సర్కార్ ప్రైవేట్ సంస్థలకు బంపర్ ఆఫర్లు ఇచ్చింది.అయినప్పటికీ కళాశాలలు తీసుకోవడానికి ఎవ్వరూ ముందుకు రావడం లేదనే సాకుతో మరో భారీ నజరానా ఇవ్వడానికి చంద్రబాబు సమాయత్తం అవుతున్నారు. కళాశాలలు పూర్తి చేయడానికి అవసరమయ్యే వ్యయంలో 30 శాతం మేర వయబిలిటీ గ్యాప్ ఫండింగ్(వీజీఎఫ్) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి సమకూర్చడానికి కసరత్తు చేస్తున్నారు. వీజీఎఫ్ రూపంలో ప్రైవేట్ సంస్థలకు మరింత మేలు తలపెట్టబోతున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే బాపట్ల, పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పెనుకొండ వైద్య కళాశాలలకు వీజీఎఫ్ కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ప్రతిపాదనలు కూడా పంపింది. గతేడాది టెండర్లు పిలిచి రద్దు చేసిన ఆదోని, పులివెందుల, మార్కాపురం, మదనపల్లె వైద్య కళాశాలలకు వీజీఎఫ్ కోరుతూ ప్రతిపాదనలు సిద్ధం చేస్తోందని సమాచారం. ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపే కుట్రే!గత ప్రభుత్వం భూములు సేకరించి, రూ.వేల కోట్ల ప్రజాధనంతో నిర్మాణాలు ప్రారంభించి, తరగతులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను బాబు సర్కారు పీపీపీ ముసుగులో ప్రైవేట్కు కట్టబెట్టేందుకు తెగతాపత్రయపడుతోంది. బాబు సర్కారు తొలి దశలోనే పీపీపీకి ఇవ్వాలనుకున్న ఆదోని, మార్కాపురం, మదనపల్లె, పులివెందుల వైద్య కళాశాలలు ప్లగ్ అండ్ ప్లే తరహాలో 2024 ఎన్నికల నాటికే ఎంబీబీఎస్ తరగతులు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే పులివెందుల కళాశాలకు నేషనల్ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) సైతం పచ్చ జెండా ఊపింది.అయితే కుట్రపూరితంగా చంద్రబాబు ప్రభుత్వం లేఖలు రాసి ఆ కళాశాల అనుమతులు, సీట్లను రద్దు చేయించింది. ఈ తరహా కళాశాలలను కారుచౌకగా కట్టబెట్టేయడం కోసం ప్రైవేట్కు భారీ ప్రయోజనాలు కల్పిస్తూ నిర్ణయాలు తీసుకుంది. అంతటితో ఆగకుండా వీజీఎఫ్ కింద ప్రైవేట్ వ్యక్తులు భరించాల్సిన వ్యయంలో 30శాతం మేర నిధులు ఖజానా నుంచి సమకూర్చడానికి సిద్ధమవుతుండటం గమనార్హం.వాస్తవానికి ప్రైవేట్ సంస్థలు భారీగా సొంత పెట్టుబడి పెట్టి రోడ్లు, బ్రిడ్జిలు వంటి మౌలిక వసతులు నిర్మిస్తున్నప్పుడు, వారికి ఆశించిన లాభాలు రాకపోతే ప్రభుత్వం ఇచ్చే ఓ ఆర్థిక మద్దతు వీజీఎఫ్. ఇదిలా ఉంటే పీపీపీ వైద్య కళాశాలలకు ఇప్పటికే భారీ ఎత్తున అయాచిత ప్రయోజనాలను చంద్రబాబు ప్రభుత్వం సమకూర్చింది. ఇక ప్రైవేట్ సంస్థకు వచ్చే నష్టం ఎక్కడ ఉంది? వారు భరించే రిస్క్ ఏమిటి? వీజీఎఫ్ రూపంలో చేస్తున్న అదనపు లాభం వెనుక లోపాయికారీ ఒప్పందాలు ఏమిటనేది ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇదంతా ప్రైవేట్ వ్యక్తుల జేబులు నింపే కుట్రలో భాగంగానే పరిస్థితులు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. విద్యార్థులకు తీరని ద్రోహం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్కు కట్టబెట్టడం కోసం చంద్రబాబు మన రాష్ట్ర విద్యార్థులకు రెండేళ్లలో తీరని ద్రోహం తలపెట్టారు. వైఎస్ జగన్ హయాంలో రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణం చేపట్టారు. వాటిలో 10 ప్రైవేట్కు కట్టబెట్టాలని గద్దెనెక్కిన వెంటనే బాబు నిర్ణయించారు. వాస్తవానికి ప్రతిపక్షంలో ఉండగా కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్ఫైనాన్స్ మెడిసిన్ సీట్ల విధానాన్నే రద్దు చేస్తామని ఎన్నికలకు ముందు టీడీపీ హామీనిచ్చింది.అధికారం చేపట్టిన వంద రోజుల్లో సెల్ఫ్ఫైనాన్స్ సీట్ల జీవోలను రద్దు చేస్తామని ప్రస్తుత విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ అప్పట్లో ప్రకటించారు. గద్దెనెక్కాక విద్యార్థులకు వెన్నుపోటు పొడుస్తూ సెల్ఫ్ఫైనాన్స్ కోటా ఎత్తేయకపోగా, ఏకంగా ప్రభుత్వ కళాశాలను ప్రైవేట్కు కట్టబెడుతున్నారు. ఈ నిర్ణయంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో 1750 చొప్పున మొత్తంగా రెండేళ్లలో 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోయారు. రేయింబవళ్లు శ్రమించి నీట్లో ఉత్తమ ర్యాంక్లు సాధించిన పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన విద్యార్థుల వైద్య విద్య కలను బాబు కాలరాశారు. -
CPI leaders: భోగి మంటల్లో సర్కార్ జీవోల దగ్ధం
-
ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటం
గుంటూరు ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆరి్థక ప్రయోజనం చేకూర్చే విధంగా సంక్రాంతిలోపు 12వ వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ)ను నియమించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నక్కా వెంకటేశ్వర్లు, కేఎస్ఎస్ ప్రసాద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించని పక్షంలో ఈనెల 20 నుంచి ఉద్యమానికి దిగుతామని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ 51వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలను శనివారం గుంటూరులోని ఏసీ కళాశాలలో నిర్వహించారు.ఈసందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ యూటీఎఫ్ కార్యకర్తలుగా మన ఊరుబడిని కాపాడుకుందామని.. అప్పుడే పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉపాధ్యాయులపై విద్యాశాఖ కమిషనర్ వ్యవహరిస్తున్న అధికార దర్పం, వ్యవహార శైలి మార్చుకోవాలని, బోధన కంటే బోధనేతర కార్యక్రమాలు ఎక్కువ కావడం వల్ల నాణ్యమైన విద్య అందించడంపై శ్రద్ధ వహించలేకపోతున్నారని అన్నారు. విద్యారంగంలోనూ పీపీపీపై ఆగ్రహం పీడీఎఫ్ ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పీపీపీ విధానాన్ని మెడికల్ కళాశాలలతో పాటు విద్యారంగంలోనూ ప్రవేశపెట్టాలని చూస్తున్నారని, దీన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. కార్పొరేట్లకు విద్యారంగాన్ని దోచిపెట్టడానికి ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అంతకుముందు గుంటూరు నగరంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. 12వ పీఆర్సీ కమిషన్ నియమించడంలో వైఫల్యంతో పాటు ప్రభుత్వ విధానాలతో సర్కారు బడుల నిర్వీర్యం, ఉపాధ్యాయులపై మోయలేని పనిభారం తదితర అంశాలకు నిరసనగా వందలాది టీచర్లు ప్రదర్శనలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కేఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు కె.శ్రీనివాసరావు, పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
పీపీపీ ద్వారానే సంపద సృష్టి
సాక్షి, అమరావతి: హైదరాబాద్ను హైటెక్ సిటీతో అభివృద్ధి చేసినట్టే.. అమరావతిని క్వాంటం వ్యాలీతో అభివృద్ధి చేస్తామని సీఎం చంద్రబాబు చెప్పారు. వాజ్పేయి శతజయంతి సందర్భంగా గుంటూరు జిల్లా వెంకటపాలెంలో ఏర్పాటు చేసిన వాజ్పేయి స్మృతి వనంలో 14 అడుగుల ఏబీ వాజ్పేయి కాంస్య విగ్రహాన్ని గురువారం ఆవిష్కరించారు. సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రాభివృది్ధకి ప్రధాని మోదీ పూర్తిగా సహకరిస్తున్నారన్నారు. పీపీపీ విధానంలో దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పారు. పీపీపీ ద్వారా సంపద సృష్టిస్తుంటే.. ఏమీ తెలియని కొందరు నాయకులు ఏదేదో మాట్లాడుతున్నారన్నారు.ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నా, ఉద్యోగాలు కల్పించాలన్నా పీపీపీ మోడల్ కరెక్ట్ అనే విషయాన్ని 30 ఏళ్లుగా చూస్తున్నామన్నారు. తాము అధికారంలోకి వస్తే కాలేజీలు కట్టిన వాళ్లను జైలులో పెడతామంటున్నారని.. అభివృద్ధి చేసే వాళ్లను, జైలులో పెట్టేవాళ్లను ఏవిధంగా చూడాలో ప్రజలు ఆలోచించుకోవాలన్నారు. ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఈ యాత్ర ఆగదన్నారు.అపరదేశ భక్తుడు వాజ్పేయి: చౌహన్సభకు హాజరైన కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహన్ మాట్లాడుతూ.. మాజీ ప్రధాని అపర దేశభక్తుడని కొనియాడారు. పార్టీలు వస్తాయి, పోతాయి గానీ దేశభక్తి అన్న భావన ప్రతి వ్యక్తిలో ప్రధానంగా ఉండాలని చెప్పిన నేత వాజ్పేయి అన్నారు. వాజ్పేయి తొలిసారి ప్రధాని అయిన సమయంలో ఫిరాయింపులను ప్రోత్సహించాలని చెప్పినా విలువలకే కట్టుబడి నిలబడ్డారని చెప్పారు. వాజ్పేయి వేసిన పునాదుల కారణంగానే దేశం, ఏపీ ముందుకు సాగుతున్నాయన్నారు. సభలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్ర మంత్రులు భూపతిరాజు శ్రీనివాసవర్మ, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్రమంత్రులు సత్యకుమార్, కందుల దుర్గేష్, ఎమ్మెల్యే శ్రవణ్కుమార్ మాట్లాడారు. వాజ్పేయిపై రూపొందించిన ప్రత్యేక పోస్టల్ స్టాంప్ను, కవర్ను కేంద్రమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్, సీఎం చంద్రబాబు అవిష్కరించారు. పునర్విభజన చట్టం కింద కేంద్ర అగ్రి వర్సిటీ నెలకొల్పండిఏపీలో కొబ్బరి పార్క్, ఆక్వా ల్యాబ్, మ్యాంగో బోర్డు సహా వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్కు సీఎం చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. అమరావతి పర్యటనలో భాగంగా గురువారం సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన కేంద్రమంత్రికి చంద్రబాబు వినతి పత్రం అందించారు. ఏపీ పునర్విభజన చట్టం–2014 షెడ్యూల్ 13లో పేర్కొన్న మేరకు రాష్ట్రంలో కేంద్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలన్నారు. దీనికోసం రూ.2,585 కోట్ల అంచనాలతో డీపీఆర్ సమర్పించినట్టు చెప్పారు. సూక్ష్మ సాగునీటి విస్తరణకు అదనంగా రూ.695 కోట్లు కేటాయించాలని, ఏపీని సహజ సాగుకు జాతీయ వనరుల రాష్ట్రంగా ప్రకటించాలని, అమరావతిలో అత్యాధునిక ఆక్వా ల్యాబ్, పులికాట్ సరస్సు అభివృద్ధికి నిధులు కేటాయించాలనే తదితర అంశాలను వినతిపత్రంలో చేర్చారు. -
చంద్రబాబు రాజకీయ సమాధి ఖాయం ఇప్పటికైనా PPP ఆపేయ్
-
పీపీపీ మెడికల్ కాలేజీల్లో ప్రభుత్వ కోటా 50 శాతం
సాక్షి,అమరాతి: పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ)తో చేపడుతున్న ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల వైద్య కళాశాలల్లో ప్రభుత్వ కోటా కింద 50 శాతం సీట్లు భర్తీ చేసి, మిగతావి యాజమాన్యం, ఎన్ఆర్ఐ కోటా కింద కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన శుక్రవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారు. తొలుత 33 ఏళ్లపాటు, తర్వాత మరో 33 ఏళ్లపాటు లీజుకు ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏడాదికి ఎకరానికి రూ.100 చొప్పున లీజుకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు.ఆ సంస్థలు ఆస్పత్రులను నిర్మాణం చేసుకునే వరకు రెండేళ్లపాటు ప్రభుత్వ బోధనాస్పత్రులను వినియోగించుకునేందుకు అనుమతించారు. అప్పటివరకు ప్రస్తుత ఆస్పత్రుల్లోని సిబ్బంది జీతభత్యాలకు ప్రభుత్వం సహకారం అందిస్తుంది. కేబినెట్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సమాచార శాఖ మంత్రి కె.పార్థసారథి మీడియాకు వెల్లడించారు. ప్రీ బిడ్ సమావేశాల్లో పీపీపీ సంస్థలు కోరిన మేరకు ఆర్ఎఫ్పీలో 6 సవరణలను ఆమోదించినట్లు చెప్పారు. కాలేజీలకు 59.89 ఎకరాలు కుదింపు.. పీపీపీ ఆస్పత్రుల్లో 70 శాతం పడకలు ప్రభుత్వ ఆరోగ్య పథకాలకు కేటాయిస్తారు. మిగతా 30 శాతం పడకలకు యాజమాన్యాలు ఫీజులు వసూలు చేసుకుంటాయి. గతంలో ఈ నాలుగు కొత్త వైద్య కళాశాలలకు 257.60 ఎకరాలను కేటాయించగా, ఇప్పుడు 197.71 ఎకరాలకు తగ్గించారు. భవిష్యత్తులో డెంటల్ కాలేజీ, నర్సింగ్ కాలేజీ, పారా మెడికల్ ఇన్స్టిట్యూట్, ఆయుష్, శిక్షణ, పరిశోధన కేంద్రాల అభివృద్ధికి అనుమతిస్తారు. అయితే వాటి నుంచి వచ్చే ఆదాయంలో 3శాతం ప్రభుత్వానికి చెల్లించాలి. వైద్య కళాశాలలు, ఆస్పత్రులు ప్రభుత్వ, ప్రైవేట్ బ్రాండింగ్తో పని చేస్తాయి. 30 శాతం వరకు ప్రైవేట్ బ్రాండింగ్ ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాలలుగా పెద్దగా పేరు పెట్టి కింద పీపీపీ సంస్థల పేర్లు పొందుపరుస్తారు. వచ్చే నెల 10వ తేదీ వరకు బిడ్ల సమర్పణకు గడువు ఉంది. డిసెంబర్ 31న బిడ్డర్లను ప్రకటిస్తారు. నియంత్రణ పరిధిలోకి ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులు అర్హతలు లేని, నకిలీ వైద్యులు ఆస్పత్రులను నిర్వహించకుండా నియంత్రించేందుకు ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులను క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్స్ (రిజి్రస్టేషన్ అండ్ రెగ్యులేషన్) యాక్ట్ 2010 పరిధిలోకి తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఇప్పటి వరకు ప్రైవేట్ అల్లోపతిక్ ఆస్పత్రులను మాత్రమే ఈ చట్టం కింద నియంత్రిస్తున్నారు. చట్ట సవరణ ద్వారా ఇకపై ప్రైవేట్ ఆయుష్ ఆస్పత్రులను కూడా నియంత్రిస్తారు. దీంతో ఆయుర్వేద, యోగ, యునాని, సిద్ధ, హోమియోపతి వైద్యం అందించే ప్రైవేట్ ఆస్పత్రులు నియంత్రణ పరిధిలోకి రానున్నాయి. -
Botsa: పాలకొల్లులో పశ్చిమగోదావరి జిల్లా సమన్వయ సమావేశం
-
రూ.వేల కోట్ల భూములు ప్రైవేట్ సంస్థలకి !
సాక్షి విజయవాడ: కూటమి ప్రభుత్వం విజయవాడలోని ప్రభుత్వ భూములను ప్రైవేట్ సంస్థలకు ఇచ్చేందుకు భారీ స్కెచ్ వేస్తున్నట్లు తెలుస్తోంది. పీపీపీ మోడల్లో (ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యం) ప్రభుత్వానికి చెందిన ఖాళీ భూములన్నీ మున్సిపల్ శాఖ టీడీపీ పెట్టుబడిదారుల చేతికి అప్పగించడానికి రంగం సిద్ధం చేసినట్లు సమాచారం.18 నగరాలు, మున్సిపాలిటీలకు చెందిన దాదాపు 1,౩౦౦ వందల ఎకరాల భూమిని ల్యాండ్ మానిటైజేషన్ పేరుతో ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. దీనికి సంబంధించి 73 ల్యాండ్ పార్సిల్స్ గుర్తించినట్లు ఎమ్ఏయూడీ ప్రకటించగా ఇదివరకే నాలుగు పట్టణాల్లో మున్సిపల్ శాఖ అధికారులు ఈఓఐ పిలిచారు. ఈ భుముల ధర వేల కోట్ల రుపాయలు ఉన్నట్లు సమాచారం. -
చేతులెత్తేసిన ప్రభుత్వం.. అన్నింటికీ ఇక పీపీపీ మంత్రం!
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం అన్నింటికీ పీపీపీ (ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం) మంత్రమే జపిస్తోంది. ప్రజలకు అవసరమైన ఏ నిర్మాణాలైనా తమవల్ల కాదని చేతులెత్తేసింది. సామాజిక మౌలిక సదుపాయాల ప్రాజెక్టులన్నింటినీ పీపీపీ విధానంలోనే చేపట్టాలని నిర్ణయించారు. ఆస్పత్రులు, తాగునీటి ప్రాజెక్టులు, గ్రామీణ రహదారులు, ప్రభుత్వ పార్కులు, బస్ స్టాండ్లు.. ఇలా ఏ అభివృద్ధి పనులైనా సరే పీపీపీ విధానంలోనే చేపట్టాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రైవేట్ రంగంలో ఆస్పత్రుల నిర్మాణాలను చేపట్టాలని.. చిన్నా, పెద్దా అన్నీ కలిపి పీపీపీలో 302 ప్రాజెక్టులను చేపట్టేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులకు డీపీఆర్లను సిద్ధం చేయగా, మరి కొన్నింటికి డీపీఆర్లు రూపొందిస్తున్నారు. సేవా రుసుము ఆధారిత మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు ఇటీవల అధికారులతో జరిగిన పీపీపీ ప్రాజెక్టుల సమావేశంలో స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కన్నా, సేవా రుసుము ఆధారిత మౌలిక సదుపాయాలను అందించడం పట్ల పౌరుల ఆలోచనా దృక్పథంలో మార్పు వచ్చిందని, అందుకు అనుగుణంగా సామాజిక మౌలిక సదుపాయాలను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. అంటే పీపీపీ విధానంలో చేపట్టే ప్రాజెక్టులకు అయ్యే వ్యయాన్ని సేవా రుసుముల ద్వారా రాబట్టుకోనున్నారు.ప్రభుత్వ రంగంలో ఏ నిర్మాణాలూ ఉండవుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతో సహా, ఎక్కడైనా ఆస్పత్రులు కావాలంటే పీపీపీ విధానంలోనే చేపడతారు. ఆ నిర్మాణాలకయ్యే వ్యయాన్ని రోగుల నుంచి చార్జీల రూపంలో వసూలు చేస్తారు. రాష్ట్రంలో 500 కిలోమీటర్ల గ్రామీణ రహదారులను, ఇతర రహదారులన్నింటినీ పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. నిర్మాణ వ్యయాన్ని రుసుముల ద్వారా రాబట్టనున్నారు. తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ ఆటోనగర్ వంటి పెద్ద పెద్ద బస్స్టాండ్లను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయనున్నారు. వివిధ స్థానిక సంస్థల ఆధ్వర్యంలోని పార్కులు, పర్యాటక ప్రాజెక్టులు, వ్యసాయ రంగంలో అవసరమైన మౌలిక సదుపాయాలు, కోల్డ్ స్టోరేజీలు, పారిశ్రామిక పార్కులు.. సెమీకండక్టర్లు, ఇ–మొబిలిటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్లతో సహా ఏరోస్పేస్ రంగాల్లో ప్రాజెక్టులను సైతం పీపీపీ విధానంలో చేపట్టనున్నారు. ఇందులో భాగంగా పెద్ద పెద్ద ప్రాజెక్టులను పీపీపీ విధానంలో త్వరగా చేపట్టి, పూర్తి చేసేందుకు అధికారులు వేగంగా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న పీపీపీ ప్రాజెక్టులకు వయబులిటీ గ్యాప్ నిధులను కేంద్ర ప్రభుత్వం అందించాలని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధి అవసరాలను తీర్చడానికి వివిధ ఆస్తులను తనఖా పెట్టేందుకు అవసరమైన నైపుణ్య మద్దతును నీతి ఆయోగ్ నుంచి తీసుకోనున్నారు. మొత్తంగా ఇకపై ప్రభుత్వ రంగంలో ఎలాంటి నిర్మాణాలు ఉండవని చంద్రబాబు తేల్చి చెప్పినట్లయింది. -
పీపీపీ కమిషన్లలో బాబు, పవన్, లోకేష్కు వాటాలు: జడ శ్రావణ్ కుమార్
సాక్షి, విజయవాడ: ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుందని జైభీమ్ రావ్ భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయానికి వ్యతిరేకంగా విజయవాడలో శనివారం మేధోమథనం సదస్సు జరిగింది.జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ.. పీపీపీ అంటే పూర్తిగా ప్రైవేటీకరణ చేయడమే. మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయడం వల్ల సామాన్యులకు తీరని నష్టం తప్పదు. ఈ విధానం వల్ల బడుగు,బలహీన వర్గాలే కాదు అగ్రవర్ణాల్లోని పేదలకు సైతం తీరని అన్యాయం జరుగుతుంది. తీవ్ర వ్యతిరేకత వస్తున్న చంద్రబాబు వెనక్కి తగ్గకపోవడం వెనుక అతిపెద్ద లాభం ఉందనేది స్పష్టమవుతోంది. పీపీపీ చేయడం వల్ల వచ్చే కమిషన్లలో చంద్రబాబు,పవన్,లోకేష్కు వాటాలు పంచుకోవాలనుకుంటున్నారు... ప్రైవేటీకరణ చేయడం వల్ల ఒక్క ఏడాది అడ్మిషన్లలోనే రూ.400 కోట్లు సంపాదిస్తారు. చంద్రబాబుకు నాదొక సూటి ప్రశ్న..ధైర్యముంటే సమాధానం చెప్పాలి. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు జరిగే విధానంలోనే పీపీపీలోనూ చేపడతారని చెప్పగలరా?. ప్రైవేటీకరణను అడ్డుకోకపోతే మన భావితరాలు తీవ్రంగా నష్టపోతాయి. మెడికల్ విద్యను ప్రైవేటీకరణ చేయనిస్తే మన భవిష్యత్ తరాలు మనల్ని క్షమించరు. కచ్చితంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీరణకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగించాలి అని అన్నారాయన. ఈ క్రమంలో.. సీఎం చంద్రబాబు,హోంమంత్రి అనిత పై జడ శ్రవణ్ కుమార్ హాట్ కామెంట్స్ చేశారు. ‘‘అన్నీ నేనే కనిపెట్టానని చంద్రబాబు చెబుతారు. చంద్రబాబు వల్ల ఏడాదికి 2500 మంది పేద విద్యార్ధులకు విద్య అందకుండా చేశారు. హోంమంత్రి వంగలపూడి అనిత తన పని తాను చేయడం లేదు. శాంతిభద్రతలను గాలికొదిలేసి మెడికల్ కాలేజీల పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చింది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన వంగలపూడి అనితకు నాదొక ప్రశ్న. ప్రభుత్వ మెడికల్ కాలేజీల అడ్మిషన్ పద్ధతిలోనే ప్రైవేట్ మెడికల్ కాలేజీల అడ్మిషన్లు జరుగుతాయా?. పేద విద్యార్ధులకు అన్యాయం జరుగుతుంటే ప్రశ్నిస్తానన్న పవన్ కళ్యాణ్ ఎక్కడికి పోయారు?’’ అని ప్రశ్నించారాయన. అమ్ ఆద్మీ పార్టీ నేత నేతి మహేశ్వరరావు మాట్లాడుతూ.. పీపీపీ అంటే చంద్రబాబుకు తెలుసా?. పేదలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రజలకు ఇచ్చే అసలైన సంక్షేమం. కోవిడ్ నేర్పిన పాఠాలను మనం గుర్తు తెచ్చుకోవాలి. పేదలకు మెరుగైన వైద్యం,వైద్య విద్యను అందజేస్తేనే సమాజం బాగుపడుతుంది. రూ.3 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఏడాదికి రూ.2 వేల కోట్లు ఖర్చు చేయలేకపోతున్నారా?.. మీరు ప్రభుత్వాన్ని నడుపుతున్నారా...ప్రజలతో వ్యాపారం చేస్తున్నారా? అని నిలదీశారు. జైభీమ్ రావ్ భారత్ పార్టీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో పలు ప్రజా సంఘాల నాయకులు పాల్గొని.. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించారు. ఇదీ చదవండి: టీడీపీలో వాళ్లు పనోళ్లేనా? -
వైద్యకళాశాలల ప్రైవేటీకరణ ఎవరికి లాభం?
ఆంధ్రప్రదేశ్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎంగా తీసుకొచ్చిన వైద్య కళాశాలల ప్రైవేటీకరణపై ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. ఈ చర్యలో అసలు హేతుబద్ధత అన్నదే లేదని, టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి సర్కారు ప్రైవేటీకరణ పేరుతో వైద్యకళాశాలలను తమ తాబేదార్లకు అప్పగిస్తోందన్న విమర్శలు అటు సామాన్య ప్రజానీకంతోపాటు ప్రతిపక్ష వైసీపీ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణలు వినిపిస్తున్నారు. ఎన్నికలకు ముందు సంపద సృష్టించి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తానని బీరాలు పలికిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ప్రజల ఆస్తులు అమ్ముతూ ప్రైవేటువారికి సంపద సృష్టిస్తున్నారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వ వైద్యకళాశాలల్లో యాభై శాతం సీట్లను సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతిని పెడతామన్న వైఎస్ జగన్ మాటలను అప్పట్లో తీవ్రంగా వ్యతిరేకించిన బాబు, లోకేశ్లు ఇప్పుడు మాటమార్చడంపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. పైగా పీపీపీ విధానం ప్రైవేటేషన్ కాదని, జగన్కు ఆ విషయం తెలియదని బాబు అండ్ కో బుకాయిస్తున్న వైనం ఆశ్చర్యం కలిగిస్తోంది. చంద్రబాబు నాయుడు, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్లు అసెంబ్లీలోని ఇరు సభల్లో చేసిన వాదనలను పరిశీలిస్తే వీరు వైద్యకళాశాలల ప్రైవేటీకరించి కళ్లప్పగించి చూడబోతున్న వైనం స్పష్టమవుతోంది. పేదలకు వైద్యవిద్య అన్నది ఒట్టిమాటేనని, వ్యహారమంతా ధనికులకు అనకూలంగానే నడుస్తోందని విమర్శలు వస్తున్నాయి. పీపీపీ అంటే ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధానమంటున్న చంద్రబాబు తద్వారా కాలేజీలు, ఆసుపత్రుల నిర్వహణలో తమ అసమర్థతను బయటపెట్టుకున్నట్లు అయ్యింది. జగన్ ప్రభుత్వం నాడు-నేడు కింద ఆస్పత్రులను బాగు చేయించి ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే, సీనియర్ అని చెప్పుకునే చంద్రబాబు ప్రభుత్వం కంటే ప్రైవేటు వారే బెటర్ అంటున్నారా? ఈ మాత్రం దానికి ప్రభుత్వం ఎందుకో? వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నిర్మాణాల మాదిరి అయితే ఈ పది మెడికల్ కాలేజీలు పూర్తి కావడానికి 15 ఏళ్లు పడుతుందని చంద్రబాబు అనడం చూస్తే ఆయన తనను తాను అసమర్థుడిగా చెప్పుకుంటున్నట్లే కదా అని వైసీపీ వారు ప్రశ్నిస్తున్నారు. అదే సమయంలో లక్ష కోట్లైనా ఖర్చు చేసి అమరావతి మొదటి దశ నిర్మాణం పూర్తి చేస్తామనడం మరీ విడ్డూరంగా ఉంది. జగన్ సీఎంగా రెండేళ్లలోనే ఐదు వైద్య కశాళాలలను అందుబాటులోకి తెచ్చారు. ఆ తరువాత ఇంకో రెండు దాదాపుగా పూరర్తయ్యాయి. మిగిలిన పదింటికీ అయ్యే రూ.ఐదారు వేల కోట్లు ప్రభుత్వం సమకూర్చుకోలేదా? లక్షల కోట్ల బడ్జెట్ కలిగిన ప్రభుత్వమే ఈ మాత్రం డబ్బు సమకూర్చు కోలేకపోతే ప్రైవేటు సంస్థలు ఎలా తెచ్చుకుంటాయి? ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా లేని విధంగా ఒక్కో వైద్యకళాశాలలకు కేటాయించిన దాదాపు యాభై ఎకరాల భూమిని ఎకరా రూ.వంద చొప్పున లీజుకు ఇవ్వడమంటే ఉత్తినే ఇచ్చినట్లు కదా? ప్రైవేట్ సంస్థలు ఈ భూములను తాకట్టు పెట్టి రుణం తెచ్చుకుంటే.. ప్రభుత్వం తన సంపదను రాసిచ్చినట్లే అవుతుంది.ప్రస్తుతం 33 ఏళ్లు ఉన్న లీజు భవిష్యత్తులో పొడిగించరన్న గ్యారెంటీ ఏమీ లేదు కాబట్టి.. ఇవి శాశ్వతంగా ప్రైవేటు వారి పరమవుతాయి. పేద ప్రజలకు ఉపయోగపడే మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు అమరావతి మాదిరే ప్రభుత్వం రుణాలు తేలేదా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనూ చంద్రబాబు ప్రభుత్వం 54 ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేసింది. కొనుగోలు చేసిన సంస్థలు తమకు దక్కిన భూమితో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశాయని ఒక రిటైర్డ్ అధికారి చెప్పారు. ఎవరి సంపద ఎవరి పరమైనట్లు? జగన్ ప్రభుత్వం ఏభై శాతం సీట్లు సెల్ప్ ఫైనాన్స్ పద్దతిలో కేటాయించి, వాటికి రూ.20 లక్షల చొప్పున ఫీజ్ వసూలు చేయాలని నిర్ణయిస్తే, చంద్రబాబు, లోకేశ్లు తప్పు పట్టారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ విధానాన్ని రద్దు చేసి అంతా ఫ్రీ చేస్తామని లోకేశ్ విద్యార్ధుల సమావేశంలోనే ప్రకటించారు. ఇప్పుడు మొత్తం ప్రైవేటుపరం చేయడమే కాకుండా, ఆ సెల్ఫ్ ఫైనాన్స్ సీట్ల ఖరీదు రూ.57 లక్షలు ప్రభుత్వ రంగంలో రూ.20 లక్షలు అంటే అంతే మొత్తం వసూలు చేస్తారు. అదే ప్రైవేటు వారు అయితే ఈ రూ.57 లక్షలే కాకుండా, అదనంగా రూ.కోటి పైనే వసూలు చేయవచ్చు అంటున్నారు. మొత్తం డబ్బు ప్రభుత్వ ఖాతాలోకి వచ్చేలా జగన్ చేస్తే, చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటు సంస్థలకు వేల కోట్ల రూపాయలు దక్కేలా చేస్తున్నారన్న విమర్శకు సమాధానం దొరకదు. ఇంతా చేసి ఆ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో ప్రజలందరికి ఉచిత వైద్య సేవలు అందుతాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రైవేటు సంస్థలు లాభాలు రాకపోతే మనలేవన్నది తెలిసిన సత్యమే. ప్రభుత్వ ఆసుపత్రుల్లో లక్ష రూపాయల విలువైన చికిత్స అయినా, ఆపరేషన్ అయినా ఉచితంగా చేస్తారు. మరి పీపీపీ మోడల్లో ఏర్పాటైన ప్రైవేట్ కళాశాలలు ఇలా చేస్తాయా? చేయవు. ఒకవేళ చేసినా ఆ మొత్తాలను ఎన్టీఆర్ వైద్య సేవ లేదా బీమా సదుపాయం పేరుతో ప్రభుత్వం నుంచే వసూలు చేసే అవకాశాలు ఎక్కువ. ఇలాంటి పీపీపీ విధానంతో ప్రజలకు ఒరిగేదేమిటి? ప్రభుత్వానికి మిగిలేదేమిటి? ప్రైవేటీకరణే విధానమని నిర్ణయించుకుని ఉంటే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత వీటిపై రూ.700 కోట్లు ఎందుకు ఖర్చు చేసినట్లు? ఇప్పటివరకూ ఆయా కళాశాలల ఏర్పాటుకు అయిన ఖర్చు (భూమి + నిర్మాణాలు) తీసుకుని ప్రైవేట్ సంస్థలకు ఇచ్చి ఉంటే కనీసం ప్రభుత్వానికి కొంత డబ్బు మిగిలి ఉండేదేమో. ప్రస్తుతం ఉన్న ప్రైవేటు మెడికల్ కాలేజీలలో కూడా ఏభై శాతం సీట్లు మెరిట్ ప్రకారం, రిజర్వేషన్లు పాటిస్తూ కేటాయించాల్సిందే. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటువారికి ఉత్తపుణ్యానికి ధారాదత్తం చేసి మెడికల్ కాలేజీలను నడపాలని చెప్పడం అర్ధరహితం. ప్రైవేటు మెడికల్ కాలేజీలకు అనుమతి పొందిన సంస్థలు భూమిని స్వయంగా సమకూర్చుకుంటున్నాయి. భవనాలు సొంత ఖర్చుతో నిర్మించుకుంటున్నాయి. యంత్ర పరికరాలు ఇతర సదుపాయాలన్నీ సొంత ఖర్చుతోనే చేసుకుంటున్నాయి. కాని ఇప్పుడు ప్రభుత్వం భూమి, భవనాలు ఉచితంగా ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడంలో అర్ధం ఏమి ఉంటుంది? పైగా ఈ కాలేజీలకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రులను కూడా అప్పగిస్తారట. ఈ సంస్థలు ఉచితంగా సేవలు అందించనప్పుడు ,ప్రభుత్వం వారికి రకరకాల రూపాలలో ఫీజులు చెల్లిస్తున్నప్పుడు ప్రైవేటు పరం చేయవలసిన అవసరం ఏమిటో తెలియదు. ప్రస్తుతం నాలుగు కాలేజీలకు పీపీపీ విదానం అమలు చేస్తున్నా, భవిష్యత్తులో మిగిలిన కాలేజీలన్నిటిని అదే రకంగా అప్పచెప్పనున్నారు. బహుశా పూర్తి అయిన ఏడు కాలేజీలను కూడా అలాగే ఇచ్చేస్తే జగన్ ప్రభుత్వ రంగంలో తీసుకు వచ్చిన ఆశయాన్ని పూర్తిగా నీరుకార్చిన ఘనత కూటమి సర్కార్ కు దక్కుతుంది. ఝార్కండ్ రాజధాని రాంచీలో ఒక ప్రభుత్వ ఆస్పత్రిని ఇదే విధంగా పీపీపీ అంటూ ప్రైవేటీకరించబోగా ప్రజాసంఘాలు, రాజకీయ పక్షాలు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఒడిశా లో గత బీజేడీ ప్రభుత్వం తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ప్రైవేటు పరం చేయలేదు. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణల్లో ప్రభుత్వాలే కొత్త కాలేజీలను నడుపుతున్నాయి. ఇవన్ని ఎందుకు! ప్రతి ఏటా కేంద్ర ప్రభుత్వం వివిధ రాష్ట్రాలలో ఎయిమ్స్ సంస్థలను ఏర్పాటు చేస్తోంది కదా! ఎందుకు వారు ప్రభుత్వరంగంలోనే నెలకొల్పుతున్నారు? కొత్తగా కేంద్రం ఇస్తున్న పదివేల మెడికల్ సీట్లను ప్రభుత్వ కాలేజీలకే ఎందుకు ఇస్తున్నారు? ఏపీ ప్రభుత్వం రోడ్లు, పోర్టులు ప్రైవేటైజ్ చేయడం లేదా అని పిచ్చి వాదన చేస్తోంది. రోడ్లకు, ఓడరేవులకు వైద్యరంగానికి పోలిక పెట్టడం అంటే ప్రజారోగ్యంపైన, పేదల వైద్యంపై చులకన భావం ఉన్నట్లు అనిపించడం లేదా?ఏది ఏమైనా సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉండి ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకు రాలేకపోయిన చంద్రబాబు నాయుడు, తనకంటే చిన్నవాడైన వైఎస్ జగన్ తీసుకు వచ్చిన మెడికల్ కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటైకీరణకు దిగుతుండడం శోచనీయం. ఈ నేపథ్యంలోనే జగన్... బుద్ది జ్ఞానం ఉన్నవారెవరైనా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ కింద ప్రైవేటు వారికి అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చాక వీటిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని ప్రకటించారు. ప్రజల కోసం జగన్ సంపద సృష్టిస్తే,, ఆ సందపను చంద్రబాబు ప్రైవేటువారికి ధారాదత్తం చేయడం సరైనదా? ఇదేనా చంద్రబాబు చెప్పే విజన్?- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
వైద్య కళాశాలల ప్రైవేటీకరణ విరమించకపోతే ఉద్యమం
పాలకొల్లు సెంట్రల్: రాష్ట్రంలో ప్రభుత్వ వైద్య కళాశాలల్ని పీపీపీ విధానం పేరిట ప్రైవేటీకరించేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోకుంటే ఉద్యమం తప్పదని పశ్చిమ గోదావరి జిల్లా ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ సమితి హెచ్చరించింది. శనివారం పాలకొల్లులోని పూలపల్లి అంబేడ్కర్ భవనంలో సీపీఎం ఆధ్వర్యంలో ‘పాలకొల్లు ప్రభుత్వ మెడికల్ కళాశాల పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ’ అంశంపై నిర్వహించిన రౌండ్టేబుల్ సమావేశంలో పలువురు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరికీ వైద్య విద్య అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఒకటి చొప్పున ఒక మెడికల్ కళాశాల ఏర్పాటు చేయాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.ఇందులో భాగంగా 17 మెడికల్ కళాశాలలను జగన్మోహన్రెడ్డి ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. ఇందుకోసం గత ప్రభుత్వం రూ.2,400 కోట్లు ఖర్చు చేసిందని చెప్పారు. ఇంకా దాదాపు రూ.5 వేల కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుందన్నారు. రాష్ట్ర బడ్జెట్ రూ.3 లక్షల కోట్లు అని గొప్పలు చెబుతున్న చంద్రబాబు ప్రభుత్వం కనీసం రూ.5 వేల కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పూర్తి చేయలేదా అని ప్రశ్నించారు. గత ప్రభుత్వం అరకొర పనులు చేపట్టిందని కూటమి ప్రభుత్వం అబద్ధాలు చెబుతూ వాటిని ప్రైవేటుకు అప్పగించాలని నిర్ణయించామని కబుర్లు చెబుతూ ప్రజలకు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. పీపీపీ అంటూనే వైద్యకళాశాలలు ప్రైవేటుపరం కావని చెప్పడం హాస్యాస్పదమని మండిపడ్డారు. పీపీపీ పద్ధతి ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకే కాకుండా ఓసీ కులాల్లోని పేద విద్యార్థులకూ నష్టం కలిగిస్తుందన్నారు.వైద్యం, విద్య రెండూ ప్రభుత్వ రంగాల్లో ఉంటేనే ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. ఇప్పటికే విద్య, వైద్యం రెండూ ఖరీదయ్యాయని, మరింత ఖరీదు కాకుండా ఉండాలంటే కూటమి ప్రభుత్వ నిర్ణయం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బొర్రా గోపిమూర్తి, మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్యే దిగుపాటి రాజగోపాల్, ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్, సీపీఎం నేత జేఎన్వీ గోపాలన్, దళిత ఐక్యవేదిక అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, సంచార జాతుల సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు పెండ్ర వీరన్న, ఉపాధ్యాయ ఉద్యమ నాయకుడు జవ్వాది శ్రీనివాసరావు, జేవీవీ జిల్లా నాయకుడు యర్రా అజయ్కుమార్, దగ్గులూరు సర్పంచ్ పేరయ్య, పట్టణ జేఏసీ చైర్మన్ గుడాల హరిబాబు తదితరులు మాట్లాడారు. -
విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టే కుట్ర
సాక్షి, విశాఖపట్నం: విద్య, వైద్యాన్ని పెత్తందారుల చేతుల్లో పెట్టేసి.. ప్రజలకు ప్రధాన అవసరాల్ని దూరం చేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పేరుతో కుట్ర పన్నుతోందని ‘పీపుల్స్ ఫర్ ఇండియా’ ధ్వజమెత్తింది. రాష్ట్రంలో కొత్తగా నిర్మించిన మెడికల్ కాలేజీల్ని పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) పేరుతో కట్టబెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాల్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రజారోగ్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని కోరుతూ ప్రజారోగ్య వేదిక, పీపుల్ ఫర్ ఇండియా విశాఖపట్నం చాప్టర్ ఆధ్వర్యంలో స్థానిక అల్లూరి విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. విలువైన ప్రజాధనాన్ని కారుచౌకగా ప్రైవేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చంద్రబాబు వైఖరిపై ప్రజా ఉద్యమాలు చేపట్టాలని తీర్మానించారు.ఐదేళ్ల తర్వాత పదవిలో ఉంటామన్న గ్యారెంటీ లేదు ఐదేళ్ల తర్వాత గెలుస్తామో లేదో అన్న గ్యారెంటీ అధికారంలో ఉన్న వాళ్లకి లేదు. ఐదేళ్లలోనే 50 ఏళ్ల రాజకీయ జీవితంలో సంపాదించాల్సిందంతా సంపాదించేయాలన్న తొందరతోనే రాజకీయ నాయకులు తీసుకుంటున్న నిర్ణయాలకు ప్రజలు బలవుతున్నారు. కాబట్టి.. ప్రజలే ముందుకు రావాలి. నిరసనల్ని ఉద్యమంగా మార్చి.. ప్రజావ్యతిరేక వైఖరికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం ఉంది. – ఎంవీఎస్ శర్మ, మాజీ ఎమ్మెల్సీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రజాధనాన్ని ప్రైవేట్కివ్వడమే సంపద సృష్టా? సంపద సృష్టి అంటే ప్రజలకు అనుకున్నారు. కానీ.. ప్రైవేట్ వాళ్లకు అని చంద్రబాబు ప్రభుత్వ విధానాల ద్వారా అర్థమవుతోంది. వైద్య కళాశాలల్ని ప్రైవేట్పరం చేస్తే.. పేద విద్యార్థులు ఆర్థిక భారంతో చదువుకు దూరమవుతారు. ఇప్పటికే పేదలకు వైద్యం భారంగా మారింది. ఈ కాలేజీలు ప్రైవేట్పరం చేస్తే.. మరింత భారమవుతుందన్న విషయం ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలి. – కేఎస్ చలం, మాజీ ఉపకులపతి, ద్రవిడ యూనివర్సిటీప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో ప్రభుత్వం తీరు దుర్మార్గంగా ఉంది కేజీహెచ్కు రోజూ 3,200 ఓపీ వస్తోంది. చుట్టుపక్కల ఉన్న ప్రైవేట్ మెడికల్ కాలేజీలు, హాస్పిటల్స్ అన్నీ కలిపితే ఇందులో పావు వంతు కూడా ఓపీ ఉండదు. సింహభాగం ప్రజలకు వైద్యం ఉచితంగా.. ప్రభుత్వ హాస్పిటల్స్లోనే అందాలి. అమరావతికి రూ.లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారు. మెడికల్ కాలేజీల నిర్మాణానికి రూ.5 వేల కోట్లు కేటాయించలేరా. – టి.కామేశ్వరరావు, అధ్యక్షుడు, ప్రజారోగ్య వేదిక అప్పుడొకటి చెప్పి.. ఇప్పుడు ముంచేస్తున్నారు పీపీపీ పేరుతో సంపద మొత్తం ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తే.. ఎవరికి సొంత ఆర్థిక ప్రయోజనాలు చేకూరుతాయో అందరికీ తెలిసిందే. ఈ విషయంలో చంద్రబాబు వైఖరి స్పష్టంగానే ఉంది. లోకేశ్ పాదయాత్ర సందర్భంగా మెడికల్ కాలేజీలను ప్రభుత్వమే నడుపుతుందని హామీ ఇచ్చారు. ఇప్పుడు నిలువునా ముంచేస్తున్నారు. ప్రైవేటీకరణ నిర్ణయం వల్ల విద్యార్థులతో పాటు.. ప్రజలూ తీవ్రంగా నష్టపోతారు. – పి.రామ్మోహన్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్ఎఫ్ఐకార్పొరేట్ పీఎం, కార్పొరేట్ సీఎం వల్లే..! వైద్య కళాశాలలపై పోరాటం ప్రజా ఉద్యమంగా మారాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు కేంద్రంలో కార్పొరేట్ పీఎం, రాష్ట్రంలో కార్పొరేట్ సీఎం ఉన్నారు. ప్రజలకు సేవ చేయరు కానీ.. ప్రైవేట్ సంస్థలపై మాత్రం ప్రేమ కురిపిస్తారు. కనిపించిన ప్రభుత్వ భూములన్నీ ప్రైవేట్కు «కట్టబెట్టేలా చట్టం చేస్తారేమో. భూమి, భవనం, మౌలిక వసతులు అన్నీ కల్పించి ప్రైవేట్కు కాలేజీలను అప్పగించడం హేయమైన చర్య. – రామారావు, రిటైర్డ్ డీఎంహెచ్వో -
మెడికల్ కాలేజీలపై చర్చించాల్సిందే.. మండలిలో వైఎస్సార్సీపీ పట్టు
సాక్షి,అమరావతి: ఏపీ శాసన మండలిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగుతోంది. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాల్సిందేనని పట్టుబడుతున్నారు. కొద్ది సేపటి క్రితం ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో వాయిదా పడిన శాసన మండలి తిరిగి ప్రారంభమైంది. అయితే, సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చ జరపాలంటూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళన కొనసాగింది. పీపీపీ విధానం రద్దు చేయాలంటూ నినాదాలు చేశారు. మండలి పోడియంను చుట్టుముట్టారు. ఈ నినాదాల మధ్య మండలిలో ప్రశ్నోత్తరాలు కొనసాగాయి. అంతకుముందు ఏపీ శాసన మండలి వాయిదా పడింది. మండలి సమావేశాల నేపథ్యంలో శుక్రవారం సభలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై చర్చించాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు శాసన మండలిలో ఆందోళన చేపట్టారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. తక్షణమే సభలో చర్చించాలని ప్లకార్డ్లతో నినాదాలు చేశారు. అయితే, వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానాన్ని ఛైర్మన్ తిరస్కరించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఆందోళన చేపట్టారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో శాసనమండలి ఛైర్మన్ ఏపీ శాసన మండలిని వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్నారు. -
నియంతకు పరాభవం
‘ప్రభుత్వం ప్రజలకు భయపడినంతకాలం స్వేచ్ఛ ఉంటుంది...ప్రజలు ప్రభుత్వానికి భయపడితే నియంతృత్వం తప్పదు’ అని ఒక రాజనీతిజ్ఞుడు అంటాడు. దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సెక్–యోల్ మంగళవారం హఠాత్తుగా దేశంలో విధించిన సైనికపాలన కాస్తా జనం తిరగబడేసరికి కేవలం ఆరు గంటల్లో తోకముడిచిన తీరు దాన్ని మరోసారి అందరికీ గుర్తుచేసింది. వచ్చే నెలనుంచి డోనాల్డ్ ట్రంప్ ఏలుబడిని చవిచూడబోతున్న అమెరికా ప్రజానీకం మొదలు దేశదేశాల పౌరులూ ఈ ప్రహసనం నుంచి చాలా నేర్చుకోవచ్చు. ‘రాజ్య వ్యతిరేక శక్తుల్ని సాధ్యమైనంత త్వరగా ఏరిపారేసి దేశంలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడానికి’ ఎమర్జెన్సీ విధింపు, సైనిక పాలన తప్పనిసరయినట్టు రాత్రి పొద్దుపోయాక యూన్ ప్రకటించారు. పొరుగునున్న శత్రు దేశం ఉత్తరకొరియాకు చెందిన కమ్యూనిస్టు పాలకులతో కుమ్మక్కయిన విపక్షాలు దేశాన్ని అస్థిరపరచాలని చూస్తున్నాయని ఆరోపించారు. కానీ రోడ్లపైకొచ్చిన సైనికులకు దేశమంతా ప్రతిఘటన ఎదురవుతున్నట్టు, నిరసనోద్యమాలు తారస్థాయికి చేరినట్టు అందిన సమాచారంతో బెంబేలెత్తిన ఆయన సైనికపాలనను ఎత్తేస్తున్నట్టు తెల్లారుజామున నాలుగుగంటలప్రాంతంలో తెలియజేయాల్సివచ్చింది. పార్లమెంటు భవనంలోకి ప్రవేశించటానికి ప్రయత్నించిన సైనికులను జనం తరిమికొట్టడంతో ఆయనకు తత్వం బోధపడింది. విపక్షం తీసుకురాబోతున్న అవిశ్వాస తీర్మానంతో తనకు పదవీభ్రష్టత్వం తప్పదనుకుని హడావిడిగా వేసిన సైనిక పాలన ఎత్తుగడ కాస్తా వికటించి ఆయన రాజకీయ భవిష్యత్తుకు పూర్తిగా తలుపులు మూసేసింది. 2027 వరకూ ఉండాల్సిన అధ్యక్షపదవి మరికొన్ని రోజుల్లో ఊడటం ఖాయమన్న సంకేతాలు వెలువడుతున్నాయి. మితవాద పీపుల్ పవర్ పార్టీ (పీపీపీ) తరఫున 2022 ఎన్నికల్లో పోటీచేసేనాటికి యూన్ అనామకుడు. అప్పటికి హద్దులు దాటిన ద్రవ్యోల్బణం, ప్రజల్లో ప్రభుత్వంపై ఏర్పడ్డ తీవ్ర అసంతృప్తి ఆసరాగా చేసుకుని ఆయన అధ్యక్షుడిగా విజయం సాధించాడు. అయితే ప్రత్యర్థి డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి లీ జే–మ్యుంగ్ కన్నా ఆయనకు కేవలం ఒక శాతం ఓట్లు అధికంగా వచ్చాయి. మ్యుంగ్ సఫాయి కార్మికుడి కుమారుడు.సంపన్నవంతమైన దక్షిణ కొరియాకు అసలు సమస్యలేమిటన్న సందేహం అందరికీ వస్తుంది. దాని తలసరి ఆదాయం 36,000 డాలర్లు. పొరుగునున్న చైనాతో పోల్చినా ఇది మూడు రెట్లు అధికం. అంతర్జాతీయ మార్కెట్లో మెరిసిపోయే బ్రాండ్లకు అది పుట్టినిల్లు. శామ్సంగ్, హ్యుందయ్, కియా, పోక్సో, ఎల్జీ, ఎస్కే... ఒకటేమిటి రకరకాల సంస్థల స్థావరం ఆ దేశం. వీటిలో 600 కంపెనీల వరకూ మన దేశంతోసహా చాలా దేశాల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి. దక్షిణ కొరియా ప్రపంచంలోనే ఆరో అతి పెద్ద ఎగుమతిదారు. ఆసియాలో అది నాలుగో అతి పెద్ద ఆర్థికవ్యవస్థ. 2009నాటి ఆర్థికమాంద్యాన్ని దక్షిణకొరియా తన దరిదాపులకు రానీయలేదు. అయినా ఏదో తెలియని వెలితి ప్రజలను నిరాశానిస్పృహల్లో ముంచింది. వృద్ధుల శాతం క్రమేపీ పెరగటం, జననాల సంఖ్య పడిపోవటం సమస్యగా మారింది. అధిక పనిగంటల వల్ల మానసిక ఒత్తిళ్లు అధికం కావటం, పెళ్లిళ్లు వాయిదా వేసుకోవటం, దంపతులు సైతం కలిసుండే గంటలు తగ్గిపోవటం వంటివి ఇందుకు కారణాలు. కానీ యూన్ దీన్ని మరో కోణంలో చూశారు. ఫెమినిస్టు ఉద్యమాలే ఈ స్థితికి కారణమంటున్న ఉద్యమాలను వెనకేసుకొచ్చారు. అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో బహిరంగంగా స్త్రీ ద్వేషాన్ని చాటుకున్నారు. అధికారం చేతికి రాగానే లింగ సమానత్వాన్ని పర్యవేక్షించే సంస్థను రద్దుచేశారు. మహిళలకుండే వెసులుబాట్లు కొన్ని రద్దుచేశారు. పైగా వారానికి 52 గంటల పనిని కాస్తా పెంచే ప్రయత్నం చేశారు. వైద్యరంగ ప్రక్షాళన పేరిట దాన్ని అస్తవ్యçస్తం చేశారు. పర్యవసానంగా దేశం సమ్మెలతో హోరెత్తింది. దీనికితోడు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎడాపెడా అవినీతికి పాల్పడ్డారు. కనుకనే మొన్న ఏప్రిల్లో 300 స్థానాలుగల నేషనల్ అసెంబ్లీకి ఎన్నికలు జరిపినప్పుడు భారీ స్థాయిలో 67 శాతంమంది పోలింగ్లో పాల్గొన్నారు. విపక్షమైన డెమాక్రటిక్ పార్టీకి 180 స్థానాలు రాగా, అధికారపక్షం 108 స్థానాలకు పరిమితమైంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికై కూడా గత సైనిక పాలకుల్ని కీర్తించటం యూన్ ఒక అలవాటుగా చేసుకున్నారు. వారివల్లే దేశ ఆర్థికవ్యవస్థ పటిష్ఠంగా ఉన్నదని ఆయన నిశ్చితాభిప్రాయం. ఇందుకు భిన్నంగా ప్రజలంతా ఆనాటి నియంతృత్వాన్ని మరిచిపోలేకపోయారు. 1987కు ముందున్న సైనిక పాలన తెచ్చిన అగచాట్లు గుర్తుండబట్టే యూన్ ప్రకటన వెలువడిన వెంటనే జనం వరదలై పోటెత్తారు. ప్రజల మద్దతు గమనించినందు వల్లే అధికార, విపక్ష ఎంపీలు పార్లమెంటుకు బారులు తీరారు. ప్రధానద్వారాన్ని సైనికులు మూసేయగా జనం సాయంతో స్పీకర్తో సహా అందరూ గోడలు దూకి, కిటికీలు బద్దలుకొట్టి భవనంలోకి ప్రవేశించారు. సైనిక పాలన వెనక్కు తీసుకోవాలంటూ అధ్యక్షుణ్ణి కోరే తీర్మానాన్ని హాజరైన 190మంది ఎంపీలు ఏకగ్రీవంగా ఆమోదించారు. శత్రు దేశాలను చూపించి, కమ్యూనిస్టుల పేరు చెప్పి ఇష్టారాజ్యంగా ప్రవర్తించే శకం ముగిసిందని దక్షిణ కొరియా ఉదంతం చెబుతోంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో సమస్యలుండటం తప్పనిసరి. కానీ వాటిని సాకుగా చూపి అందరినీ మభ్యపెట్టి అధికారంలోకొచ్చాక నియంతృత్వ పోకడలకు పోతే చెల్లదని జనం చాటారు. యూన్ ఏలుబడి ఎప్పుడు ముగుస్తుందన్న సంగతి అలావుంచితే, ప్రజలు ఇదే చైతన్యాన్ని కొనసాగించగలిగితే భవిష్యత్తులో అక్కడ ఏ పాలకుడూ నియంతగా మారే ప్రమాదం ఉండదు. -
పీపీపీ విధానంలో ఐదు టెక్స్టైల్ పార్కులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పీపీపీ విధానంలో ఐదు టెక్స్టైల్ పార్కుల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రిమండలి నిర్ణయించింది. ఈమేరకు ఏపీ టెక్స్టైల్స్ గార్మెంట్ పాలసీ–2024–29కి ఆమోదం తెలిపింది. రెండు లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేస్తారు. వీటిలో సూక్ష్మ యూనిట్లకు 30 శాతం, మధ్య తరహా యూనిట్లకు 20 శాతం, పెద్ద పరిశ్రమలకు 25 శాతం పెట్టుబడి రాయితీ ఇస్తారు.సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం నిర్ణయాలను మంత్రులు కె.పార్థసారథి, పి.నారాయణ మీడియా సమావేశంలో వివరించారు. పలు పాలసీలు, అభివృద్ధి పనులకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్లు మంత్రులు వివరించారు. కాకినాడ పోర్టులో షిప్ సీజ్ విషయంలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా సంప్రదించాల్సి ఉందని మంత్రి తెలిపారు. మంత్రిమండలి ఇతర నిర్ణయాలు.. ⇒ ఐటీ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్ పాలసీ–2024–29కి ఆమోదం. దీని కింద ఐటీ సంస్ధల కోసం మౌలిక వసతులు కలి్పంచే డెవలపర్లకు, కో వర్కింగ్ స్పేస్, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్ అభివృద్ధి చేసే వారికి పలు రాయితీలు ఇస్తారు. ఐటీ కాంప్లెక్స్తో పాటు ఎంటర్టైన్మెంట్ సెంటర్లు అభివృద్ది చేసే వారికి 50 శాతం కేపిటల్ రాయితీ ఇస్తారు.కో వర్కింగ్ స్పేస్కు రాయితీకి కనీసం 100 సీట్ల సామర్ఢ్యం లేదా 10 వేల చదరపు అడుగుల కార్యాలయ సముదాయం ఉండాలి. నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్కు పది సీట్ల సామర్ధ్యం లేదా వెయ్యి చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ ఉండాలి. కో–వర్కింగ్లో సీటుకు నెలకు రూ.2 వేలు, నైబర్హుడ్ వర్కింగ్ స్పేస్లో సీటుకు నెలకు రూ.1000 చొప్పున 6 నెలలు రాయితీ ఇస్తారు. 5 లక్షల చదరపు అడుగుల ఫ్లోర్ ఏరియా పైబడిన ఐటీ క్యాంపస్ ఏర్పాటు చేసేవారికి పెట్టుబడిలో 50 శాతం రాయితీ ఇస్తారు. ⇒ పీఎంఏవై కింద నిర్మాణం ప్రారంభమై అసంపూర్తిగా ఉన్న పట్టణ ప్రాంతాల్లోని 6.41 లక్షల ఇళ్లు, గ్రామీణ ప్రాంతాల్లో 1.90 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని 2026 మార్చికల్లా పూర్తి చేయాలని మంత్రిమండలి నిర్ణయించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అనుసరించిన మూడు ఆప్షన్ల విధానంలో, అదే యూనిట్ విలువకు వీటిని నిర్మిస్తారు. జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికీ తాగునీరు అందించాలని నిర్ణయించింది. ⇒ పోర్టు ఆధారిత పరిశ్రమల అభివృద్ధి లక్ష్యంతో ఏపీ మారిటైమ్ పాలసీ–2024–29కి ఆమోదం. మెగా పోర్టు మంజూరుకు ప్రయతి్నంచాలని మంత్రిమండలి నిర్ణయించింది. ⇒ టూరిజంకు పారిశ్రామిక హోదా కలి్పస్తూ నూతన విధానానికి ఆమోదం. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో టెంపుల్, ఎకో టూరిజం, వెల్నెస్, అగ్రీ సర్క్యూట్ ప్రాజెక్టులు చేపడతారు. ⇒ పౌర సేవల సులభతరం, వాట్సాప్ ద్వారా అన్ని సరి్టఫికెట్లు అందించడం లక్ష్యంగా ఆర్టిజీఎస్ పాలసీ–2024–29కు ఆమోదం.⇒ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ మొబిలిటీ పాలసీ–2024–29కి ఆమోదం. రాజధానిని ఎలక్ట్రికల్ మొబిలిటీ సిటీగా తీర్చిదిద్దేలా పాలసీ. దీని ద్వారా రూ.30 వేల కోట్ల పెట్టుబడి, 60 వేల ఉద్యోగాల కల్పనే లక్ష్యం. విద్యుత్ వాహనాలు కొనే వారికి రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ. ⇒ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన శ్రీకాకుళం జిల్లా ఉద్ధానం, పులివెందుల, డోన్ తాగునీటి ప్రాజెక్టుల ధరల జీవో 62 ద్వారా సవరణకు ఆమోదం. ⇒ ఆయుర్వేద, హోమియోపతిక్ బోర్డుల పేర్లను మార్చడం, నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ యాక్ట్ 2020 కి అనుగుణంగా బోర్డు పునరి్నర్మాణానికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ⇒ డిసెంబర్ 15న పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఘనంగా నిర్వహించాలని నిర్ణయం. ఆయన జన్మస్థలంలో నివాసం ఉన్న ఇంటిని మ్యూజియంగా తీర్చిదిద్దాలని, ఆయనపై లఘు చిత్రాన్ని రూపొందించాలని నిర్ణయం. ⇒ రాజధానిలో గతంలో చేపట్టి, పూర్తికాకుండా ఉన్న రూ.7,391.65 కోట్ల విలువైన పనుల్లో 18 పనులను తిరిగి చేపట్టేందుకు రూ.11,471 కోట్లకు ఈ నెలలో టెండర్లను ఆహా్వనించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ నెలలో టెండర్లు పూర్తిచేసి, మూడేళ్లలో పనులు పూర్తి చేయాలని నిర్ణయించింది. ధరలు, జీఎస్టీ, డ్యామేజీ కారణంగా ఈ పనుల వ్యయం 30 శాతం పెరిగినట్లు మంత్రులు తెలిపారు. -
‘ఇమ్రాన్కు పోటీగా విపక్షాల అభ్యర్థి’
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్(పీటీఐ) పార్టీ అధ్యక్షుడు ఇమ్రాన్ ఖాన్ ఈ నెల 11న పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టనుండగా ఆయనకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలు పావులు కదుపుతున్నాయి. ఇందుకోసం ప్రత్యర్థి పార్టీలైనా నవాజ్ షరీఫ్కు చెందిన పాకిస్తాన్ ముస్లిం లీగ్- నవాజ్(పీఎంఎల్-ఎన్) పార్టీ, బెనర్జీర్ భుట్టో కుమారుడి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ(పీపీపీ)లు ఏకతాటిపైకి వచ్చాయి. ఇతర చిన్న పార్టీలను కలుపుకొని విపక్ష కూటమిని ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి. గురువారం రెండు పార్టీల నేతలు మాట్లాడుతూ.. పార్లమెంటులో ఇమ్రాన్కు పోటీగా విపక్ష కూటమి తరఫున అభ్యర్థిని నిలుపడానికి ప్రయత్నిస్తున్నట్టు ప్రకటించారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగానే ఈ కూటమి ఏర్పాటు జరిగిందని పీఎంఎల్-ఎన్ పార్టీ నేత మర్యమ్ ఔరంగజేబు తెలిపారు. ఎన్నికలు జరిగనప్పటి నుంచి పీఎంఎల్-ఎన్, పీపీపీ పార్టీలు ఇమ్రాన్ రిగ్గింగ్కు పాల్పడినట్టు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, జూలై 25న జరిగిన సాధారణ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ 116 స్థానాలు సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటుకు ఇతరుల మద్దతు కూడగట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకోసం కొన్ని చిన్న పార్టీలు, పలువురు ఇండిపెండెట్ల మద్దతుతో ఇమ్రాన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధపడ్డారు.విపక్షాలు ఎంతగా ప్రయత్నించిన ఇమ్రాన్ ప్రధాని కాకుండా అడ్డుకోవడం కష్టమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. -
ఇన్ఫ్రాకు పెద్దపీట..
- అదనంగా రూ. 70,000 కోట్ల కేటాయింపులు - ఎన్ఐఐఎఫ్ ఏర్పాటు ‘పీపీపీ’ ప్రాజెక్టులకు ఊతం న్యూఢిల్లీ: వృద్ధి ఆశలతో పొంతన లేకుండా ఉన్న మౌలిక సదుపాయాలను మెరుగుపర్చే చర్యలపై కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దృష్టి పెట్టారు. ఈ ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 2015-16లో అదనంగా రూ. 70,000 కోట్లు కేటాయిస్తున్నట్లు బడ్జెట్లో పేర్కొన్నారు. ప్రభుత్వం ముందున్న అయిదు ప్రధాన సవాళ్లలో.. ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులను ఆకర్షించడం కూడా ఒకటని ఆయన చెప్పారు. ఈ రంగ వృద్ధికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) ప్రాతిపదికన ప్రాజెక్టులకు ఊతమివ్వాల్సిన అవసరం ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. రహదారుల నిర్మాణానికి రూ. 14,031 కోట్ల మేర, రైల్వేలకు రూ. 10,050 కోట్ల మేర స్థూలంగా బడ్జెట్లో కేటాయింపులు పెంచినట్లు జైట్లీ చెప్పారు. మొత్తం మీద ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు రూ. 3,17,889 కోట్ల స్థాయిలో ఉంటాయని... 2014-15తో పోలిస్తే ఇది సుమారు రూ. 80,844 కోట్ల పెరుగుదలని వివరించారు. జాతీయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ ..: మౌలిక రంగానికి ఊతం ఇచ్చే దిశగా జాతీయ పెట్టుబడి, మౌలిక సదుపాయాల నిధి(ఎన్ఐఐఎఫ్)ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. దీనికి ఏటా రూ. 20,000 కోట్ల మేర నిధులు దక్కేలా చూడనున్నట్లు వివరించారు. ఇది ఐఆర్ఎఫ్సీ, ఎన్హెచ్బీ వంటి మౌలిక సదుపాయాల ఫైనాన్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేయగలదని తద్వారా ఇన్ఫ్రా సంస్థలకు నిధులు లభించగలవని పేర్కొన్నారు. రైలు, రహదారులు, నీటి పారుదల రంగ ప్రాజెక్టులకు సంబంధించి పన్నురహిత ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాండ్ల జారీని కూడా అనుమతించే ప్రతిపాదన పరిశీలనలో ఉందని జైట్లీ చెప్పారు. పీపీపీ విధానాన్ని సమీక్షించి, పునరుద్ధరించాల్సిన అవసరం ఉందన్నారు. మరోవైపు రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడితో కొత్తగా మరో 5 అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామగ్రామానికీ రహదారులు..: ప్రస్తుతం రహదారి సౌకర్యాలు అంతంత మాత్రంగా ఉన్న 1,78,000 పైచిలుకు ప్రాంతాలకు రోడ్ల నిర్మాణంపై దృష్టి పెడుతున్నట్లు జైట్లీ తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే నిర్మాణంలో ఉన్న లక్ష కిలోమీటర్ల రహదారులతో పాటు మరో లక్ష కిలోమీటర్ల రోడ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంటుందన్నారు. ఇక పెట్రోలు, డీజిల్పై ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్ సుంకంలో కొంత భాగాన్ని రోడ్డు సెస్సు కింద మార్చాలని, ఈ నిధులను రహదారులు ఇతర ఇన్ఫ్రా ప్రాజెక్టుల నిర్మాణానికి ఉపయోగించాలని యోచిస్తున్నట్లు జైట్లీ చెప్పారు. -
ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాలో 6 దేశీ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా వినూత్న ఇన్ఫ్రా ప్రాజెక్టుల్లో ఆరు దేశీ ప్రాజెక్టులు చోటు దక్కించుకున్నాయి. ఇందులో హైదరాబాద్కి చెందిన దిగ్గజం మేఘా ఇంజినీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఎంఈఐఎల్) చేపట్టిన నర్మదా కెనాల్ సోలార్ ప్రాజెక్టు కూడా ఉంది. ఇదే కాకుండా ఢిల్లీ మెట్రో, యమునా ఎక్స్ప్రెస్వే, టాటా పవర్కి చెందిన ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు (గుజరాత్), ఇంటర్సెప్టర్ స్యూవేజ్ సిస్టమ్, గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్-సిటీ (గిఫ్ట్) ఈ జాబితాలో ఉన్నాయి. అత్యంత ప్రభావం చూపగలిగే వినూత్నమైన ప్రాజెక్టులతో ‘ఇన్ఫ్రాస్ట్రక్చర్ 100’ పేరిట అంతర్జాతీయ అకౌంటింగ్ సంస్థ కేపీఎంజీ ఈ జాబితాను తయారు చేసింది. ప్రాజెక్టు వ్యయం, సంక్లిష్టత, సాధ్యాసాధ్యాలు, నవ్యత, సమాజంపై ప్రభావం అంశాల ప్రాతిపదికగా దీన్ని రూపొందించినట్లు కేపీఎంజీ వివరించింది. న్యూఢిల్లీ, ఆగ్రాను కలుపుతూ దాదాపు 165 కిలోమీటర్ల పొడవుండే ఆరు లేన్ల యమునా ఎక్స్ప్రెస్వే 2012లో ప్రారంభమైంది. దీని నిర్మాణానికి 1.9 బిలియన్ డాలర్ల వ్యయం అయ్యింది. ప్రపంచ స్థాయి ఇన్ఫ్రాను అభివృద్ధి చేయగలిగే సత్తా భారత్కి ఉందని ఇది చాటిచెప్పగలదని కేపీఎంజీ వివరించింది. మరోవైపు, 2.3 బిలియన్ డాలర్ల వ్యయంతో ఏర్పాటైన ఢిల్లీ మెట్రో ఎప్పటికప్పుడు సవాళ్లను అధిగమిస్తూ మరింతగా విస్తరిస్తోందని పేర్కొంది. 4.4 బిలియన్ డాలర్ల ముంద్రా అల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టు.. భారత విద్యుత్ రంగంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టుల్లో మైలురాయిలాంటిదని కేపీఎంజీ తెలిపింది. ఇక గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీని 20 బిలియన్ డాలర్ల వ్యయంతో త లపెట్టారు. దాదాపు 400 వైవిధ్యమైన ప్రాజెక్టులను పరి శీలించి కేపీఎంజీ 100 సంస్థలను ఎంపిక చేసింది. ఎంఈఐఎల్ ప్రాజెక్టు..: 17.9 మిలియన్ డాలర్ల వ్యయంతో కూడిన నర్మదా కెనాల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టింది. కాంట్రాక్టులో భాగంగా దాదాపు 5.5 కిలోమీటర్ల పొడవునా కెనాల్పై సోలార్ ఫొటోవోల్టయిక్ గ్రిడ్ను ఏర్పాటు చేసి, 25 సంవత్సరాల పాటు నిర్వహించాల్సి ఉంటుంది. ఇది ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య ప్రాజెక్టు. -
80% భూమి సేకరించాకే హైవే ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: జాతీయ రహదారుల ప్రాజెక్టులకు అవసరమైన భూమిలో కనీసం 80 శాతాన్ని సేకరించకుండా ఆయా ప్రాజెక్టులకు టెండర్లు పిలవబోమని కేంద్ర రహదారి రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆయన బుధవారం ఇక్కడ జరిగిన ఫిక్కీ సదస్సులో తెలిపారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో కనీసం 10 శాతం భూమిని కూడా సేకరించకుండానే ప్రాజెక్టులు మొదలుపెట్టారనీ, రహదారుల రంగంలో నెలకొన్న సమస్యలకు ఇదే కారణమనీ విమర్శించారు. వచ్చే 5-10 ఏళ్లలో బిడ్డింగ్ నిర్వహించడానికి 300 ప్రాజెక్టులను అన్ని అనుమతులతో సిద్ధం చేస్తున్నామని తెలిపారు. ఈ రంగంలో అభివృద్ధి మందగించడానికి ఫైళ్లను త్వరగా క్లియర్ చేయకపోవడమే కారణమని గుర్తించినట్లు చెప్పారు. మౌలిక సౌకర్యాలు, వ్యాపారాల్లో సమయమే అత్యంత కీలకమైనదనీ, ఫైళ్లు మూడు నుంచి ఆరునెలల పాటు పెండింగులో ఉంటున్నాయనీ చెప్పారు. ఇలాంటి జాప్యాల కారణంగా దేశంపై రోజుకు రూ.15 కోట్ల భారం పడుతోందన్నారు. రైల్వేల నుంచి అనుమతులు లేకపోవడంతో 300కు పైగా రైల్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం పెండింగులో ఉందన్నారు. మౌలికం వృద్ధికి పటిష్ట పీపీపీ నమూనా మౌలిక రంగం అభివృద్ధికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుందని ఆర్థిక కార్యదర్శి అరవింద్ మయారామ్ సదస్సులో పేర్కొన్నారు. ఈ దిశలో పటిష్టవంతమైన, సంక్లిష్టతలకు తావులేని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్య (పీపీపీ) విధాన నమూనాకు రూపకల్పన చేస్తున్నట్లు కూడా వెల్లడించారు. -
రైలు దారి మార్చుకుంటోంది....
న్యూఢిల్లీ : కూ చిక్ చిక్ అంటు వచ్చిన ఎన్డీయే రైలు బండి దారి మార్చుకుంటోంది. విదేశీ పెట్టుబడులకు రైల్వేశాఖ తలుపులు తెరుస్తోంది. రైల్వేలో వందశాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే సూచనలు కనిపిస్తున్నాయి. పీపీపీల పేరు (ప్రభుత్వ, ప్రయివేట్ భాగస్వామ్యం)తో ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేపట్టింది. పదేళ్ల తర్వాత తొలిసారి రైల్వే బడ్జెట్ ప్రవేశపెట్టిన బీజేపీ రైల్వేల్లో ఎఫ్డీఐలకు అనుమతించాలని కేంద్రాన్ని కోరింది. మౌలిక సదుపాయాల కల్పనకు పీపీపీ పద్దతిలో పనులు చేపడతామని రైల్వే మంత్రి సదానందగౌడ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత దేశ ఆర్థిక వ్యవస్థకు రైల్వే శాఖ ఆత్మ వంటిదన్న సదానంద గౌడ 62 నిమిషాల ప్రసంగంలో ఎక్కువ సార్లు వినిపించిన పదం పీపీపీ. దేశం మొత్తంలో చాలా రంగాలు ప్రైవేటీకరణ చేతికి అప్పగించినాఇప్పటి వరకు రైల్వే శాఖను ప్రైవేటు పరం చేయాలనే ఆలోచనను ధైర్యంగా ప్రభుత్వం చేయలేదు. ఒకవేళ రైల్వే శాఖలో కూడా ప్రైవేటు భాగస్వామ్యం కల్పిస్తే ఇక దేశం మొత్తం కూడా ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టినట్టే అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు విపక్షాలు కూడా మోడీ సర్కార్ రైల్వే శాఖను ప్రయివేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని విమర్శిస్తున్నాయి. నిజానికి కి ప్రధాని మోడీ ఎఫ్డిఐలకు ఇప్పటికే సూత్రప్రాయంగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జమ్ము కాశ్మీర్ లో కాత్రా-ఉధంపూర్ రైల్వే లైన్ ప్రారంభోత్సవం సందర్భంగా ఆయన ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు. రైల్వే సంస్థ అభివద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యాన్ని పెంచాల్సిన అవసరముందని మోడీ వ్యాఖ్యానించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే ఈ చర్యలు తప్పవని చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.


