-
కర్నూలులో కదం తొక్కిన జగనన్న జనాభిమానం (ఫొటోలు)
-
నరసాపురం సిద్ధం.. సీఎం జగన్ కోసం జన ప్రభంజనం (ఫొటోలు)
-
నారాసురుడిది ఆదినుంచీ రక్త చరిత్రే
రాజకీయ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే..జనంతో మమేకమవుతూ.. ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాజీలేని పోరాటాలు చేస్తూ.. ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రజల్లో విశ్వసనీయతను చాటుకోవడం ఒక మార్గం. పూటకో కుట్ర, రోజుకో కుతంత్రం పన్నుతూ.. రాజకీయంగా నీడనిచ్చిన వారికి వెన్నుపోటు పొడుస్తూ.. ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణించి మట్టుబెడుతూ రక్తపుటేరులు పారించడం రెండో మార్గం.. శకునిలోని కుటిలత్వం.. దుర్యోధనుడిలోని క్రూరత్వం.. దుశ్శాసనుడిలోని కిరాతకం.. ధృతరాష్ట్రుడిలోని కపటత్వం కలగలిసి దుష్టచతుష్టయ లక్షణాలను పుణికిపుచ్చుకున్నరెండున్నర ఎకరాల రైతు కుటుంబానికి చెందిన నారా చంద్రబాబునాయుడు రెండో మార్గాన్నే ఎంచుకున్నారు. విద్యార్థి దశలోనే ఏడుకొండలవాడి పాదాల చెంత ఎస్వీ యూనివర్సిటీని సం‘కుల’ సమరానికి వేదికగా మార్చారు.. కుల రాజకీయాలతో దాడులకు తెగబడ్డారు.విద్యార్థి నాయకుడి దశ నుంచి రాజకీయ నాయకుడిగా రూపాంతరం చెందాక.. కుట్రలు, కుతంత్రాలు, హత్యా రాజకీయాలతో రక్తపుటేరులకు కేరాఫ్గా మారారు. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయ జీవితంలో అడుగడుగునా రక్తపు మరకలే! సాక్షి, అమరావతి: సార్వత్రిక ఎన్నికల్లో పేదల పక్షాన నిలబడిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బస్సు యాత్రలో సంఘీభావం తెలిపేందుకు ఊరూరా వాడవాడన మేమంతా సిద్ధం అంటూ ప్రజలు తండోపతండాలుగా కదలివస్తూ నీరాజనాలు పలుకుతున్నారు. ప్రజా క్షేత్రంలో ఒంటరిగా వైఎస్ జగన్ను ఎదుర్కోవడానికి భయపడి జనసేన, బీజేపీతో జట్టుకట్టి.. మూడు పార్టీలు సంయుక్తంగా నిర్వహిస్తున్న సభలకు జనం మొహం చాటేస్తుండటంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆందోళన చెందుతున్నారు. సీఎం జగన్కు వస్తున్న ప్రజా స్పందనను చూసి ఓర్వలేక.. రాజకీయ ఉనికి ప్రశ్నార్థకం అవుతుందనే భయంతో శనివారం తాడికొండలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభలో సాయంత్రం 5.20 గంటలకు ప్రసంగిస్తూ రాళ్లు, చేతికి ఏది దొరికితే దాంతో సీఎం జగన్పై దాడి చేయాలని చంద్రబాబు ఆ పార్టీ శ్రేణులను రెచ్చగొట్టారు. చంద్రబాబు ప్రోద్బలంతో కరుడుగట్టిన టీడీపీ మూకల ముఠా విజయవాడ సింగ్నగర్లో డాబా కొట్ల సెంటర్ వద్ద బస్సు యాత్రలో సీఎం జగన్ రోడ్షో నిర్వహిస్తారని ముందే గ్రహించి.. పక్కా ప్రణాళికతో హత్యాయత్నానికి తెగబడ్డారు. ఈ హత్యాయత్నంపై చంద్రబాబు తనయుడు లోకే‹శ్, ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్న తీరును చూస్తుంటే ఇందులో బాబు హస్తం ఉందని సీఎం జగన్ అభిమానులే కాదు పలు రాజకీయ పార్టీల సీనియర్ నేతలు, సామాన్య ప్రజలు సైతం అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. స్కిల్ స్కాంలో అడ్డంగా సీఐడీ పోలీసులకు పట్టుబడి.. రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై బయటకొచి్చనప్పుడు చంద్రబాబు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడికి జరగనటువంటి రీతిలో సీఎం జగన్ను దారుణంగా శిక్షిస్తానంటూ చంద్రబాబు ఆవేశంతో ఊగిపోవడాన్ని రాజకీయ పరిశీలకులు ఎత్తిచూపుతున్నారు. జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్ప పాదయాత్రలో జనం నీరాజనాలు పలుకుతుండటం చూసి ఓర్వలేక విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో కోడికత్తితో హత్యాయత్నానికి తెగబడేలా కుట్ర చేశారు. చంద్రబాబు వ్యవహార శైలి మొదటి నుంచి ఇలానే ఉందని పలు ఘటనలను ఉదహరిస్తున్నారు. కుట్రలు, కుతంత్రాలే శ్వాసగా.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న తర్వాత చంద్రబాబు తన సహజ లక్షణాలైన కుట్రలు, కుయుక్తులకు మరింత పదును పెట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ. ఎన్టీ రామారావు మంత్రివర్గంలో, టీడీపీలో.. నాదెండ్ల భాస్కర్రావు, నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. వారిని అడ్డుతొలగించుకోకపోతే తాను ఎదగలేననే భావనతో.. ఆ ముగ్గురిని టీడీపీ నుంచి సాగనంపడానికి కుట్రలు చేశారు. 1984 జనవరి 9 నాటికి ఎన్టీఆర్ సీఎంగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా.. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో భారీఎత్తున సభ నిర్వహించారు. ఈ సభలో ఎన్టీఆర్పై మల్లెల బాబ్జీని ఉసిగొలిపి.. హత్యాయత్నం చేయించి.. ఆ నెపాన్ని తనపైకి నెట్టడానికి ప్రయత్నించారని నాదెండ్ల భాస్కర్రావు అనేక సందర్భాల్లో చెప్పారు. ఆ తర్వాత మల్లెల బాబ్జీకి ఇస్తానన్న రూ.3 లక్షల సుపారీ ఇవ్వకుండా చంద్రబాబు ద్రోహం చేశారని.. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన మల్లెల బాబ్జీ 1988లో ఆత్మహత్య చేసుకున్నాడనే విమర్శలు ఉన్నాయి. నాదెండ్ల భాస్కర్రావు తిరుగుబాటుతో ఎన్టీఆర్ ప్రభుత్వం కుప్పకూలింది. దీనికి నిరసనగా ఎన్టీ రామారావు శాంతియుతంగా ప్రజా పోరాటం చేశారు. కానీ.. ఎన్టీఆర్కు తెలియకుండా అప్పట్లో రాష్ట్రంలో హింసాత్మక సంఘటనలకు ప్రేరేపించి.. అగ్నిగుండం చేసిన చరిత్ర చంద్రబాబుదేనని ఆయన తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ‘ఒక చరిత్ర–కొన్ని నిజాలు’ పేరుతో రాసిన పుస్తకంలో స్పష్టం చేశారు. ఆ తర్వాత 1985 ఎన్నికల్లో ఓటమి భయంతో పోటీ చేసేందుకు చంద్రబాబు జంకారు. టీడీపీ అధికారంలోకి రావడంతో ఎన్టీఆర్ దన్నుతో కర్షక పరిషత్ చైర్మన్గా దొడ్డిదారిన పదవి పొంది.. ప్రజాధనాన్ని అడ్డగోలుగా దోపిడీ చేశారు. తన దోపిడీ గుట్టంతా నాటి సీఎం ఎన్టీఆర్ వ్యక్తిగత కార్యదర్శి రాఘవేంద్రరావుకు తెలిసినందున పక్కా ప్రణాళికతో ఆయన్ను మట్టుబెట్టించి.. దాన్ని ప్రమాదంగా చిత్రీకరించారని అప్పట్లో టీడీపీ నేతలే ఆరోపించారు. అప్పట్లోనే ఓ వర్గం నేతలను చంద్రబాబు చేరదీసి వర్గ రాజకీయాలకు తెరతీశారని ఎన్టీఆర్కు సీనియర్ నేతలు ఫిర్యాదులు కూడా చేశారు. మహానేత సహకారంతో మంత్రి పదవి దివంగత ముఖ్యమంత్రి మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి సహకారంతో టి.అంజయ్య మంత్రివర్గంలో స్థానం దక్కించుకున్న చంద్రబాబు.. ఆ తర్వాత ఆయన పట్ల కనీసం కృతజ్ఞత ప్రదర్శించని స్వార్థ పరుడని రాజకీయ విశ్లేషకులు స్పష్టీకరిస్తున్నారు. మంత్రిగా ఉన్న సమయంలోనే ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని చంద్రబాబు వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించాక... 1983లో జరిగిన ఎన్నికల్లో తన మామ ఎన్టీఆర్పైనే పోటీ చేస్తానంటూ బీరాలు పలికిన చంద్రబాబు.. చంద్రగిరి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి ఘోర పరాజయం పాలయ్యారు. రాజకీయ అస్థిత్వం కోసం మామను బతిమాలి టీడీపీలో చేరారు. వద్దని వారించినా అల్లుడనే కనికరంతో చంద్రబాబును ఎన్టీఆర్ చేరదీశారని టీడీపీ సీనియర్ నేతలు పలు సందర్భాల్లో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. విద్యార్థి దశలోనే సం‘కుల’ సమరం చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెలో 1950 ఏప్రిల్ 20న జన్మించిన చంద్రబాబు.. విద్యార్థి దశలో తిరుపతిలోని గోవిందరాజస్వామి డిగ్రీ కళాశాల, వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సం‘కుల’ సమరాన్ని రాజేసి.. విద్యాలయాలను భ్రష్టుపట్టించారని నాటి సహ విద్యార్థులు చెబుతున్నారు. కుల రాజకీయాలతో ఎదిగిన చంద్రబాబు.. కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ అరంగేట్రం చేశారు. గల్లా రాజగోపాలనాయుడి శిష్యరికంతో 1978లో కాంగ్రెస్ పార్టీ టికెట్ సాధించి.. చంద్రగిరి నియోజకవర్గం నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. అనంతరం రాజకీయ భిక్ష పెట్టిన గల్లా రాజగోపాలనాయుడికి తీరని ద్రోహం చేశారనే విమర్శలు ఉన్నాయి. తొమ్మిదేళ్ల పాలనలో ఏరులై పారిన రక్తం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి సీఎం పీఠాన్ని అధిరోహించిన చంద్రబాబు.. 1995 – 2004 మధ్య కాలంలో రాజకీయాల్లో ప్రత్యర్థులను వర్గ శత్రువులుగా పరిగణిస్తూ వచ్చారు. రాయలసీమలో ఫ్యాక్షన్ ను రాజేసి.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయ ప్రత్యర్థులను అంతమొందించారనే ఆరోపణలు ఉన్నాయి. అనంతపురం జిల్లాలో ప్రత్యర్థి రాజకీయ పార్టీకి చెందిన 415 మందిని వెంటాడి వేటాడి చంపేయడంలో కీలక భూమిక పోషించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యకమమ్యాయి. ఇలా హత్యకు గురైన వారిలో 300 మంది మృతదేహాల ఆచూకీ ఇప్పటికీ లభించలేదు. రాజకీయ ప్రయోజనాల కోసం కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ రక్కసిని రాజేసి వందలాది హత్యలకు కారణమయ్యారని బాధిత కుటుంబాలు ఆరోపిస్తున్నాయి. కడప జిల్లాలో ఫ్యాక్షన్ తార స్థాయికి చేరడానికి చంద్రబాబు ఎప్పటికప్పుడు కుట్రలు చేశారని టీడీపీ సీనియర్ నేతలే పలు సందర్భాల్లో ఆరోపించారు. చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లోనూ ఇదే రీతిలో ప్రత్యర్థులను మట్టుబెట్టారనే విమర్శలు ఉన్నాయి. 2003లో చంద్రబాబు ప్రభుత్వ హయాంలోనే తనకు రక్షణ కల్పించాలని పరిటాల రవి కోరారు. కానీ.. పరిటాల రవికి భద్రత కల్పించలేదు. 2005లో పరిటాల రవి హత్యకు గురైన తర్వాత రాష్ట్రాన్ని అగ్ని గుండంగా మార్చేలా టీడీపీ శ్రేణులను ఉసిగొల్పడంపై చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారని.. జిల్లాల వారీగా టార్గెట్లు పెట్టి మరీ ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయించారని ఆ పార్టీ సీనియర్ నేతలే వివిధ సందర్భాల్లో తీవ్ర విమర్శలు చేశారు. జర్నలిస్టు పింగళి దశరథరామ్ హత్య తమ అక్రమాలు, ఆగడాలను ప్రశి్నంచిన రాజకీయ నాయకుల్నే కాదు.. జర్నలిస్టులను సైతం టీడీపీ నేతలు మట్టుబెట్టారు. విజయవాడలో ‘ఎన్కౌంటర్’ అనే పక్షపత్రికకు పింగళి దశరథరామ్ వ్యవస్థాపక సంపాదకుడు, పబ్లిషర్గా వ్యవహరించేవారు. కాంగ్రెస్, టీడీపీల ప్రజావ్యతిరేక విధానాలను తీవ్రంగా విమర్శించేవారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అవినీతి, అక్రమాలను తన పత్రికలో ఎండగట్టారు. ఈ నేపథ్యంలో 1985 అక్టోబర్ 20వ తేదీ రాత్రి 9 గంటలకు విజయవాడలోని సత్యనారాయణపురంలో రిక్షాలో వెళ్తున్న దశరథరామ్ను గూండాలు అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య చేయించింది చంద్రబాబేనని ప్రజలు ఇప్పటికీ భావిస్తుంటారు. వెన్నుపోటుతో ఎన్టీఆర్ కన్నుమూత కుట్రలు, కుయుక్తులతో టీడీపీలో ఎదిగిన చంద్రబాబు.. 1995లో రాజకీయ అస్థిత్వాన్ని కల్పించిన మామ ఎన్టీఆర్కే ద్రోహం తలపెట్టి వెన్నుపోటు పొడిచారు. వైస్రాయ్ హోటల్లో నిర్బంధించిన తన ఎమ్మెల్యేలను విడిపించుకోవడానికి వచ్చిన ఎన్టీ రామారావుపై చెప్పులతో దాడి చేయించిన నైజం చంద్రబాబుది అన్నది జగది్వదితం. తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, బావమరిది ఎన్.హరికృష్ణలను మభ్యపెట్టి.. వారి సహకారంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల్లోనే వారిద్దరినీ టీడీపీ నుంచి సాగనంపారు. చంద్రబాబుకు సహకరించి తప్పు చేశానని దగ్గుబాటి వెంకటేశ్వరరావు అనేక సందర్భాల్లో ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు వెన్నుపోటుతో అధికారాన్ని కోల్పోయిన ఎన్టీఆర్.. వైస్రాయ్ హోటల్ వద్ద చెప్పులు వేయించిన ఘటనతో మరింత క్షోభకు గురై ఆ ఆవేదనతోనే కన్నుమూశారు. ఎన్టీఆర్ కన్ను మూయడానికి కొద్ది రోజుల ముందు చంద్రబాబు గురించి చేసిన వ్యాఖ్యలు ఆయన నేర చరిత్రను ఎత్తిచూపాయి. వంగవీటి రంగా హత్యలో కీలక పాత్ర రాష్ట్రంలో 1985 ఎన్నికల్లో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన వంగవీటి మోహనరంగా.. ప్రజా పోరాటాలతో తిరుగులేని నాయకుడిగా ఆవిర్భవించారు. రంగాను అడ్డుతొలగించుకోకపోతే కోస్తాలో రాజకీయ మనుగడ ఉండదని చంద్రబాబు భావించారని చెబుతున్నారు. అందుకే అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్కు తెలియకుండా కుట్ర చేసి.. 1988 డిసెంబర్ 26న ప్రజా సమస్యల పరిష్కారం, వ్యక్తిగత భద్రత కోసం ఆమరణ దీక్ష చేస్తున్న రంగాను అతి దారుణంగా హత్య చేయించడంలో చంద్రబాబు కీలక పాత్ర పోషించారని సీనియర్ నేత చేగొండి హరిరామజోగయ్య తన ఆత్మకథలో ఏకరవు పెట్టారు. మహానేత కుటుంబంపై ఎప్పుడూ కక్షే ► రాష్ట్రంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కుటుంబం దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. ఆ కుటుంబాన్ని కడతేర్చితే రాజకీయంగా తనకు తిరుగుండదని చంద్రబాబు భావించారని.. అందువల్లే వైఎస్ కుటుంబంపై కక్ష కట్టి.. మట్టుబెట్టేందుకు ఎప్పటికప్పుడు కుట్రలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ► 1999లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికలను ఎదుర్కొంది. కడప జిల్లాపై వైఎస్ రాజశేఖరరెడ్డి తండ్రి వైఎస్ రాజారెడ్డి ముద్ర బలమైంది. ఆయన్ను హత్య చేస్తే.. వైఎస్ రాజశేఖరరెడ్డిని కడప జిల్లాకే పరిమితం చేయవచ్చునని.. తద్వారా ఎన్నికల్లో విజయం సాధించి అధికారాన్ని నిలుపుకోవచ్చునని నాటి సీఎం చంద్రబాబు భావించారని చెబుతున్నారు. వైఎస్ రాజారెడ్డిని 1998 మే 23న పులివెందులకు సమీపంలో హత్య చేశారు. హత్య చేసిన వారికి నెల రోజులపాటు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు తన అధికారిక నివాసంలోనే ఆశ్రయం కల్పించారనే విమర్శలు అప్పట్లో బలంగా వ్యక్తమయ్యాయి. వైఎస్ రాజారెడ్డి హత్య కేసులో నిందితుడైన రాగిపిండి సుధాకర్రెడ్డిని టీడీపీ ప్రభుత్వ హయాంలో క్షమాభిక్షపై విడుదల చేయడం ఆ విమర్శలకు బలం చేకూర్చుతోంది. ► 2019 ఎన్నికల్లో మళ్లీ అధికారాన్ని చేజిక్కించుకోవడం కోసం అత్యంత ప్రజాదరణ కలిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతమొందించేందుకు కుట్ర పన్నారు. విశాఖపట్నం విమానాశ్రయంలో సామాన్యులు ఎవరూ ప్రవేశించలేని వీఐపీ లాంజ్లో.. తనకు అత్యంత సన్నిహితుడైన నేతకు చెందిన రెస్టారెంట్లో పని చేసే ఉద్యోగి ద్వారా వైఎస్ జగన్ను కడతేర్చేందుకు 2018 అక్టోబర్ 25న కుట్ర చేశారు. హత్యాయత్నం నుంచి వైఎస్ జగన్ బయటపడ్డ తర్వాత చంద్రబాబు వ్యవహరించిన తీరు ఆయనే ఈ కుట్రకు సూత్రధారి అనేలా ఉందని రాజకీయ విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. ► 2019 ఎన్నికలకు ముందు ఎన్డీయే నుంచి వేరుపడిన చంద్రబాబు.. అప్పట్లో రాష్ట్ర పర్యటనకు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై తిరుపతిలో రాళ్లతో దాడి చేయించారు. ఇప్పుడు తన రాజకీయ జీవితానికి ముప్పు ఏర్పడటంతో పవన్ కళ్యాణ్తో కలిసి అమిత్ షాతో కాళ్లబేరానికి దిగి.. మళ్లీ బీజేపీ పంచన చేరారు. ఇలా అడుగడుగునా చంద్రబాబు కుట్రలు, కుతంత్రాలతో రాజకీయం చేస్తున్నారు. తాజాగా దుష్టచతుష్టయంతో కలిసి చెలరేగిపోతున్నారు. 2014–19 మధ్య అధికారం అండతో హత్యాకాండ ► రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ అధికారంలోకి వచి్చంది. 2014–19 మధ్య టీడీపీ పాలనలో సాగిన హత్యాకాండలో 30 మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలను మట్టుబెట్టారు. ► 2014 జూలై 3న అనంతపురం జిల్లా యల్లనూరు మండల వైఎస్సార్సీపీ నాయకుడు ప్రకాశం శెట్టిని టీడీపీ నేతలు హత్య చేశారు. ► 2014 ఆగస్టు 11న కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం గొట్టుముక్కల గ్రామంలో వైఎస్సార్సీపీ గ్రామ పంచాయతీ ఉపసర్పంచి ఆలోకం కృష్ణారావు(55)ను టీడీపీ కార్యకర్తలు హత్య చేశారు. తర్వాత అదే గ్రామంలోని వైఎస్సార్సీపీ ఎంపీటీసీ సభ్యుడు గుదే అక్కారావు ఇంటిపైనా దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. ► 2014 ఆగస్టు 21న గుంటూరు జిల్లా బొల్లాపల్లి మండలం మేళ్లవాగు గ్రామంలో వైఎస్సార్సీపీకి చెందిన అన్నదమ్ములు బూసి పెదనాగిరెడ్డి, చిననాగిరెడ్డిపై తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసి చంపేశారు. ► 2014 ఆగస్టు 22న అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామంలో వైఎస్సార్సీపీ నేత మల్లిఖార్జునను హత్య చేశారు. ► 2014 సెపె్టంబరు 1న అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం కణేకల్ మండలం హనుమాపురం సర్పంచ్ విశ్వనాథ్ ప్రాణం తీశారు. ► 2014 సెపె్టంబర్ 11న గుంటూరు జిల్లా చినగార్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త గోవింద్రెడ్డి హత్యకు గురయ్యాడు. ► 2014 నవంబర్ 27న కర్నూలు జిల్లా పలుకురులో వైఎస్సార్సీపీ నేత ప్రభాకర్నాయుడు హత్యకు గురయ్యారు. ► 2014 డిసెంబర్ 30న నెల్లూరు జిల్లాలో అల్లం నరేంద్రను హత్య చేశారు. ► 2015 మార్చి 31న అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గం పెద్దవడుగూరు మండలం కిష్టిపాడు సింగిల్ విండో అధ్యక్షుడు విజయభాస్కర్రెడ్డిని సింగిల్ విండో కార్యాలయంలోనే టీడీపీ నేతలు కత్తులు, వేటకొడవళ్లతో దారుణంగా నరికి చంపారు. ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్రెడ్డి ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందనే ఆరోపణలున్నాయి. ► 2015 ఏప్రిల్ 29న అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్సార్సీపీ మండల మాజీ కనీ్వనర్ ప్రసాద్రెడ్డిని రాప్తాడు తహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలే దారుణంగా హత్య చేశారు. ఒక్క అనంతపురం జిల్లాలోనే దాదాపు 12 రాజకీయ హత్యలు జరిగాయి. ► 2015 మే 15న కర్నూలు జిల్లా వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు వసంతరావుపై దాడి చేసి చంపేశారు. ► 2015 అక్టోబర్ 14న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చింతకుంటలో వైఎస్సార్సీపీ నేత రాఘవరెడ్డిని హత్య చేశారు. ► 2016 డిసెంబర్ 9న వైఎస్సార్ జిల్లా పులివెందుల నియోజకవర్గం వేంపల్లె మండలం అలవలపాడు ఎంపీటీసీ సభ్యుడు గజ్జెల రామిరెడ్డి ప్రత్యర్థుల చేతిలో దారుణ హత్యకు గురయ్యాడు. మండల సర్వసభ్య సమావేశం ముగించుకొని వేంపల్లె నుంచి అలవలపాడు గ్రామానికి మోటార్ సైకిల్పై వెళ్తుండగా టీడీపీకి చెందిన కృష్ణారెడ్డి, ఆయన అనుచరులు సుమోతో ఢీకొట్టి, వేట కొడవళ్లతో నరికి చంపారు. ► 2017 మే 6న కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గోవిందపల్లిలో వైఎస్సార్సీపీ నేత ఇందూరి ప్రభాకర్రెడ్డి, ఆయన బావ మరిదిని దారుణంగా హత్య చేశారు. ► 2017 మే 21న కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త చెరుకులపాడు నారాయణరెడ్డిని క్రిష్ణగిరి మండలం రామకృష్ణాపురం వద్ద హత్య చేశారు. -
కటకటాల్లోకే అవినీతి పరులు..మోదీ ఘాటు విమర్శలు
ప్రధాని నరేంద్ర మోదీ ఉత్తరప్రదేశ్ మీరట్లో లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. రాబోయే ఎన్నికలు ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం కోసం కాదని ‘వికసిత్ భారత్’ కోసమని అని అన్నారు. ►‘గత 10 ఏళ్లలో అవినీతికి వ్యతిరేకంగా మేం తీసుకున్న చర్యల్ని దేశం మొత్తం చూసింది. పేదల సొమ్మును దోచుకోకుండా మేం భరోసా ఇచ్చాం. అందుకే అవినీతిపరులు ఈ రోజు కటకటాల వెనుక ఉన్నారని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. ►రాబోయే ఎన్నికలు అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్న ఎన్డీయేకు అవినీతిపరులను కాపాడే ప్రతిపక్షానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని సూచించారు. ► నేను అవినీతిపరులను మాత్రమే విచారించడం లేదు. నా దేశ ప్రజలను ఎవరు దోచుకున్నారో, నా ప్రజల దోచుకున్న సంపదను తిరిగి వారికి చెందేలా చూడడమే అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. ► బీజేపీ ఇప్పటికే మూడోసారి గెలుపు కోసం సన్నాహాలు ప్రారంభించింది. రాబోయే ఐదేళ్ల కోసం మేము రోడ్మ్యాప్ను రూపొందిస్తున్నాము. మొదటి 100 రోజుల్లో మనం ఎలాంటి ప్రధాన నిర్ణయాలు తీసుకోవాలనే దానిపై వేగంగా పని జరుగుతోంది’ అని మోదీ అన్నారు. ►గత 10 సంవత్సరాలలో, మీరు అభివృద్ధి ట్రైలర్ మాత్రమే చూశారు. అసలు అభివృద్ది ముందున్నదన్న మోదీ.. ఈ సారి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్ధులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. -
‘400 సరే.. 200 సీట్లలో గెలవమనండి’.. బీజేపీకి దీదీ సవాల్
ఈ సారి లోక్సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీకి పశ్చిమ బెంగాల్ సీఎం, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ సవాల్ విసిరారు. కనీసం 200 లోక్సభ స్థానాల్లో గెలిచి చూపించాలని ఛాలెంజ్ చేశారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తల గాయం నుంచి కోలుకున్న మమతా బెనర్జీ అనంతరం తొలిసారి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వివాదాస్పద మహిళా నేత, పశ్చిమ బెంగాల్ కృష్ణానగర్ లోక్సభ టీఎంసీ అభ్యర్ధి మహువా మొయిత్రా తరుపున ప్రచారం చేశారు. ఈ ఎన్నికల ర్యాలీలో ‘బీజేపీ 400కి పైగా లోక్సభ స్థానాల్లో గెలుస్తామని అంటోంది. ముందుగా 200 సీట్ల బెంచ్మార్క్ను దాటాలని నేను బీజేపీకి సవాలు చేస్తున్నాను. 2021 పశ్చిమ బెంగాల్ 294 అసెంబ్లీ స్థానాలకు గాను 200పైగా సీట్లు గెలుస్తామని బీజేపీ ప్రగల్భాలు పలికింది. కానీ 77 సీట్లతో సరిపెట్టుకుందని’ ఎద్దేవా చేశారు. #InPics | West Bengal chief minister Mamata Banerjee, along with TMC leader Mahua Moitra, holds a poll rally in Krishnanagar.#ElectionsWithNDTV #LokSabhaElection2024 pic.twitter.com/4iuTTL203Q — NDTV (@ndtv) March 31, 2024 సీఏఏని అనుమతించబోం ‘పౌరసత్వ సవరణ చట్టాన్ని(సీఏఏ) చట్టబద్ధమైన పౌరులను విదేశీయులుగా మార్చేందుకు ఒక ఉచ్చు. అందుకే రాష్ట్రంలో మేం సీఏఏని అనుమతించబోం. సీఏఏ కోసం దరఖాస్తు చేయడం వల్ల దరఖాస్తుదారు విదేశీయులుగా మారతారని, కాబట్టి దరఖాస్తు చేసుకోవద్దని ప్రజల్నిహెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించినందునే టీఎంసీ అభ్యర్థి మహువా మోయిత్రాకు మద్దతుగా కృష్ణానగర్లో జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె మాట్లాడుతూ.. ‘మా ఎంపీ మహువా మొయిత్రా బీజేపీకి వ్యతిరేకంగా గళం విప్పినందున ఆమెను లోక్సభ నుండి బహిష్కరించారు’ అని టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న బీజేపీ ఈ సందర్భంగా విపక్షాల ఇండియా కూటమిపై మమతా బెనర్జీ మండి పడ్డారు. ‘పశ్చిమ బెంగాల్లో ఇండియా కూటమి లేదు. రాష్ట్రంలో సీపీఐ, కాంగ్రెస్ కూటములు బీజేపీ కోసమే పనిచేస్తున్నాయి’ అని అన్నారు. -
ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ.. మాటల తూటాలు!
సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: లోక్సభ ఎన్నికల వేళ ప్రధాన పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం షురూవైంది. ఇరు పార్టీల నేతలు పరస్పరం మాటల తూటాలు పేలుతున్నాయి. ఆయా పార్టీల క్యాడర్ను ఈ ఎన్నికలకు సమాయత్తం చేయడంలో భాగంగా నిర్వహిస్తున్న సమావేశాల్లో నేతలు ఒకరినొకరు చేసుకుంటున్న ప్రత్యారోపణలతో ఉమ్మడి మెదక్ జిల్లా రాజకీయం వేడెక్కింది. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ నేతల విమర్శలు రాజకీయవర్గాల్లో రచ్చకు దారితీస్తున్నాయి. బీఆర్ఎస్ ఎద్దేవా? బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు అంటే ఎలక్షన్లు, కలెక్షన్లు అంటూ బీఆర్ఎస్ నేతలు సైటెర్లు వేశారు. గులాబీ పార్టీ సంగారెడ్డి నియోజకవర్గం ముఖ్య నాయకుల సమావేశం మంగళవారం స్థానిక ఓ ఫంక్షన్ హాలులో జరిగింది. దుబ్బాకలో ప్రజలు తిరస్కరించిన ఆయన్నే బీజేపీ మెదక్ లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దించిందని కారు పార్టీ నేతలు విమర్శలు గుప్పించారు. అలాగే కేంద్ర ప్రభుత్వ తీరును కూడా ఎండగట్టారు. నచ్చినోళ్లు జేబులో ఉండాలి నచ్చనోళ్లు జైలులో ఉండాలి అన్నట్లుగా బీజేపీ సర్కారు వ్యవహరిస్తోందని విమర్శించారు. ఆయనకు నిధులెక్కడివి? బీఆర్ఎస్ నేతల విమర్శలను కమలం పార్టీ తిప్పికొట్టింది. బీఆర్ఎస్ అభ్యర్థి పి.వెంకట్రాంరెడ్డికి రూ. వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ బీజేపీ అభ్యర్థి రఘునందన్రావు ప్రశ్నించారు. తాను ఎంపీగా గెలిచాక రూ.వంద కోట్లు సొంత నిధులతో పీవీఆర్ ట్రస్ట్ను ఏర్పాటు చేస్తామని వెంకట్రాంరెడ్డి ప్రకటించారు. ఇందులోంచి ఏటా రూ.20 కోట్లతో నియోజకవర్గంలోని నిరుపేద విద్యార్థులకు ఉచితంగా ఉన్నత విద్యను అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ వివరాలను పక్కాగా వెబ్సైట్లో ఉంచుతానని స్పష్టం చేశారు. ఆయనకు రూ.వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయంటూ సంగారెడ్డిలో బుధవారం నిర్వహించిన బీజేపీ ముఖ్యనేతల సమావేశంలో రఘునందన్ ప్రశ్నించారు. ఇవి చదవండి: కాంగ్రెస్కు ఓటేస్తే రైతుల పరిస్థితి ఆగమే.. : వినోద్కుమార్ -
‘సందేశ్ఖాలీ’ బాధితురాలు, ఎంపీ అభ్యర్థి రేఖా పత్రకి ప్రధాని ఫోన్
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్లోని సందేశ్ఖాలీ బాధితురాలు, బసిర్హట్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రను ప్రధాని నరేంద్ర మోదీ పరామర్శించారు. ఆమెతో ఫోన్లో స్వయంగా మాట్లాడారు. సందేశ్ఖాలీలో షాజహాన్ షేక్ ఆకృత్యాలను బయటపెట్టిన రేఖా పత్రను శక్తి స్వరూపిణి ( శక్తి అనే పదం దుర్గా, కాళీ వంటి దేవతల) తో పోల్చారు. ప్రధాని మోదీ: సందేశ్ఖాలీ ప్రజలు ఎలా ఉన్నారు. వారి పరిస్థితి ఇప్పుడెలా ఉంది? రేఖ పత్ర : తృణమూల్ కాంగ్రెస్ షాజహాన్ షేక్ ఆగడాలు అన్నీ ఇన్నీ కావు. కేంద్రం సహకారంతో మా కష్టాలు తీరాయి. ప్రధాని మోదీ : బసిర్హట్ నియోజకవర్గం అభివృద్ది చేసే బాధ్యతను మీకే అప్పగించాం. రేఖపత్ర : సందేశ్ఖాలీ మహిళల పట్ల మీరు దేవుడిలాంటి వారు. ఆ రాముడే మాతో ఉన్నట్లు భావిస్తున్నాం. ప్రధాని మోదీ: వారి ఆశీసులు పొందినందుకు నేను సంతోషిస్తున్నాను. మహిళామణులకు ఎల్లవేళలా కృతజ్ఞుడినై ఉంటాను. బీజేపీ అభ్యర్థిగా మీ ఎంపిక పట్ల ప్రజలు ఎలా స్పందిస్తున్నారు? రేఖ పత్ర : మొదట మీరు నన్ను లోక్సభ అభ్యర్ధిగా ప్రకటించడంపై పలువురు మహిళలు నిరసనలు వ్యక్తం చేశారు. ఆ తర్వాతే వాళ్లల్లో చైతన్యం కలిగింది. తృణముల్ కాంగ్రెస్ నేతల సూచనల మేరకే తాము ఇలా ఆందోళన చేశామని, ఇకపై ఇలా చేయబోమని హామీ ఇచ్చారు. వారితో నాకు ఎలాంటి శత్రుత్వం లేదు. నేను వారి కోసం పని చేస్తా. ప్రధాని మోదీ : మీకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారి బాగు కోసం పని చేప్తున్నందుకు అభినందనలు. మిమ్మల్ని అభ్యర్థిగా నిలబెట్టి గొప్ప పని చేశాం. రేఖ పత్ర : నాకు ప్రజా మద్దతు లభిస్తుందన్న నమ్మకం నాకుంది. ‘నేను నిరుపేదరాలిని. నా భర్త చెన్నైలో పనిచేస్తున్నారు. మేం బతకడానికి చాలా కష్టపడుతున్నాము. ఇక్కడ ప్రజలకు పని లభించేలా, వారు రాష్ట్రం విడిచి వెళ్లాల్సిన అవసరం లేకుండా నేను ఏదైనా చేయాలని అనుకుంటున్నారు. ప్రధాని మోదీ : మీ గెలుపు ఖాయం. ‘మీరు శక్తి స్వరూపిణి. శక్తివంతమైన నేతను జైలుకే పంపారు. బసిర్హట్లోనే కాదు, వెస్ట్ బెంగాల్ అంతటా మహిళల గౌరవం కోసం కలిసి పోరాడుదాం. మీకు నా పూర్తి మద్దతు ఉంది’. ‘బెంగాల్ దుర్గా మాత నెలవు. మీరు ఆ శక్తి స్వరూపం. సందేశ్ఖాలీ మహిళలు గొంతు ఎత్తడం అంత సులభం కాదు. ఈసారి బెంగాల్లోని నారీశక్తి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని భావిస్తున్నాం’ అంటూ ప్రధాని మోదీ బసిర్హట్ లోక్సభ బీజేపీ అభ్యర్ధి రేఖ పత్రతో సంభాషణ ముగించారు. -
లోక్సభ స్పీకర్ ఓం బిర్లాపై పోటీ చేసే కాంగ్రెస్ అభ్యర్ధి ఎవరంటే
న్యూఢిల్లీ : రానున్న లోక్సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్ధుల ఎంపికపై కాంగ్రెస్ తీవ్ర కసరత్తే చేస్తోంది. తాజాగా రాజస్థాన్, తమిళనాడు ఐదు లోక్సభ స్థానాలకు అభ్యర్ధుల్ని ఖరారు చేస్తూ ఆరో జాబితాను విడుదల చేసింది. రాజస్థాన్లో అజ్మీర్ లోక్సభ స్థానం నుండి రామచంద్ర చౌదరి, రాజ్సమంద్ నుండి సుదర్శన్ రావత్, భిల్వారా నుండి దామోదర్ గుర్జార్, కోటా నియోజకవర్గంలో ప్రహ్లాద్ గుంజాల్కు చోటు కల్పించింది. గుంజాల్ బీజేపీ అభ్యర్ధి, లోక్సభ స్పీకర్ ఓం బిర్లాతో తలపడనున్నారు. రాజస్థాన్లో 25 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్రంలో రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. ఫేజ్ 1 (ఏప్రిల్ 19) 12 స్థానాలకు పోలింగ్ జరగనుండగా, మిగిలిన 13 స్థానాలకు రెండో దశలో (ఏప్రిల్ 26న) పోలింగ్ జరుగుతుంది. తమిళనాడులో తిరునెల్వేలి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్పై సి రాబర్ట్ బ్రూస్కు చోటు కల్పించింది. తమిళనాడులోని మొత్తం 39 లోక్సభ స్థానాలకు ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. कांग्रेस अध्यक्ष श्री @kharge की अध्यक्षता में आयोजित 'केंद्रीय चुनाव समिति' की बैठक में लोकसभा चुनाव, 2024 के लिए कांग्रेस उम्मीदवारों के नाम की छठवीं लिस्ट। pic.twitter.com/KoXyKzYH87 — Congress (@INCIndia) March 25, 2024 -
‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’
దిస్పూర్, సాక్షి : లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయా పార్టీల నేతలు తమ ప్రచార పర్వాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అయితే ఈ ప్రచారంలో ఒకేసారి రెండు ప్రత్యర్థి పార్టీల నాయకులు, కార్యకర్తలు ఎదురు పడితే ఎలా ఉంటుంది. అచ్చం ఇక్కడా అదే జరిగింది. మరి ఆ తర్వాత ఏమైంది. అస్సాం దిబ్రూఘర్ లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్, ‘ఇండియా’ బ్లాక్ కూటమి అభ్యర్థిగా లూరింజ్యోతి గొగోయ్ పోటీ చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో తమను గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో అస్సాం దిబ్రూఘర్ జిల్లా హల్దీబారి నగర్ థాన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఖోవాంగ్లోని హల్దీబారి నఘర్ థాన్ అనే ప్రార్థనా స్థలంలో కలిసి కనిపించారు. అనుకోకుండా జరిగిన ఈ హఠాత్పరిణామానికి ఇరువురు నేతలు ఆశ్చర్యపోయినా అతని మోముపై చిరునవ్వు చిందించారు. ‘నమస్తే అన్నా’..‘బాగున్నావా తమ్మీ’ రాజకీయాల్లో ప్రత్యర్థులు కామన్. పార్టీల మధ్య, నేతల మధ్య కూడా విమర్శలు కామన్. అయితే.. ఇవి హద్దుల్లోనే ఉన్నాయనే సంకేతాలిచ్చారు ఇరు పార్టీల లోక్సభ అభ్యర్థులు. నిత్యం నువ్వెంత అంటే.. నువ్వెంత అనుకునే రాజకీయ నాయకులు కాస్త ఆప్యాయంగా ఒకరినొకరు పలకరించుకున్నారు. నమస్తే అన్నా అంటే.. బాగున్నావా తమ్మీ అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చి పుచ్చుకుంటూ క్షేమ సమాచారం గురించి తెలుసుకున్నారు. అంతేకాదు పక్కపక్కనే కూర్చుని టీ తాగుకుంటూ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతుందంటూ మాట్లాడుకోవడం ఎన్నికల సిత్రాలు స్థానికుల్ని ఆకట్టుకుంటున్నాయి. విద్యార్ధి సంఘానికి అధ్యక్షులుగా బీజేపీ అభ్యర్థి సర్బానంద సోనోవాల్, అస్సాం జాతీయ పరిషత్ (ఏజేపీ) అధ్యక్షుడు లూరింజ్యోతి గొగోయ్లు సీనియర్, జూనియర్. వారిద్దరూ గతంలో అస్సాంలోని పురాతన విద్యార్థి సంఘమైన ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ (ఏఏఎస్యూ) అధ్యక్షులుగా పనిచేశారు. సోనావాల్ మా సీనియరే ‘ఈ సందర్భంగా లూరింజ్యోతి గొగోయ్ మాట్లాడుతూ.. మేం ఒకరికొకరం శుభాకాంక్షలు చెప్పుకున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మేం ఇక్కడ పనిచేస్తున్నాం. ప్రత్యర్ధులమే అయినా మేం విద్యార్ధి సంఘంలో కలిసి పనిచేశాం. అతను (సోనావాల్ని ఉద్దేశిస్తూ) మా సీనియర్ అంటూ సంభాషించారు. కాగా, డిబ్రూగఢ్ నియోజకవర్గంలో మొదటి దశలో ఏప్రిల్ 19న పోలింగ్ జరగనుంది. -
నోరు తెచ్చిన చేటు.. తిరుగులేని బీజేపీ నేత కొంపముంచింది
బెంగళూరు, సాక్షి : రానున్న లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా పెట్టుకున్న బీజేపీ అభ్యర్ధుల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోంది. ముఖ్యంగా వివాదస్పద చరిత్ర ఉన్న నేతలకు మొండి చేయిచూపిస్తుంది. తాజాగా, ఆరుసార్లు లోక్సభ సభ్యునిగా పనిచేసిన ఓ నేతకు సీటు ఇచ్చేది లేదని కరాఖండీగా చెప్పేసింది. అదే సమయంలో నోరు పారేసుకుని పార్టీ ఇస్తున్న అవకాశాల్ని చేజార్చుకోవద్దని హితువు పలుకుతోంది. బీజేపీ ఎంపీ అనంతకుమార్ హెగ్డే. కర్ణాటకలోని ఉత్తర కన్నడ లోక్సభ స్థానంలో తిరుగులేని నేత. వరుసగా నాలుగు లోక్సభ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించారు.కానీ నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కర్ణాటకలోనే కాదు పలుమార్లు ఆయన చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదాస్పద మయ్యాయి. ఫలితంగా ఈసారి లోక్సభ సీటును హెగ్డేకి ఇవ్వలేదు. ఆయనకు బదులు మరో నేతకు ఇచ్చింది. ఇటీవల బీజేపీ అధిష్టానం ఈ సారి లోక్సభ ఎన్నికల్లో 400 పై చీలూకు స్థానాల్లో విజయం సాధించాలంటూ అభ్యర్ధులకు దిశా నిర్ధేశం చేసింది. ఆ తర్వాతే కర్ణాటక ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ రాజ్యాంగాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉందని, అది బీజేపీ మాత్రమే చేయగలుగుతుందన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాలను గెలుచుకోగలిగితే అది సాధ్యమన్న ఆయన.. ఆ సంఖ్య పొందాలంటే తమ పార్టీకి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. అయితే ఈ వివాదాస్పద వ్యాఖ్యలపై కమలం అధిష్టానం హెగ్డేపై ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా లోక్సభ ఎన్నికల కోసం 17 రాష్ట్రాల నుంచి 111 మంది అభ్యర్ధులతో ఆదివారం ఐదో జాబితా విడుదల చేసింది. అందులో అనంతకుమార్ హెగ్డేకు స్థానం కల్పించలేదు. ఉత్తర కన్నడ లోక్సభ స్థానంలో ఈ సారి హెగ్డేకి బదులు ఆరుసార్లు ఎమ్మెల్యేగా, కర్ణాటక అసెంబ్లీ స్పీకర్గా పని చేసిన విశ్వేశ్వర హెగ్డే కాగేరికి సీటును ఖరారు చేసింది. ఇలా అనంత్ కుమార్ హెగ్డేతో పాటు వివాదాలకు కేంద్ర బిందువుగా ఉండే నేతలకు లోక్సభ సీటును తిరస్కరించింది. అలాంటి వారిలో ప్రగ్యాసింగ్ ఠాకూర్, దక్షిణ ఢిల్లీ బీజేపీ ఎంపీ రమేశ్ బిధూరి, పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మలు ఉన్నారు. -
లోక్సభ ఎన్నికలు.. ఈ సారైనా తమిళసైకి అదృష్టం వరించేనా?
సాక్షి, చెన్నై : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ...ఈసారి భారీ మెజార్టీ సాధనే లక్ష్యంగా పెట్టుకుంది. లోక్సభ ఎన్నికల్లో 400 స్థానాల్లో విజయ బావుటా ఎగుర వేసేలా నిర్దేశించుకుంది. ఇందుకోసం వివాదాల్లేని నేతల్ని లోక్సభ అభ్యర్ధులుగా బరిలోకి దించుతుంది. పార్టీకి బలమైన అభ్యర్థులు లేనిచోట్లా ఇతర పార్టీలకు చెందిన కీలక నాయకులు, సిట్టింగ్ ఎంపీలకు అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో ప్రస్తుతం గవర్నర్లుగా పనిచేస్తున్న ప్రముఖుల్ని ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఆహ్వానిస్తుంది. తాజాగా తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి రాజీనామా చేసిన తమిళిసై సౌందరరాజన్కు చెన్నై సౌత్ సీటును కేటాయించింది. ఈ మేరకు 9 మందితో తాజాగా విడుదల చేసిన మూడో జాబితాలో బీజేపీ అధిష్టానం తమిళిసైకి చోటు కల్పించింది. దీంతో తమిళసై సౌందరరాజన్ ఎవరు? అని ప్రతి ఒక్కరూ తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తమిళిసై సౌందరరాజన్ ఎవరు? నగర్ కమ్యూనిటీ వర్గానికి చెందిన ప్రముఖ కాంగ్రెస్ నాయకుడు కుమారి అనంతన్ కుమార్తే తమిళిసై సౌందరరాజన్. వ్యాపారవేత్త..రాజకీయవేత్త హెచ్ వసంతకుమార్ మేనకోడలు. తమిళిసై సౌందరరాజన్ వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె గైనకాలజిస్ట్గా తన వృత్తిని ప్రారంభించారు. సోనాలజీ, ఫీటల్ థెరపీలో ప్రత్యేక శిక్షణ పొందారు. ఆమెకు చిన్నతనం నుంచే రాజకీయాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతుండగా విద్యార్థి సంఘం నాయకురాలిగా పనిచేసి, బీజేపీ సిద్ధాంతాల వైపు ఆకర్షితులై ఆ పార్టీలో చేరారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001 లో తమిళనాడు రాష్ట్ర వైద్య విభాగం ప్రధాన కార్యదర్శిగా, 2007 లో అఖిల భారత కో-కన్వీనర్ గా, 2007లో బీజేపీ ప్రధాన కార్యదర్శిగా, 2010లో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షురాలిగా, 2013లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా, 2014లో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా సేవలందించారు. 1999లో దక్షిణ చెన్నై జిల్లా వైద్య విభాగం కార్యదర్శిగా, 2001లో మెడికల్ వింగ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, 2005లో ఆల్ ఇండియా కో-కన్వీనర్ (దక్షిణాది రాష్ట్రాల వైద్య విభాగం)గా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా బీజేపీ రాష్ట్ర శాఖలో తమిళసై పనిచేశారు. 2007, 2010లో రాష్ట్ర ఉపాధ్యక్షురాలుగా, 2013లో జాతీయ కార్యదర్శిగా ఉన్నత బాధ్యలు చేపట్టారు. తమిళనాడు బీజేపీ మాజీ అధ్యక్షురాలిగా పనిచేసిన తమిళిసై 2006, 2011లో అసెంబ్లీ ఎన్నికల్లో 2009, 2019 లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయారు. సెప్టెంబర్ 2019లో తెలంగాణ గవర్నర్గా సౌందరరాజన్ నియమితులయ్యారు. కిరణ్ బేడీని తొలగించిన తర్వాత ఆమెకు పుదుచ్చేరి ఎల్జీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పుడు తర్వలో జరగబోయే లోక్సభ ఎన్నికల బరిలోకి దిగి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు తమిళసై. -
గెలుపెవరిది : లోక్సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించేదెవరు
సార్వత్రిక ఎన్నికల సమరానికి నగరా మోగడంతో దేశం ఇక పార్టీల ప్రచారాలతో హోరెత్తుతుంది. కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల మధ్య మినహ పార్లమెంటు ఎన్నికల్లో దాదాపుగా ఎన్డీయే, ఇండియా కుటముల మధ్య పోరు జరగనుంది. ఉత్తరాది ఇండియా కూటమికి, దక్షిణాదాది ఎన్డీయే కూటమికి పరీక్షగా నిలవనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలు, ఆయా పార్టీల కీలక నేతలు? గెలుపు - ఓటముల్ని ప్రభావితం చేసే అంశాలను ఒక్కసారి పరిశీలిస్తే.. మహరాష్ట్ర మహరాష్ట్రాల్లో బీజేపీ, కాంగ్రెస్, ఎన్సీపీ(అజిత్ పవార్ వర్గం), ఎన్సీపీ (శరద్ చంద్ర పవార్), శివసేన (శిందే వర్గం), శివసేన (యూబీటీ)లు ప్రధాన పార్టీలుగా ఉన్నాయి. ఆయా పార్టీల్లో ఏక్నాథ్ షిండే, శరద్ పవార్, ఉద్ధవ్ ఠాక్రే, దేవేంద్ర ఫడణవీస్, అజిత్ పవార్లు ముఖ్య నేతలుగా వ్యవహరిస్తున్నారు. ఇక రాష్ట్రంలో అత్యంత కీలక నియోజక వర్గాలుగా నాగ్పూర్, బారమతిలు ఉన్నాయి. మహరాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం ఎన్డీయే కూటమికి -41 సీట్లు, యూపీఏ కూటమికి - 5 సీట్లు, ఇతరులు -2 సీట్లను కైవసం చేసుకోగా రానున్న లోక్సభ ఎన్నికల్లో హిందూత్వావాదం, ద్రవ్యోల్బణం, నిరుద్యోగితతో పాటు, ఎన్సీపీ, శివసేనల్లో చీలికలు ప్రభావితం చేయనున్నాయి. దీంతో ఏ పార్టీలో ఎంత మంది అభ్యర్ధులు గెలుస్తారో వేచి చూడాల్సి ఉంది. తమిళనాడు తమిళనాడులో గవర్నర్ అర్ఎన్ రవి వర్సెస్ అధికార పార్టీ డీఎంకేల మధ్య వివాదం కొనసాగుతున్న ఈ తరుణంలో ఈ సారి లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది అనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చాంశనీయంగా మారింది. డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీలు ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తుండగా.. తూత్తుకూడి, శివగంగ నియోజకవర్గాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయి. ఇక తమిళనాడులో మొత్తం 39 లోక్సభ స్థానాలు, 234 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత లోక్సభ ఎన్నికల్లో డీఎంకే - 24, కాంగ్రెస్- 8, అన్నాడీఎంకే -1లు గెలుపొందగా.. ఈ సారి స్టాలిన్ సంక్షేమ పథకాలు మోదీ కరిష్మా లోక్సభ ఎన్నికల ఫలితాలపై ప్రభావం చూపనుంది. కర్ణాటక కర్ణాటకలో కాంగ్రెస్,బీజేపీ, జేడీ(ఎస్)లు ప్రధాన పార్టీలుగా వ్యవహరిస్తుండగా.. సిద్ధరామయ్య, బీఎస్,యడియూరప్ప, డి.కే, శివకుమార్, హెచ్డీ దేవెగౌడలు కీలక నేతలుగా ఉన్నారు. ఇక రాష్ట్రంలో గుల్బర్గా, హసన్, మాండ్య నియోజకవర్గాలపై ప్రాధాన్యత ఎక్కువగా ఉంది. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-25, కాంగ్రెస్-1,ఇతరులు-2 లోక్సభ స్థానాల్లో దక్కించుకుంది. మరి ఈ సారి ఏ పార్టీ ఎన్నిసీట్లు గెలుస్తుందా? అనేది ఆయా పార్టీల అభ్యర్ధుల పనితీరు, అభివృద్దిపై ఆధారపడింది. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు, మోదీ చరిష్మా ఎన్నికల్లో కీలకం కానున్నాయి. కేరళ కేరళలలో సీపీఎం నేతృత్వంలోని ఎల్డీఎఫ్, కాంగ్రెస్ నాయకత్వంలోని యూడీఎఫ్, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కీలకంగా వ్యవహరిస్తుండగా.. కీలక నేతలుగా పినరయి విజయన్, కె.సురేంద్రన్లు ఉన్నారు. కీలక నియోజక వర్గాలుగా తిరువనంతపురం, వయనాడ్లు ఉన్నాయి. రాష్ట్రంలో మొత్తం 20 లోక్సభ స్థానాలు, 140 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత లోక్సభ ఎన్నికల్లో యూడీఎఫ్ - 19, ఎల్డీఎఫ్ -1 సీట్లు గెలిచాయి. సహకార రంగంలో అవకతవకలు, రైతుల సమస్యలు, సీఎం విజయన్ కుటుంబంపై అవినీతి ఆరోపణలు ప్రభావితం చూపనున్నాయి. గోవా గోవాలో బీజేపీ, కాంగ్రెస్, ఆప్లు ప్రధాన పార్టీలుగా కొనసాగుతుండగా కీలక నేతలుగా ప్రమోద్ సావంత్, అమిత్ పాట్కర్లు కీలక నేతలుగా.. ఉత్తర గోవా.. దక్షిణ గోవాలు కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. గోవాలో మొత్తం లోక్సభ స్థానాలు-2, అసెంబ్లీ స్థానాలు -40 ఉండగా.. గత లోక్సభ ఎన్నికల్లో బీజేపీ-1, కాంగ్రెస్-1 సీటును దక్కించుకున్నాయి. ఈ సారి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్, జీఎఫ్బీ, శివసేన ఐక్యంగా పోటీ చేస్తుండడం, మోదీ కరిష్మా ఏ విధంగా ప్రభావితం చూపనున్నాయనేది తెలియాల్సి ఉంది. గుజరాత్ ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో ప్రధాన పార్టీలుగా బీజేపీ, కాంగ్రెస్, ఆప్లు ఉన్నాయి. భూపేంద్ర పటేల్, సీ.ఆర్. పాటిల్, శక్తి సిన్హ్ గోహిల్లు కీలక నేతలుగా రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తున్నారు. గుజరాత్లో మొత్తం 26 లోక్సభ స్థానాలు, 182 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. గత ఎన్నికల్లో బీజేపీ మొత్తం లోక్సభ స్థానాల్లో విజయదుందుభి మోగిచింది. ప్రధాని మోదీ కరిష్మా, కాంగ్రెస్-ఆప్ కూటమిగా ఏర్పడడంతో ఈ సారి ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. అండమాన్ నికోబార్ అండమాన్ నికోబార్, చండీగడ్, దమణ్ దీవ్, లక్ష్య దీప్, పాండిచ్చేరిలలో ఒకటి మాత్రమే లోక్సభ స్థానాల్లో ఉన్నాయి. వీటిల్లో అండమాన్ నికోబార్ లోక్సభ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకోగా.. చండీగఢ్లో బీజేపీ, దమణ్ దీప్ బీజేపీ,లక్ష్య ద్వీప్లో ఎన్సీపీ శరద్ పవార్ వర్గంలు ఒక్కోస్థానంలో గెలిచాయి. కాగా, సార్వత్రిక ఎన్నికల పోలింగ్ 2024 ఏప్రిల్ 19న ప్రారంభమై.. ఏప్రిల్ 26, మే 7, మే 13, మే 20, మే 25, జూన్ 1 తేదీల్లో మొత్తం ఏడు దశల్లో జరుగుతుంది. మరి ఈ సారి లోక్సభ ఎన్నికల్లో విజయదుందుభి మోగించేదెవరనేది అప్పటి వరకు వేచి చూడాల్సి ఉంది. -
ఈసారైనా గెలిచేనా?, ప్రధాని మోదీ హోరు.. బీజేపీ జోరు
సాక్షి, తిరువనంతపురం : కేరళ రాష్ట్రం పాలక్కాడ్లో ప్రధాని మోదీ రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో బీజేపీ అభిమానులు, మద్దతు దారులు భారీ ఎత్తున తరలించారు. ఈ రోడ్ షోలో బీజేపీ పాలక్కాడ్ లోక్సభ అభ్యర్థి సీ కృష్ణకుమార్, పొన్నాని నియోజకవర్గం లోక్సభ అభ్యర్థి నివేదత సుబ్రమణియన్లు సైతం ప్రధాని వెంటే ఉన్నారు. బీజేపీ ఆశలు నెరవేరేనా కేరళ బీజేపీ ఆశలు పెట్టుకున్న లోక్సభ స్థానాల్లో పాలక్కాడ్ ఒకటి. 2019లో లోక్ సభ ఎన్నికల్లో పాలక్కాడ్ నుంచి పోటీ చేసిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీ.కృష్ణకుమార్కు 21 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. ఇది 2014లో సాధించిన ఓట్ల కంటే ఆరు శాతం ఎక్కువ. ఇదే స్థానం నుంచి 2021 అసెంబ్లీ ఎన్నికల్లో 'మెట్రో మ్యాన్' ఇ. శ్రీధరన్ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్కు గట్టి పోటీ ఇచ్చారు. కానీ గెలవలేకపోయారు. 2016లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్ధిగా శోభా సురేంద్రన్కు ఓటమి తప్పలేదు. మోదీ హోరో..బీజేపీ జోరు కానీ ఈ సారి లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో పాలక్కాడ్ ప్రజలు బీజేపీకి పట్టం కడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సురేంద్రన్ అన్నారు. మోదీ పర్యటనకు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ కేరళలో బీజేపీకి విశ్వాసాన్ని పెంచిందని తెలిపారు. ఈ సందర్భంగా మోదీ మరోమారు ఎన్నికల ప్రచారానికి కేరళకు వస్తారని ఆయన పేర్కొన్నారు. మరోసారి పర్యటన జనవరి నుండి మోదీ ఐదోసారి కేరళ పర్యటిస్తున్నారు. ప్రధాని వరుస పర్యటనలతో కేరళలో లోక్సభ ఎంపీలు లేని బీజేపీ ఈసారి ‘రెండంకెల’ స్థానాలను గెలుచుకుంటుందని సురేంద్రన్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. -
బీజేపీతో కటీఫ్.. కేంద్ర మంత్రి పదవికి పరాస్ రాజీనామా
సాక్షి, పాట్నా : లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీహార్ రాష్ట్ర రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్డీఏ కూటమి నుంచి తప్పుకుంటున్నట్లు రాష్ట్రీయ లోక్ జనశక్తి పార్టీ చీఫ్ పశుపతి కుమార్ పరాస్ ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి పదవికి కూడా తాను రాజీనామా చేస్తున్నట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా పరాస్ మీడియాతో మాట్లాడుతూ..‘కేంద్ర కేబినెట్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి పదవి ఇచ్చినందుకు ప్రధాని మోదీకి ధన్యావాదాలు. ఆయనకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. కానీ, బీహార్లో ఎన్డీయే భాగస్వామ్య పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు విషయంలో మాకు అన్యాయం జరిగింది. మా పార్టీకి ఐదుగురు ఎంపీలున్నారు. అయినా పొత్తులో మాకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. అందుకే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేస్తున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఎన్డీయే మిత్రపక్షమైన లోక్ జనశక్తి పార్టీ వ్యవస్థాపకుడు, దళిత నేతగా పేరొందిన రాం విలాస్ పాశ్వాన్ మరణం తర్వాత ఆయన కుమారుడు చిరాగ్, సోదరుడు పరాస్ మధ్య విభేదాలు తలెత్తిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే 2021లో పార్టీ రెండు ముక్కలుగా చీలిపోయింది. చిరాగ్ ఎన్డీయే నుంచి బయటకు రాగా.. కూటమిలో ఉన్న పశుపతి పరాస్కు కేంద్రమంత్రి పదవి దక్కింది. అయితే, ఇటీవల ఎన్డీయే విస్తరణలో భాగంగా చిరాగ్ మళ్లీ కూటమిలో చేరగా.. తాజా సర్దుబాటులో వారికి సీట్లు కేటాయించారు. అయితే, వచ్చే లోక్సభ ఎన్నికల్లో హాజీపూర్ నుంచి పోటీ చేయాలని భావిస్తున్న పరాస్కు ఇప్పుడు కూటమిలో సీట్లు దక్కలేదు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఆయన.. ఎన్డీయే నుంచి బయటకు వచ్చేస్తున్నట్టు తెలిపారు. -
YSRCP MP Candidates List: వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్థులు వీరే.. (ఫొటోలు)
-
ఎన్నికల బాండ్లు: ఎస్బీఐకి సుప్రీం డెడ్లైన్
సాక్షి, ఢిల్లీ: ఎలక్టోరల్ బాండ్ల కేసులో సుప్రీం కోర్టు మరోసారి స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియాపై కన్నెర్ర జేసింది. మార్చి 21 లోపు ఏ సంస్థ ఏ రాజకీయ పార్టీకి ఎంతెంత నిధులు ఇచ్చిందో ఆల్ఫాన్యూమరిక్ సీరియల్ కోడ్తో సహా ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించిన అన్ని వివరాలను వెల్లడించాలని ఎస్బీఐని సుప్రీం కోర్టు ఆదేశించింది. . ఎంపిక చేసిన సంస్థల వివరాలు మాత్రమే కాకుండా.. ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసిన వారందరి మొత్తం వివరాల్ని బహిర్ఘతం చేయాలని స్పష్టం చేసింది. దీపాటు తమ వద్ద ఉన్న ఎలక్టోరల్ బాండ్ల అన్ని వివరాలను బ్యాంక్ బహిర్గతం చేసిందని, ఎలాంటి వివరాలను దాచిపెట్టలేదని సూచిస్తూ గురువారం సాయంత్రం 5 గంటలలోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్బీఐ ఛైర్మన్ దినేష్ ఖేరాను అత్యున్నత న్యాయ స్థానం ఆదేశించింది. ‘‘బాండ్ల విషయంలో ఎస్బీఐ సెలెక్టివ్గా ఉండకూడదు. దీనికి సంబంధించిన ప్రతి సమాచారం బయటకు రావాలి. దేన్నీ అణచివేయకూడదనే ఉద్దేశంతోనే అన్ని వివరాలను ఇవ్వాలని మేం తీర్పు చెప్పాం. ఏ దాత ఏ పార్టీకి ఎంత ఇచ్చారనే విషయాన్ని తెలియజేసే యునిక్ నంబర్లతో పాటు అన్ని వివరాలను ఎస్బీఐ ఈసీకి ఇవ్వాల్సిందే. ఇందులో ఎలాంటి సందేహాలకు ఇక తావులేదు’’ అని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా ఎస్బీఐ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది హరీశ్ సాల్వే.. ఎలక్టోరల్ బాండ్ల సీరియల్ కోడ్ను సైతం ఎస్బీఐ అందిస్తుందని కోర్టుకు తెలిపారు. ‘మేం ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించి మా వద్ద ఉన్న మొత్తం సమాచారాన్ని అందిస్తాం. ఎలాంటి డేటాను ఎస్బీఐ తన వద్ద ఉంచుకోదు’ అని సాల్వే చెప్పారు. -
2019 లోక్ సభ ఎన్నికల్లో మోదీకి పోలైన ఓట్లు ఎన్నో తెలుసా?
సాక్షి, లక్నో : ఈ సారి లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీని 10 లక్షల పై చీలూకు మెజార్టీ ఓట్లతో గెలిపించాలని బీజేపీ పిలుపు నిచ్చింది. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం వారణాసి లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్న మోదీ తరుపున బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఆప్కి బార్ 10 లాక్స్ పార్’ ఎన్నికల నినాదంతో మోదీని 10లక్షలకు పై మెజార్టీతో గెలిపించాలని ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ‘ త్వరలో జరగబోయే లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని మోదీకి మద్దతు తెలుపుతూ భారీ సంఖ్యలో ఓట్లు పోలయ్యేలా ప్రచారం చేస్తున్నాం. ఆప్కి బార్ 10 ల్యాక్స్ పార్ అనే నినాదంతో కార్యకర్తలు మోదీకి అండగా నిలుస్తున్నారని వారణాసి నగర బీజేపీ అధ్యక్షుడు విద్యాసాగర్ రాయ్ తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ప్రధాని మోదీ నాటి 2014 సార్వత్రిక ఎన్నికల్లో గుజరాత్ రాష్ట్రం వడోదరా లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో విజయం సాధించారు. ఆ ఎన్నికల్లో మోదీకి దాదాపు 581,000 ఓట్లు పోలయ్యాయి. అయితే 2019 సార్వత్రిక ఎన్నికల నాటికి పోలింగ్ శాతం 7.25 శాతం పెరిగింది. మొత్తం 64 శాతంతో మోదీ దాదాపు 675,000 ఓట్లను సాధించారు. ఆయన తన సమీప ప్రత్యర్థి సమాజ్వాది పార్టీకి చెందిన షాలినీ యాదవ్పై 4,80,000 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 2009లో బీజేపీ గుజరాత్ అధ్యక్షుడు, నవ్సారి నియోజక వర్గం ఎంపీ సీఆర్ పాటిల్ దాదాపు 973,000 ఓట్లను పొందారు. అత్యధికంగా 689,000 ఓట్ల తేడాతో లోక్ సభ ఎన్నికల్లో విజయదుందుబి మోగించారు 10లక్షలకు పైన ఓట్లు సాధించేలా 2024లోక్ సభ ఎన్నికల్లో 10 లక్షల పైన ఓట్లను సాధించేలా క్షేత్రస్థాయిలో బీజేపీ శ్రేణులు ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. త్వరలో మార్చి 31 న కార్మికుల ‘టిఫిన్ మీట్’ని నిర్వహిస్తున్నట్లు తెలిపిన విద్యాసాగర్ రాయ్ కార్మికులకు మార్గనిర్దేశం చేయడానికి పీఎం మోదీ వర్చువల్గా పాల్గొననున్నట్లు వెల్లడించారు. -
బీజేపీలో చేరిన ప్రముఖ గాయని పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్
ప్రముఖ గాయని, పద్మశ్రీ అనూరాధ పౌడ్వాల్ బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా అనూరాధ పౌడ్వాల్ ప్రధాని నరేంద్ర మోదీని ప్రశంసిస్తూ, ఆయన నేతృత్వంలోని బీజేపీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో బీజేపీలో చేరిన ఆమె , బీజేపీ నేతలతో కలిసి విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నకు, పౌడ్వాల్ తనకు ఇంకా తెలియదని, పార్టీ తనకు ఏ బాధ్యతలు అప్పగించినా తప్పకుండా చేస్తానని అన్నారు. -
మధ్య ప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు
సాక్షి,భోపాల్ : మధ్యప్రదేశ్ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. రాజీనామాలతో కాషాయ పార్టీకి నాయకులు షాకిస్తున్నారు. తాజాగా, బీజేపీ రాజ్యసభ సభ్యుడు అజయ్ ప్రతాప్సింగ్ రాబోయే లోక్సభ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు . తన రాజీనామా లేఖను సోషల్ మీడియాలో షేర్ చేసిన ప్రతాప్ సింగ్.. ‘పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’ అని పేర్కొంటూ తన నిర్ణయాన్ని వెల్లడించారు. రాజీనామాకు నిర్దిష్ట కారణాన్ని సింగ్ లేఖలో వెల్లడించనప్పటికీ, పార్టీ నామినేషన్ ప్రక్రియపై తన అసంతృప్తిని ఎత్తిచూపారు. ‘బీజేపీ చెప్పేదానికి, చేసేదానికి తేడా ఉంది’ అని ఉదహరించారు. मैं भारतीय जनता पार्टी की प्राथमिक सदस्यता से त्याग पत्र देता हूँ। pic.twitter.com/g9De9pSzga — Ajay Pratap Singh (@mpajaypratap) March 16, 2024 మార్చి 2018లో బీజేపీ తరుపున రాజ్యసభలో అడుగు పెట్టిన ప్రతాప్ సింగ్ పదవీకాలం ఏప్రిల్ 2న ముగుస్తుంది. కాగా, బీజేపీ ప్రకటించిన లోక్సభ అభ్యర్ధుల జాబితాలో తనపేరు లేకపోవడంపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. -
50కి పైగా కంపెనీలు..1600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్ల కొనుగోలు
సాక్షి, కోల్కతా : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన 50కి పైగా కంపెనీలు రూ.1,600 కోట్ల విలువైన ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసినట్లు తేలింది. రూ.1,600 కోట్లలో మదన్లాల్ లిమిటెడ్,ఎంకేజీ ఎంటర్ప్రైజెస్, కెవెంటర్స్ ఫుడ్ పార్క్ వంటి సంస్థలు రూ. 600 కోట్ల ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయగా, వాటిల్లో కెవెంటర్ గ్రూప్ భారీ మొత్తంలో బాండ్ల రూపంలో డిపాజిట్ చేసినట్లు తెలుస్తోంది. కెవెంటర్ గ్రూప్ తర్వాత ఆర్పీ సంజీవ్ గోయెంకా గ్రూప్ హల్దియా ఎనర్జీ, ధరివాల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ కంపెనీలు దాదాపు రూ.500 కోట్లను ఎలక్టోరల్ బాండ్ల రూపంలో ఆయా పార్టీలకు విరాళం ఇచ్చాయి. ఈ కంపెనీలతో పాటు రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు రాజకీయ పార్టీలకు విరాళం ఇచ్చాయి. వాటిల్లో ఐటీసీ, రుంగ్తా గ్రూప్, రష్మీ గ్రూప్, అంబుజా, శ్యామ్ స్టీల్, ఐఎఫ్బీ గ్రూప్, రిప్లే, శ్రీ సిమెంట్, ధున్సేరి గ్రూప్, ఉత్కర్ష్ గ్రూప్, స్టార్ సిమెంట్, డబ్ల్యూపీఐఎల్, టెగా ఇండస్ట్రీస్, అక్రోపోలిస్ మెయింటెనెన్స్, ఎస్కేపీ మర్చంట్స్, ఆస్టిన్ ప్లైవుడ్స్ ఉన్నాయి. ఇక, ఏప్రిల్ 12, 2019 నుంచి ఫిబ్రవరి 15, 2024 మధ్య కాలంలో సుమారు 1,260 కంపెనీలు, వ్యక్తులు సుమారు రూ.12,155.51 కోట్ల విలువైన 22,217 బాండ్లను కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ డేటా చూపించింది. ఈ కాలంలో రూ.12,769.09 కోట్ల విలువైన 20,421 బాండ్లను 23 రాజకీయ పార్టీలు రీడీమ్ చేశాయి. బీజేపీ రీడమ్ చేసి రూ.6,061 కోట్లను పార్టీ కార్యకలాపాలకు వినియోగించుకోవగా రూ.1,610 కోట్లను తృణమూల్ కాంగ్రెస్, రూ.1,422 కోట్లను కాంగ్రెస్ రీడమ్ చేసుకుంది. -
ఒడిశా అధికార పార్టీ బీజేడీకి ఎదురు దెబ్బ
సాక్షి, భువనేశ్వర్ : లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా అధికార పార్టీ బిజూ జనతాదళ్ (బీజేడీ)కి ఎదురు దెబ్బ తగిలింది. ప్రముఖ ఒడియా నటుడు, బీజేడీ నేత అరిందమ్ రాయ్ బీజేపీలో చేరారు. ‘బీజేడీలో ఉన్నప్పుడు నేను సీఎం నవీన్ పట్నాయక్ను కలవడానికి చాలాసార్లు ప్రయత్నించాను. అయితే, పార్టీ రాజకీయాల కారణంగా నేను సీఎంను కలిసే అవకాశం పొందలేకపోయాను. ప్రధాని నరేంద్రమోదీ స్ఫూర్తితో బీజేపీలో చేరానని, రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానంటూ పార్టీ మారడానికి గల కారణాల్ని వెల్లడించారు. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు ఎం చుబా అవో ఒడిశా ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నవీన్ పట్నాయక్ తన పరిపాలనలో.. కేంద్ర ప్రభుత్వ పథకాలను తామే ప్రవేశ పెట్టినట్లు ప్రజల్ని మోసం చేస్తున్నారని ఆరోపించారు. దేశ అభివృద్ది కోసం ప్రధాని మోదీ చేస్తున్న కృషి అమోఘం అన్న ఆయన..ఈ సారి ఎన్నికల్లో బీజేపీ హ్యాట్రిక్ కొడుతుందని ధీమా వ్యక్తం చేశారు. 2019 లోక్సభ ఎన్నికల్లో ఒడిశాలో 21 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికలలో బిజూ జనతాదళ్ (బీజేడీ) అత్యధిక స్థానాలను గెలుచుకుంది. బీజేపీ, కాంగ్రెస్ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. బీజేడీ 12 స్థానాల్లో గెలుపొందగా, బీజేపీ 8 స్థానాలతో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ ఒక్క సీటు మాత్రమే గెలుచుకుంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో 147 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పాటు ఏకకాలంలో జరిగిన గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేడీ 113 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 23 స్థానాల్లో రెండో స్థానంలో నిలవగా, కాంగ్రెస్ 9, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) 1, స్వతంత్ర అభ్యర్థి మరో సీటుతో రెండో స్థానంలో నిలిచారు. -
63 మంది సిట్టింగ్లకు నో టికెట్.. బీజేపీ వ్యూహం ఏంటి?
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలో మూడోసారి అధికారం చేపట్టి హ్యాట్రిక్ కొట్టాలని భావిస్తున్న బీజేపీ.. ‘అబ్కీ బార్ 400 పార్, తీస్రీ బార్ మోదీ సర్కార్’ అనే నినాదంతో ఎన్నికల బరిలోకి దిగుతుంది. 400 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా లోక్ సభ అభ్యర్ధులను ఎంచుకుంటోంది. గెలుపు గుర్రాలకే ప్రాధాన్యం ఇచ్చేలా భారీ ఎత్తున 63 లోక్ సభ సిట్టింగ్ స్థానాల్లో కొత్త వారికి అవకాశం ఇచ్చింది. ఢిల్లీ ఏకంగా ఏడు లోక్ సభ స్థానాల్లో ఆరు సిట్టింగ్ అభ్యర్ధులను మార్చేసింది. ఏడుకి ఏడు స్థానాల్లో కైవసం చేసుకునేలా వ్యూహా, ప్రతి వ్యూహాలను అమలు చేస్తోంది. బీజేపీ ఈసారి లోక్సభ ఎన్నికల అభ్యర్ధుల మొదటి, రెండు జాబితాలలో 63 మంది సిట్టింగ్ ఎంపీల స్థానాల్లో కొత్త నేతలకు అవకాశం కల్పిచ్చింది. మార్చి 2న విడుదల చేసిన 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో 33 మంది కొత్త నేతలకు టికెట్లు కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది. మార్చి 13న విడుదల చేసిన రెండో జాబితాలో 30 మంది ఎంపీలను భర్తీ చేసింది. ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్కు చెక్ పెట్టేలా పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ గ్రౌండ్ ఫీడ్బ్యాక్ ఆధారంగా బీజేపీ అగ్రనాయకత్వం ఢిల్లీ లోక్ సభ స్థానాల్లో నేతల ఎంపికపై తీవ్ర కసరత్తే చేసింది. ఢిల్లీ 2014, 2019 లోక్సభ ఎన్నికల్లో మొత్తం ఏడు స్థానాలను బీజేపీ గెలుచుకుంది. వరుస విజయాల్ని సొంతం చేసుకున్నప్పటికీ ఈసారి లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ - కాంగ్రెస్లు పొత్తు పెట్టుకున్నాయి. దీంతో ఈ మొత్తం స్థానాల్లో గెలుపొందేలా ఏడుగురు సిట్టింగ్ ఎంపీ అభ్యర్థులలో ఆరుగురిని మార్చింది. సిట్టింగ్ ఎంపీలలో మనోజ్ తివారీ మాత్రమే మరోసారి సీటు దక్కించుకున్నారు. గెలుపే ముఖ్యం అభ్యర్థుల ఎంపికలో గెలుపే కీలకమని భావిస్తున్న బీజేపీ అగ్రనేతలు వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టేలా వ్యవహరిస్తున్న బిధురి, వర్మలకు టికెట్ నిరాకరించింది. క్రికెట్ పై దృష్టిసారించేందుకు అవకాశం కల్పించేలా తనని రాజకీయ బాధ్యతల నుంచి తనను తప్పించాలని పార్టీ నాయకత్వాన్ని కోరడంతో గౌతమ్ గంభీర్ స్థానంలో మరో కొత్త నేతని ఎంపిక చేసింది. అభ్యర్ధుల జాబితా విడుదల చేసిన తరుణంలో హర్ష్ వర్ధన్ రాజకీయాల నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. 6 మంది కొత్త అభ్యర్ధులు ఎవరంటే? ఢిల్లీ లోక్సభ స్థానాల్లో బీజేపీ అగ్రనాయకత్వం ఎంపిక చేసిన ఆరుగురు కొత్త నేతల్లో బీజేపీ అగ్రనేత, దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె బన్సూరి స్వరాజ్, యోగేంద్ర చందోలియా, హర్ష్ మల్హోత్రా, రాంవీర్ సింగ్ బిధూరి, ప్రవీణ్ ఖండేల్వాల్, కమల్జీత్ శరావత్లు ఉన్నారు. బన్సూరి స్వరాజ్ మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులు అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు. గట్కెక్కిన మనోజ్ తివారీ భోజ్పురి చిత్ర పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటులలో తివారీ ఒకరు. బీజేపీలో చేరకముందు సమాజ్వాదీ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. 2014లో ఈశాన్య ఢిల్లీ నుండి లోక్సభకు ఎన్నికయ్యారు. 2019లో అదే స్థానం నుంచి మరోమారు విజయం సాధించారు. ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడిగా కూడా పనిచేసిన తివారీకి తూర్పు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బీహార్లో విస్తరించి ఉన్న పూర్వాంచల్ ప్రాంతాలలో తివారీ ఫాలోవర్స్ ఎక్కువమంది ఉన్నారు. గెలుపు తద్యమని భావించింది కాబట్టే బీజేపీ ఆయనకు మరోసారి సీటును అప్పగించింది. -
ONOE: హంగ్ వస్తే?
ఎప్పటి నుంచో వినిపిస్తున్నట్లుగానే మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ జమిలి ఎన్నికలకు జైకొట్టింది. ఈ కమిటీ తను నివేదించిన నివేదికలో పలు అంశాలకు సిఫార్సు చేసింది. హంగ్ వచ్చినా, అవిశ్వాస తీర్మానం వంటి పరిస్థితులు నెలకొన్నా,మళ్ళీ ఎన్నికలు నిర్వహించి కొత్త సభను ఏర్పాటుచేయాలని సూచించింది. ఒకప్పటి ఏకకాల ఎన్నికలను పునరుద్ధరించాలన్నది ప్రధాన సిఫార్సు.దేశానికి స్వాతంత్ర్య లభించిన తొలిరోజుల్లో ఈ వ్యవస్థ ఉండేది. ప్రజాస్వామ్య పునాదులను బలోపేతం చేయడంతో పాటు దేశ ప్రజల ఆకాంక్షలను సాకారం చేయడానికి జమిలి ఎన్నికలు ఉపయోగపడతాయని బిజెపి ప్రభుత్వం చెబుతున్న మరోమాట. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికలను ఒకేసారి నిర్వహించడం తొలిదశ కాగా,ఈ ఎన్నికలు జరిగిన 100రోజుల లోపే మున్సిపాలిటీలు, పంచాయతీలకు కూడా ఎన్నికలు నిర్వహించడం రెండో దశలో జరగాల్సిన కార్యాచరణగా ఉండాలని ఈ కమిటీ బలంగా చెబుతోంది. కాకపోతే,దీనికోసం ఆర్టికల్ 325ను సవరించాలి. ఈ సవరణకు రాష్ట్రాల సహకారం అవసరం. రేపటి ఎన్నికల ఫలితాల తర్వాత కానీ,ఆ యా పార్టీల బలాబలాలు తెలియరావు. 'ఒకే దేశం - ఒకే ఎన్నిక' అంశంపై కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ఆ మధ్య వివరణ ఇచ్చారు.జమిలి ఎన్నికల నిర్వహణలో సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేసేందుకు ఏర్పాటుచేసిన అత్యున్నత కమిటీ తుది నివేదిక అందించడానికి నిర్దిష్టమైన గడువేమీలేదని ఆయన స్పష్టం చేశారు. దీనిని బట్టి చూస్తే,ఇప్పుడప్పుడే ఈ వ్యవహారం తేలదని అర్థం చేసుకోవచ్చు.2024 లోపే జమిలి ఎన్నికలు జరుగవచ్చని గతంలో కొందరు జోస్యం చెప్పారు. దానికి తెరపడిందన్నది సత్యం. కేవలం కొన్ని నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగాల్సివుంది. ఆ తర్వాత భవిష్యత్తులో జరుగబోయే ఎన్నికల నాటికి ఏదైనా స్పష్టత వస్తుందేమో! చూడాలి. దేశంలోని అన్ని రాష్ట్రాల శాసనసభలకు,లోక్ సభకు ఏక కాలంలో ఎన్నికలు జరపాలనే నినాదాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదే పదే వినిపిస్తూనే వున్నారు. మొదటి నుంచీ జమిలి ఎన్నికల నిర్వహణపై ఆయన పట్టుదలగానే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే, ఈ అంశంపై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో గత సంవత్సరం సెప్టెంబర్ లో కేంద్రం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసే దిశగా కమిటీ పనిచేయడం కూడా ప్రారంభించింది. ప్రజల నుంచి సూచనలు, సలహాలను ఆహ్వానించింది. స్పందన కూడా విశేషంగా వచ్చింది. వేలాదిగా ఈ -మెయిల్స్ వచ్చాయి. కేంద్రం మొన్నామధ్యనే 6 జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. ఇప్పటివరకూ 35 పార్టీల నుంచి అభిప్రాయాలు సేకరించినట్లు తెలుస్తోంది.జమిలి ఎన్నికలకు సంబంధించి న్యాయ కమిషన్ నుంచి కూడా సలహాలు తీసుకుంది. మరి కొన్ని నెలల వ్యవధిలోనే సాధారణ ఎన్నికలు జరగాల్సిన నేపథ్యంలో,ప్రతిపక్ష పార్టీల వ్యాఖ్యల వేడి పెరుగుతోంది. ముఖ్యంగా తృణమూల్ పార్టీ అధినేత్రి,పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ జమిలి ఎన్నికలకు ససేమిరా అంటున్నారు.అదే విషయాన్ని స్పష్టం చేస్తూ రామ్ నాథ్ కోవింద్ కమిటీకి ఉత్తరం కూడా రాశారు. ప్రజాస్వామ్యం ముసుగులో నియంతృత్వాన్ని అనుమతించే వ్యవస్థగా మారుతుందని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. జమిలి ఎన్నికలకు తాము దూరంగానే ఉంటామని స్పష్టం చేశారు. కేంద్రం లేదా రాష్ట్ర ప్రభుత్వాలువివిధ కారణాలతో తమ ఐదేళ్ల పదవీ కాలాన్ని పూర్తి చేయలేకపోవచ్చని గత చరిత్రను గుర్తుచేస్తున్నారు. అనేకసార్లు లోక్ సభ రద్దయిందని, భవిష్యత్తులో కూడా అటువంటి పరిస్థితులు తలెత్తుతాయనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు.ఓటర్ల ఎన్నికల విశ్వాసాన్ని ఉల్లంఘించడం న్యాయమా? అని ఆమె ప్రశ్నిస్తున్నారు.తృణమూల్ పాటు మిగిలిన ప్రతిపక్ష పార్టీలకు అనేక భయాలు ఉన్నాయి. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్కు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. 'జమిలి' అంటే రాష్ట్రాలపై దాడి చేయడమేనని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శనా బాణాలు సంధిస్తునే వున్నారు.ఈ ఎన్నికల వల్ల సామాన్యులకు ఒరిగేదేంటని కేజ్రీవాల్ ప్రశ్నిస్తున్నారు. 2029 నుంచి లోక్ సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించేలా లా కమిషన్ ఓ ఫార్ములా రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. లా కమిషన్ ఇంకా తుది నివేదికను తయారుచేయాల్సివుంది. పంచాయతీల నుంచి పార్లమెంట్ దాకా ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది బిజెపి ప్రభుత్వ ఆలోచనగా తెలుస్తోంది. ముఖ్యంగా,దీనివల్ల డబ్బు ఆదా అవుతుందని,ఆ ధనాన్ని అభివృద్ధి పనుల కోసం కేటాయించవచ్చని మోదీ సర్కార్ వాదిస్తోంది.ఈ చర్చ ఈనాటిది కాదు.2019లో రెండవసారి అధికారంలోకి వచ్చిన వెనువెంటనే అన్ని పార్టీలను ఆహ్వానించి దీనిపై చర్చ కూడా జరిపారు.అప్పట్లో దేశ వ్యాప్తంగా మొత్తం నలబై రాజకీయ పార్టీలను ఈ సమాలోచనకు ఆహ్వానించారు. 21పార్టీలు మాత్రమే హాజరయ్యాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రాంతీయ పార్టీలు అప్పట్లో జమిలి ఎన్నికలకు జై కొట్టాయి. వచ్చిన మిగిలిన పార్టీలు విభిన్న స్వరాలను వినిపించాయి. కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగానే ఉంది. లోక్ సభకు,శాసనసభలకు సమాంతరంగా ఏకకాలంలో జరపడం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి, ప్రధానంగా ఖర్చు కలిసివస్తుందన్నది వాస్తవమే. వివిధ ఎన్నికల కోడ్ పేరుతో జరగాల్సిన కార్యక్రమాలు జరగకుండా పనులు ఆగిపోవడం, సమయం వృధా అవ్వడం మొదలైన వాటికి అడ్డుగోడ పడుతుంది.తద్వారా పనిరోజులు పెరుగుతాయి. ప్రతి సంవత్సరం ఏదో ఒక రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతూనే ఉంటాయి. కనీసం రెండు,మూడు రాష్ట్రాలలో ఎన్నికలు తప్పనిసరిగా వస్తుంటాయి.ఈ నేపథ్యంలో, కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోడానికి వెనుకాడే పరిస్థితి వస్తుంది.అదే అన్ని చోట్ల సమాంతర ఎన్నికల విధానం అందుబాటులో ఉంటే,కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి మరింతగా పరిపాలనపై దృష్టి సారించే వెసులుబాటు ఉంటుంది. ఐదేళ్లకొకసారి అన్ని వ్యవస్థలకు ఒకేసారి ఎన్నికలు జరపడం వల్ల రాజకీయ సుస్థిరత నెలకొనే అవకాశం ఉంది.బిజెపి ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికలపై కొందరు అనేక అనుమానాలు, సందేహాలు,అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ ప్రతిపాదన వల్ల ఎటుచూసినా,కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికే ఎక్కువ మేలుజరుగుతుందనీ,అందుకే, దీనిపై బలంగా ప్రచారం చేస్తోందనే భావంలో ప్రతిపక్షాలు ఉన్నాయి. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీకి సంపూర్ణమైన బలం లేకపోతే, వివిధ ప్రాంతీయ పార్టీలపై ఆధారపడి సంకీర్ణ ప్రభుత్వం నడపాల్సిన పరిస్థితి వస్తుందనీ, దీని వల్ల కేంద్రంలో పాలనకు అవరోధాలు ఏర్పడతాయనే అనుమానాలు బిజెపికి ఉన్నాయి. ప్రస్తుతం,దేశంలో బిజెపి బలంగానే ఉంది. కొన్ని రాష్ట్రాల్లో మాత్రం బలహీనంగా వుంది. ఆంధ్రప్రదేశ్లో చాలా బలహీనంగా ఉంది. తమిళనాడు,కేరళలో కూడా అదే తీరు. తెలంగాణలో కాస్త బలిపడినట్లు తాజా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఉత్తరాదిలో మాత్రం బిజెపి బలంగా కనిపిస్తోంది. కొన్ని రోజుల వ్యవధిలో దేశంలోని పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సివుంది. ఫలితాలు ఎలా ఉండబోతాయో ఇంకా స్పష్టత రావాల్సివుంది. జమిలి ఎన్నికలు జరిగితే, ఐదేళ్లపాటు యథేచ్ఛగా తమ విధానాలను అమలుపరిచే స్వేచ్ఛ మరింత బలంగా ఉంటుందనే అభిప్రాయంలోనే బిజెపి మొదటి నుంచి వుంది. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఆధిక్యత వస్తుందనీ,దాని వల్ల ప్రాంతీయ పార్టీలకు నష్టం జరుగుతుందనే భయంలో కొన్ని ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి.దీని వల్ల వారు అనుసరించే విధానాల వల్ల దేశ సమగ్రతకు జమిలి ఎన్నికల వల్ల భంగం కలిగే ప్రమాదం ఉందనీ కొందరు విమర్శిస్తున్నారు.పరోక్షంగా అధ్యక్ష వ్యవస్థకు నిర్మాణం చేపట్టే ప్రతిపాదనలు దీని వెనకాల దాగి ఉన్నాయనే భయాలు కొందరిలో లేకపోలేదు.ఈ భయాలన్నీ ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్ కు, ఆ పార్టీని అనుసరిస్తున్న కొన్ని పార్టీలకు ఉన్నాయి. జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే, కొన్ని శాసనసభల పదవీకాలాన్ని కుదించాలి,కొన్నింటిని పొడిగించాలి.ఇటువంటి కీలకమైన చర్యలకు రాజ్యాంగ సవరణలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీనికి సరిపడా బలం ఉభయ సభల్లోనూ బిజెపికి ఉంది. 'సమాంతర ఎన్నికల'పై, 2018 ఆగస్టులో లా కమీషన్ ఒక ముసాయిదా నివేదిక సమర్పించింది. చట్ట సవరణ జరిగిన తర్వాత, దేశంలోని సగం రాష్ట్రాల శాసనసభలు ఆమోదం తెలపాల్సిన అవసరం కూడా ఉంది.ఇక్కడ కూడా బిజెపికి వాతావరణం అనుకూలంగానే ఉంది.లోక్ సభ, శాసనసభలకు ఎన్నికలు జరిగినప్పుడు కొన్నిచోట్ల క్రాస్ ఓటింగ్ జరుగుతూ ఉంటుంది. శాసనసభకు స్థానిక పార్టీకి వేసి, లోక్ సభకు జాతీయ పార్టీకి వేసే మైండ్ సెట్ కొందరు ఓటర్లలో ఉంటుంది.ఫలితాలు తదనుగుణంగా వచ్చిన అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఎల్లవేళలా,అధికారంలో ఉండే పార్టీలకు సంపూర్ణమైన మెజారిటీ ఉండకపోవచ్చు.సంకీర్ణంగా ప్రభుత్వాలు నడిపే క్రమంలో, విభేదాల వల్ల ప్రభుత్వం పడిపోయినప్పుడు,ఎన్నికలు మళ్ళీ నిర్వహించాల్సి వస్తుంది. ఇటువంటి సందర్భాల్లో ఏమి చేయాలి? అనే సందేహాలు ఉన్నాయి. ఇలా జమిలి ఎన్నికల అంశంలో అనేక అనుకూల, ప్రతికూల అంశాలు,సందేహాలు, అనుమానాలు ఉన్నాయి. వీటన్నింటిపై దేశ వ్యాప్తంగా సమగ్రమైన చర్చ జరగాలి. ప్రజామోదాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.చర్చలో అన్ని పార్టీలు పాల్గొనాలి.మంచిచెడు, లాభనష్టాలు బేరీజువేసుకోవాలి. "కేవలం ఇది చర్చించే విషయం కాదని,భారత్ కు ఎంతో అవసరం", అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనేకమార్లు ఉద్ఘాటించారు. పార్టీల రాజకీయ స్వార్ధాలు ఎట్లా ఉన్నా,దేశ ప్రజల మంచికి,దేశ ప్రగతికి పట్టంకట్టే విధానాలను స్వాగతించవచ్చు. 2029 లో నైనా జరుగుతాయా? అన్నది వచ్చే ఎన్నికల్లో ఫలితాలను బట్టి కొంత అంచనా వెయ్యవచ్చు.ఈసారి ఎన్నికల్లో 400 స్థానాల లక్ష్యంతో బిజెపి కదనరంగంలో దిగుతోంది.కొన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు నువ్వా నేనా అన్నట్లుగా చాలా బలంగా వున్నాయి. ఇండియా కూటమి మధ్య ఐక్యత ఆశించిన స్థాయిలో లేదన్నది నేటి మాట.జమిలి ఎన్నికలు నిర్వహించాలంటే? ప్రణాళిక చాలా అవసరం.ఈవిఎంలు, వీవీప్యాట్ లు,భద్రతా సిబ్బంది మొదలైన అనేక అంశాలలో పకడ్బందీ ప్రణాళికలు రచించుకోవాల్సివుంటుంది. :::మాశర్మ -
పొత్తు లేనట్లే.. బీజేపీ తేల్చేసిందా?
సాక్షి, భువనేశ్వర్ : బీజేపీ - బీజేడీల మధ్య ఇక పొత్తు లేనట్లేనని తెలుస్తోంది. ఈ సారి లోక్సభ ఎన్నికలకు 15 ఏళ్ల తర్వాత పాత మిత్రులు మళ్లీ ఒక్కటవ్వనున్నారని అందరూ అనుకున్నారు. కానీ తాజా రాజకీయ పరిణామాలు అందుకు తావు ఇవ్వడం లేదని సమాచారం. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం ప్రధాని మోదీ ఒడిశాలో పర్యటించారు. ఆ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేడీ అధినేత, ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్లు మంతనాలు జరిపారు. అనంతరం 15 ఏళ్ల తర్వాత బీజేపీతో జతకట్టేలా సంకేతాలిచ్చారు. అమిత్ షా తో సుదీర్ఘంగా చర్చలు ఇందులో భాగంగా పొత్తు పెట్టుకుని లోక్సభ ఎన్నికల బరిలో దిగేలా ఇరు పార్టీల అగ్రనేతలు చర్చలు జరిపారు. అయితే, సీట్ల పంపకాల్లో విభేదాలు తలెత్తడంతో.. బీజేపీ ఒంటరిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తుందంటూ ఒడిశా బీజేపీ అధ్యక్షుడు మన్మోహన్ సామల్ ప్రకటించారు. పొత్తుపై చర్చించేందుకు అధిష్టానం పిలుపుతో ఢిల్లీకి వెళ్లిన మన్మోహన్ సాముల్.. కేంద్రమంత్రి అమిత్ షాతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. చర్చల అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పొత్తులపై మన్మోహన్ సాముల్ మాట్లాడుతూ.. ‘మా జాతీయ అధ్యక్షుడు, పార్లమెంటరీ పార్టీ ఏది చెబితే అది తుది నిర్ణయం’ అని అన్నారు. సీనియర్ నేతలతో సీఎం భేటీ ఆ తర్వాతే ఒడిశాలో బీజేపీ సొంతంగా రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందంటూ ఎక్స్.కామ్లో ఓ పోస్ట్ పెట్టారు. కొద్ది సేపటికే ఆ పోస్ట్ను డిలీట్ చేశారు. మరోవైపు బీజేడీ పార్టీ అధ్యక్షుడు, సీఎం నవీన్ పట్నాయక్ తన నివాసంలో పార్టీ సీనియర్ నేతల సమావేశాన్ని నిర్వహించారు. ఇలా వరుస పరిణామాలతో ఒడిశా రాష్ట్ర రాజకీయాలు రసకందాయంగా మారాయి. పోలింగ్కు సమయం ఉంది కాబట్టి పొత్తులపై బీజేపీ- బీజేడీలు చర్చలు జరుపుతుంటే.. ఇరు పార్టీల నేతలు మాత్రం ఎప్పుడు ఏం జరుగుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తుండడం గమనార్హం. -
అమిత్ షా ఎంట్రీతో ‘మహా’ పంచాయితీ కొలిక్కి
సాక్షి, ముంబై : ఇకపై బలాబలాలు నిరూపించుకోవడాల్లేవ్..ఎన్నికల బరిలోకి దిగి మెజార్టీ స్థానాల్లో గెలవడమే తరువాయి అంటూ మహారాష్ట్రలోని మహాయుతి (బీజేపీ, శివసేన-షిండే వర్గం, ఎన్సీపీ-అజిత్పవార్ వర్గం) కూటమి ఎన్నికల బరిలోకి దిగనుంది. ఇన్ని రోజులు సీట్ల పంపకంలో నాన్చుతూ వస్తున్న అంశాన్ని ట్రబుల్ షూటర్ అమిత్ షా యూటర్న్ తిప్పారు. చర్చలు సఫలం కావడంతో కూటమిలో ఇతర భాగస్వాములు ఎవరెన్ని సీట్లు పోటీ చేస్తారనేది త్వరలోనే స్పష్టత ఇవ్వనున్నారు. రోజుల తరబడి సాగిన చర్చల తర్వాత, మహారాష్ట్రలో మహాయుతి కూటమి ప్రభుత్వంలో సీట్ల పంపకం పురోగతి సాధించింది. ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం నాలుగు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అంగీకరించినట్లు పలు జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి. మహరాష్ట్రలో మొత్తం 48 లోక్సభ స్థానాలు ఉండగా.. తమకు క్షేత్రస్థాలు బలం ఎక్కువగా ఉందంటూ ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం 11 స్థానాలు, శివసేన-ఏక్ నాథ్ షిండే వర్గం 22 స్థానాల్లో పోటీ చేస్తామని పట్టుబట్టాయి. అయితే షిండే వర్గానికి 22 సీట్లు, అజిత్పవార్కు 11 సీట్లు కేటాయిస్తే మాకు మిగిలేదేంటి? 48 సీట్లలో 15 సీట్లా? అది ఎలా సాధ్యపడుతుంది’ అని బీజేపీ నేతులు అభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సీట్ల పంపకంపై పలు దఫాలుగా చర్చలు జరిగినా.. అవి కొలిక్కి రాలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా రంగంలో దిగారు. పరిస్థితుల్ని చక్కబెట్టారు. తాజాగా, ఎన్సీపీ- అజిత్ పవార్ వర్గం బారామతి, రాయ్గఢ్, షిరూర్, పర్భాని.. ఈ నాలుగు లోక్సభ స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టేందుకు అంగీకరించింది. ఇక శివసేన ఏక్నాథ్ షిండే వర్గం 13 స్థానాల్లో, బీజేపీ 31 స్థానాల్లో పోటీ చేయనుంది. కాగా, ఆయా స్థానాల్లో అభ్యర్ధుల ఎంపిక? ఎవరెన్ని స్థానాల్లో పోటీ చేస్తున్నారనే అంశాలపై మహాయుతి కూటమి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంది.
Pagination
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
సీబీఎస్ఈ పది, పన్నెండవ తరగతి ఫలితాలు విడుదల
ఎవరి లెక్క వారిదే..!
ఓటరు తీర్పు... ఈవీఎంలలో భద్రం
రాయల్ ఎన్ఫీల్డ్ దగ్ధం
వైఎస్సార్సీపీ గెలుపుకోసం పనిచేసిన వారికి ధన్యవాదాలు
దళిత మహిళా సర్పంచ్పై జనసేన దాడి
రామతీర్థంలో వైభంగా పూర్ణాహుతి
గ్రామాల్లో ద్రాక్ష పంట
చికెన్
పశువుల ఎరువుతో భూసారం పెంపు
తప్పక చదవండి
- చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చిన బీజేపీ!
- గనిలో చిక్కుకున్న 14 మంది అధికారులు.. కొనసాగుతున్న సహాయక చర్యలు!
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- తాడిపత్రిలో టీడీపీ శ్రేణుల విధ్వంసకాండ
- 20 వరకు వర్షాలే
- రాష్ట్రంలో 81.3% పోలింగ్!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- ట్రిపుల్ ఐటీకి దరఖాస్తు చేసుకోవడం ఇలా
- హల్దీరామ్స్పై జాతీయ కంపెనీల కన్ను.. మెజారిటీ వాటా కొనుగోలుకు బిడ్డింగ్
Advertisement