-
స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్ ఇండియా రేంజ్లో!
టాలీవుడ్ బ్లాక్బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్. మగధీర, బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి ఆల్టైమ్ హిట్స్ను అందించారు. అయితే తాజాగా మరో స్టార్ హీరోకు కథను అందించేందుకు సిద్ధమయ్యారు. శాండల్వుడ్ సూపర్ స్టార్ కిచ్చా సుదీప్ నటిస్తున్న తాజా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్ పనిచేస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తండ్రి ఆయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. తాజాగా కన్నడ హీరో కిచ్చాకు సైతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్ 2న కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రివీల్ చేశారు. (ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! ) కిచ్చా సుదీప్ కథానాయకుడుగా ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్సీ స్టూడియోస్ భారీ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆర్.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కిచ్చా సుదీప్ మరోసారి కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో జతకట్టబోతున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్లో ఆర్సీ స్టూడియోస్ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో నిర్మించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఈ సంస్థ నిర్మించిన ఐదు చిత్రాలు వరుసగా తెరపైకి రాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కిచ్చ సుదీప్ కథానాయకుడిగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రంలో పని చేయడానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను, నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. (ఇది చదవండి: సలార్ రిలీజ్ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్!) -
కిచ్చా సుదీప్ చేసిన మోసాన్ని బయటపెట్టిన నిర్మాత
కిచ్చా సుదీప్ టాలీవుడ్ వారికి సుపరిచితమే. రాజమౌళి తెరకెక్కించిన ఈగ సినిమా ఆయనకు స్టార్డమ్ను తెచ్చిపెట్టింది. ఇటీవల విక్రాంత్ రోణాతో తెలుగులో కూడా మెప్పించాడు. తాజాగా ఆయన మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న కిచ్చా46 సంబంధించిన టీజర్ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. (ఇదీ చదవండి: సమంత మళ్లీ ప్రేమలో పడిందా? ఆ పోస్ట్ అర్థమేంటి?) తాజాగా సుదీప్పై కన్నడ నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ పలు ఆరోపణలు చేశాడు. తన బ్యానర్లో సినిమా చేస్తానని రెమ్యూనరేషన్ తీసుకుని మూవీ చేయకుండా మోసం చేశాడని ఆయన తెలుపుతున్నాడు. ప్రాజెక్ట్ కోసం సుదీప్కు రూ. 9 కోట్ల రూపాయలు ఇచ్చానని, కానీ డేట్స్ ఇవ్వకుండా తిప్పుకుంటున్నాడని నిర్మాత ఆరోపిస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ వద్ద ఫిర్యాదు చేశానన్నారు. సుమారు ఎనిమిదేళ్ల క్రితమే సినిమా చేయడానికి ఇద్దరి మధ్య పరస్పరం అంగీకారం కుదిరనట్లు తెలిపాడు. కానీ ఇప్పటి వరకు డేట్స్ కేటాయించడంలో సుదీప్ విఫలమయ్యారని నిర్మాత పేర్కొన్నారు. సినిమాకు సంబంధించిన పూర్తి రెమ్యూనరేషన్ రూ. 9 కోట్లతో పాటు.. మరో రూ. 10 లక్షలు తన వంట గది రెనోవేషన్ కోసం సుదీప్ తీసుకున్నాడని చెప్పుకొచ్చాడు. సినిమా కోసం దర్శకుడు నంద కిషోర్కి అడ్వాన్స్ చెల్లించడంతో పాటు ఈ చిత్రానికి 'ముత్తట్టి సత్యరాజు' అనే టైటిల్ను కూడా ఫిలిం ఛాంబర్లో రిజిస్టర్ చేశామన్నారు. కానీ తమ బ్యానర్లో సినిమా చేయకుండా ఇప్పుడు, ఒక తమిళ నిర్మాతతో సుదీప్ మూవీ ప్రకటించారు. (ఇదీ చదవండి: 'గురువు' పేరుతో పూనమ్ కౌర్ సంచలన పోస్ట్) తన వద్ద డబ్బు తీసుకున్న తర్వాత ఇప్పటికే వివిధ నిర్మాతలతో సుదీప్ నాలుగు సినిమాలు చేశాడు. కానీ తన బ్యానర్లో చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదన్నారు. దీంతో తాను సుదీప్ను సంప్రదించడానికి చాలా రకాలుగా ప్రయత్నించానని, అయితే అతని నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఛాంబర్కి సమస్యను తీసుకెళ్లానని, అతను మాట్లాడితే పరిష్కరించేందుకు సిద్ధంగా ఉన్నానని నిర్మాత ఎమ్ ఎన్ కుమార్ చెప్పారు. -
కోలీవుడ్లో పాన్ ఇండియా మూవీతో ఎంట్రీ ఇస్తున్న కిచ్చా సుదీప్
భారీ చిత్రాల నిర్మాత కలైపులి ఎస్ థాను. ఈయన ఇటీవల నటుడు ధనుష్ కథానాయకుడిగా వరుసగా అసురన్, కర్ణన్, నానే వరువేన్ చిత్రాలు నిర్మించారు. అందులో అసురన్, కర్ణన్ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. నానే వరువేన్ చిత్రం మాత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. కాగా తాజాగా కలైపులి ఎస్. థాను తాజాగా తన వి.క్రియేషన్స్ పతాకంపై ఒక పాన్ ఇండియా చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించనున్నారు. ఈయన ఈ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించి తమిళ ప్రేక్షకులకు దగ్గరైన విషయం తెలిసిందే. అదే విధంగా కిచ్చా సుదీప్ కథానాయకుడిగా నటించిన కన్నడ చిత్రం విక్రాంత్ రోణా చిత్రం తమిళంలోనూ మంచి వసూళ్లు రాబట్టింది. దీంతో ఈయన ఇప్పుడు నేరుగా తమిళ చిత్రంలో నటించడానికి సిద్ధమవుతున్నారు. ఇది ఈయన నటిస్తున్న 46వ చిత్రం అవుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటనను చిత్ర వర్గాలు బుధవారం వెల్లడించారు. చిత్ర షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానున్నట్లు అందులో పేర్కొన్నారు. అంతకు ముందుగా చిత్ర టీజర్ విడుదల చేయనట్లు నిర్మాతలు పేర్కొన్నారు. అయితే ఈ చిత్రానికి దర్శకుడు, కథానాయకి, ఇతర నటీనటులు సాంకేతిక వర్గం వివరాలు వెలువడాల్సి ఉంది. అయితే వెల్ కమ్ టూ బాద్ షా అంటూ నిర్మాత బుధవారం నటుడు కిచ్చా సుదీప్ను స్వాగతిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. కాగా నటుడు సూర్య కథానాయకుడిగా వెట్రిమారన్ దర్శకత్వంలో వాడివాసల్ అనే భారీ చిత్రాన్ని నిర్మించనున్నట్లు నిర్మాత ధాను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఆ చిత్రం ఎప్పుడు మొదలవుతుందో తెలియాల్సి ఉంది. -
ష్.. కిచ్చా సుదీప్ ప్రచారానికి రెస్పాన్స్ ఇది!
Kichcha Sudeepa In Trending.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం.. కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ బీజేపీకి మద్దతు ప్రకటించడం అటు రాజకీయ, ఇటు సినీ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది. కన్నడనాట అందరివాడిగా పేరున్న సుదీప్.. గతంలోలాగే ఈ ఎన్నికల్లో కూడా తటస్థంగా ఉంటారని అంతా భావించారు. కానీ, అనూహ్యంగా.. రాజకీయాల్లో అడుగుపెట్టకుండానే కాషాయం పార్టీ తరపున ప్రచారం చేస్తానని ప్రకటించడాన్ని విపక్షాలు తట్టుకోలేకపోయాయి. ఈ క్రమంలో సుదీప్పై విమర్శలూ గుప్పించాయి. అయితే.. ఆ విమర్శల సంగతి పక్కనపెడితే మాస్ ఫాలోయింగ్ ఉన్న సుదీప్ ప్రచారంలోకి దిగితే.. అంతే భారీ స్థాయిలో ఆదరణ దక్కుతోంది. ఓవైపు అభిమానుల ఉత్సాహం, మరోవైపు ట్రాఫిక్కు అంతరాయం.. ఫలితంగా సెక్యూరిటీ కల్పించడం పోలీసులకు పెను సవాల్గా మారింది. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్గా సుదీప్ చేస్తున్న ప్రచారానికి అనూహ్య స్పందన లభిస్తోంది. గురువారం విజయనగర జిల్లా కుడ్లిగి నియోజవర్గంలో సుదీప్ బీజేపీ అభ్యర్థి లోకేష్ వీ నాయక తరపున ప్రచారం నిర్వహించారు. ఆ రోడ్షోకి జనం సంద్రల్లా వెల్లువెత్తడం గమనార్హం. రోడ్డుకు ఇరువైపులా మోహరించిన ‘బాద్షా’ సుదీప్ ఫ్యాన్స్.. ట్రాఫిక్కు అంతరాయం కలిగించడంతో సుదీప్ ప్రయాణిస్తున్న వాహనం ముందుకు కదల్లేదు . దీంతో పోలీసులు జోక్యం చేసుకుని వాహనాన్ని ముందుకు పోనిచ్చారు. అంతకు ముందు బుధవారం సాయంత్రం బళ్లారి జిల్లా సండూర్లోనూ ఇలాంటి పరిస్థితులే ఎదురయ్యాయి. దీంతో ప్రచారాన్ని అర్థాంతంగా ముగించారాయన. ఇది చూసి.. ఇది బీజేపీ ప్రచార ర్యాలీనా? లేక సుదీప్ అభిమానుల ర్యాలీనా? అనే డౌట్లను సోషల్ మీడియా వేదికగా కురిపిస్తున్నారు పలువురు. ఓట్లు రాల్చడం మాటేమేగానీ.. సుదీప్ రాకను పండుగలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఆ అభిమానులు షేర్ చేస్తున్న వీడియోలతో.. ఒక్కసారిగా కిచ్చా సుదీప్ #KichchaSudeepa హ్యాష్ ట్యాగ్ ట్విటర్ ట్రెండింగ్లోకి వచ్చేసింది. ಅಭಿಮಾನಿಗಳ ಸಮ್ಮುಖದಲ್ಲಿ ವೀರಮದಕರಿ ಚಿತ್ರದ ಡೈಲಾಗನ್ನು ಹೇಳಿದ ನಮ್ಮ ಕಿಚ್ಚ ಸುದೀಪ್ ಬಾಸ್...@KicchaSudeep #KicchaSudeep𓃵 #Kiccha46 #KicchaBOSS𓃵 #KarnatakaElection2023 pic.twitter.com/gku0Nw5njI — 𝐊𝐢𝐜𝐜𝐡𝐚 𝐔𝐧𝐢𝐯𝐞𝐫𝐬𝐞™ (@KicchaUniverse) April 27, 2023 ಅಭಿಮಾನಿಗಳ ಅಭಿಮಾನಿ ಕೂಡ್ಲಿಗಿ ಯಲ್ಲಿ@KicchaSudeep #KicchaSudeep𓃵 #KicchaSudeep #Kiccha46 pic.twitter.com/Tzikcc7qX1 — ಕಿಚ್ಚನ ಆರ್ಮಿ ಬಳ್ಳಾರಿ (@KING_KICCHA_G) April 27, 2023 Kiccha Sudeep campaigns for BJP candidate. 🔥🔥 pic.twitter.com/fwDcsPIFXi — News Arena India (@NewsArenaIndia) April 26, 2023 Exclusive Video...🔥 Our Baadshah @KicchaSudeep Anna Road Show in #Kudligi 💥🚩😍#Kiccha46 #KicchaSudeep#KicchaBOSS𓃵 #KicchaSudeep𓃵 pic.twitter.com/IbH2dQDGcv — Abhinaya Chakravarthi Official Team Honnavara™ (@ACOTeamHonnavar) April 27, 2023 ఇదీ చదవండి: నేను బీజేపీకి న్యాయం చేయలేదు -
బొమ్మై నామినేషన్.. హాజరైన నడ్డా, సుదీప్
బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై నామినేషన్ వేశారు. షిగ్గావ్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ తరపున బరిలో దిగుతున్న ఆయన.. బుధవారం నామినేషన్ పత్రాలను నిజయోకవర్గపు రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు కన్నడ స్టార్ నటుడు కిచ్చా సుదీప్ సైతం ఆ సమయంలో బొమ్మై వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరపున కిచ్చా సుదీప్ స్టార్ క్యాంపెయినర్గా పని చేయనున్న విషయం విదితమే. అయితే తాను రాజకీయాల్లోకి రాకున్నా.. బొమ్మైతో ఉన్న అనుబంధం మేరకు ఈ ఎన్నికల్లో ఆయన తరపున ప్రచారం చేస్తానని సుదీప్ ఇదివరకే ప్రకటించారు. ఇక నామినేషన్ తరవ తర్వాత జేపీ నడ్డా మాట్లాడుతూ కర్ణాటకలో కమల వికాసం ఖాయమన్నారు. మే 10వ తేదీన ఒకే దఫాలో 224 నిజయోకవర్గాలకు పోలింగ్ జరగనుంది. మే 13వ తేదీన ఫలితాలు వెల్లడి అవుతాయి. దేశంలో తొలిసారిగా ఓట్ ఫ్రమ్ హోం సదుపాయాన్ని వృద్ధులు, వికలాంగుల కోసం తీసుకురానుంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇదీ చదవండి: కర్ణాటకలో బీజేపీకి ఊహించని పరిణామం
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలింగ్ కేంద్రాల తనిఖీ
పట్టుదలతో చదవండి
స్వర్ణకారుల సమస్యలు పరిష్కరిస్తాం
ఆదాయపు పన్ను మాఫీ చేయిస్తాం
ఓపెన్ కాస్టుల్లో పనివేళలు మార్చండి
కమిషనింగ్ పూర్తిచేయండి
ఓదెల మల్లన్న సాక్షిగా చెబుతున్నా..
సర్కారు ఆస్పత్రిలో గడువు ముగిసిన మందులు!
ఎన్నికల ప్రచార వ్యయం నమోదుపై సమావేశం
వేడెక్కిన ప్రచారం
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement