స్టార్ హీరో సినిమాకు ఓకే చెప్పిన విజయేంద్ర ప్రసాద్.. పాన్‌ ఇండియా రేంజ్‌లో! | Vijayendra Prasad to work on Kichcha Sudeep next Film with R Chandru | Sakshi
Sakshi News home page

Vijayendra Prasad: మరో పాన్‌ ఇండియా కథ.. కిచ్చా సుదీప్‌ చిత్రానికి గ్రీన్ సిగ్నల్!

Sep 3 2023 11:20 AM | Updated on Sep 3 2023 12:13 PM

Vijayendra Prasad to work on Kichcha Sudeep next Film with R Chandru - Sakshi

టాలీవుడ్‌ బ్లాక్‌బస్టర్ చిత్రాలకు కథలు అందించిన రచయిత విజయేంద్రప్రసాద్.  మగధీర, బాహుబలి, ఆర్‌ఆర్‌ఆర్‌ లాంటి ఆల్‌టైమ్‌ హిట్స్‌ను అందించారు. అయితే తాజాగా మరో స్టార్‌ హీరోకు కథను అందించేందుకు సిద్ధమయ్యారు. శాండల్‌వుడ్‌ సూపర్‌ స్టార్‌ కిచ్చా సుదీప్‌ నటిస్తున్న తాజా చిత్రానికి విజయేంద్ర ప్రసాద్‌ పనిచేస్తున్నారు. టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తండ్రి ఆయన ఇప్పటి వరకు తెలుగు, తమిళం, హిందీ భాషల్లో 25 చిత్రాలకు పైగా కథలను అందించారు. తాజాగా కన్నడ హీరో కిచ్చాకు సైతం కథ సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఈ విషయాన్ని సెప్టెంబర్‌ 2న కిచ్చా సుదీప్ బర్త్ డే సందర్భంగా మేకర్స్ రివీల్ చేశారు. 

(ఇది చదవండి: అవార్డులు నాకు చెత్తతో సమానం.. స్టార్ హీరో షాకింగ్ కామెంట్స్! )

కిచ్చా సుదీప్‌ కథానాయకుడుగా ప్రముఖ కన్నడ చిత్ర నిర్మాణ సంస్థ ఆర్సీ స్టూడియోస్ భారీ బడ్జెట్లో చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఆర్‌.చంద్రు దర్శకత్వం వహిస్తున్నారు. కిచ్చా సుదీప్ మరోసారి కబ్జా దర్శకుడు ఆర్ చంద్రుతో జతకట్టబోతున్నారు. ఈ ముగ్గురు కాంబినేషన్‌లో ఆర్సీ స్టూడియోస్‌ సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించనున్నట్లు అందులో పేర్కొన్నారు. ఈ  ఏడాదిలో ఈ సంస్థ నిర్మించిన ఐదు చిత్రాలు వరుసగా తెరపైకి రాబోతున్నట్లు తెలిపారు. అదేవిధంగా కిచ్చ సుదీప్‌ కథానాయకుడిగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రంలో పని చేయడానికి ప్రపంచ స్థాయి టెక్నీషియన్లను, నటీనటులను ఎంపిక చేస్తున్నట్లు తెలిపారు. 

(ఇది చదవండి: సలార్‌ రిలీజ్‌ ఆ నెలలోనే.. వైరలవుతున్న ట్వీట్‌!)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement