breaking news
Delhi Premier League
-
విధ్వంసం సృష్టించిన నితీశ్ రాణా.. బ్యాటింగ్లో ఉగ్రరూపం, బౌలింగ్లో అద్భుతం
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో ఎడిషన్ (2025) విజేతగా వెస్ట్ ఢిల్లీ లయన్స్ అవతరించింది. నిన్న (ఆగస్ట్ 31) జరిగిన ఫైనల్లో ఆ జట్టు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. వెస్ట్ ఢిల్లీ లయన్స్ను ఆ జట్టు కెప్టెన్ నితీశ్ రాణా ఒంటిచేత్తో గెలిపించాడు. తొలుత బౌలింగ్లో అదరగొట్టి (4-0-16-1), ఆతర్వాత బ్యాటింగ్లో (49 బంతుల్లో 79 నాటౌట్; 4 ఫోర్లు, 7 సిక్సర్లు) బెదరగొట్టాడు. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. యుగల్ సైనీ (48 బంతుల్లో 65; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), ప్రన్షు విజయ్రాన్ (24 బంతుల్లో 50 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) అర్ద సెంచరీలతో మెరిశారు. ఆఖర్లో ప్రన్షు విరుచుకుపడకపోయుంటే సెంట్రల్ ఢిల్లీ ఈ స్కోర్ చేయలేకపోయేది. ప్రన్షు, సైనీ మినహా సెంట్రల్ ఢిల్లీ ఇన్నింగ్స్లో ఎవరూ చెప్పుకోదగ్గ స్కోర్లు చేయలేదు. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో నితీశ్ రాణా, మనన్ భరద్వాజ్ (3-0-11-2), శివాంక్ వశిష్ట్ (2-0-12-2) సెంట్రల్ ఢిల్లీ బ్యాటర్లను ఇబ్బంది పెట్టారు. శుభమ్ దూబే, మయాంక్ గుసేన్ తలో వికెట్ తీసినా ధారాళంగా పరుగులు సమర్పించుకున్నారు.అనంతరం ఓ మోస్తరుకు మించిన లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ ఢిల్లీ.. నితీశ్ రాణా విధ్వంసం సృష్టించడంతో మరో 2 ఓవర్లు మిగిలుండగానే విజయతీరాలకు చేరింది. రాణాకు జతగా హృతిక్ షోకీన్ (27 బంతుల్లో 42 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) కూడా బ్యాట్ ఝులిపించి వెస్ట్ ఢిల్లీ విజయంలో కీలకపాత్ర పోషించాడు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో ఒక్కరు కూడా రాణా, షోకీన్ జోరుకు అడ్డుకట్ట వేయలేకపోయారు.ఈ సీజన్ ఆధ్యాంతం నితీశ్ రాణా అద్భుత ప్రదర్శనలు చేశాడు. కీలక మ్యాచ్ల్లో మరింత చెలరేగి ఆడాడు. ఎలినేటర్ మ్యాచ్లో విధ్వంసకర శతకం (55 బంతుల్లో 134 నాటౌట్), క్వాలిఫయర్-2లో మెరుపు ఇన్నింగ్స్ (26 బంతుల్లో 45 నాటౌట్) ఆడి తన జట్టును ఫైనల్కు చేర్చాడు. ఫైనల్లో బ్యాట్తో పాటు బంతితోనూ సత్తా చాటి ఒంటిచేత్తో తన జట్టును ఛాంపియన్గా నిలబెట్టాడు.ఈ టోర్నీ గత సీజన్లో ఐపీఎల్ సంచలనం ప్రియాన్ష్ ఆర్య (పంజాబ్ కింగ్స్) నితీశ్ తరహాలోనే రెచ్చిపోయి వెలుగులోకి వచ్చాడు. ఆతర్వాత ప్రియాంశ్ ఆర్య ఐపీఎల్లో ఏం చేశాడో అంతా చూశాం. ఈ సీజన్ మెరుపు ప్రదర్శనలతో నితీశ్ కూడా భారత పరిమిత ఓవర్ల జట్లలోకి వచ్చి అద్భుతాలు చేస్తాడేమో చూడాలి. నితీశ్ ఐపీఎల్లో గత సీజన్కు ముందే కేకేఆర్ నుంచి రాజస్థాన్ రాయల్స్కు మారాడు. గత సీజన్లో అతను చెప్పుకోదగ్గ ప్రదర్శనలేమీ చేయలేదు. -
దిగ్వేష్-రాణా మధ్య వాగ్వాదం.. కొట్టుకునేంత వరకు వెళ్లారు! వీడియో
ఢిల్లీ యువ స్పిన్నర్, లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ దిగ్వేష్ సింగ్ రథీ.. వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రాస్గా నిలుస్తున్నాడు. ఐపీఎల్-2025లో తన నోట్ బుక్ సెలబ్రేషన్స్తో బీసీసీఐ అగ్రహానికి గురైన దిగ్వేష్.. ఇప్పుడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో కూడా అదే తీరును కనబరిచాడు. ఈ టోర్నీలో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్కు దిగ్వేష్ సింగ్ ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.అయితే శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్లో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్లో దిగ్వేష్, వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీష్ రాణా మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.అసలేమి జరిగిదంటే?వెస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేయడానికి వచ్చిన దిగ్వేష్ను రాణా గ్రాండ్ వెలకమ్ పలికాడు. ఆ ఓవర్లో రాణా మూడు సిక్స్లు, ఒక ఫోర్తో మొత్తంగా 22 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ దిగ్వేష్ బౌలింగ్లో ఒక ఫోర్, 2 సిక్స్లు కొట్టాడు. దీంతో దిగ్వేష్ తన సహనాన్ని కోల్పోయాడు. రాణా ఏకాగ్రాతను దెబ్బతీసేందుకు మైండ్ గేమ్స్ ఆడాడు. దీంతో అతడిని స్లెడ్జ్ చేయడం దిగ్వేష్ మొదలు పెట్టాడు. తన మూడో ఓవర్ వేయడానికి వచ్చిన ఈ లక్నో స్పిన్నర్ బంతిని వేసేందుకు ముందుకు వచ్చి కావాలనే ఒక్కసారిగా ఆపేశాడు. అతడి చర్య రాణాకు అగ్రహాం తెప్పించింది. దిగ్వేశ్ రాఠీ మరో బంతి వేసేటప్పుడు రాణా పక్కకు తప్పుకున్నాడు. వెంటనే దిగ్వేష్ రాణాను ఏదో అన్నాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్దం చోటు చేసుకుంది. ఈ క్రమంలో అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.It’s all happening here! 🔥🏏Nitish Rana | Digvesh Singh Rathi | West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/OfDZQGhOlr— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025క్రిష్- సుమిత్ మధ్య గొడవఇదే కాకుండా ఈ మ్యాచ్లో మరో ఇద్దరి ఆటగాళ్ల మధ్య గొడవ జరిగింది. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ ప్లేయర్ సుమిత్ మాథుర్, వెస్ట్ ఢిల్లీ ఆటగాడు క్రిష్ యాదవ్ కొట్టుకునేంత పనిచేశారు. 11 ఓవర్ వేసిన అమన్ భారతి బౌలింగ్లో లాంగ్-ఆఫ్ కోసం సిక్స్ కొట్టడానికి ప్రయత్నించి క్రిష్ ఔటయ్యాడు.దీంతో సౌత్ ఢిల్లీ ఆటగాళ్లు సంబరాల్లో మునిగి తేలిపోయాడు. ఈ క్రమంలో ఔట్ అయిన క్రిష్ ప్రత్యర్థి ఆటగాడితో గొడవకు దిగాడు. ఒకరిపైకి ఒకరు దూసుకొచ్చారు. అయితే అంతకు ముందు దిగ్వేశ్తో గొడవ పడిన నితీశ్ ఈసారి శాంతికాముకుడిగా వ్యవహరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. కాగా ఎలిమినేటర్ రౌండ్లో విజయం సాధించిన వెస్ట్ ఢిల్లీ క్వాలిఫయర్-2కు ఆర్హత సాధించింది.చదవండి: Bengaluru Stampede: ఆర్సీబీ కీలక ప్రకటన.. ఒక్కొక్కరికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియాAn intense moment in the middle! 🏏Nitish Rana | Digvesh Singh Rathi | West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/dX5E5wFDqd— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025 -
నితీష్ విధ్వంసకర సెంచరీ.. 15 సిక్స్లతో వీర విహారం! వీడియో
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టు క్వాలిఫయర్ 2కు ఆర్హత సాధించింది. శుక్రవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఎలిమినేటర్లో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్పై 7 వికెట్ల తేడాతో వెస్ట్ ఢిల్లీ ఘన విజయం సాధించింది. దీంతో శనివారం క్వాలిఫయర్-2లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో వెస్ట్ ఢిల్లీ తలపడనుంది.కాగా ఎలిమినేటర్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగుల భారీ స్కోర్ సాధించింది. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్ బ్యాటర్లలో అన్మోల్ శర్మ(55), తేజస్వి దహియా(33 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్లతో 60) హాఫ్ సెంచరీలతో మెరవగా.. సుమిత్ మాథుర్(26 బంతుల్లో48) మెరుపులు మెరిపించాడు. వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో హృతిక్ షోకీన్ రెండు వికెట్లు పడగొట్టగా.. శుబమ్ దుబే, శివాంక్, అనిరుద్ చౌదరి తలా వికెట్ సాధించారు.నితీష్ విధ్వంసం..అనంతరం 202 పరుగుల లక్ష్య చేధనలో వెస్ట్ ఢిల్లీ 21 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ క్రమంలో వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ నితీష్ రాణా విధ్వంసం సృష్టించాడు. ప్రత్యర్ధి బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు.అరుణ్ జైట్లీ స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. ఈ క్రమంలో రాణా కేవలం 42 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు.ఓవరాల్గా 55 బంతులు ఎదుర్కొన్న నితీష్.. 8 ఫోర్లు, 15 సిక్స్ల సాయంతో 134 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో 202 పరుగుల లక్ష్యాన్ని వెస్ట్ ఢిల్లీ 17.1 ఓవర్లలో కేవలం మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది.చదవండి: ZIM vs SL: శ్రీలంకను వణికించిన జింబాబ్వే.. ఉత్కంఠ పోరులో ఓటమిCaptain Rana Roars! 🏏🔥Nitish Rana dominates with a century to guide his team to victory! 💥Nitish Rana| West Delhi Lions | South Delhi Superstarz | #DPL #DPL2025 #AdaniDPL2025 #Delhi pic.twitter.com/WcDy5Q1GM4— Delhi Premier League T20 (@DelhiPLT20) August 29, 2025 -
నాన్న చెబితే వినక తప్పదు.. నా ఫోకస్ మాత్రం..: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా విధ్వంసకర బ్యాటర్ వీరేందర్ సెహ్వాగ్ (Virender Sehwag) వారసుడు ఆర్యవీర్ (Aaryavir Sehwag) సెహ్వాగ్ లీగ్ క్రికెట్లో అడుగుపెట్టాడు. తొలి ప్రయత్నంలోనే ధనాధన్ ఆడి.. శుభారంభం అందుకున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL)-2025లో భాగంగా సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరఫున ఆర్యవీర్ బుధవారం అరంగేట్రం చేశాడు.వరుసగా రెండు బౌండరీలుఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా పేసర్ నవదీప్ సైనీ (Navdeep Saini) బౌలింగ్లో వరుసగా రెండు బౌండరీలు బాది ఆర్యవీర్ తన ఆగమాన్ని ఘనంగా చాటాడు. అయితే, మొత్తంగా 16 బంతులు ఎదుర్కొన్న ఈ జూనియర్ సెహ్వాగ్ నాలుగు బౌండరీల సాయంతో 22 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు.ఏదేమైనా.. క్రీజులో ఉన్నది కొద్దిసేపే అయినా ఆర్యవీర్ సెహ్వాగ్ తండ్రి వీరేందర్ సెహ్వాగ్ను గుర్తుచేస్తూ అభిమానులను అలరించాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ‘‘యశ్ ధుల్ దులిప్ ట్రోఫీ కారణంగా ఈ మ్యాచ్ మిస్సయ్యాడు.ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయానుమా జట్టు గత మ్యాచ్ పూర్తైన తర్వాతే.. ధుల్ స్థానంలో నేను ఆడబోతున్నానని తెలిసింది. జాంటీ భయ్యా వచ్చి నాకు ఈ విషయం ఈ చెప్పాడు. ఈ మ్యాచ్లో ఆడటం బాగా అనిపించింది. బౌండరీలు బాదడం వల్ల నాలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. అయితే, ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాను. తదుపరి మ్యాచ్లో మరింత ఎక్కువ సేపు బ్యాటింగ్ చేయాలని అనుకుంటున్నా’’ అని ఆర్యవీర్ తెలిపాడు. నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదుఇక తండ్రి వీరేందర్ సెహ్వాగ్ గురించి ప్రస్తావన రాగా.. ‘‘నాన్న చెబితే ఎవరైనా వినక తప్పదు కదా!’’ అంటూ ఆర్యవీర్ నవ్వులు చిందించాడు. తండ్రి నుంచి తప్పక ఫీడ్బ్యాక్ తీసుకుంటానని తెలిపాడు.కేవలం ఆట మీద మాత్రమే దృష్టిఅదే విధంగా.. ‘‘మమ్మల్ని, మా ఆట తీరును అందరూ గమనిస్తూ ఉంటారని తెలుసు. స్కౌట్స్ మా ప్రదర్శనను విశ్లేషిస్తూ ఉంటారు. అయితే, ఆ విషయం గురించి మేము ఎక్కువగా ఆలోచించము. ఒకవేళ అలా చేసినట్లయితే ఒత్తిడి మరింత ఎక్కువవుతుంది. కాబట్టి.. మైదానంలో కేవలం ఆట మీద మాత్రమే నేను దృష్టి సారిస్తాను’’ అని ఆర్యవీర్ సెహ్వాగ్ ఐపీఎల్లో ఆడాలన్న తన కల గురించి చెప్పుకొచ్చాడు.కాగా భారత ఓపెనర్గా అద్భుతంగా రాణించిన వీరేందర్ సెహ్వాగ్కు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆర్యవీర్. చిన్నోడు వేదాంత్. ఆర్యవీర్ దేశీ క్రికెట్లో ఇప్పటికే సత్తా చాటుతున్నాడు. డీపీఎల్ వేలంలో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని ఎనిమిది లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది.చదవండి: గిల్, స్కై, సంజూ కాదు!.. టీమిండియాకు ఆ ముగ్గురే గేమ్ ఛేంజర్లు: సెహ్వాగ్ -
బౌలర్లు ఇక కాస్కోండి.. జూనియర్ సెహ్వాగ్ వచ్చేస్తున్నాడు! వీడియో
ఢిల్లీకి చెందిన ‘సెహ్వాగ్’ అనే క్రికెటర్ తిరిగి మళ్లీ ఓపెనర్గా బ్యాటింగ్కు వచ్చాడు. అయితే మీరు అనుకుంటున్నట్లు అతడు వీరేంద్ర సెహ్వాగ్ కాదు.. అతడి పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్. ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్(DPL)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తరపున అరంగేట్రం చేశాడు. బుధవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఈస్ట్ ఢిల్లీ రైడర్స్పై తన తొలి టీ20 మ్యాచ్ను ఆర్యవీర్ ఆడాడు.తండ్రికి తగ్గ తనయుడు..ఈ మ్యాచ్లో ఓపెనర్గా వచ్చిన ఆర్యవీర్ తన తండ్రి శైలిలో ఫోర్ కొట్టి ఖాతా తెరవకపోయినా.. కానీ వీరేంద్రుడి మాదిరే తన దూకుడును ప్రదర్శించాడు. 18 ఏళ్ల ఆర్యవీర్ ఫాస్ట్ బౌలర్లను అద్బుతంగా ఎదుర్కొన్నాడు. కొత్త బంతితో భారత పేసర్ నవదీప్ సైనీని ఎదుర్కొన్న ఆర్యవీర్.. వరుసగా రెండు బౌండరీలు బాదాడు.తొలి బౌండరీని ఆఫ్-సైడ్ దిశగా బాదిన జూనియర్ సెహ్వాగ్.. రెండో బౌండరీని చక్కటి లాఫ్టెడ్ డ్రైవ్తో రాబట్టాడు. అతడి డేరింగ్ బ్యాటింగ్కు అందరూ ఫిదా అయిపోయారు. ఆర్యవీర్ కాసేపే క్రీజులో ఉన్నప్పటికి తన బ్యాటింగ్తో అలరించాడు. 16 బంతులు ఎదుర్కొన్న ఆర్యవీర్.. 4 ఫోర్లు సాయంతో 22 పరుగులు చేసి ఔటయ్యాడు.కాగా ఆర్యవీర్ ఇటీవలే ఇన్ సైడ్స్పోర్ట్స్కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా ఐపీఎల్లో ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహించాలని, టీమిండియా స్టార్ విరాట్ కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవాలన్న తన కోరికను ఆర్యవీర్ వ్యక్తం చేశాడు.ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్పై 62 పరుగుల తేడాతో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ గెలిచింది.Classy batting! Aaryavir Sehwag smashes consecutive fours. 💥 🏏Aaryavir Sehwag | East Delhi Riders | Central Delhi Kings | Anuj Rawat | Jonty Sidhu | #DPL2025 #DPP #AdaniDPL2025 #Delhi pic.twitter.com/08KwyxqPeK— Delhi Premier League T20 (@DelhiPLT20) August 27, 2025 -
మా నాన్న చాలా నేర్పించారు.. కానీ అతడే నాకు రోల్ మోడల్: ఆర్యవీర్ సెహ్వాగ్
టీమిండియా స్టార్ విరాట్ కోహ్లికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సామన్యుల నుంచి సెలబ్రేటిల వరకు విరాట్ కోహ్లిని ఆరాధిస్తుంటారు. ఈ ఢిల్లీ బాయ్ ఎంతో మంది యువ క్రికెటర్లకు రోల్ మోడల్. ఈ జాబితాలో టీమిండియా లెజెండరీ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఉన్నాడు.రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) సూపర్స్టార్ విరాట్తో డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవాలని ఆర్యవీర్ కలలు కంటున్నాడు. తన తండ్రి వీరేంద్ర సెహ్వాగ్ ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్ వంటి జట్లకు ప్రాతినిధ్యం వహించినప్పటికీ ఆర్యవీర్ మాత్రం ఆర్సీబీకి ఆడాలని తహతహలాడుతున్నాడు.17 ఏళ్ల ఆర్యవీర్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. డీపీఎల్ వేలంలో ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ రూ.8 లక్షల భారీ ధరకు సొంతం చేసుకుంది. అయితే ఈ ఏడాది టోర్నీలో ఇప్పటివరకు ఆడే అవకాశం అతడికి లభించలేదు. సెంట్రల్ ఢిల్లీ ఆటగాడు యశ్ ధుల్ దులీప్ ట్రోఫీలో ఆడేందుకు వెళ్లనుండడంతో ఆర్యవీర్కు మిగితా మ్యాచ్ల్లో ఆర్యవీర్ భాగమయ్యే ఛాన్స్ ఉంది."ప్రస్తుత తరంలో విరాట్ కోహ్లి గొప్ప బ్యాటర్. కోహ్లితో డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవాలనేది నా కల. ఐపీఎల్లో ఆడే అవకాశం వస్తే కచ్చితంగా ఆర్సీబీకి ప్రాతినిథ్యం వహిస్తాను. అదేవిధంగా మా నాన్న నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.ప్రతి ఒక్కరిని గౌరవించడం, అందరితో మర్యాదగా నడుచుకోవడం, కెరీర్ పరంగా ఎంత ఎదిగినా తగ్గే ఉండాలి మా నాన్న మాకు నేర్పించారు అని ఇన్సైడ్ స్పోర్ట్స్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్యవీర్ పేర్కొన్నాడు.కాగా ఆర్యవీర్ తన తండ్రి అడుగు జాడల్లోనే నడుస్తున్నాడు. గతేడాది కూచ్ బెహార్ ట్రోఫీలో ఢిల్లీ అండర్-19 జట్టు తరపున డబుల్ సెంచరీతో చెలరేగాడు. మేఘాలయ జట్టుపై 297 పరుగులు చేసి త్రుటిలో ట్రిపుల్ సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు.చదవండి: వాంఖెడే స్టేడియంలో గావస్కర్ విగ్రహావిష్కరణ -
మరో విధ్వంసకర శతకం.. బీభత్సం సృష్టించిన టీమిండియా యువ కెరటం
రెడ్ బాల్ క్రికెట్కు మాత్రమే పనికొస్తాడనుకున్న భారత అండర్-19 జట్టు మాజీ కెప్టెన్ యశ్ ధుల్.. టీ20 ఫార్మాట్లోనూ మెరుపులు మెరిపిస్తున్నాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో సెంట్రల్ ఢిల్లీకి ఆడుతున్న ధుల్.. వరుస సెంచరీలతో అదరగొడుతున్నాడు.కొద్ది రోజుల కిందట నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్పై మెరుపు సెంచరీతో (56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు) విరుచుకుపడిన చేసిన ధుల్.. తాజాగా అదే జట్టుపై మరోసారి విధ్వంసకర శతకంతో (51 బంతుల్లో 105; 14 ఫోర్లు, 4 సిక్సర్లు) బీభత్సం సృష్టించాడు.ధుల్ సెంచరీలతో పేట్రేగిపోయిన రెండు సందర్భాల్లో సెంట్రల్ ఢిల్లీ ఘన విజయాలు సాధించింది. తాజాగా నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన సెంట్రల్ ఢిల్లీ 16 ఓవర్లలో (వర్షం కారణంగా కుదించారు) 7 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. ధుల్తో పాటు యుగల్ సైనీ (28 బంతుల్లో 63; 6 ఫోర్లు, 4 సిక్సర్లు) సత్తా చాటాడు. నార్త్రన్ ఢిల్లీ బౌలర్లలో కెప్టెన్ హర్షిత్ రాణా, అర్జున్ రప్రియ తలో 3 వికెట్లు తీశారు.అనంతరం భారీ లక్ష్య ఛేదనలో నార్త్రన్ ఢిల్లీ అద్భుతంగా పోరాడినప్పటికీ విజయం సాధించలేకపోయింది. 16 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసి లక్ష్యానికి 16 పరుగుల దూరంలో నిలిచిపోయింది. ఓపెనర్లు సర్తక్ రంజన్ (52), అర్నవ్ బుగ్గా (43) మెరుపు ఇన్నింగ్స్లతో గెలుపుకు గట్టి పునాది వేసినప్పటికీ.. ఆతర్వాత వచ్చిన వారు దాన్ని కొనసాగించలేకపోయారు. మధ్యలో వైభవ్ కంద్పాల్ (34) మినహా అంతా విఫలమయ్యారు. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లు తలో చేయి వేసి నార్త్రన్ ఢిల్లీ గెలుపుకు అడ్డుకున్నారు.ఆ ముద్రను చెరిపేసిన ధుల్రెడ్ బాల్ బ్యాటర్గా ముద్రపడిన ధుల్.. వరుస టీ20 సెంచరీలతో ఆ ఇమేజ్ను చెరిపేశాడు. తాజా ప్రదర్శనలతో ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు. ధుల్కు అండర్-19 క్రికెట్ ఆడే రోజుల నుంచి నిదానంగా ఆడతాడన్న చెడ్డ పేరుంది. టెక్నిక్ పరంగా బలంగా ఉన్నప్పటికీ.. పరిమిత ఓవర్ల ఫార్మాట్లలో, ముఖ్యంగా టీ20ల్లో అవేవీ లెక్కలోని రావు.అందుకే ధుల్ తన శైలిని మార్చుకొని బ్యాట్ను ఝులిపించడం ప్రారంభించాడు. ఈ క్రమంలోనే డీపీఎల్లో రెండు విధ్వంసకర శతకాలతో విరుచుకుపడ్డాడు. ధుల్కు ఆటగాడిగానే కాకుండా కెప్టెన్గానూ మంచి ట్రాక్ రికార్డు ఉంది. అతని సారథ్యంలో భారత్.. అండర్-19 జట్టు 2021 ఆసియా కప్, 2022 వరల్డ్కప్ గెలిచింది.ధుల్ రంజీ అరంగేట్రంలో రెండు ఇన్నింగ్స్ల్లో సెంచరీలు చేసి సీనియర్ లెవెల్లో గ్రాండ్గా ఎంట్రీ ఇచ్చాడు. ఆతర్వాత 2022లో అతనికి ఐపీఎల్ అవకాశం దక్కింది. ఆ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. 3 ఇన్నింగ్స్ల్లో కేవలం 16 పరుగులే చేసి నిరాశపరిచాడు. ఆ సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్ను మరోసారి దక్కించుకునే ప్రయత్నం చేయవచ్చు. -
టీమిండియా స్టార్ హర్షిత్ రాణాకు షాక్.. ‘ఓవరాక్షన్’కు తప్పదు మూల్యం!
టీమిండియా యువ పేసర్ హర్షిత్ రాణా మరోసారి అనుచిత ప్రవర్తనతో వార్తల్లో నిలిచాడు. బౌలింగ్లోనే కాదూ.. బ్యాటర్లకు సెండాఫ్ ఇవ్వడంలోనూ మరోమారు దూకుడు ప్రదర్శించి మూల్యం చెల్లించాడు. అసలేం జరిగిందంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL 2025)లో లోకల్ కుర్రాడు హర్షిత్ రాణా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్కు కెప్టెన్గా వ్యవహరిస్తున్నాడు.అర్జున్ ధనాధన్ఈ టీ20 ఫార్మాట్ లీగ్లో భాగంగా నార్త్ ఢిల్లీ సోమవారం రాత్రి వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్టుతో తలపడింది. అరుణ్ జైట్లీ స్టేడియంలో తొలుత బ్యాటింగ్ చేసిన నార్త్ ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. సార్థక్ రంజన్ (33 బంతుల్లో 42) జట్టు తరఫున టాప్ రన్ స్కోరర్గా నిలవగా.. అర్జున్ రాప్రియా విలువైన ఇన్నింగ్స్ (22 బంతుల్లో 40) ఆడాడు.హృతిక్ షోకేన్ మెరుపు హాఫ్ సెంచరీ వృథాఇక వెస్ట్ ఢిల్లీ బౌలర్లలో మయాంక్ గసైన్ (3/2) అత్యుత్తమంగా రాణించగా.. శుభమ్ దూబే కూడా (2/26) కూడా రెండు వికెట్లు కూల్చాడు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన వెస్ట్ ఢిల్లీ 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 154 పరుగుల వద్దే నిలిచిపోయింది. దీంతో నార్త్ ఢిల్లీ జయభేరి మోగించింది. దీంతో హృతిక్ షోకేన్ మెరుపు హాఫ్ సెంచరీ (24 బంతుల్లో 51) వృథాగా పోయింది.నార్త్ ఢిల్లీ తరఫున దీపాన్షు గులియా (3/44) అత్యుత్తమ బౌలింగ్తో ఆకట్టుకున్నాడు. ఇదిలా ఉంటే.. వెస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్లో మూడో ఓవర్లో నార్త్ ఢిల్లీ కెప్టెన్ హర్షిత్ రాణా బంతితో రంగంలో దిగాడు. అద్భుత డెలివరీతో ఆయుశ్ దోసాంజేను బౌల్డ్ చేశాడు.వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూఈ క్రమంలో పెవిలియన్కు వెళ్లేందుకు సిద్ధమైన ఆయుశ్ను చూస్తూ.. ‘‘వెళ్లు.. వెళ్లు’’ అన్నట్లుగా వేలు ఊపుతూ సంజ్ఞ చేశాడు. ఈ నేపథ్యంలో హర్షిత రాణా చర్యను తీవ్రంగా పరిగణించిన డీపీఎల్ యాజమాన్యం అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించింది.డీపీఎల్ ప్రవర్తనా నియామవళిలోని ఆర్టికల్ 2.5 ప్రకారం.. భాష, చర్యలు, ఇతరులను రెచ్చగొట్టే విధంగా సైగలు వంటివి నేరం. ఇందులోని లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్లు హర్షిత్ రాణా మ్యాచ్ రిఫరీ ముందు అంగీకరించాడు. ఫలితంగా అతడి ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు డీపీఎల్ యాజమాన్యం తెలిపింది. కాగా ఐపీఎల్-2024లో కోల్కతా నైట్ రైడర్స్కు ఆడిన సమయంలోనూ హర్షిత్ రాణా ఇలాగే అతి చేశాడు. సన్రైజర్స్ హైదరాబాద్ స్టార్ మయాంక్ అగర్వాల్ను అవుట్ చేయగానే ఫ్లైయింగ్ కిస్సులు ఇస్తూ ఓవరాక్షన్ చేసి.. మూల్యం చెల్లించాడు.చదవండి: శుభవార్త పంచుకున్న హసీన్ జహాన్.. షమీపై మరోసారి తీవ్రమైన ఆరోపణలుBails are broken — Harshit Rana was there 🥶#DPL2025pic.twitter.com/VDnk39INji— KKR Karavan (@KkrKaravan) August 11, 2025 -
ఐపీఎల్లో హిట్టు.. డీపీఎల్లో ఫట్టు.. అతడు మాత్రం అలా కాదు..!
గత ఐపీఎల్ సీజన్లో లక్నో సూపర్ జెయింట్స్ తరఫున సంచలన ప్రదర్శనలు చేసి వెలుగులోకి వచ్చిన ఢిల్లీ మిస్టరీ స్పిన్నర్ దిగ్వేశ్ సింగ్ రాఠీ.. ప్రస్తుతం జరుగుతున్న ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో అంచనాలకు తగ్గట్టుగా రాణించలేకపోతున్నాడు. రాఠీ ఈ డీపీఎల్ సీజన్లో వరుసగా 4 మ్యాచ్ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేక ఉసూరుమనిపించాడు. పైగా 10 ఎకానమీ రేట్కు తగ్గకుండా పరుగులు సమర్పించుకుని ప్రత్యర్థి బ్యాటర్లు పండుగ చేసుకునేలా చేశాడు.ఐపీఎల్ 2025లో ఆకట్టుకునే ఎకానమీతో (8.25) బౌలింగ్ చేసి 14 వికెట్లు (13 మ్యాచ్ల్లో) తీసిన రాఠీపై డీపీఎల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లీగ్లో అతను సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ తరఫున ఆడుతున్నాడు. రాఠీ న్యూఢిల్లీ టైగర్స్తో జరిగిన గత మ్యాచ్లో తొలి రెండు ఓవర్లలో కేవలం 9 పరుగులే ఇచ్చి గాడిలో పడినట్లు కనిపించాడు. అయితే చివరి రెండు ఓవర్లలో ఏకంగా 24 పరుగులిచ్చి మళ్లీ మొదటికొచ్చాడు.ఎన్నో ఆశలు పెట్టుకున్న రాఠీ వరుసగా వైఫల్యాలు చెందుతుండటంతో అతని జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ ఆడిన 5 మ్యాచ్ల్లో నాలుగింట ఓడింది. రాఠీ మున్ముందు జరిగే మ్యాచ్ల్లో రాణిస్తేనే సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ నాకౌట్ చేరే అవకాశం ఉంటుంది. గత సీజన్లో రాఠీ ప్రదర్శన ప్రస్తుత సీజన్కు భిన్నంగా ఉంది. 2024 సీజన్లో అతను 10 మ్యాచ్ల్లో కేవలం 7.83 ఎకానమీ రేట్తో 14 వికెట్లు తీశాడు. ఈ ప్రదర్శన కారణంగానే రాఠీకి ఐపీఎల్ నుంచి పిలుపు వచ్చింది. ఐపీఎల్లో తన అరంగేట్రం సీజన్లోనే రాఠీ ఆకట్టుకున్నాడు. నాణ్యమైన స్పిన్ బౌలింగ్తో పాటు నోట్ బుక్ సెలబ్రేషన్స్ ద్వారా బాగా పాపులర్ అయ్యాడు.రాఠీకి భిన్నంగా ప్రియాంశ్ ఆర్యప్రస్తుత డీపీఎల్ సీజన్లో మరో ఐపీఎల్ స్టార్ ప్రియాంశ్ ఆర్య (ఔటర్ ఢిల్లీ) తొలుత నిరాశపరిచినా, ఆతర్వాత గాడిలో పడ్డాడు. ఈ సీజన్లో తొలి మూడు మ్యాచ్ల్లో సామర్థ్యం మేరకు రాణించలేకపోయిన ఆర్య.. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో జరిగిన నాలుగో మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఆ మ్యాచ్లో కేవలం 56 బంతుల్లో 7 ఫోర్లు, 9 సిక్సర్ల సాయంతో 111 పరుగులు చేశాడు.ఆర్య గత డీపీఎల్ సీజన్లోనూ ఇలాంటి విధ్వంసకర శతకాలు బాది ఐపీఎల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అనంతరం ఐపీఎల్లోనూ పంజాబ్ కింగ్స్ తరఫున అంచనాలకు మించి రాణించాడు. సీఎస్కేతో మ్యాచ్లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన ఆర్య.. సీజన్ మొత్తం నిలకడగా మెరుపులు మెరిపించి (17 మ్యాచ్ల్లో 179.25 స్ట్రయిక్రేట్తో 475 పరుగులు) పంజాబ్ను ఫైనల్స్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. -
IPL 2026: మరో ప్రియాంశ్ ఆర్య లోడింగ్..!
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ అరంగేట్రం ఎడిషన్ (2024) ప్రియాంశ్ ఆర్య లాంటి విధ్వంసకర బ్యాటర్ను ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ సీజన్లో ప్రియాంశ్ మెరుపులు ఆకాశాన్ని తాకాయి. ఫలితంగా అతనికి ఐపీఎల్ ఆఫర్ వచ్చింది.ప్రియాంశ్ డీపీఎల్ 2024లో 198.69 స్ట్రయిక్రేట్తో 67.56 సగటున 2 విధ్వంసకర సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 608 పరుగులు చేశాడు. ఓ మ్యాచ్లో ప్రియాంశ్ 6 బంతుల్లో 6 సిక్సర్లు బాది, 40 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేశాడు. ఈ ప్రదర్శన తర్వాతే ప్రియాంశ్ వెలుగులోకి వచ్చాడు.ఆతర్వాత ప్రియాంశ్ ఐపీఎల్ 2025లో ఏం చేశాడో అందరం చూశాం. సీఎస్కేతో మ్యాచ్లో 39 బంతుల్లోనే శతక్కొట్టిన అతను.. సీజన్ మొత్తం నిలకడగా మెరుపులు మెరిపించి (17 మ్యాచ్ల్లో 179.25 స్ట్రయిక్రేట్తో 475 పరుగులు) తన జట్టును (పంజాబ్ కింగ్స్) ఫైనల్స్కు చేర్చడంలో కీలకపాత్ర పోషించాడు. తాజాగా ప్రియాంశ్ లాగే మరో ఆటగాడు ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో మెరుపులు మెరిపిస్తూ ఐపీఎల్వైపు దూసుకొస్తున్నాడు. వెస్ట్ ఢిల్లీ లయన్స్కు చెందిన ఆయుశ్ దొసేజా నిన్న (ఆగస్ట్ 7) పురానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 52 బంతుల్లో శతక్కొట్టి ప్రియాంశ్ ఆర్యను గుర్తు చేశాడు. దీనికి ముందు మ్యాచ్లో కూడా దొసేజా విధ్వంసం సృష్టించాడు. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్పై 48 బంతుల్లో అజేయమైన 84 పరుగులు చేశాడు.దొసేజా దూకుడు చూస్తుంటే అందరికీ ప్రియాంశ్ ఆర్యనే గుర్తుకు వస్తున్నాడు. అతను ఈ సీజన్లో ఇదే ఫామ్ను కొనసాగిస్తే ఐపీఎల్ 2026 వేలంలో హాట్ పిక్ అవుతాడు. దొసేజా ప్రదర్శనలు చూసి భారత క్రికెట్ అభిమానులు మరో ప్రియాంశ్ ఆర్య లోడింగ్ అంటూ చర్చించుకుంటున్నారు. దొసేజా ఓ పక్క చెలరేగుతుంటే డీపీఎల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న ప్రియాంశ్ ఆర్య మాత్రం ఈ సీజన్లో నిరాశపరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లో కూడా చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. -
విజృంభించిన ఆర్సీబీ స్టార్ స్పిన్నర్.. మరోసారి విఫలమైన ప్రియాంశ్ ఆర్మ
ఆర్సీబీ స్టార్ స్పిన్నర్ సుయాశ్ శర్మ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ఆరో మ్యాచ్లో చెలరేగిపోయాడు. ఈ టోర్నీలో ఔటర్ ఢిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న సుయాశ్.. నిన్న (ఆగస్ట్ 5) పురానీ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో 4 వికెట్లతో విజృంభించాడు. తన జట్టు 149 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకునే క్రమంలో సుయాశ్ మ్యాజిక్ చేశాడు. 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఫలితంగా అతని జట్టు ప్రత్యర్థిని 14.3 ఓవర్లలో 66 పరుగులకే ఆలౌట్ చేసింది. పురానీ ఢిల్లీ పతనాన్ని శాశించడంలో సుయాశ్కు శౌర్య మాలిక్ (3-0-10-3) జత కలిశాడు. శివమ్ శర్మ, హర్ష్ త్యాగి తలో వికెట్ తీశారు. పురానీ ఢిల్లీ ఇన్నింగ్స్లో సమర్థ్ సేథ్ (18), లలిత్ యాదవ్ (20) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితమయ్యారు.అంతకుముందు ఔటర్ ఢిల్లీ.. ఉధవ్ మోహన్ (4-0-26-5) విజృంభించడంతో 148 పరుగులకే పరిమితమైంది. ఉధవ్ మోహన్తో పాటు రజ్నీశ్ దాదర్ (4-0-22-2), పర్దీప్ పరాషార్ (3-0-11-2) రాణించారు. ఔటర్ ఢిల్లీ ఇన్నింగ్స్లో సనత్ సాంగ్వాన్ (26) టాప్ స్కోరర్గా నిలువగా.. సిద్దాంత్ శర్మ (21), వరున్ యాదవ్ (18), ధృవ్ సింగ్ (19), హర్ష్ త్యాగి (17) రెండంకెల స్కోర్లు చేశారు. ఐపీఎల్ సంచలనం, పంజాబ్ కింగ్స్ విధ్వంసకర ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య (16) వరుసగా రెండో మ్యాచ్లో విఫలమయ్యాడు. ఈ లీగ్ తొలి మ్యాచ్లో ఆర్మ 26 పరుగులకే పరిమితమయ్యాడు.వాస్తవానికి డీపీఎల్ 2025 ప్రారంభానికి ముందు నుంచి ప్రియాంశ్ ఆర్మపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ లీగ్ ఇనాగురల్ ఎడిషన్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడిన ఆర్య మరోసారి సీన్ రిపీట్ చేస్తాడని అంతా ఆశించారు. డీపీఎల్ అరంగేట్రం సీజన్లో ఆర్య 67.56 సగటున, 198.69 స్ట్రయిక్రేట్తో 608 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ప్రియాంశ్ ఓ మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. అలాగే 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు.ఆర్య ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో 17 మ్యాచ్లు ఆడి సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 179.24 స్ట్రయిక్రేట్తో 475 పరుగులు చేసి పంజాబ్ ఫైనల్స్కు చేరడంలో కీలకపాత్ర పోషించాడు. -
అరంగేట్రంలో అదుర్స్.. 5 వికెట్లతో చెలరేగిన వైభవ్ టీమ్ మేట్
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ నుంచి మరో యువ సంచలనం క్రికెట్ ప్రపంచానికి పరిచియమయ్యాడు. 18 ఏళ్ల యువ ఫాస్ట్ బౌలర్ ఉదవ్ మోహన్ తన డీపీఎల్ అరంగేట్రంలోనే సత్తాచాటాడు. ఈ మెగా టోర్నీలో పురానీ దిల్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న మోహన్.. మంగళవారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఔటర్ ఢిల్లీతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లతో చెలరేగాడు. మోహన్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 26 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. మోహిత్ పన్వర్, ధ్రువ్ సింగ్, సిద్ధాంత్ శర్మ , హర్ష్ త్యాగి, శివమ్ శర్మ వంటి కీలక వికెట్లను మోహన్ సాధించాడు.ఉదవ్ ఇటీవలే భారత అండర్-19 జట్టుకు కూడా ఎంపికయ్యాడు. వచ్చే నెలలో ఆస్ట్రేలియా అండర్-19తో జరగనున్న మల్టీ ఫార్మాట్ సిరీస్లలో వైభవ్ సూర్యవంశీ, అయూష్ మాత్రేతో కలిసి మోహన్ ఆడనున్నాడు. మోహన్ ఇంకా ఫస్ట్ క్రికెట్లో అరంగేట్రం చేయలేదు. ఈ ఏడాది జూన్లో జరిగిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో అతడిని పురానీ దిల్లీ రూ. 6.60 లక్షల భారీ ధరకు కొనుగోలు చేసింది. తన ధరకు తగ్గ న్యాయం తొలి మ్యాచ్లోనే మోహన్ చేశాడు.ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పురానీ దిల్లీపై 82 పరుగుల తేడాతో ఔటర్ ఢిల్లీ వారియర్స్ విజయం సాధించింది. 149 పరుగుల లక్ష్య చేధనలో పురానీ దిల్లీ 66 పరుగులకే కుప్పకూలింది. ఔటరీ ఢిల్లీ బౌలర్లలో సుయూష్ శర్మ నాలుగు వికెట్లు పడగొట్టగా.. శౌర్య మాలిక్ మూడు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు బ్యాటింగ్ చేసిన ఢిల్లీ వారియర్స్ 148 పరుగులకు ఆలౌటౌటైంది. పురానీ ధిల్లీ బౌలర్లలో మోహన్తో పాటు ప్రషార్, దాదర్ తలా రెండు వికెట్లు సాధించారు.Udhav Mohan is on fire! 🔥Udhav Mohan | Outer Delhi Warriors | Purani Dilli-6 | Delhi Premier League 2025 | #Delhi #DPL #DPL2025 #Cricket #T20 pic.twitter.com/MTMhiNlQlA— Delhi Premier League T20 (@DelhiPLT20) August 5, 2025చదవండి: Stuart Broad: టీమిండియా నుంచి ఆరుగురు.. గిల్కు చోటు లేదు! -
నిరాశపరిచిన ఐపీఎల్ సంచలనం ప్రియాంశ్ ఆర్య
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ 2025 ఎడిషన్లో ఐపీఎల్ సంచలన ఆటగాళ్లకు శుభారంభం లభించలేదు. ఈ లీగ్లో ఔటర్ ఢిల్లీ వారియర్స్కు ప్రాతినిథ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ విధ్వంసకర బ్యాటర్ ప్రియాంశ్ ఆర్య, ఆర్సీబీ సంచలన స్పిన్నర్ సుయాశ్ శర్మ అంచనాలకు తగ్గట్టుగా రాణించలేక నిరాశపరిచారు. లీగ్లో భాగంగా నిన్న న్యూఢిల్లీ టైగర్స్తో జరిగిన మ్యాచ్లో ఈ ఇద్దరు ఓ మోస్తరు ప్రదర్శనలతో సరిపెట్టారు.ప్రియాంశ్ ఆర్య 15 బంతుల్లో 4 ఫోర్లు, సిక్సర్ సాయంతో 26 పరుగులు చేయగా.. సుయాశ్ శర్మ 4 ఓవర్లలో వికెట్లేమీ తీయకుండా 33 పరుగులు సమర్పించుకున్నాడు. ప్రియాంశ్కు మంచి ఆరంభం లభించినా భారీ స్కోర్గా మలచడంలో విఫలమయ్యాడు. సుయాశ్ తన కోటా ఓవర్లు పూర్తి చేసినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు.ఈ లీగ్ ఇనాగురల్ ఎడిషన్లో విధ్వంసకర ఇన్నింగ్స్లు ఆడి ఐపీఎల్ అవకాశం దక్కించుకున్న ప్రియాంశ్పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ 2025లో మరోసారి విధ్వంసం సృష్టిస్తాడని అతని జట్టు ఔటర్ ఢిల్లీ భారీ ఆశలు పెట్టుకుంది. ప్రియాంశ్, సుయాశ్ సామర్థ్యం మేరకు రాణించకపోవడంతో న్యూఢిల్లీ టైగర్స్ చేతిలో ఔటర్ ఢిల్లీ 40 పరుగుల తేడాతో ఘెర పరాజయాన్ని ఎదుర్కొంది.ఈ మ్యాచ్లో న్యూఢిల్లీ టైగర్స్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేయగా.. ఛేదనలో సత్తా చాటలేకపోయిన ఔటర్ ఢిల్లీ నిర్ణీత ఓవర్లలో 182 పరుగులకే పరిమితమై ఓటమిపాలైంది. న్యూఢిల్లీ టైగర్స్ ఇన్నింగ్స్లో శివమ్ గుప్తా (89), కెప్టెన్ హిమ్మత్ సింగ్ (69) అర్ద సెంచరీలతో రాణించగా.. ఔటర్ ఢిల్లీ తరఫున సనత్ సాంగ్వాన్ (48), శ్రేష్ఠ యాదవ్ (37 నాటౌట్), ధృవ్ సింగ్ (42 నాటౌట్) ఓ మోస్తరు స్కోర్లు చేశారు. న్యూఢిల్లీ టైగర్స్ భారీ స్కోర్ చేసినప్పటికీ.. ఔటర్ ఢిల్లీ బౌలర్ అన్షుమన్ హూడా 5 వికెట్లు తీశాడు.ప్రియాంశ్ ఆర్య ఇటీవల ముగిసిన ఐపీఎల్ సీజన్లో 17 మ్యాచ్లు ఆడి సెంచరీ, 2 అర్ద సెంచరీల సాయంతో 179.24 స్ట్రయిక్రేట్తో 475 పరుగులు చేశాడు. సుయాశ్ గత ఐపీఎల్ సీజన్లో పెద్దగా వికెట్లేమీ తీయనప్పటికీ (14 మ్యాచ్ల్లో 4 వికెట్లు), కీలక సమయాల్లో పొదుపుగా బౌలింగ్ చేసి ఆర్సీబీ టైటిల్ గెలవడంలో కీలకపాత్ర పోషించాడు. ప్రియాంశ్ డీపీఎల్ అరంగేట్రం సీజన్లో 67.56 సగటున, 198.69 స్ట్రయిక్రేట్తో 608 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ప్రియాంశ్ ఓ మ్యాచ్లో 6 బంతుల్లో 6 సిక్సర్లు బాదాడు. అలాగే 50 బంతుల్లో 120 పరుగులు చేశాడు. -
విధ్వంసకర శతకంతో విరుచుకుపడిన భారత యువ కెరటం
ఇటీవలికాలంలో భారత అండర్-19 క్రికెట్ హీరోలు చెలరేగిపోతున్నారు. వైభవ్ సూర్యవంశీ, ఆయుశ్ మాత్రే లాంటి వారు ఇటీవల ఇంగ్లండ్ గడ్డపై ఆకాశమే హద్దుగా చెలరేగగా.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025లో భారత అండర్-19 జట్టు మాజీ సారధి యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడ్డాడు. డీపీఎల్ 2025 రెండో మ్యాచ్లో ధుల్ సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు ఆడుతూ నార్త్రన్ ఢిల్లీ స్ట్రయికర్స్పై 56 బంతుల్లో 8 ఫోర్లు, 7 భారీ సిక్సర్ల సాయంతో అజేయమైన 101 పరుగులు చేశాడు. ఫలితంగా సెంట్రల్ ఢిల్లీ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.ప్రస్తుత డీపీఎల్ సీజన్లో ధుల్ సెంచరీనే మొదటిది. గత సీజన్ మొత్తంలో 93 పరుగులే చేసిన ధుల్ ఈ సీజన్ తొలి మ్యాచ్లోనే సెంచరీతో మెరిశాడు. రెడ్ బాల్ బ్యాటర్గా ముద్రపడిన ధుల్ ఈ ఇన్నింగ్స్తో ఆ ముద్రను చెరిపేసి ఆల్ ఫార్మాట్ బ్యాటర్ అనిపించుకున్నాడు. అండర్-19 క్రికెట్ ప్రదర్శనల ఆధారంగా 2023 ఐపీఎల్ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున అరంగేట్రం చేసిన ధుల్.. ఆ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు. 3 ఇన్నింగ్స్ల్లో కేవలం 16 పరుగులే చేశాడు. ఆ సీజన్లో పేలవ ప్రదర్శన తర్వాత ధుల్ను ఏ ఐపీఎల్ ఫ్రాంచైజీ పట్టించుకోలేదు. తాజాగా ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ ధుల్ను మరోసారి దక్కించుకనే ప్రయత్నం చేయవచ్చు.మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తర ఢిల్లీ.. సర్తక్ రంజన్ (82), అర్నవ్ బుగ్గా (67) అర్ద సెంచరీలతో రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. సెంట్రల్ ఢిల్లీ బౌలర్లలో గవిన్ష్ ఖురానా, మనీ గ్రేవాల్ తలో 2 వికెట్లు తీయగా.. సిమర్జీత్ సింగ్, తేజస్ బరోకా తలో వికెట్ పడగొట్టారు.అనంతరం ఓ మోస్తరు లక్ష్య ఛేదనకు దిగిన సెంట్రల్ ఢిల్లీ.. ఓపెనర్ యశ్ ధుల్ విధ్వంసకర శతకంతో విరుచుకుపడటంతో 17.3 ఓవర్లలోనే విజయతీరాలకు చేరింది (2 వికెట్లు కోల్పోయి). సెంట్రల్ ఢిల్లీని విజయతీరాలకు చేర్చడంలో ధుల్కు యుగల్ సైనీ (36), జాంటి సిద్దూ (23 నాటౌట్) సహకరించారు. ఉత్తర ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. -
అరంగేట్రానికి సిద్దమవుతున్న కోహ్లి అన్న కొడుకు..
టీమిండియా స్టార్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి మరొకరు క్రికెట్ ప్రపంచానికి పరిచయం కానున్నారు. అతడి అన్న కొడుకు ఆర్యవీర్ కోహ్లి ప్రొఫిషనల్ క్రికెట్లో అరంగేట్రం చేసేందుకు సిద్దమయ్యాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 సీజన్లో 14 ఏళ్ల ఆర్యవీర్.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ (SDS) తరపున ఆడనున్నాడు.ఇటీవల జరిగిన డీపీఎల్ వేలంలో లక్ష రూపాయల కనీస ధరకు సౌత్ ఢిల్లీ అతడిని కొనుగోలు చేసింది. ఈ క్రమంలో తన డీపీఎల్ సీజన్ కోసం ఆర్యవీర్ నెట్స్లో తీవ్రంగా శ్రమిస్తున్నాడు. లెగ్ స్పిన్నర్ అయిన ఆర్యవీర్ తన సహచర బ్యాటర్లకు నెట్స్లో బౌలింగ్ చేస్తున్నాడు.ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ నేపథ్యంలో ఆర్యవీర్పై సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ హెడ్ కోచ్, టీమిండియా మాజీ క్రికెటర్ సర్సందీప్ సింగ్ ప్రశంసల వర్షం కురిపించాడు. ఆర్యవీర్కు అద్బుతమైన టాలెంట్ ఉందని అతడు కొనియాడాడు."ఆర్యవీర్ కోహ్లి ఒక రైజింగ్ స్టార్. అతడికి ప్రస్తుతం 14 ఏళ్లు మాత్రమే. అతడు భవిష్యత్తులో కచ్చితంగా సూపర్ స్టార్ అవుతాడు. అతడిపై కోహ్లి అనే ట్యాగ్ ఎటువంటి ఒత్తిడి తీసుకురాదు. ఎందుకంటే అతడి వద్ద అద్బుతమైన టాలెంట్ ఉంది.అతడిలో కష్టపడి పనిచేసే తత్వం ఉంది" అని పీటీఐకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సర్సందీప్ పేర్కొన్నాడు. కాగా విరాట్ కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ వద్ద ఆర్యవీర్ శిక్షణ తీసుకున్నాడు. వెస్ట్ ఢిల్లీ క్రికెట్ ఆకాడమీలో ఆర్యవీర్ను రాజ్కుమార్ తన శిక్షణతో రాటుదేల్చాడు. ఈ టోర్నీలో టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ కూడా ఆడనున్నాడు. రూ. 8లక్షలకు సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ అతడిని కొనుగోలు చేసింది.చదవండి: అతడికి రెస్ట్ ఏమి అవసరం లేదు.. రెండు టెస్టుల్లోనూ ఆడించండి: కుంబ్లేVIDEO | Virat Kohli's nephew, Aryaveer Kohli, trained with "no baggage" of his famed last name in the training session of the South Delhi Superstarz ahead of the second edition of the Delhi Premier League.Budding leg-spinner Aryaveer Kohli, son of Virat's elder brother Vikas,… pic.twitter.com/HYu2U39qqJ— Press Trust of India (@PTI_News) July 17, 2025 -
జాక్పాట్!.. భారీ ధరకు అమ్ముడుపోయిన సెహ్వాగ్ కొడుకు
టీమిండియా మాజీ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ సెహ్వాగ్ జాక్పాట్ కొట్టేశాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 (DPL Auction) వేలంలో ఏకంగా రూ. 8 లక్షలు దక్కించుకున్నాడు. సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ ఈ మేర భారీ మొత్తం వెచ్చించి ఈ అన్క్యాప్డ్ ప్లేయర్ను సొంతం చేసుకుంది.డబుల్ సెంచరీ వీరుడుకాగా ఆర్యవీర్ సెహ్వాగ్ (Aryavir Sehwag) ఢిల్లీ తరఫున అండర్-19 క్రికెట్ ఆడుతున్నాడు. తండ్రి అడుగుజాడల్లోనే నడుస్తున్న 17 ఏళ్ల ఈ కుర్రాడు ఇప్పటికే అద్భుత ప్రదర్శనలతో సత్తా చాటాడు. ముఖ్యంగా గతేడాది మేఘాలయ జట్టు మీద డబుల్ సెంచరీతో మెరిసిన ఆర్యవీర్.. తృటిలో తండ్రి రికార్డుకు దూరమయ్యాడు. 297 పరుగుల వద్ద అవుటైన అతడు ట్రిపుల్ సెంచరీకి మూడు పరుగుల దూరంలో నిలిచాడు.కాగా టెస్టుల్లో సెహ్వాగ్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 319 కాగా.. అతడి కుమారుడు ఫస్ట్క్లాస్ క్రికెట్లో ఈ రికార్డును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలో ఫెరారీ కారు గెలుచుకునే అవకాశం చేజార్చుకున్నాడు. గతంలో సెహ్వాగ్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించాడు.ఫెరారీ మిస్ అయ్యావు‘‘టెస్టు క్రికెట్లో నేను కొన్ని మైలురాళ్లు సాధించానని నా కుమారులకు తెలుసు. అందుకే.. కనీసం స్కూల్ క్రికెట్లోనైనా నా హయ్యస్ట్ స్కోరు 319 పరుగుల బెంచ్ మార్కును దాటితే వారికి ఫెరారీ కొనిస్తానని చెప్పాను’’ అని సెహ్వాగ్ గతంలో చెప్పాడు.ఇక తన కుమారుడు ఆర్యవీర్ 2024లో ఈ ఫీట్ను మిస్ కాగా.. ‘‘బాగా ఆడావు ఆర్యవీర్. కానీ కేవలం 23 పరుగుల తేడాతో ఫెరారీ మిస్ అయిపోయావు. నీలోని పరుగుల దాహాన్ని ఇలాగే ఉండనివ్వు. సెంచరీలు, డబుల్ సెంచరీలు, ట్రిపుల్ సెంచరీలు సాధించు. ఆడుతూనే ఉండు’’ అని సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.అమ్ముడుపోని వేదాంత్కాగా ఇలా తనదైన శైలిలో పరుగులు సాధిస్తున్న ఆర్యవీర్ను సెంట్రల్ ఢిల్లీ కింగ్స్ తమ సొంతం చేసుకుంది. అయితే, సెహ్వాగ్ చిన్న కుమారుడు వేదాంత్ (Vedant Sehwag)కు మాత్రం వేలంలో నిరాశే మిగిలింది. నిజానికి ఆర్యవీర్ కంటే ముందే వేదాంత్ పేరు వేలంలోకి వచ్చింది.ఖరీదైన ఆటగాడిగా సన్రైజర్స్ప్లేయర్కానీ అతడిని కొనేందుకు ఒక్క ఫ్రాంఛైజీ కూడా ఆసక్తి చూపలేదు. ఇదిలా ఉంటే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2025 వేలంలో సిమర్జీత్ సింగ్ అత్యంత ఖరీదైన ఆటగాడిగా నిలిచాడు. ఢిల్లీ సెంట్రల్ కింగ్స్ అతడి కోసం ఏకంగా రూ. 39 లక్షలు వెచ్చించింది. ఈ రైటార్మ్ పేసర్ ఐపీఎల్-2025లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుతో ఉన్న విషయం తెలిసిందే. గతంలో చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ జట్లలోనూ సిమర్జీత్ భాగమయ్యాడు.మరోవైపు.. రాజస్తాన్ రాయల్స్ స్టార్ నితీశ్ రాణాను వెస్ట్ ఢిల్లీ లయన్స్ కొనుగోలు చేసింది. రూ. 34 లక్షల ధరకు అతడు జట్టుతో చేరాడు. ఇక టీమిండియా మాజీ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా ఇదే జట్టుకు ఆడనున్నాడు. అతడి కోసం ఫ్రాంఛైజీ రూ. 13 లక్షలు వెచ్చించింది.ఢిల్లీ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్లో భాగమైన జట్లు ఇవేసౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ గతేడాది ఆడగా.. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు వచ్చాయి. ఇక 2024లో మొదలైన డీపీఎల్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ విజేతకాగా.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ రన్నరప్గా నిలిచింది.చదవండి: IND vs ENG 2nd Test: బర్మింగ్హామ్లో జైహింద్ -
మళ్లీ వేలానికి రిషబ్ పంత్
గత ఐపీఎల్ సీజన్ మెగా వేలంలో రూ. 27 కోట్ల ధర దక్కించుకొని, ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన ఆటగాడిగా చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జెయింట్స్ సారధి రిషబ్ పంత్ మరోసారి వేలం బరిలోకి దిగనున్నాడు. ఈసారి పంత్ ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. జులై 6, 7 తేదీల్లో న్యూఢిల్లీలో జరుగబోయే డీపీఎల్ వేలంలో పంత్ పేరు నమోదు చేసుకున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. పంత్ డీపీఎల్ ఆడేందుకు గతంలో తన ఇష్టాన్ని వ్యక్తం చేశాడు. పంత్ డీపీఎల్ ఎంట్రీ విషయాన్ని డీడీసీఏకు (ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్) చెందిన ఓ కీలక అధికారి బహిర్గతం చేశాడు. పంత్తో పాటు ఐపీఎల్ 2025 సంచలనాలు ప్రియాంశ్ ఆర్య (పంజాబ్ కింగ్స్), దిగ్వేశ్ రాఠీ (లక్నో సూపర్ జెయింట్స్) కూడా డీపీఎల్ వేలంలో పాల్గొననున్నారు. ఈ ముగ్గురితో పాటు మరో ఏడుగురు ఐపీఎల్ స్టార్లు (ఇషాంత్ శర్మ, ఆయుష్ బదోని, హర్షిత్ రాణా, హిమ్మత్ సింగ్, సుయాష్ శర్మ, మయాంక్ యాదవ్, అనూజ్ రావత్) కూడా డీపీఎల్ 2025 వేలం బరిలో ఉండనున్నారు. ప్రియాంశ్ ఆర్య, దిగ్వేశ్ రాఠీ గత డీపీఎల్ సీజన్లో సంచలనాలు సృష్టించి ఐపీఎల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ ఇద్దరూ ఐపీఎల్లోనూ ఇరగదీసి తమకు గుర్తింపునిచ్చిన డీపీఎల్ బరిలో మళ్లీ నిలువనున్నారు.కొత్తగా రెండు ఫ్రాంచైజీలుగతేడాదే పురుడుపోసుకున్న డీపీఎల్ రాబోయే ఎడిషన్లో మరో రెండు కొత్త జట్లను పరిచయం చేస్తుంది. తొలి ఎడిషన్లో (2024) ఆరు జట్లతో జరిగిన డీపీఎల్ ఈసారి ఎనిమిది జట్లతో సాగనుంది. కొత్త జట్ల వివరాలను డీడీసీఏ అధ్యక్షుడు రోహన్ జైట్లీ ఇవాళ వెల్లండించారు. ఇందులో ఓ జట్టు పేరు ఔటర్ ఢిల్లీ కాగా.. మరో జట్టు పేరు న్యూఢిల్లీ. ఔటర్ ఢిల్లీని సవిత పెయింట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు రూ.10.6 కోట్లకు కొనుగోలు చేయగా.. న్యూఢిల్లీ ఫ్రాంచైజీని భీమా టోలింగ్ అండ్ ట్రాఫిక్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు క్రేయాన్ అడ్వర్టైజ్మెంట్ సంస్థలు రూ.9.2 కోట్లకు దక్కించుకున్నాయి.డీపీఎల్ తొలి ఎడిషన్లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, పురానీ దిల్లీ 6, సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్, వెస్ట్ ఢిల్లీ లయన్స్ జట్లు పాల్గొన్నాయి. గత ఎడిషన్లో ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఛాంపియన్గా నిలిచింది. ఫైనల్లో ఆ జట్టు సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ను ఓడించి విజేతగా అవతరించింది. గత సీజన్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఊహలకందని విధంగా 20 ఓవర్లలో 308 పరుగులు చేసి ఔరా అనిపించింది. ఆ సీజన్లో ఇలాంటి ప్రదర్శనలు ఎన్నో నమోదయ్యాయి. గత సీజన్లో ప్రియాంశ్ ఆర్య రెండు సెంచరీలు నమోదు చేశాడు. ఆయుశ్ బదోని ఓసారి శతక్కొట్టాడు. గత సీజన్ సూపర్ సక్సెస్ కావడంతో ఈ సీజన్పై భారీ అంచనాలు ఉన్నాయి. డీపీఎల్ మహిళల విభాగంలోనూ జరుగుతుంది. -
సెహ్వాగ్ ఇద్దరు కొడుకులు.. కోహ్లి కుటుంబం నుంచి ఒకరు..
దేశవ్యాప్తంగా టీ20 లీగ్లకు క్రమక్రమంగా ఆదరణ పెరుగుతోంది. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రీమియర్ లీగ్ (DPL) కూడా తెరమీదకు వచ్చింది. గతేడాది ఆరంభమైన ఈ లీగ్ ద్వారా.. ఐపీఎల్-2025 నయా సంచలనాలు ప్రియాన్ష్ ఆర్య (Priyansh Arya), దిగ్వేశ్ సింగ్ రాఠి (Digvesh Singh Rathee) వెలుగులోకి వచ్చారు.డీపీఎల్ ప్రస్తుతం రెండో సీజన్కు సిద్ధమైంది. ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్లో ప్రవేశించాయి. ఈసారి మరో అదనపు ఆకర్షణ కూడా ఉంది. టీమిండియా సూపర్ స్టార్ విరాట్ కోహ్లి కుటుంబం నుంచి ఓ స్పిన్ బౌలర్ డీపీఎల్ వేలంలో తన పేరును నమోదు చేసుకున్నాడు.ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ?కోహ్లికి కొడుకు వరసయ్యే ఆర్యవీర్ కోహ్లి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి చిన్ననాటి కోచ్ రాజ్కుమార్ శర్మ దగ్గర అతడు మెళకువలు నేర్చుకుంటున్నాడు అంతేకాదు.. భారత విధ్వంసకర ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ ఇద్దరు కుమారులు ఆర్యవీర్ సెహ్వాగ్, వేదాంత్ సెహ్వాగ్ కూడా డీపీఎల్ వేలంలోకి రానున్నట్లు సమాచారం. ఇప్పటికే వీరి పేర్లు షార్ట్లిస్ట్ అయినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.సెహ్వాగ్ పెద్ద కుమారుడు ఆర్యవీర్ ఇప్పటికే ఢిల్లీ అండర్ 19 జట్టుకు ఆడుతుండగా.. 15 ఏళ్ల వేదాంత్ ఆఫ్ స్పిన్నర్. ఇతడు అండర్-16 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. ఈ ఇద్దరూ డీపీఎల్ వేలంలో ‘బి’ కేటగిరిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇదే నిజమైతే దిగ్గజాల వారసుల ఆట చూసేందుకు అభిమానులు డీపీఎల్పై ఓ లుక్కేయడం ఖాయం.సత్తా చాటిన ప్రియాన్ష్, దిగ్వేశ్కాగా జూలై 5న ఢిల్లీ ప్రీమియర్ లీగ్ వేలం జరుగనుంది. ఇక గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్కు ఆడిన ప్రియాన్ష్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు.. పది మ్యాచ్లలో కలిపి 608 పరుగులు చేసి లీగ్ టాప్ రన్ స్కోరర్గా నిలిచాడు.ఈ క్రమంలో రూ. 3.80 కోట్ల ధరతో ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్లో చేరిన ప్రియాన్ష్ చెన్నై సూపర్ కింగ్స్ మీద 42 బంతుల్లో 103 పరుగులతో చెలరేగి చరిత్ర సృష్టించాడు. మరోవైపు.. సౌత్ ఢిల్లీకే ఆడిన దిగ్వేశ్ సింగ్ రాఠీ సైతం డీపీఎల్లో సత్తాచాటి ఐపీఎల్లో ప్రవేశించాడు. లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రూ. 30 లక్షలకు కొనుగోలు చేయగా.. ఈ ఏడాది జట్టు తరఫున టాప్ వికెట్ టేకర్గా నిలిచాడు. 13 ఇన్నింగ్స్లో కలిపి పద్నాలుగు వికెట్లు పడగొట్టాడు.ఇక డీపీఎల్లో ఈసారి అవుటర్ ఢిల్లీ, న్యూ ఢిల్లీ పేరిట రెండు కొత్త జట్లు కూడా లీగ్లో ప్రవేశించాయి. గతేడాది సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, పురాణీ ఢిల్లీ 6 పేరిట ఆరుజట్లు తలపడ్డాయి. ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ టైటిల్ గెలవగా.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ రన్నరప్గా నిలిచింది. ఇక తొలి సీజన్కు వీరేందర్ సెహ్వాగ్ బ్రాండ్ అంబాసిడర్గా ఉన్న విషయం తెలిసిందే.చదవండి: ‘షర్మిలా ఠాగూర్, సైఫ్ అలీ ఖాన్ను పిలవండి.. ఎవరూ వేలెత్తి చూపరు’ -
ప్రియాన్ష్.. నీ కోసం ఐపీఎల్ ఎదురుచూస్తోంది
ప్రియాంష్ ఆర్య.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో ఒక యువ సంచలనం. ఈ లీగ్లో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్జ్కు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రియాన్ష్ ఆర్య తన అద్బుత ప్రదర్శనలతో అందరని ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా గత వారంలో . నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్తో మ్యాచ్లో ఒకే ఓవర్లో ఆరు సిక్స్లు బాదిన ఈ యువ సంచలనం.. ఓవర్ నైట్ స్టార్గా మారిపోయాడు. అతడి హిట్టింగ్ స్కిల్స్ గురించి ఎంతచెప్పుకున్న తక్కువే.ఈ ఎడమ చేతి వాటం ఆటగాడు తన సిక్సర్లతో భారత దిగ్గజం యువరాజ్ సింగ్ను గుర్తు చేస్తున్నాడు. ఇప్పటివరకు ఈ టోర్నీలో 8 మ్యాచ్లు ఆడిన ప్రియాన్ష్.. 576 పరుగులు చేసి టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ఈ లీగ్లో దుమ్ములేపుతున్న ఆర్య తన మనసులోని మాటను బయట పెట్టాడు.ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాలన్న తన కోరికను 23 ఏళ్ల ఆర్య వ్యక్తం చేశాడు. అందుకు గల కారణాన్ని కూడా ఆర్య వెల్లడించాడు. కోహ్లి తనకు రోల్మోడల్ అని, అతడితో కలిసి డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవాలనకుంటున్నాని ప్రియాన్ష్ చెప్పుకొచ్చాడు.ఐపీఎల్ ఎదురుచూస్తోంది..ఇక ఈ ఏడాది ఆఖరిలో ఐపీఎల్-2025 మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో ప్రియాంష్ ఆర్యపై కాసుల వర్షం కురిసే అవకాశముంది. ఇటువంటి యువ సంచలనాల కోసమే ఫ్రాంఛైజీలు వేయికళ్లుతో ఎదురుచూస్తున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంచైజీలు ఆర్యపై ఓ కన్నేసి ఉంటాయి.నా దృష్టి అంతా ఆ టోర్నీపైనే..ఐపీఎల్ గురించి ప్రస్తుతం నేను ఆలోచించడం లేదు. ఎందుకంటే ఐపీఎల్ చాలా పెద్ద క్రికెట్ టోర్నీ. ఈ లీగ్ కోసం ఆలోచించడం, ఒత్తడిని ఎదుర్కొవడం రెండూ ఒకటే. వేలం కూడా నా ఆలోచన లేదు. ఆడే అవకాశం వస్తే అది నా శ్రమకు దక్కిన ఫలితంగా భావిస్తాను. అయితే నా దృష్టింతా ప్రస్తుతం సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీపైనే ఉంది. నా రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించడానికి ఇది గొప్ప అవకాశం. అక్కడ అద్భుతప్రదర్శన జట్టును గెలిపించడమే నా లక్ష్యమని ఓ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆర్య పేర్కొన్నాడు. -
విధ్వంసం.. టీ20ల్లో 308 పరుగులు! సన్రైజర్స్ రికార్డు బద్దలు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సిక్సర్ల మోత మోత మోగింది. ఈ లీగ్లో భాగంగా శనివారం అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రయికర్స్తో జరిగిన మ్యాచ్లో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ బ్యాటర్లు ఆయుష్ బదోని, ప్రియాన్ష్ ఆర్య విధ్వంసం సృష్టించారు. వీరిద్దరి విధ్వంసానికి అరుణ్ జైట్లీ స్టేడియం దద్దరిల్లిపోయింది.ఈ ఇద్దరూ యువ ఆటగాళ్లు మెరుపు సెంచరీలతో చెలరేగారు. ప్రత్యర్ధి బౌలర్లను ఉతికారేశారు. ఆయుష్ బదోని 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్లతో 165 పరుగులు చేయగా.. ప్రియాన్ష్ ఆర్య 50 బంతుల్లో 10 ఫోర్లు, 10 సిక్స్ల సాయంతో 120 పరుగులు చేశాడు. ఇక వీరిద్దరి సంచలన ఇన్నింగ్స్ల ఫలితంగా సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీస్కోరు చేసింది.అరుదైన రికార్డు..ఇక ఈ మ్యాచ్లో భారీ స్కోర్ చేసిన సౌత్ ఢిల్లీ సూపర్స్టార్స్ జట్టు ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకుంది. టీ20 క్రికెట్లో అత్యధిక స్కోర్ సాధించిన రెండో జట్టుగా సౌత్ ఢిల్లీ రికార్డులకెక్కింది. ఇప్పటివరకు ఈ రికార్డు ఐపీఎల్ ఫ్రాంచైజీ సన్రైజర్స్ హైదరాబాద్ పేరిట ఉండేది. ఐపీఎల్-2024లో ఎస్ఆర్హెచ్ ఆర్సీబీపై 283 పరుగుల భారీ స్కోర్ చేసింది. తాజా మ్యాచ్లో 308 పరుగులు చేసిన సౌత్ ఢిల్లీ.. సన్రైజర్స్ రికార్డును బ్రేక్ చేసింది. ఇక ఈ జాబితాలో నేపాల్ అగ్రస్ధానంలో ఉంది. 2023లో మంగోలియాపై నేపాల్ 3 వికెట్లు కోల్పోయి 314 పరుగులు చేసింది. 6️⃣ 𝐒𝐈𝐗𝐄𝐒 𝐢𝐧 𝐚𝐧 𝐨𝐯𝐞𝐫 🤩There’s nothing Priyansh Arya can’t do 🔥#AdaniDPLT20 #AdaniDelhiPremierLeagueT20 #DilliKiDahaad | @JioCinema @Sports18 pic.twitter.com/lr7YloC58D— Delhi Premier League T20 (@DelhiPLT20) August 31, 2024 -
19 సిక్సర్లు.. సెంచరీ... ఎవరీ అరివీర భయంకర బ్యాట్స్మెన్?
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ కెప్టెన్ ఆయుష్ బదోని విధ్వంసం సృష్టించాడు. ఈ లీగ్లో భాగంగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్తో జరిగిన మ్యాచ్లో మెరుపు సెంచరీతో బదోని చెలరేగాడు. ప్రత్యర్ధి బౌలర్లను ఈ యువ సంచలనం ఊచకోత కోశాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే బౌలర్లపై విరుచుకుపడ్డాడు. స్టేడియం నలుమూలులా సిక్సర్ల బాదుతూ తన విశ్వరూపాన్ని బదోని చూపించాడు. ఈ క్రమంలో కేవలం 39 బంతుల్లోనే తన సెంచరీ మార్క్ను అందుకున్నాడు. ఓవరాల్గా ఈ మ్యాచ్లో కేవలం 55 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బదోని 8 ఫోర్లు, 19 సిక్స్లతో ఏకంగా 165 పరుగులు చేశాడు. అతడితో పాటు ఓపెనర్ ప్రియాంష్ ఆర్య విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్లతో 120 పరుగులు సాధించాడు.దీంతో సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది. అనంతరం 309 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 198 పరుగులే చేసింది. దీంతో నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్ 112 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది.అంతా గంభీర్ వల్లే..ఆయుష్ బదోని సక్సెస్ వెనక టీమిండియా హెడ్కోచ్ గౌతం గంభీర్ ఉన్నాడనే చెప్పకోవాలి. బదోని కెరీర్ ఎదుగుదలలో గంభీర్ కీలక పాత్ర పోషించాడు. ఐపీఎల్లో లక్నో సూపర్ జెయింట్స్కు బదోని ప్రాతినిథ్యం వహిస్తున్నాడు.2022 సీజన్లో ఈ క్యాష్ రిచ్ లీగ్లోకి బదోని అడుగుపెట్టాడు. అయితే ఇదే సమయంలో లక్నో మెంటార్గా బాధ్యతలు చేపట్టిన గౌతీ.. తన అనుభవంతో బదోనిని రాటుదేల్చాడు. కాగా లక్నో జట్టులోకి బదోని రావడానికి గల కారణం కూడా గౌతీనే. ఐపీఎల్లో వేలంలో అతడి సలహా మెరకే బదోనిని లక్నో ఫ్రాంచైజీ కొనుగోలు చేసింది. రెండు సీజన్ల పాటు లక్నో మెంటార్గా కొనసాగిన గంభీర్.. బదోనికి ఎంతో సపోర్ట్గా నిలిచాడు. ఈ విషయాన్ని చాలా సందర్బాల్లో అయూష్ సైతం ధ్రువీకరించాడు. గంభీర్కు తనకు పెద్దన్న లాంటి వాడని అయూష్ పలుమార్లు చెప్పుకొచ్చాడు. -
ఢిల్లీ ఆటగాడి తుపాన్ ఇన్నింగ్స్.. 6 బంతుల్లో 6 సిక్స్లు! వీడియో
ఢిల్లీ ప్రీమియర్ లీగ్-2024లో సంచలనం నమోదైంది. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ ఓపెనర్ ప్రియాంష్ ఆర్య 6 బంతుల్లో 6 సిక్స్లు బాదాడు. ఈ లీగ్లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్తో మ్యాచ్లో ప్రియంష్ ఈ ఘనత సాధించాడు. సౌత్ ఢిల్లీ ఇన్నింగ్స్ 12 ఓవర్ వేసిన స్పిన్నర్ మనన్ భరద్వాజ్ బౌలింగ్లో ప్రియంష్ వరుసగా 6 సిక్స్లు బాదాడు. ఆ ఓవర్లో తొలి బంతిని లాంగ్ ఆఫ్ మీదగా సిక్స్ బాదిన ప్రియాంష్.. రెండవ బంతిని డీప్ మిడ్ వికెట్ దిశగా స్టాండ్స్లోకి పంపించాడు. ఆ తర్వాతి నాలుగు బంతులను కూడా ఆర్య సిక్సర్లగా మలిచాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఈ క్రమంలో ఓ అరుదైన రికార్డును ప్రియంష్ ఆర్య తన పేరిట లిఖించుకున్నాడు. ఓకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదిన మూడో భారత క్రికెటర్గా ప్రియాంష్ నిలిచాడు. అంతకుముందు రవిశాస్త్రి, యువరాజ్ సింగ్ ఒకే ఓవర్లో ఆరు సిక్సర్లు బాదారు.ఇక ఈ మ్యాచ్లో ప్రియాంష్ విధ్వంసకర సెంచరీతో చెలరేగాడు. 50 బంతులు ఎదుర్కొన్న ఆర్య.. 10 ఫోర్లు, 10 సిక్స్లతో 120 పరుగులు సాధించాడు. అతడితో పాటు మరో ఢిల్లీ సూపర్ స్టార్జ్ ఆటగాడు ఆయూష్ బదోనీ కూడా భారీ సెంచరీతో మెరిశాడు. కేవలం 55 బంతుల్లో 8 ఫోర్లు, 19 సిక్స్లతో 165 పరుగులు చేశాడు. వీరిద్దరి విధ్వంసకర ఇన్నింగ్స్ల ఫలితంగా సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 308 పరుగుల భారీ స్కోర్ సాధించింది.చదవండి: నరాలు తెగే ఉత్కంఠ.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సఫారీ క్రికెటర్ View this post on Instagram A post shared by Delhi Premier League T20 (@delhipremierleaguet20) -
భారత స్టార్ క్రికెటర్ గుండెలో రంధ్రం.. సర్జరీ తర్వాత ఇలా..
అండర్-19 ప్రపంచకప్-2022 గెలిచిన భారత కెప్టెన్ యశ్ ధుల్ గత కొంతకాలంగా ఫామ్లేమితో సతమతమవుతున్నాడు. ఈ ఏడాది అట్టహాసంగా ఆరంభించిన ఢిల్లీ ప్రీమియర్ లీగ్(డీపీఎల్)లో సెంట్రల్ ఢిల్లీ కింగ్స్కు సారథిగా ఎంపికైన అతడు పూర్తిగా విఫలమయ్యాడు. ఈ క్రమంలో కెప్టెన్సీని జాంటీ సిద్ధుకు అప్పగించిన యశ్ ధుల్.. కేవలం ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగుతున్నాడు.బ్యాటింగ్ స్థానాన్ని మార్చుకున్నా ఫలితం లేకపోవడంతో ఓ మ్యాచ్కు దూరమయ్యాడు కూడా!.. ఇప్పటివరకు డీపీఎల్లో ఆడిన ఐదు ఇన్నింగ్స్లో కలిపి కేవలం 93 పరుగులే చేయగలిగాడు యశ్ ధుల్. ఈ నేపథ్యంలో కామెంటేటర్లు, విశ్లేషకులు ఈ 21 ఏళ్ల బ్యాటర్ ప్రదర్శనపై విమర్శలు గుప్పిస్తున్నారు.క్రికెటర్ గుండెలో రంధ్రం.. ఇటీవలే సర్జరీఈ క్రమంలో యశ్ ధుల్ తన అనారోగ్యానికి సంబంధించిన షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. యశ్ ధుల్కు బాల్యం నుంచే గుండెలో రంధ్రం ఉందని.. ఇటీవలే ఇందుకు సంబంధించిన సర్జరీ ఒకటి జరిగిందని అతడి తండ్రి విజయ్ న్యూస్18తో అన్నారు. కొన్నాళ్ల క్రితం బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో పునరావాసం పొందినపుడు అక్కడి నిపుణులు యశ్ ధుల్ సమస్యను గుర్తించి.. శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్లు తెలిపారు.అందుకే ఆడలేదుఈ క్రమంలో ఢిల్లీలో సర్జరీ చేయించామని.. బీసీసీఐ వైద్య బృందం ఎప్పటికప్పుడు అతడి పరిస్థితిని పర్యవేక్షిస్తోందని విజయ్ వెల్లడించారు. ఇక ఇటీవల యశ్ ధుల్కు ఫిట్నెస్ సర్టిఫికెట్ కూడా జారీ చేశారని అతడి కోచ్ ప్రదీప్ కొచ్చర్ తెలిపారు. అయితే, ఎండ, ఆర్ద్రత ఎక్కువగా ఉన్న సమయంలో యశ్ ధుల్ విశ్రాంతి తీసుకుంటున్నాడని.. అందుకే కొన్ని మ్యాచ్లకు దూరమయ్యాడన్నారు. రంజీ ట్రోఫీ ఆడే క్రమంలో ఇప్పటి నుంచే ఈ మేరకు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు.సానుకూల దృక్పథంతో ఉన్నాఇక ఈస్ట్ ఢిల్లీ రైడర్స్తో మంగళవారం నాటి మ్యాచ్లో 11 బంతులు ఎదుర్కొని కేవలం ఎనిమిది పరుగులే చేసిన అనంతరం ధుల్ మాట్లాడుతూ.. ‘‘గత కొన్ని రోజులుగా అనుకోని సంఘటనలు జరిగాయి. ఇప్పుడిప్పుడే నేను కోలుకుంటున్నాను. త్వరలోనే పూర్తిస్థాయిలో రాణిస్తాననే సానుకూల దృక్పథంతో ఉన్నాను. వంద శాతం ఎఫర్ట్ పెట్టి ఆడతా’’ అని పేర్కొన్నాడు. కాగా ఇటీవల ప్రకటించిన దులిప్ ట్రోఫీ-2024 రెడ్ బాల్ టోర్నీలో యశ్ ధుల్కు చోటు దక్కలేదు. ఇక ఐపీఎల్-2023లో యశ్ ఢిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిథ్యం వహించిన విషయం తెలిసిందే.చదవండి: రిటైర్మెంట్ ప్రకటించిన ఇంగ్లండ్ విధ్వంసకర బ్యాటర్ -
టీమిండియాకు మరో బౌలర్.. స్పిన్నర్గా మారిన పంత్(వీడియో)
టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ స్పిన్నర్గా సరికొత్త అవతరమెత్తాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్లో పురాణి డిల్లీ 6 జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పంత్.. సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్తో జరిగిన తొలి మ్యాచ్లో స్పిన్ బౌలింగ్ చేసి అందరని ఆశ్చర్చపరిచాడు. ఢిల్లీ సూపర్స్టార్జ్ విజయానికి ఒక్క పరుగు అవసరమైన సమయంలో పంత్ ఆఫ్ స్పిన్ బౌలింగ్ చేశాడు. అయితే మొదటి బంతికే ఢిల్లీ సూపర్స్టార్జ్ విజయం సాధించడంతో పంత్కు తన ఓవర్ను పూర్తి చేసే అవకాశం లభించలేదు.కేవలం ఒక్క బాల్ మాత్రమే రిషబ్ బౌలింగ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు భారత క్రికెట్కు మరో బౌలర్ దొరికేశాడంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా హెడ్ కోచ్ గంభీర్ నేతృత్వంలో ఇప్పటికే సూర్యకుమార్ యాదవ్, శుభమన్ గిల్ వంటి వారు పార్ట్టైమ్ బౌలర్లగా మారారు. రాబోయే మ్యాచ్ల్లో పంత్ కూడా బౌలింగ్ చేసే అవకాశం లేకపోలేదు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. పురాణి డిల్లీపై 3 వికెట్ల తేడాతో సౌత్ ఢిల్లీ సూపర్స్టార్జ్ ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన పురాణి డిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 197 పరుగుల భారీ స్కోర్ సాధించింది. పురాణి ఢిల్లీ బ్యాటర్లలో అర్పిత్ రాణా(59) పరుగులతో టాప్ స్కోరర్గా నిలవగా.. వన్స్ బేడి(47), పంత్(35), లలిత్ యాదవ్(34) పరుగులతో రాణించారు.అనంతరం 198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌత్ ఢిల్లీ.. 19.1 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సౌత్ ఢిల్లీ బ్యాటర్లలో పియూన్ష్ ఆర్య(57), ఆయూష్ బదోని(57) హాఫ్ సెంచరీలతో మెరిశారు.Rishabh pant bowling 😸🔥pic.twitter.com/QvM7tFZLcu— 𝓱 ¹⁷ 🇮🇳 (@twitfrenzy_) August 17, 2024 -
పంత్ కీలక నిర్ణయం.. ఆ లీగ్లో ఆడనున్న ఢిల్లీ చిచ్చర పిడుగు
ఢిల్లీ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్లో టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ భాగం కానున్నాడు. ఈ లీగ్లో పురాణి ఢిల్లీ 6 ఫ్రాంచైజీ తరపున పంత్ ఆడనున్నాడు. అతడితో పాటు భారత వెటరన్ క్రికెటర్ ఇషాంత్ శర్మ కూడా పురాణి ఢిల్లీకి ప్రాతినిథ్యం వహించనున్నాడు. అదే విధంగా యువ ఢిల్లీ ఆటగాళ్లు హర్షిత్ రాణా, ఆయుష్ బడోనీ, అనుజ్ రావత్, యశ్దయాల్లు కూడా డీపీఎల్లో ఆడనున్నారు. తాజాగా డీపీఎల్లో పాల్గోనే ఆటగాళ్ల డ్రాఫ్ట్ జాబితాను ఢిల్లీ అండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ విడుదల చేసింది. అయితే ఈ అరంగేట్ర సీజన్కు ఢిల్లీ ఫాస్ట్ బౌలింగ్ సంచలనం మయాంక్ యాదవ్ దూరమయ్యాడు. ఫిట్నెస్ సమస్యల కారణంగా ఈ టోర్నీకి మయాంక్ దూరంగా ఉండనున్నాడు. మయాంక్ ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ ఆకాడమీలో శిక్షణ పొందుతున్నాడు. ఇక ఈ డీపీఎల్ తొట్ట తొలి ఎడిషన్ ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనుంది. మ్యాచ్లన్నీ ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా జరగనున్నాయి. ఈ లీగ్ ప్రారంభ ఎడిషన్లో మొత్తం ఆరు ఫ్రాంచైజీలు భాగం కానున్నాయి. సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్, పురాణి డిల్లీ 6, సెంట్రల్ ఢిల్లీ కింగ్స్, నార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్, వెస్ట్ ఢిల్లీ లయన్స్, ఈస్ట్ ఢిల్లీ రైడర్స్ ఫ్రాంచైజీలు రూ. 49.65 కోట్ల రూపాయలకు విక్రయించబడ్డాయి.సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్: ఆయుష్ బదోని, కులదీప్ యాదవ్, ప్రియాంష్ ఆర్య, సుమిత్ మాథుర్, దివిజ్ మెహ్రా, కున్వర్ బిధురి, దిగ్వేష్ రాఠీ, తేజస్వి దహియా, రాఘవ్ సింగ్, సౌరభ్ దేస్వాల్, సార్థక్ రే, లక్షయ్ సెహ్రావత్, తరుణ్ బిష్త్, శుభ్ పన్బే, శుభమ్ పన్బే, శుభమ్ పన్. సింగ్, మయాంక్ గుప్తా, అన్షుమాన్ హుడా, అనిందో నహరాయ్, దీపాంశు గులియాతూర్పు ఢిల్లీ రైడర్స్: అనుజ్ రావత్, సిమర్జీత్ సింగ్, హిమ్మత్ సింగ్, హిమాన్షు చౌహాన్, హర్ష్ త్యాగి, వైభవ్ శర్మ, మయాంక్ రావత్, సమర్థ్ సేథ్, ప్రణవ్ పంత్, సుజల్ సింగ్, హార్దిక్ శర్మ, రౌనక్ వాఘేలా, అగ్రిమ్ శర్మ, శంతను సింగ్, భగవాన్, భగవాన్, భగవాన్ చౌదరి, సాగర్ ఖత్రి, శివమ్ కుమార్ త్రిపాఠి, రిషబ్ రాణా, లక్షయ సాంగ్వాన్సెంట్రల్ ఢిల్లీ కింగ్స్: యశ్ ధుల్, ప్రిన్స్ చౌదరి, హితేన్ దలాల్, జాంటీ సిద్ధు, లక్షయ్ థరేజా, యోగేష్ శర్మ, మనీ గ్రేవార్, కేశవ్ దాబాస్, శౌర్య మాలిక్, సౌరవ్ దాగర్, ఆర్యన్ రాణా, సిద్ధాంత్ బన్సల్, రజనీష్ దాదర్, సుమిత్ కుమార్, కౌశల్ సుమన్, దీప్ బల్యాన్, విశాంత్ భాటి, ధ్రువ్ కౌశిక్, అజయ్ గులియానార్త్ ఢిల్లీ స్ట్రైకర్స్: హర్షిత్ రాణా, సుయాష్ శర్మ, ప్రన్షు విజయరన్, వైభవ్ కంద్పాల్, క్షితిజ్ శర్మ, వైభవ్ రావల్, యష్ దాబాస్, ప్రణవ్ రాజ్వంశీ, మనన్ భరద్వాజ్, యశ్ భాటియా, యతీష్ సింగ్, అమన్ భారతి, యజాస్ శర్మ, సార్థక్ చోరంద్, అనిరుధ్ రంజన్, అనిరుద్ , యథార్త్ సింగ్, సిద్ధార్థ సోలంకి, ధ్రువ్ చౌహాన్, యువరాజ్ రాఠీవెస్ట్ ఢిల్లీ లయన్స్: హృతిక్ షోకీన్, నవదీప్ సైనీ, దేవ్ లక్రా, దీపక్ పునియా, శివంక్ వశిష్త్, అఖిల్ చౌదరి, ఆయుష్ దోసెజా, క్రిష్ యాదవ్, అన్మోల్ శర్మ, యుగల్ సైనీ, అంకిత్ రాజేష్ కుమార్, వివేక్ యాదవ్, ఆర్యన్ దలాల్, మసాబ్ ఆలం, ఏకాంష్ దోబల్, శివం గుప్తా, యోగేష్ కుమార్, సూర్యకాంత్ చౌహాన్, తిషాంత్ దబ్లా, అబ్రహీం అహ్మద్ మసూదిపురాణి డిల్లీ 6: లలిత్ యాదవ్, ఇషాంత్ శర్మ, అర్పిత్ రాణా, శివం శర్మ, ప్రిన్స్ యాదవ్, రిషబ్ పంత్, మయాంక్ గుసేన్, సనత్ సాంగ్వాన్, అంకిత్ భదానా, యుగ్ గుప్తా, కేశవ్ దలాల్, ఆయుష్ సింగ్, కుష్ నాగ్పాల్, సుమిత్ ఛికారా, అర్నవ్ బుగ్గారా బేడీ, మంజీత్, యష్ భరదవాజ్, సంభవ్ శర్మ, లక్ష్మణ్