breaking news
Anil kumar yadav
-
Anil Kumar : నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు
-
నేను నవ్వినందుకు కేసు పెట్టారు
సాక్షి,నెల్లూరు: నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో మాజీమంత్రి అనిల్ కుమార్ యాదవ్ విచారణ ముగిసింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ మంత్రి ప్రసన్నకుమార్ రెడ్డికు మద్దతు తెలిపేందుకు నాపై కేసు పెట్టారు.ప్రసన్న కుమార్తో కలిసి నన్ను ఏ2గా చేర్చారు. నేను నవ్వినందుకు కేసు పెట్టారు. పోలీసులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. కూటమి ప్రభుత్వంలో వేదిక మీద నవ్విన నాయకుల మీద కేసులు పెట్టే పరిస్థితులు వచ్చాయి. నవ్విన తప్పే అంటే ఇక ఏమి చేయాలి?. కూటమి నేతలు ఏ స్థాయికి దిగజారి పోయారో తెలుస్తోంది.36 ప్రశ్నలు అడిగారు, 10 నిమిషాల్లో సమాధానం రాసి ఇచ్చాను. నన్ను ఆరు గంటలు కూర్చోబెట్టారు, విచారణ చేశారు. బీసీ నాయకులను కూటమి ప్రభుత్వం కక్ష్య సాధిస్తోంది’అని ఆరోపించారు. కాగా,కూటమి సర్కార్ కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. అనిల్ కుమార్పై వేమిరెడ్డి ప్రశాంతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ కుమార్.. నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. -
అనిల్ కుమార్ యాదవ్ పై కక్ష సాధింపు
-
ఆ కేసులో అనిల్ కుమార్ యాదవ్ ని ఇరికించే కుట్ర
-
నెల్లూరు రూరల్ డీఎస్పీ ఆఫీసుకు అనిల్ కుమార్ యాదవ్
-
ఈ కంపెనీకి 10కోట్లు ఎందుకు కొట్టారు..సైదాపూర్ లో చక్కర్లు కొడుతుంది
-
Anil Kumar Yadav: నిరూపిస్తే.. 950 కోట్లు మీవే..
-
వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యాఖ్యలకు ఇచ్చిపడేసిన అనిల్ కుమార్ యాదవ్
-
అది నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా: అనిల్
సాక్షి, నెల్లూరు: తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని.. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆఫ్రికాలో తనకు ఎలాంటి మైనింగ్స్ లేవని స్పష్టం చేశారు. ‘‘గతంలో కంటే ఒక్క రూపాయి ఎక్కువ ఉన్నా నన్ను శిక్షించండి. నా దగ్గర రూ.వేల కోట్ల ఉన్నాయని నిరూపిస్తే అమరావతికి విరాళంగా ఇచ్చేస్తా’’ అంటూ అనిల్ సవాల్ విసిరారు.తనపై వస్తున్న ఆరోపణలపై ఆయన మాట్లాడుతూ.. కావాలంటే సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలన్నారు. అక్రమ మైనింగ్ వ్యవహారంలో నా ప్రమేయం ఉందని శ్రీకాంత్ రెడ్డి చేత బలవంతంగా చెప్పించారు. అనిల్కి, కాకాణికి పడదని గతంలో ఎన్నో వార్తలు వచ్చాయి.. కానీ ఇప్పుడు మేమిద్దరం కలిసి మైనింగ్ చేశామని ఆరోపిస్తున్నారు’’ అంటూ అనిల్ మండిపడ్డారు.‘‘గూడూరు, నాయుడుపేటలో నేను, శ్రీకాంత్ రెడ్డి వ్యాపారాలు చేస్తున్నామని విమర్శిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇసుక రవాణాని ఏజెన్సీకీ ఇచ్చాం. నేను ఇసుక అక్రమ రవాణా చేసానని ఆరోపిస్తున్నారు. 2008 నుంచి ఇప్పటి వరకు నా ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి. నా ఆస్తి 1000 కోట్లు అంటున్నారు.. చంద్రబాబు విచారణ జరిపి అందులో 950 కోట్లు అమరావతి అభివృద్ధికి తీసుకుని, నాకు రూ.50 కోట్లు ఇస్తే చాలు. అవసరమైతే చంద్రబాబుకి లేఖ రాస్తాను. 2022 నుంచి ఇప్పటి వరకు ఎవరు మైన్ నుంచి రవాణా జరిగిందో ఈడీ ద్వారా విచారణ జరపండి.. నేనే కోర్టులో పిటిషన్ వేస్తాను’’ అని అనిల్ పేర్కొన్నారు. -
అనిల్ కుమార్ కు వైఎస్ జగన్ ఆత్మీయ ఆలింగనం
-
బాబు భయం బట్టబయలు.. అనిల్ కుమార్ యాదవ్ సెటైర్లు
-
వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకో?
సాక్షి,నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత,మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనలంటే కూటమికి భయమెందుకు? అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రశ్నించారు. వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన వేళ చంద్రబాబు సర్కార్ విధిస్తున్న ఆంక్షలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.వైఎస్ జగన్ పర్యటనలంటే కూటమికి భయమెందుకు?. జగన్కు వస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకపోతున్నారు. కూటమి సర్కార్ ప్రజల సంక్షేమాన్ని ఎప్పుడో వదిలేసింది.ప్రజలను వదిలేసి సినిమాలను ప్రమోట్ చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలకు పోరాటాలు కొత్త కాదు. రేపు నెల్లూరు జిల్లా నలుమూలల నుంచి జనం తరలి వస్తారు. ప్రజాభిమానాన్ని ఆపాలంటే కొత్త జైళ్లు కట్టుకోండి. ప్రజల హక్కులను కాలరాసే అధికారం పోలీసులకు లేదు. నాయకుడికి మద్దతు తెలపడం ప్రజల హక్కు. ఇబ్బంది పెట్టినవారెవరనీ వదిలి పెట్టే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు. -
వెయ్యి మందికిపైగా YSRCP నేతలకు నోటీసులిచ్చారు: అనిల్ కుమార్ యాదవ్
-
అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి వెళ్లి నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
హైకోర్టులో మాజీమంత్రి అనిల్ యాదవ్ స్క్వాష్ పిటిషన్
-
నమ్ముకున్న వారిని ప్రాణం అడ్డుపెట్టి అయినా కాపాడుకునే వ్యక్తి YS జగన్
-
అనిల్ కుమార్ యాదవ్ కు పోలీసుల నోటీసులు
-
మాజీ మంత్రి అనిల్కు పోలీసుల నోటీసులు
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో వైఎస్సార్సీపీ నేతలే టార్గెట్గా అక్రమ కేసుల నమోదు ప్రక్రియ కొనసాగుతోంది. రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ నేతలను వేధింపులకు గురి చేస్తూ అక్రమ కేసులు పెట్టారు. ఇక, తాజాగా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు.వివరాల ప్రకారం.. టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఫిర్యాదు మేరకు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో భాగంగా తాజాగా మాజీమంత్రి అనిల్కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే, కొవ్వూరులో వైఎస్సార్సీపీ సమావేశంలో పాల్గొన్నందుకు, ప్రశాంతి రెడ్డి ఎపిసోడ్పై అనిల్ కుమార్ మాట్లాడినందుకు గానూ.. ఆయనకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఈ క్రమంలో అనిల్ కుమార్ యాదవ్ ఇంటికి పోలీసులు వెళ్లారు.. ఈ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఇంటికి పోలీసులు నోటీసులు అంటించారు. కాగా, ఎల్లుండి విచారణకు రావాలని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, పార్టీ సమావేశంలో పాల్గొన్నందుకు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై ప్రజలు విస్తుపోతున్నారు. -
రుస్తుం మైన్స్ చుట్టూ భేతాళ కుట్రలు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు/నెల్లూరు(లీగల్): కూటమి ప్రభుత్వ వైఫల్యాలతోపాటు 12నెలలుగా టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి అక్రమాలపై పోరాడుతున్న ఉమ్మడి నెల్లూరు జిల్లా వైఎస్సార్సీపీ నాయకులే లక్ష్యంగా సర్కారు కుట్రలకు తెగబడుతోంది. అసత్యాలతో భేతాళ కథలల్లి కక్షసాధింపులకు దిగుతోంది. ఏదో ఒక రకంగా నరకం చూపేందుకు శతవిధాలా యత్నిస్తోంది. దీనిలో భాగంగానే అసలు మైనింగే జరగని రుస్తుం మైన్స్లో ఏదో జరిగిపోయిందంటూ పోలీసులు అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రతిపక్ష నేతలను ఒక్కొక్కరిని అరెస్టు చేస్తున్నారు. తొలుత ముగ్గురిపై కేసు నమోదు చేయడంతో వారు కోర్టుకెళ్లి ముందుస్తు బెయిల్ తెచ్చుకున్నారు. ఈ కేసులో మాజీమంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిని ఏ–4గా సర్కారు ఇరికించింది. ఆయనను అరెస్టు చేసి రిమాండ్కు పంపింది. ఏ–5గా టీడీపీ నేత కృష్ణంరాజు పేరు చేర్చి మరో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించింది. తాజాగా బీసీ నేత, మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ను కేసులో ఇరికించేందుకు యత్నిస్తోంది. ఏదోరకంగా ఆయనను అరెస్టు చేయాలని తలస్తోంది. ఆయన అనుచరులనూ ఇరికించేందుకు కుయుక్తులు పన్నుతోంది. దీనికోసం ఏ–12వ నిందితుడిగా బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని చేర్చి అక్రమంగా అరెస్టు చేసింది. అతన్ని బెదిరించి మాజీమంత్రి అనిల్కుమార్యాదవ్ పాత్ర ఉందని చెప్పాలంటూ పోలీసులు శ్రీకాంత్రెడ్డిని భయపెట్టి వాంగ్మూలం వారే రాసుకుని సంతకం తీసుకున్నారు. ఈ విషయాన్ని బిరదవోలు శ్రీకాంత్రెడ్డి న్యాయమూర్తి ఎదుట చెప్పడంతో ప్రభుత్వ కుతంత్రం బట్టబయలైంది. శ్రీకాంత్ రెడ్డి నుంచి న్యాయమూర్తి మళ్లీ వాంగ్మూలాన్ని తీసుకుని రికార్డు చేయించారు. కేసు పూర్వాపరాలు ఇవీ.. పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామ సర్వే నంబర్లు 697, 699,751/2, 759/1, 759/2, 924, 925ల్లోని ప్రభుత్వ భూముల్లో 32.71 ఎకరాల విస్తీర్ణంలో రుస్తుం మైనింగ్కు 2016 ఏప్రిల్ నెల వరకే అనుమతులు ఉన్నాయి. లీజు గడువు పూర్తవ్వడంతో యజమాని సైతం వదిలేశారు. అక్కడ మైనింగే జరగలేదు. 2023 డిసెంబర్లో అక్రమ మైనింగ్ జరుగుతోందని ప్రస్తుత ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి ఫిర్యాదు చేయడంతో మైనింగ్ శాఖాధికారులు జాయింట్ తనిఖీ నిర్వహించారు. అసలు అక్కడ మైనింగ్ జరిగిన ఆనవాళ్లే లేవని, ఈ ప్రాంతంలో ఫెల్డ్స్పార్, క్వార్ట్జ్ మిశ్రమం కలిసిన పాత నిల్వలు ఉన్నట్లు గుర్తించారు. ఎక్కడా యంత్రాలు పెట్టి తవ్వకాలు చేసినట్లు ఆనవాళ్లు కన్పించలేదు. రెండు శాశ్వత భవనాలు పాడుబడి ఉన్నట్లు గుర్తించి ఆ మేరకు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఆ తర్వాత రెండు నెలల వ్యవధిలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడం, ప్రభుత్వం మారడంతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల తర్వాత రుస్తుం మైన్లో అక్రమ మైనింగ్ జరిగినట్లు మైనింగ్ డీడీతో ఫిర్యాదు చేయించి వైఎస్సార్సీపీ నేతలను ఆ కేసుల్లో ఇరికించి జైలుకు పంపుతున్నారు. ఇప్పటి వరకు దాదాపు 12 మందిని ఈ కేసులో నిందితులుగా చేర్చారు. తాజాగా ఈ కేసులో ఎలాంటి సంబంధంలేని మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్, ఆయన అనుచరులను ఇరికించే యత్నాలు చేస్తున్నారు.ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినందుకేనా?కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే మాజీ మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డిని టార్గెట్ చేసి ఈ అక్రమ కేసు నమోదు చేశారు. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే ఏ–5గా టీడీపీ నేతను చేర్చిన పోలీసులు ఇప్పటి వరకు ఆయన్ను అరెస్ట్ చేయలేదు. ఇటీవలి కాలంలో కాకాణి రిమాండ్లో ఉండడంతో మాజీ మంత్రి అనిల్కుమార్యాదవ్ తరచూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తుండడంతో ఆయననూ టార్గెట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కేసుతో అసలు సంబంధం లేని వైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని నిందితుడిగా చేర్చి సోమవారం హైదరాబాద్లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను నెల్లూరు తీసుకొచ్చి భయపెట్టి బలవంతంగా తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. అనిల్కుమార్, ఆయన అనుచరుల పాత్ర ఉన్నట్లు చెప్పినట్లు రికార్డు చేశారు. దీంతో రెండు రోజుల్లోనే అనిల్కుమార్యాదవ్ అరెస్టుకు తెగబడే ఆస్కారం ఉందనే ప్రచారం విస్తృతంగా జరుగుతోంది.రాత్రంతా వేధించారు.. థర్డ్డిగ్రీ అని భయపెట్టారువైఎస్సార్సీపీ నేత బిరదవోలు శ్రీకాంత్రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయన్ను రాత్రంతా పోలీస్స్టేషన్లో ఉంచి వేధించారు. అర్ధరాత్రి సమయంలో థర్డ్ డిగ్రీ ప్రయోగిస్తామని భయపెట్టి తప్పుడు వాంగ్మూలం తీసుకున్నారు. ఈ విషయాన్ని గూడూరు ఇన్చార్జి న్యాయమూర్తి బీవీ సులోచనారాణి ఎదుట మంగళవారం శ్రీకాంత్ రెడ్డి వెల్లడించారు. అనిల్కుమార్ పాత్ర ఉందని చెప్పాలంటూ బెదిరించారని, స్టేట్మెంట్ను వాళ్లే రాసుకుని తనను చదవనివ్వకుండానే భయపెట్టి సంతకం తీసుకున్నారని శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాంత్రెడ్డి వేదనను సావధానంగా విన్న న్యాయమూర్తి పోలీసుల తీరుపై మండిపడ్డారు. శ్రీకాంత్రెడ్డి వాంగ్మూలాన్ని మళ్లీ న్యాయమూర్తి రికార్డు చేయించారని న్యాయవాది ఉమామహేశ్వరరావు తెలిపారు.శ్రీకాంత్రెడ్డికి అస్వస్థత ఇదిలా ఉంటే బిరదవోలు శ్రీకాంత్రెడ్డి సోమవారం రాత్రి పోలీసుల వేధింపులు, బెదిరింపులకు తాళలేక అస్వస్థతకు గురయ్యారు. రాత్రంతా డీఎస్పీ కార్యాలయంలోనే ఉంచడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యారు. అస్వస్థతకు గురైన శ్రీకాంత్రెడ్డిని హుటాహుటిన నెల్లూరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం గూడూరు కోర్టుకు తరలించారు. న్యాయమూర్తి సులోచనరాణి ఎదుట శ్రీకాంత్రెడ్డి తన గోడు వెళ్లబోసుకున్నారు. ఇరుపక్షాల వాదనల అనంతరం న్యాయమూర్తి శ్రీకాంత్రెడ్డికి ఆగస్టు 4 వరకు రిమాండ్ విధించారు. -
మిథున్ అరెస్ట్ పై అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
Anil Kumar: మేము CCTV ఫ్యూటేజీతో కేసు పెట్టి వారం రోజులు అయింది..
-
Anil Kumar Yadav: మేము కూడా టీడీపీ రౌడీల్లా తెగిస్తే..
-
నెల్లూరు సాక్షిగా చెప్తున్నా.. అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్
-
‘దాడిపై నిన్న నే ఫిర్యాదు చేశాం.. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు’
నెల్లూరు: వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రసన్నకుమార్ ఇంటిపై టీడీపీ శ్రేణులు చేసిన దాడి ఇప్పటివరకూ కనీసం ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని అనిల్ కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. ప్రసన్నకుమార్ ఇంటిపై నిన్న(సోమవారం, జూలై7) రాత్రి సమయంలో దాడి జరిగితే అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశామని, దానిపై ఇప్పటివరకూ ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదని అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఈరోజు(మంగళవారం, జూలై8) పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. ప్రసన్నకుమార్తో పాటు అనిల్ కుమార్ యాదవ్, చంద్రశేఖర్రెడ్డి, ఆనం విజయ్ కుమార్రెడ్డిలు ఎస్పీకి ఆఫీస్కు వెళ్లారు. దీనిలో భాగంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ.. ‘ దాడిపై నిన్ననే పిర్యాదు చేశాం. ఇప్పటి వరకూ పోలీసుల నుండి ఎలాంటి స్పందనా లేదు. ఎఫ్ఐఆర్ కూడా కట్టలేదు. ఇది ప్రసన్న కుమార్ రెడ్డిపై జరిగిన హత్యాయత్నం. విమర్శలలో ఏదైనా అభ్యంతరం వుంటే చట్టపరంగా వెళ్ళాలి. ప్రసన్న కుమార్ రెడ్డి ఏమి మాట్లాడాడు...?, వేమిరెడ్డిని జాగ్రత్తగా వుండాలి అని సూచించారు. రోజా పై టిడిపీ చేసిన వ్యాఖ్యలు ఏమైయ్యాయి.. ఒక మహిళ నేత, మాజీ మంత్రులను ఎమ్మెల్యేలను వాడు వీడు అని మాట్లాడొచ్చా?, డబ్బుంది కాబట్టి డబ్బున్నోళ్లు అన్నాం.. దాంట్లో తప్పేముంది?, దాడిలో పాల్గొన్న వారితో పాటు వేమిరెడ్డి దంపతులపై హత్యాయత్నం కేసు కట్టాలి’ అని అనిల్ కుమార్ యాదవ్ పేర్కొన్నారు.నా తల్లిని బెదిరించారు.. నేను ఇంట్లో ఉంటే చంపేవారు: ప్రసన్నకుమార్ -
వైఎస్ జగన్ నెల్లూరు పర్యటన ఏర్పాట్లపై అనిల్ కుమార్ యాదవ్..
-
నెల్లూరులో జగన్ పై ఉన్న అభిమానం అంటే ఏంటో చూపిస్తా..
-
తప్పుడు కేసులకు భయపడం: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, తిరుపతి జిల్లా: రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. జిల్లా అంత ఒక్కతాటిపై ఉండి మాజీ మంత్రి కాకాణి గోవర్థన్రెడ్డికి అండగా ఉంటాం.. మీరు ఎన్ని కేసులు పెడితే అంత బలంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గర అవుతుంది. ఎన్ని కేసులు పెట్టిన వైఎస్సార్సీపీ నాయకులు భయపడరు. న్యాయస్థానంపై మాకు నమ్మకం ఉంది’’ అని అనిల్ చెప్పారు.వైఎస్సార్సీపీ ఎంపీ గురుమూర్తి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు. కాకాణి గోవర్ధన్రెడ్డి పై తప్పుడు కేసులు పెట్టీ జైలుకు పంపించారు. కూటమి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెప్తారువెంకటగిరి నియోజకవర్గం వైఎస్సార్సీపీ ఇంచార్జి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందన్నారు. సీఎం చంద్రబాబును ఇళ్లకు పంపించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. అందరికీ ఇల్లు సాధ్యం కాదని.., చంద్రబాబుకు మాత్రమే ఇల్లు కట్టుకుంటున్నారు. ప్రజలే చంద్రబాబును ఇంటికి పంపిస్తారుఎమ్మెల్సీ మేరుగ మురళి మాట్లాడుతూ.. నిరాధారమైన ఆరోపణలతో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. తప్పుడు కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడరు.ఎమ్మెల్సీ చంద్ర శేఖర్రెడ్డి మాట్లాడుతూ.. నెల్లూరు జిల్లా చరిత్రలో తప్పుడు కేసులతో మాజీ మంత్రిని అరెస్ట్ చేసిన ఘటన ఎప్పుడు జరగలేదు. జూన్ 4 తేదీన రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటు దినం బలంగా నిర్వహిస్తాం. కూటమి ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్తాం -
కాకాణిని జైలుకు పంపడమే లక్ష్యంగా కూటమి పెద్దల కుట్ర
-
రెడ్బుక్ రాజ్యాంగంతో అరాచకం
నెల్లూరు(బారకాసు): ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ కూటమి ప్రభుత్వం అరాచకాలకు తెగబడిందని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ (పీఏసీ) మెంబర్ పి.అనిల్కుమార్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం నెల్లూరులోని పార్టీ జిల్లా కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి ఊసే లేకుండా పోయిందని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం లేని స్కామ్లు సృష్టించి కక్ష సాధింపులకు దిగుతోందని ధ్వజమెత్తారు. మాజీ ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్రెడ్డి అక్రమ అరెస్ట్ను ఖండించారు. ఏపీలో పనిచేయాలంటేనే బ్యూరోక్రాట్స్ భయపడుతున్నారని విమర్శించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. మైనింగ్ మాఫియాను పోషిస్తున్న చంద్రబాబు నెల్లూరు జిల్లాలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు మైనింగ్ మాఫియాను బాబు పెంచి పోషిస్తున్నారు. జిల్లాలో దాదాపు 180 మైన్లు ఉంటే అందులో కేవలం 25 నుంచి 30 మాత్రమే నడుస్తున్నాయి. వేమిరెడ్డి వల్ల అనేక క్వారీలు ఇంకా మూతపడే ఉన్నాయి. వేమిరెడ్డి కంపెనీ పెట్టుకోవడం తప్పా అంటూ టీడీపీ నాయకుడు బీద రవిచంద్రయాదవ్ వత్తాసుగా మాట్లాడారు. తాను తప్ప ఇంకెవరూ మైనింగ్ వ్యాపారాలు చేసుకోకూడదన్న ఎంపీ దురాశ వల్ల నెల్లూరు జిల్లాలో దాదాపు 10 వేల మంది ఉపాధి కోల్పోతున్నారు.260 మందికిపైగా క్వార్ట్జ్æ ఎగుమతిదారులుంటే ఎంపీ వేమిరెడ్డికి చెందిన కంపెనీ ఒక్కటే వ్యాపారం చేయడం వెనుక మతలబు ఏంటి? ఎవరైనా ఎక్స్పోర్ట్ చేసుకుందామనిపోతే వారిని బెదిరిస్తున్నారు. ఎంపీ మైనింగ్ అక్రమాలపై నేను ప్రెస్మీట్ పెట్టి మాట్లాడిన తర్వాత కొంతమందిని పిలిపించుకుని మాట్లాడుకున్నారని తెలిసింది. లోకల్ మైన్లన్నీ ఎంపీ కంపెనీకి చేయాలట. ఎక్స్పోర్టర్ చైనా కంపెనీకి అమ్ముకుంటామని వాళ్లతో చెప్పారు. ఇదే జరిగితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఎంటర్ కావడం తథ్యం. లీజు గడువు ముగిసిన వాటిలో అక్రమ మైనింగ్ ఎంపీ ప్రభాకర్రెడ్డి ఫ్యాక్టరీ పెడతానని ఇంకా శంకుస్థాపన చేయకుండానే వేల టన్నులు చైనాకి ఎక్స్పోర్టు చేస్తున్నాడు. 50 ఏళ్ల పరి్మషన్ గడువు ముగిసిపోయిన ఏడెనిమిది మైన్స్, పట్టా భూములను తన గుప్పెట్లో పెట్టుకుని అక్రమంగా మైనింగ్ చేస్తూ ఏడాదికి రూ.250 కోట్లు చొప్పున నాలుగేళ్లలో రూ.వెయ్యి కోట్లకు పైనే దోపిడీకి స్కెచ్ వేశాడు. ఇవి నిజంకాదని నిరూపిస్తే ఎంపీకి క్షమాపణలు చెప్పడానికీ సిద్ధం. మా హయాంలో పారదర్శకంగా మైనింగ్ గత ప్రభుత్వంలో ఎవరి మీద ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వేచ్ఛగా మైనింగ్ చేసుకోనిచ్చాం. టాప్ టెన్ ఎక్స్పోర్టర్ల లిస్ట్ చూస్తే అందులో టీడీపీ వాళ్లే ఎక్కువ మంది ఉంటారు. మా ప్రభుత్వ పారదర్శక విధానాలకు ఇంతకన్నా వేరే రుజువులు అవసరం లేదు. -
కూటమి సర్కార్ నిర్లక్ష్యంతో మైనింగ్ లో పని చేసే కార్మికులు రోడ్డున పడ్డారు
-
సైదాపురంలో అక్రమ మైనింగ్ పై మాజీ మంత్రి అనిల్ కుమార్ ధ్వజం
-
మైనింగ్ మాఫియా డాన్ ఎంపీ వేమిరెడ్డి
నెల్లూరు (పొగతోట): నెల్లూరు జిల్లాలో వేలాది కుటుంబాలను రోడ్లపాల్జేసి అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి మైనింగ్ మాఫియాగా మారారని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత డాక్టర్ పి.అనిల్కుమార్యాదవ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రభుత్వానికి 5 రోజులు గడువు ఇస్తున్నానని, ఆయనపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేయకపోతే సైదాపురం నుంచే ఉద్యమాన్ని ప్రారంభిస్తామని హెచ్చరించారు. ఆదివారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియాతో అనిల్కుమార్ మాట్లాడుతూ.. అక్రమ మైనింగ్తో తమకేమీ సంబంధం లేదని ఆయన్ను కలిసిన లీజుదారులకు ఎంపీ చెప్పారన్నారు. అయితే, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి డైరెక్టర్గా లక్ష్మి క్వార్ట్ ్జ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో కంపెనీ స్థాపించారని ఆధారాలు చూపించారు. వాస్తవాలు కనబడుతుంటే మైనింగ్తో ఆయనకు సంబంధలేదని ఎలా చెబుతారని ప్రశ్నించారు. మైనింగ్తో ఏ సంబంధం లేకపోయినా మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్రెడ్డిపై కేసు నమోదు చేశారని.. అక్రమ మైనింగ్కి పాల్పడుతూ రూ.వందల కోట్లు దోచుకుంటున్న ఎంపీపై మాత్రం కేసులు ఎందుకు పెట్టరని నిలదీశారు.గత ప్రభుత్వంలో మైన్లకు రూ.255 కోట్ల జరిమానావైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అక్రమ మైనింగ్పై అధికారులు చిత్తశుద్ధితో పనిచేశారని అనిల్కుమార్ యాదవ్ చెప్పారు. అప్పట్లో అక్రమ మైనింగ్కు పాల్పడిన వారికి రూ.255 కోట్ల జరిమానాలు విధించారని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జరిమానాలు విధించిన, కేసులు ఉన్న గనులను మాత్రమే ఎందుకు తెరిచారని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మైనింగ్ ద్వారా రూ.300 కోట్లు ఆదాయం వస్తే.. ప్రస్తుతం రూ.30 కోట్లు కూడా ప్రభుత్వానికి రావడం లేదన్నారు. సైదాపురం మండలంలో 200 మైన్లు ఉన్నా.. కేవలం 30 మాత్రమే ప్రారంభించడం వెనుక రహస్యమేమిటని ప్రశ్నించారు. ఎంపీ వేమిరెడ్డి స్వార్థంతో వ్యవహరిస్తూ ఆయన చెప్పిన ధరకు, ఆయన కంపెనీకే సరఫరా చేసే వారికి మాత్రమే మైనింగ్ అనుమతులు ఇచ్చారన్నారు. మైనింగ్ యజమానులు కోర్టుకు వెళితే వాటిని తెరవాలని ఫిబ్రవరిలో కోర్టు ఆదేశించిందన్నారు. అయినా ఇప్పటివరకు గనులను తెరవడంలేదన్నారు. దీంతో మైనింగ్ యజమానులు కంటెంట్ ఆఫ్ కోర్టు కింద మళ్లీ కోర్టును ఆశ్రయించారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మైనింగ్ యజమానులెవరూ ఎవరూ కోర్టుకు వెళ్లలేదన్నారు. మైనింగ్ పరిశ్రమను తెరవనివ్వకుండా, ఇతరులకు పర్మిట్లు రాకుండా ఎంపీ అడ్డుకుంటున్నారని తెలిపారు.అన్ని ఎక్స్పోర్టు కంపెనీలు మూతగతంలో ఇక్కడ దాదాపు 30 ఎక్స్పోర్టు కంపెనీలు ఉంటే.. ఇప్పుడు అవన్నీ మూతపడ్డాయని, ఎంపీ వేమిరెడ్డి డైరెక్టర్గా ఉన్న రెండు కంపెనీలు మాత్రమే ఎక్స్పోర్టు చేస్తున్నాయన్నారు. కూటమి అధికారంలోకి వచ్చాక లక్ష్మి క్వార్ట్ ్జ కంపెనీ ఏర్పాటు చేయగా, తాజాగా ఫినీ క్వార్ట్ ్జ ప్రారంభించారన్నారు. ఎగుమతిదారుందరినీ నిలిపివేశారని.. ఒక్క ఎంపీ వేమిరెడ్డి ఎక్స్పోర్ట్ కంపెనీ ద్వారానే సరుకు రవాణా జరుగుతోందని ఆధారాలతో సహా వెల్లడించారు. శతాబ్దాల చరిత్ర కలిగిన వెంకటగిరి రాజాల మైన్లు కూడా తెరవలేదన్నారు. ధనదాహంతో అక్రమ మైనింగ్కు పాల్పడుతున్న ఎంపీకి పేదల ఉసురు కచ్చితంగా తగులుతుందన్నారు.50 ఏళ్లు దాటిన మైన్లు స్వాధీనం చేసుకోవాలిగతంలో శోభారాణి మైన్ కంపెనీకి రూ.32 కోట్లు ఫైన్ వేశారని అనిల్కుమార్ గుర్తు చేశారు. వెంకటగిరి ఎమ్మెల్యే మీడియా సమావేశంలో శోభారాణి మైనింగ్ కంపెనీ ఇల్లీగల్ అని చెప్పారన్నారు. గతంలో మైనింగ్ డిప్యూటీ డైరెక్టర్ పంచనామా చేసి 38 వేల మెట్రిక్ టన్నుల క్వార్ట్ ్జ ఉందని నివేదిక ఇచ్చారన్నారు. ప్రస్తుతం అదే అధికారి 1.20 లక్షల మెట్రిక్ టన్నుల క్వార్ట్ ్జ ఉందని నివేదికలు ఇచ్చారన్నారు. 50 ఏళ్లు దాటిన గనులను నిబంధనల ప్రకారం ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలన్నారు. లీజు సమయం దాటినా మైన్లలో అందుబాటులో ఉన్న మెటీరియల్ను వేలం వేయాలని ప్రస్తుత ప్రభుత్వ కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. కేబినెట్ నిర్ణయం మేరకు నిల్వ ఉన్న క్వార్ట్ ్జను వేలం వేస్తే ప్రభుత్వానికి రూ.3 వేల కోట్ల ఆదాయం వచ్చే అవకాశం ఉందన్నారు.ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న గంజాయి బ్యాచ్సైదాపురంలో గంజాయి బ్యాచ్ మాఫియా నడిపిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. మైన్ల వైపు ఎవరిని వెళ్లనివ్వకుండా మహిళలను, అటుగా వెళ్తున్న వాహనాలను, ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. అమర్నాథ్రెడ్డి అనే వ్యక్తి అక్రమ మైనింగ్ చేస్తున్నారని కూటమి ప్రభుత్వం కేసులు పెట్టిందన్నారు. ప్రస్తుతం అతనే ఇల్లీగల్ మైనింగ్ చేస్తున్నాడని తెలిపారు. జిల్లా ఎస్పీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మఫ్టీలో వెళితే సైదాపురంలో ఏం జరుగుతుందో తెలుస్తుందన్నారు. -
‘ఏపీలో గనుల దోపిడీ.. పెనాల్టీలో ఉన్న మైన్స్ ఓపెన్’
సాక్షి, నెల్లూరు: ఏపీలో కూటమి సర్కార్ పాలనలో పెనాల్టీ ఉన్న మైన్స్ తెరిచి మైనింగ్ చేస్తున్నారని ఆరోపించారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. క్వార్జ్ అక్రమాలపై వేమిరెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారని ప్రశ్నించారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..‘కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ఇన్ని రోజులు మీడియాకి దూరంగా ఉండాల్సి వచ్చింది. క్వార్జ్ దందాను నడిపి అనిల్ వేల కోట్లు సంపాదించడానికి అసత్య ప్రచారాలు చేశారు. న్యాయస్థానాన్ని ఆశ్రయించే హక్కు అందరికి ఉంటుంది.. మాజీ మంత్రి కాకాణికి న్యాయస్థానం మీద గౌరవం ఉంది. గత ప్రభుత్వమే కొన్ని మైన్స్ మీద 255 కోట్ల రూపాయల మేర ఫైన్ విధించింది. వాటిని వసూలు చేయాల్సిన బాధ్యత ప్రస్తుత ప్రభుత్వం మీదే ఉంది.పెనాల్టీ ఉన్న మైన్స్ ఓపెన్ చేసి మైనింగ్ చేస్తున్నారు. వందల మైన్స్ ఉంటే కేవలం 30 మైన్స్ మాత్రమే ఎందుకు ఓపెన్ చేశారు?. గత ప్రభుత్వంలో 150 కోట్ల దాకా ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఇప్పుడు 30 కోట్లు కూడా రావడం లేదు. 100 మైన్స్ దాకా మూసేశారు. ఈ ప్రభుత్వంలో మైన్ మీద ఆధారపడిన కొన్ని వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయ్. వైఎస్సార్సీపీ హయాంలో మేము ఎవరిని బెదిరించలేదు.. ఇప్పుడు మైన్ ఓనర్స్ ని బెదిరించి.. గనులు మూయించారు. ఓనర్స్ కోర్టుకు వెళ్లారు.వేమిరెడ్డే సూత్రధారి..క్వార్జ్ని నమ్ముకున్న కూలీలు, సామాన్య ప్రజలు నష్టపోతున్నారు. సామాన్య ప్రజల కోసం అవసరమైతే కొట్లాడతా.. కాకాణి మీద కేసు పెట్టునట్లు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మీద కూడా కేసు నమోదు చెయ్యాలి. క్వార్జ్ అక్రమాలపై వీపీఆర్ సమాధానం చెప్పాలి.. పెద్ద మనిషి ముసుగులో ఆయన చేసిన అక్రమాలు బయటికి తీసుకొస్తాం. ఎవరి హయాంలో అక్రమ మైనింగ్ జరిగిందో చూడండి. కొండలు కొండలు గ్రావెల్.. ఇసుకను తీసుకెళుతున్నారు. గత ప్రభుత్వంలో ఏరోజు కూడా గనుల యజమానులు కోర్టుకు వెళ్ళలేదు. న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చిన ప్రభుత్వం అమలు చేయలేదు. గనుల యజమానుల సంఘం కూడా ప్రభుత్వానికి లేఖ రాసింది. మందకృష్ణ మాదిగకు చెందిన ఎంఆర్పీఎస్ నేతలు కూడా గనులను ప్రారంభించాలని ప్రభుత్వాన్ని కోరారులక్ష్మి క్వార్జ్ అండ్ సాండ్ కంపెనీలో VPR డైరెక్టర్ గా వున్నారు. ఈ కంపెనీనే తెల్లరాయిని ఎగుమతి చేసింది. తరువాత ఫినీ క్వార్జ్ లిమిటెడ్ పేరుతో సిస్టర్ కంపెనీను ప్రారంభించారు. దీని డైరెక్టర్ విజయకుమార్ రెడ్డి, ఆయన ఎవరో అందరికీ తెలుసు. ఈ కంపెనీ ద్వారా కూడా తెల్లరాయిని ఎగుమతి చేశారు. నేను ఏ ఒక్క గని యజమానిని కూడా బెదిరించలేదు. ఇప్పుడు వీళ్లే గనుల యజమానులను బెదిరించి వారి నుంచి మెటీరియల్ ను తీసుకుంటున్నారు. ఈ తెల్లరాయిని తీసుకువెళ్లేందుకు అనుమతులు ఇవ్వకపోయినా.. ఇచ్చినట్లు తహసిల్దార్ చెబుతున్నారుఅక్రమ మైనింగ్..గని కాల పరిమితి ముగిసిన తర్వాత అవి ప్రభుత్వ ఆధీనంలోకి వస్తాయి. కానీ ఇలాంటి గనులన్నింటినీ స్వాధీనం చేసుకొని అక్రమ మైనింగ్ చేస్తున్నారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేస్తుంటే కేసులు కట్టడం లేదు. రెండు రోజుల క్రితం కూడా టిప్పర్లతో తెల్లరాయి ని తీసుకు వెళుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొత్త విధానం ప్రకారం గనుల వద్ద ఉన్న తెల్లరాయి నిల్వలను వేలం వేస్తామని ప్రకటించారు. ప్రభుత్వం వేలం వేస్తే రూ.500 కోట్ల దాకా ఆదాయం వస్తుంది. కొన్ని గనులను అమర్ నాథ్ రెడ్డి నిర్వహిస్తున్నారు, వీటిని పరిశీలించేందుకు ఎవరినీ అనుమతించడం లేదు. గనుల వద్ద గూండాలను పెట్టారు,. అక్రమ మైనింగ్ లో భాగంగా పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నారు.. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. వీటన్నిటికీ ఎంపీ వేమిరెడ్డి సమాధానం చెప్పాలి, వేమిరెడ్డి తన అనుచరుల వద్ద మాట్లాడించకుండా తానే మాట్లాడాలి. గన్నులన్నింటినీ ప్రారంభించక పోతే యజమానుల తరఫున ఉద్యమం చేస్తా, గనుల్లో అక్రమాలు చేస్తున్న ఎంపీ వేమిరెడ్డిపై ఎందుకు కేసు పెట్టకూడదని ప్రశ్నిస్తున్నా.తన కంపెనీ కాకపోతే ఆయన ఎందుకు చెప్పడం లేదు?. రూ.15 వందల కోట్ల మేర ఎంపీ దోపిడీకి పాల్పడ్డారు. గతంలోనే చెప్పా.. పే బ్యాక్స్ అందరికీ ఉంటాయి, క్వార్జ్ డంప్ను వేలం వేయాలని డిమాండ్ చేస్తున్నా. ఇలాగే అక్రమంగా మైనింగ్ కొనసాగిస్తే అందరికీ అవకాశం కల్పించాలి, బడా బాబులకు మాత్రమే అవకాశం ఇవ్వడం మంచిది కాదు. చేస్తే అందరికీ అవకాశం ఇవ్వాలి.. లేకుంటే ఆందోళన చేస్తాం. గనుల్లో 70 శాతం మంది బాధితులు టీడీపీ వాళ్లే ఉన్నారు. సైదాపురంలో గంజాయి బ్యాచ్ తిరుగుతూ.. ప్రజలను, మహిళలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. మా పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాణిపై తప్పుడు కేసులు పెట్టారు’ అని చెప్పుకొచ్చారు. -
అనిల్ కుమార్ యాదవ్ సంచలన ప్రెస్ మీట్
-
దమ్ముంటే మమ్మల్ని ఎదుర్కొండి.. చదువుకునే పిల్లల్ని కాదు.. అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
పార్టీ మార్పులపై అనిల్ కుమార్ యాదవ్ షాకింగ్ కామెంట్స్ ..
-
ఎన్ని కేసులైనా పెట్టుకోండి.. వడ్డీతో సహా చెల్లిస్తా: అనిల్ కుమార్ హెచ్చరిక
సాక్షి, నెల్లూరు: వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, రాష్ట్రంలో వైఎస్సార్సీపీకి పూర్వవైభవం తీసుకొస్తామని చెప్పుకొచ్చారు.మాజీ మంత్రి అనిల్ కుమార్ నెల్లూరులో మీడియాతో మాట్లాడుతూ..నేను పార్టీ మారుతున్నానంటూ కొన్ని చానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. నేను రాజకీయాల్లో ఉన్నంత కాలం వైఎస్ జగన్ వెంటే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో నెల్లూరు జిల్లాను క్లీన్స్వీప్ చేసేలా కృషి చేస్తాం. వైఎస్ జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని అన్నారు.నా మీద తప్పుడు కథనాలు రాసి వ్యూస్ పెంచుకుందామని కొన్ని చానల్స్ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నాయి. నా మీద వార్త రాయడం వల్ల ఛానల్స్ రేటింగ్ పెరుగుతాయి అంటే రాసుకోవచ్చు. కొన్ని వ్యక్తిగత కారణాల రీత్యా కొద్ది రోజులు జిల్లా రాజకీయాలకు దూరంగా ఉన్నాను. త్వరలోనే జిల్లా రాజకీయాల్లో యాక్టివ్ అవుతాను.. నాన్ స్టాప్ కార్యక్రమాలు చేస్తాం. పాత కేసుల్లో తనను అక్రమంగా అరెస్టు చేయాలంటూ కొందరు లోకేష్ వెంట తిరుగుతున్నారు. అధికారం చేతిలో పెట్టుకుని.. నాపై అక్రమ కేసులు పెట్టించి శునకానందం పొందాలని చూస్తున్నారు. ఎన్ని కేసులు అయినా పెట్టుకోండి భరిస్తా.. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తా.ఎవరు పోస్టింగ్ పెట్టినా వైఎస్సార్సీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను అరెస్ట్ చేస్తూ కూటమి ప్రభుత్వం శునకానందం పొందుతోంది. నాలుగు కేసులు పెట్టినంత మాత్రాన మేము భయపడతాం అనుకుంటే అంతకన్నా పొరపాటు మరొకటి లేదు. ఇక్కడ భయపడే వారు ఎవరూ లేరు. గతంలో మా ప్రభుత్వంలో మేము ఇలాగే కేసులు పెట్టాలనుకుంటే ఇంతకన్నా ఎక్కువ కేసులు అయ్యేవి. కానీ, మేము అలా చేయలేదు. రానున్న కాలంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిస్థితులు వేరేగా ఉంటాయి. అరెస్ట్లపై కూటమి నేతలు మాకు ఒక దారి చూపించారు. రానున్న కాలంలో తప్పకుండా తప్పులకు పాల్పడిన వారికి శిక్ష తప్పదు అంటూ హెచ్చరించారు. -
నారా లోకేష్ కు కౌంటర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్
-
పోరాటం కొత్త కాదు.. వెనకడుగు వేసేది లేదు: వైఎస్సార్సీపీ నేతలు
సాక్షి, నెల్లూరు: తిరుమల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న చంద్రబాబుకి ఇవే చివరి ఎన్నికలు అవుతాయన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి. తన స్వార్థ రాజకీయాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీసిన వ్యక్తి చంద్రబాబు అంటూ మండిపడ్డారు. పోరాటం చేయడం వైఎస్సార్సీపీకి కొత్తేమీ కాదని మాజీ మంత్రి అనిల్ కుమార్ చెప్పుకొచ్చారు.కాగా, వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ ఆనం విజయ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రూరల్ నియోజకవర్గ ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కాకాణి గోవర్ధన్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి, జడ్పీ చైర్పర్స్ ఆనం అరుణమ్మ పాల్గొన్నారు.ఈ సందర్బంగా మాజీ మంత్రి కాకాణి మాట్లాడుతూ.. చంద్రబాబు లాంటి వ్యక్తిని గతంలో ఎప్పుడూ చూడలేదు. తన స్వార్ధ రాజకీయాలు కోసం తిరుమల పవిత్రతను దెబ్బతిశాడు. మనం ఓడిపోయాం తప్ప.. ప్రజలని ఎప్పుడూ మోసం చేయలేదు. ఒక్క సీటుతో ప్రయాణం ప్రారంభించిన డీఎంకే.. ప్రతిపక్షానికి కేవలం నాలుగు సీట్లే మిగిల్చి అధికారంలోకి వచ్చింది. గ్రామంలో ఉండే ప్రతి ఒక్కరూ రెడ్ బుక్ రాసుకోండి.. అధికారంలోకి రాగానే దాన్ని అమలు చేద్దాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులు ధ్వంసం చేసిన వారి సొంత ఖర్చులతోనే నిర్మాణాలు చేయిస్తాం. జమిలీ ఎన్నికలు వచ్చినా.. 2029 ఎన్నికలు వచ్చినా గెలుపు వైఎస్సార్సీపీదే. కష్ట కాలంలో పార్టీ జెండా మోసిన వారికే భవిష్యత్తులో పదవులు వస్తాయి. కూటమికి ఎందుకు ఓటు వేశామా అని ప్రజలు ఇప్పుడు బాధపడుతున్నారు.ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో వైఎస్సార్సీపీని బలోపేతం చేసుకుందాం. రూరల్లో పార్టీకి బలమైన కేడర్ ఉంది. పార్టీ కష్ట కాలంలో మనతో ఉండే వారికీ భవిష్యత్తులో పదవులు వరిస్తాయి. నాలుగు నెలలకే కూటమి ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది. రూరల్ నియోజకవర్గానికి బలమైన నాయకుడు విజయ్ కుమార్ రెడ్డి ద్వారా దొరికారు. సిటీ, రూరల్లో మళ్ళీ మన జెండా ఎగరేస్తాం.రూరల్ నియోజకవర్గ ఇంఛార్జ్ ఆనం విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో కూడా రూరల్లో వైఎస్సార్సీపీ గెలిచింది. రూరల్ నియోజకవర్గం వైఎస్సార్సీపీకి కంచుకోటలాంటిది. ఈసారి జరిగే ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతాం. స్వార్థ ప్రయోజనాల కోసం నేతలు పార్టీ మారారు. కార్యకర్తలు మాత్రం పార్టీలో ఉన్నారు. పార్టీ మారిన వారికి భవిష్యత్తులో తన్నులు తప్పవు. ఎమ్మెల్యే కోటంరెడ్డి ఇబ్బంది పెడతాడని.. ఆయన్ను తిడుతూనే పంచన చేరుతున్నారు. నా నేతల జోలికి వస్తే ఎవరికైనా తాట తీస్తాం. ఊరికే వదిలిపెట్టం. అన్ని రోజులు ఒకేలా ఉండవు. మా టైమ్ కూడా వస్తుంది. అప్పుడు చెబుతాం.మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. 40 శాతం ఓట్లతో దేశంలో శక్తివంతమైన నాయకుడిగా వైఎస్ జగన్ ఉన్నారు. వైఎస్ జగన్ను ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఏపీలోని పార్టీలకు లేవు. రాష్ట్రం నాశనం అయిందనే భావన మూడు నెలల్లోనే వచ్చింది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా వైఎస్ జగన్తోనే ఉంటాం. పోరాటాలు చేయడం మాకు కొత్త కాదు.. వెనకడుగు వేసే ప్రసక్తే లేదు. తాడో పేడో తేల్చుకునే వాళ్ళకే జిల్లా పదవులు, రాష్ట్ర పదవులు ఇవ్వాలి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందరం కలిసి కొట్లాడతాం.. కార్యకర్తలను బతికించుకుంటాం. ఎల్లో మీడియా నన్ను నిత్యం కలవరిస్తోంది. నేను ఎక్కడికి పోలేదు.. విజయదశమి తర్వాత యాక్టివ్ అవుతా’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: టీడీపీ గూండాల దాడిలో నాగరాజుకు గాయాలు.. వైఎస్ జగన్ పరామర్శ -
మంత్రి నారాయణ్ కు అనిల్ కుమార్ యాదవ్ వార్నింగ్
-
లోకేష్.. పడవలు ఎక్కడ?: అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్
సాక్షి, తాడేపల్లి: వాయుగుండం కారణంగా ఏపీలో వర్షాలు దంచికొడుతున్నాయి. కృష్ణమ్మ వరద ధాటికి ఏకంగా కరకట్టపై ఉన్న సీఎం చంద్రబాబు ఇంట్లోకి కూడా నీరు చేరుకుంది. ఈ నేపథ్యంలో మంత్రి నారా లోకేష్కు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కౌంటరిచ్చారు. గతంలో లోకేష్ కామెంట్స్కు బదులిస్తూ.. ఇప్పుడు మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా? అని ప్రశ్నించారు.కాగా, అనిల్ కుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా.. ఏమయ్యా లోకేష్.. ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో పడవలను అడ్డుపెట్టామని అన్నావు. మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా?. మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు. ఆ బోట్లను త్వరగా తీసి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించండి’ అంటూ కౌంటరిచ్చారు. ఏమయ్యా @naralokesh...ఆరోజు కరకట్టపై మీ అక్రమ నివాసాన్ని ముంచడానికి బ్యారేజ్ గేట్ల మధ్యలో పడవలను అడ్డుపెట్టామని అన్నావు..మరి ఇప్పుడు మీరే మీ ఇంటిని ముంచుకోవడానికి పడవలు అడ్డు పెట్టుకున్నారా...?మీరు సురక్షిత ప్రాంతాలకు వెళ్లడం కాదు..ఆ బోట్లను త్వరగా తీసి ప్రజలను సురక్షిత… pic.twitter.com/J6WQiVApEb— Dr.Anil Kumar Yadav (@AKYOnline) September 2, 2024 -
‘ఏపీలో లా అండ్ ఆర్డర్ కాదు.. లోకేశ్ ఆర్డర్ నడుస్తోంది’
సాక్షి, అమరావతి: ఏపీలో టీడీపీ రెడ్ బుక్ పాలన కొనసాగుతోందన్నారు మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్. అలాగే, లా అండ్ ఆర్డర్ కాదు నారా లోకేశ్ ఆర్డర్ కనిపిస్తోందని మండిపడ్డారు. వినుకొండ రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు.కాగా, వినుకొండలో టీడీపీ కార్యకర్తల చేతిలో రషీద్ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అనిల్ కుమార్ యాదవ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ సందర్భంగా ట్విట్టర్లో..‘రషీద్ హత్య ఘటన మనసున్న ప్రతీ ఒక్కరికీ కలచివేస్తోంది. అంత కిరాతమైన దృశ్యాలు ఆ వీడియో కనపిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వినుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ ఘటన.. మనసున్న ప్రతి ఒక్కరినీ కలచివేస్తుంది.అంత కిరాతకమైన దృశ్యాలు ఆ వీడియోలో కన్పిస్తున్నాయి. రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం. ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నాను.ఆంధ్ర ప్రదేశ్ ను అత్యాచార ప్రదేశ్…— Dr.Anil Kumar Yadav (@AKYOnline) July 18, 2024 ఆంధ్రప్రదేశ్ను అత్యాచారప్రదేశ్గా మార్చకండి. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది. ఏపీలో లా అండ్ ఆర్డర్ కనిపించడం లేదు. లోకేష్ ఆర్డర్ మాత్రమే కనిపిస్తోంది. నిన్నటి వినుకొండ వంటి ఘటనలు రాష్ట్రంలో ఎన్నో జరుగుతూనే ఉన్నాయి. వీటి అన్నింటిపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా దృష్టిపెట్టాలి అని విజ్ఞప్తి చేస్తున్నాను. రాష్ట్రంలో ఆ ఒకటిన్నర నెలలో శాంతి భద్రతల అంశంపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలి’ అని డిమాండ్ చేశారు. -
తను విసిరిన ఛాలెంజ్ పై అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్
-
మమ్మల్ని అన్నారు.. ఇప్పుడు వాళ్ళేం చేస్తున్నారు
-
అధికారం ఇచ్చింది పక్షపాతం లేకుండా పాలించమని ఈ రోజు మీరు పగ సాధిస్తే..!
-
అధికారం శాశ్వతం కాదు.. టీడీపీ గుర్తుంచుకోవాలి: అనిల్
సాక్షి, తాడేపల్లి: తనకు ఓట్లేశారని తమ సామాజక వర్గంపై దాడులు చేశారని.. అది ప్రజాస్వామ్యంలో మంచిదికాదని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, అధికారం శాశ్వతం కాదని గుర్తించాలని హితవు పలికారు.ప్రజల అభిప్రాయాన్ని స్వీకరిస్తున్నాం. పల్నాడుకు నేను కొత్తయినా కూడా ప్రజలు నన్ను ఆదరించారు. కూటమి ఇచ్చిన హామీలను అమలు చేయాలి. సీట్లు రాకున్న 40 శాతం ఓటు షేర్ మాకు ఉంది. మాకు ప్రతిపక్షం కొత్తకాదు. గతంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలపడ్డాం. ఇప్పూడూ అంతే. మా అపజయానికి కారణాలను విశ్లేషిస్తున్నాం’’ అని అనిల్ చెప్పారు.‘‘ఓటమి చెందామని ఇంట్లో కూర్చోము. వైఎస్ జగన్ వలన చిన్న వయసులోనే రెండు సార్లు ఎమ్మెల్యే అయ్యాను. ఎప్పుడూ ఆయన వెంటే నడుస్తా. పల్నాడులో దాడులు ఆపాలి. మా భాష బాగలేదన్నవారు ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారో జనం చూస్తున్నారు. అధికార పార్టీకి కాస్త టైం ఇస్తాం. వారి తప్పులపై నిలదీస్తాం’’ అని అనిల్ పేర్కొన్నారు.‘‘తమిళనాడులో డీఎంకేకి నాలుగుసార్లు డిపాజిట్ రాలేదు. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చింది. మేము కూడా అంతే. రాజకీయ సన్యాసంపై నా ఛాలెంజ్ని టీడీపీ వారు స్వీకరించలేదు. కాబట్టి దాని గురించి ఇక నేను మాట్లడను. దాడుల్లో గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం. కక్ష సాధింపు ఉండదని చెప్తూనే టీడీపీ దాడులు చేస్తోంది. ఇది మంచి పద్దతి కాదు’ అని అనిల్ పేర్కొన్నారు. -
అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి
సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంట్ అభ్యర్ధి అనిల్కుమార్ యాదవ్ డిమాండ్ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయన్నారు.టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవకాశాలున్నాయని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్లలోని పలు ప్రాంతాల్లో రిగ్గింగ్ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే పిన్నెల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తుమృకోటలో రిగ్గింగ్ జరుగుతోందని తానే ఫోన్ చేసి ఎస్పీకి తెలియచేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామన్నారు. టీడీపీ రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియమించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయట పెట్టాలని డిమాండ్ చేశారు. -
లోకేష్ కి ఆ వీడియో ఎక్కడిది
-
దమ్ముంటే ఆ ప్రాంతంలో రీపోలింగ్ పెట్టాలి
-
టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని చెప్పినా పోలీసులు స్పందించలేదు: అనిల్ కుమార్
సాక్షి, తాడేపల్లి: ఎన్నికల కమిషన్ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈవీఎంల ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారో చెప్పాలన్నారు వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్.కాగా, అనిల్ కుమార్ గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ఎమ్మెల్యే పిన్నెల్లి, ఆయన కుమారుడిపై కూడా దాడులు చేశారు. పల్నాడు జిల్లాలో టీడీపీ నేతలు ఈవీఎంలను ధ్వంసం చేశారు. చింతపల్లిలో టీడీపీ నేతలు రిగ్గింగ్ చేశారు. తుమ్మురుకోట, వబుచెర్లలో ఈవీఎంలు ధ్వంసం చేశారు. టీడీపీ రిగ్గింగ్ చేస్తోందని పోలీసులకు చెప్పినా స్పందించలేదు. పాల్వాయి గేటు ప్రాంతంలో టీడీపీ నేతలు విధ్వంసం చేశారు. టీడీపీ నేతల అరాచక వీడియోలు ఎందుకు బయటకు రాలేదు?. ఓటమి భయంతోనే టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారు.ఎనిమిది చోట్ల ఈవీఎంలు ధ్వంసమైతే ఒక్కటే ఎందుకు బయటకు వచ్చింది. ఈవీఎం ధ్వంసం వీడియోలను ఎవరు బయటపెట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలను కొడుతున్న వీడియోలు ఈసీని కనపడలేదా?. పోలింగ్ రోజు పోలీసుల వైఖరి ఈసీకి కనపడలేదా?. ఈసీ తీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈసీ తీరుపై న్యాయ పోరాటం చేస్తాం. టీడీపీ రిగ్గింగ్కు పాల్పడిన చోట్ల రీపోలింగ్ పెట్టాలి’ అని డిమాండ్ చేశారు. నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్ది అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్- ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్... అల్లర్లపై చర్యలు తీసుకోలేదు.- టీడీపీ నేతలు సత్యహరిచంద్రులు అన్నట్లుగా ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తోంది.- మాచర్లలో జరిగిన ఎన్నికల హింస, అల్లర్లపై ఎన్నికల కమిషన్ ఎందుకు మౌనంగా ఉంది.?- మాచర్ల నియోజకవర్గంలో అధికారులను మార్చిన తరువాతనే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి.- మాచర్లలో టిడిపి అల్లర్లకు పాల్పడవచ్చని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందు నుంచి ఈసికి లేఖలు రాస్తూనే ఉన్నారు.- మాచర్లలో జరిగిన అన్నిసంఘటనలపై ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి.- మాచర్లలో పలుప్రాంతాలలో రిగ్గింగ్ జరుగుతుందని ఎస్సీ, ఎస్టీ, బిసిలపై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్ చేస్తే ఏమాత్రం స్పందించలేదు.- టీడీపీ రిగ్గింగ్ చేస్తున్న చోట SP సహకారం అందించాడు. టిడిపి రిగ్గింగ్ పై ఎస్పి స్పందించకపోతే పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారు.- పాల్వాయి గేట్ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తలను టిడిపి గుండాలు పగలకొట్టినా పోలీసులు స్పందించలేదు- ఆంధ్రప్రదేశ్ లో పోలింగ్ డే రోజున తొమ్మిది EVMలు ధ్వంసం అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఒక్క వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చింది.?- మాచర్లలోను, మిగతా నియోజకవర్గాల పరిధిలో EVMలు పగులగొట్టినచోట ఎందుకు చర్యలు తీసుకోలేదు, వీడియోలు బయటకు ఇవ్వలేదు.?- మొత్తం 9 సంఘటనలు EVMల ధ్వంసం జరిగితే కేవలం 1 మాత్రమే వీడియో ఎలా బయటకు వచ్చింది.? మిగిలిన 8 వీడియోలు బయటకు ఎందుకు రాలేదు.?- గొడవలకు టిడిపి కారణం కాదు అని చెప్పాలనే ఈసి ప్రయత్నంగా కనిపిస్తోంది.!- వీడియో ఎలా బయటకు వచ్చిందో ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలి.- అసలు వీడియో బయటకు ఎలా వచ్చింది? వారిపై చర్యలు తీసుకోరా.?- వీడియో ఎలా బయటకు వచ్చిందో విచారణ కేంద్ర ఎన్నికల సంఘం జరిపించాలని డిమాండ్ చేస్తున్నా- ఒక సామాజిక వర్గం అధికారులను అడ్డం పెట్టుకొని తెలుగుదేశం నేతలు రిగ్గింగ్ చేసారు.- టిడిపి ఎంపీ అభ్యర్ది లావు కృష్ణ దేవారాయులు సుధ్ద పూసలాగా మాట్లాడుతున్నారు- మాకు పోలీసులు సహకరించలేదు. బందోబస్తు పెట్టలేదు అని ఆయన మాట్లాడుతున్నారు- పల్నాడు ఎస్పి దాడులు జరుగుతున్న గ్రామాల్లోకి మాత్రం రాకుండా పక్క గ్రామాలలో తిరిగారు.- మాచర్లలో రెండు రోజుల ముందు ఓ పధకం ప్రకారం పోలీసులను మార్చారు. ఎంపీ సామాజిక వర్గానికి చెందిన పోలీసులను నియమించుకున్నారు.- ఏది ఏమైనా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మళ్ళీ ఘన విజయం సాధిస్తారు.- తుమృకోటలో రిగ్గింగ్ జరిగుతుందని నేనే స్వయంగా ఫోన్ చేసి ఎస్పికి తెలియచేశాను- తెలుగుదేశం వాళ్ళు దాడులు చేస్తున్నారని చెప్పినా SP కనీసం స్పందించలేదు. నన్ను రమ్మని చెప్పి అక్కడకు వెళ్లేసరికి ఎస్పీ అక్కడ లేరు.- న్యాయ పోరాటం చేస్తాం. ఓటు వేసేందుకు వెళ్లకుండా ఎమ్మెల్యేను పోలీసులు అడ్డుకున్నారు.- ఎంఎల్ఏ స్వగ్రామమైన కండ్లగుంట, పక్క గ్రామం కేపి గూడెంలో ఇద్దరు డిఎస్పీలను పెట్టారు- టిడిపి రిగ్గింగ్ కు పాల్పడుతున్న ఒప్పిచర్ల, తుమృకోట, పాల్వాయి గేట్, చింతపల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను పెట్టారు.- ఈ గ్రామాలలో పోలింగ్ బూత్ ల వీడియో ఫుటేజ్ బయటపెట్టండి. పోలీసుల సహకారంతో రిగ్గింగ్ జరిగిన విషయం బయటకువస్తుందని బయటపెట్టడం లేదు.- ఈ గ్రామాలలో రీ పొలింగ్ పెట్టాలని అడిగినా ఈసి స్పందించలేదు.- ముటుకూరు గ్రామంలో ఎస్సిబిసిలను భయభ్రాంతులకు గురిచేశారు. తుమృకోటలో ఇనుప రాడ్లతో టిడిపి వాళ్ళు ఈవిఎంను పగులగొట్టారు.- పోతురాజుగుంటలో బుడగ జంగాల ఇళ్ళపై దాడి చేసి లూటి చేసిన మాట నిజం కాదా.- కృష్ణదేవరాయలు ఫోన్ రికార్డ్ చూసుకోండి అని సత్యహరిచ్చంద్రుల్గా అంటున్నారు. వాట్సప్ కాల్ మాట్లాడితే రికార్డు ఉండదని అందరికి తెలుసు.- సత్తెనపల్లిలో నాలుగు రీపోలింగ్ అడిగితే స్పందించలేదు.- ప్రజలు వైయస్సార్ సిపి వెంట ఉన్నారు. తిరిగి ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ ప్రమాణస్వీకారం చేయబోతున్నారు.- ఎంఎల్ఏ వాళ్ళ తమ్ముడు నియోజకవర్గంలో తిరగకుండా చేయాలని పోలీసులు చూశారు.- సత్తెనపల్లి, కొత్తగణేషుని పాడులో ఘర్షణలు జరుగుతున్నా కూడా ఎస్పీ అక్కడకు వెళ్లలేదు. -
టీడీపీ నేతలకు అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ వార్నింగ్
-
ఓటేస్తే చంపేస్తారా..! మహిళలపై ఇంత దారుణమా..!
-
అనిల్ కుమార్, కాసు మహేష్ ల పైకి కర్రలతో టీడీపీ మూకలు
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు
-
టీడీపీ అరాచకం.. తలలు పగిలినా, ఎస్పీ ఫోన్ కూడా ఎత్తలేదు.. అనిల్ కుమార్ యాదవ్ సంచలన కామెంట్స్
-
టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడులో టీడీపీ అరాచకాలకు తెగబడిందని వైఎస్సార్సీపీ ఎంపీ అభ్యర్థి అనిల్కుమార్ యాదవ్ మండిపడ్డారు. కొందరు పోలీసులు టీడీపీ అభ్యర్థుల్లా వ్యవహరించారు.. టీడీపీ దాడులపై మేం ఫోన్లు చేసినా పోలీసులు స్పందించలేదన్నారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఓటమి అక్కసుతో టీడీపీ నేతలు దాడులకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు.మాచర్లలో టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని.. పిన్నెళ్లి, ఆయన కుమారుడిపై టీడీపీ నేతలు దాడి చేశారన్నారు. పోలింగ్ బూత్ లోపలికి వెళ్లి టీడీపీ నేతలు దాడులు చేశారు. వైఎస్సార్సీపీకి మద్దతు తెలిపిన గ్రామాలపై దాడులకు దిగారు. పల్నాడు ఎస్పీకి ఫోన్ చేసినా స్పందించలేదు పోలీసులు టీడీపీ కార్యకర్తల్లా పనిచేశారంటూ అనిల్ మండిపడ్డారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?: గోపిరెడ్డికొందరు అధికారులు టీడీపీకి కొమ్ము కాశారని గోపిరెడ్డి శ్రీనివాస్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘కొందరు పోలీసులు మాకు వ్యతిరేకంగా పనిచేశారు. నన్ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. టీడీపీ అభ్యర్థులకు ఈసీ రూల్స్ వర్తించవా?’’ అంటూ గోపిరెడ్డి ప్రశ్నించారు. -
ప్రజలంతా మనసాక్షితో ఓటు వేయాలి - అనిల్ కుమార్
-
వీళ్ళే మన అభ్యర్థులు .. గెలిపించాల్సిన బాధ్యత మీదే
-
చంద్రబాబుకు అనిల్ కుమార్ యాదవ్ సవాల్
-
గుంటూరులో ఎన్నికల ప్రచారం..దుమ్మురేపిన అనిల్ కుమార్ యాదవ్
-
నరసరావుపేటలో స్థానికేతరులకే పట్టం
సాక్షి, నరసరావుపేట: ఎన్నికల్లో అభ్యర్థి స్థానికత అంశం ఎంతో కీలకం. కొన్నిసార్లు దాని ఆధారంగా గెలుపోటములు ప్రభావితమవుతుంటాయి. నరసరావుపేట ఓటర్లు 1998 పార్లమెంట్ ఎన్నికల నుంచి ఇప్పటివరకు పల్నాడు వెలుపలి వారినే పట్టం కడుతున్నారు. ప్రధాన పారీ్టలు కూడా నాన్లోకల్ అభ్యర్థులనే బరిలోకి దింపుతున్నాయి. 1998 ఎన్నికలలో ప్రస్తుత బాపట్ల జిల్లాలోని వేమూరులో జన్మించిన మాజీ సీఎం కొణిజేటి రోశయ్యను నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు గెలిపించారు. ఆ తరువాత 1999 ఎన్నికల్లో మరో మాజీ సీఎం నేదురుమల్లి జనార్థన్రెడ్డి టీడీపీ అభ్యర్థి లాల్జాన్బాషాపై గెలుపొందారు. ఇదే లోకసభ నియోజకవర్గం నుంచి కాసు బ్రహ్మానందరెడ్డి ఎంపీగా గెలవడంతో ముగ్గురు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంలను ఢిల్లీకి పంపిన ఘనత నరసరావుపేటకి దక్కింది. నేదురుమల్లి తర్వాత 2004 సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు జిల్లాకు చెందిన మేకపాటి రాజమోహన్రెడ్డి ఎంపీగా గెలుపొందారు. వీరు ముగ్గురు కాంగ్రెస్–ఐ పార్టీ తరపున గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరుపున పోటీ చేసిన మోదుగుల వేణుగోపాల్రెడ్డి గెలుపొందారు. మోదుగుల స్వస్థలం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం పెదపరిమి. ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత జరిగిన 2014 ఎన్నికల్లో రాయపాటి సాంబశివరావు మాత్రం అమరావతి మండలం ఉంగుటూరు గ్రామానికి చెందినవారు.2019లో జరిగిన చివరి సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరు జిల్లా పెదనందిపాడుకు చెందిన లావు శ్రీకృష్ణదేవరాయులు వైఎస్సార్ సీపీ తరపున పోటీ చేసి గెలిచారు. ఇలా గత ఆరు ఎన్నికల్లో ఐదుమంది పల్నాడు ప్రాంతానికి చెందని వారు ఎంపీగా గెలుస్తున్నారు. నెల్లూరు సెంటిమెంట్ రాజకీయంగా నరసరావుపేటకి నెల్లూరుకి అవినాభావసంబంధం ఉన్నట్టు ఉందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. 1999 ఎన్నికల్లో నెల్లూరు జిల్లా నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నేదురుమల్లి జనార్ధన్రెడ్డిని పల్నాడు ప్రాంత వాసులు గెలిపించారు. తరువాత ఎన్నికల్లో అదే నెల్లూరు నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీ తరపున బరిలో నిలిచిన మేకపాటి రాజమోహన్రెడ్డిని నరసరావుపేట పార్లమెంట్ ఓటర్లు 86,255 ఓట్ల భారీ మెజారీ్టతో గెలిపించారు. ఇలా ఇప్పటివరకు నెల్లూరు నుంచి వచ్చి పోటీ చేసిన నేతలకు నరసరావుపేట ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. త్వరలో జరగనున్న 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ నెల్లూరు జిల్లా వాసి మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ వైఎస్సార్సీపీ తరపున పోటీలో ఉంటున్నారు. దీంతో మరోసారి నెల్లూరు సెంటిమెంట్ పనిచేసి అనిల్కుమార్ యాదవ్ గెలుపు పక్కా అని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అనిల్కుమార్ యాదవ్కు బ్రహ్మరథం బీసీల అడ్డా అయిన నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో ఇంతవరకు ఒక్క బీసీ అభ్యర్థి కూడా ఎంపీగా గెలుపొందలేదు. బీసీలను రాజకీయంగా ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీ వర్గానికి చెందిన పి.అనిల్కుమార్ యాదవ్ను పోటీలో ఉంచిన విషయం తెలిసిందే. ఇప్పటికే అన్ని వర్గాల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో ఆయన గెలుపు పక్కా అనే టాక్ వినిపిస్తోంది. -
లోకేష్ కామెంట్స్ కి అనిల్ కుమార్ యాదవ్ కౌంటర్
-
సీఎం జగన్ పై దాడి...అనిల్ కుమార్ యాదవ్ ఆగ్రహం..
-
పెన్షన్ ఆపడంపై అనిల్ కుమార్ రియాక్షన్
-
టీడీపీ, బీజేపీ పొత్తుకు అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్
-
అనిల్ వస్తే ఉరుములు మెరుపులు...అంబటి గూస్ బంప్స్ స్పీచ్
-
కోటంరెడ్డి వ్యాఖ్యలపై అనిల్ కుమార్ యాదవ్ రియాక్షన్
-
బాస్ దెబ్బకు వాళ్ల మైండ్ బ్లాక్
-
జగన్ గారు నరసరావుపేట వెళ్ళమన్నప్పుడు మనసులోని పరిస్థితి
-
దోపిడీ ఆరోపణలపై కోటంరెడ్డికి ఛాలెంజ్..!
-
వరికపూడిసెల ప్రాజెక్ట్ గురించి మాట్లాడే హక్కు నీకు లేదు బాబు
-
ఎంతమంది వచ్చినా జగనే మళ్లీ సీఎం: అనిల్ కుమార్ యాదవ్
సాక్షి, బాపట్ల: సీఎం జగన్కు ప్రజల అండదండలు ఉన్నాయని.. ఎన్ని పార్టీలు కూటమి కట్టినా వైఎస్సార్సీపీ విజయాన్ని ఆపలేవని మాజీ మంత్రి, నరసరావుపేట వైఎస్సార్సీపీ పార్లమెంటరీ ఇన్ఛార్జి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం సాయంత్రం మేదరమెట్ల సిద్ధం సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘వచ్చే ఎన్నికల్లో మన సత్తా చూపించాలి. జగన్ను ఎదుర్కొనే దమ్ములేక పొత్తులు పెట్టుకున్నారు. ఎంతమంది కలిసి వచ్చినా జగన్ మరోసారి సీఎం అవుతారని అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. -
అద్దంకి సిద్ధం సభలో డ్రోన్ కలకలం
సాక్షి, బాపట్ల: ఆదివారం అద్దంకి మేదరమెట్లలో అత్యంత ప్రతిష్టాత్మకంగా వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న సిద్ధం సభలో డ్రోన్ కలకలం రేగింది. మంత్రి అంబటి రాంబాబు ప్రసంగిస్తున్న సమయంలో.. సభా ప్రాంగణంలో ఒకవైపు డ్రోన్ ఎగురుతూ కనిపించింది. అప్రమత్తమైన నిర్వాహకులు వెంటనే డ్రోన్ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకొచ్చారు. మరోవైపు అనుమతి లేకుండా డ్రోన్ ఎగురుతోందని, ఎవరో దాన్ని నియంత్రిస్తున్నారని సభా వేదికపై నుంచే ప్రకటించారు. ఆ సమయంలో సభకు హాజరైన వారు ఒక దిక్కుకు చూడటం కనిపించింది. అయితే ఆ అవాంతరం ఒకట్రెండు నిమిషాలకు మించి జరగలేదు. డ్రోన్ విషయాన్ని ప్రకటించిన తరువాత అంబటి తన ప్రసంగాన్ని కొనసాగించారు. ఇక కాసేపటికే మైక్ అందుకుని ‘‘ఏయ్ పప్పూ... ఎక్కడో దూరంగా ఉండి.. డ్రోన్ను పంపించడం కాదు.. దమ్ముంటే ఇక్కడికి రా. కార్యకర్తల నినాదాలతోనే ఈ షర్ట్ తడిచిపోవడం ఖాయం’’ అంటూ వైఎస్సార్సీపీ నేత మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ నారా లోకేష్ను ఉద్దేశించి సవాలు విసిరారు. -
ఒక్క తన్ను తంతే మళ్ళి కనపడడు
-
Anil Kumar Yadav: చంద్రబాబు ఈ వీడియో చూస్తే..మైల్డ్ బ్లాక్
-
చంద్రబాబుకు మాస్ సవాళ్లు విసిరిన నందిగామ సురేష్, అనిల్ కుమార్ యాదవ్
-
15 లక్షల మందితో సిద్ధం సభ: అనిల్కుమార్ యాదవ్
-
మార్చి 3 పల్నాడు జిల్లా మేదరమెట్లలో సిద్ధం సభ
-
నరసరావుపేట ఇక బీసీలకు కోట
-
మీరంతా ఆశీర్వదిస్తే నరసరావుపేట ఎంపీగా గెలుస్తా: అనిల్
-
Narasaraopet Lok Sabha: చరిత్రలో తొలిసారిగా....
ఇప్పటి వరకు బీసీలను ఓటు బ్యాంకుగానే వాడుకున్నాయి రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపారీ్టలు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ బోన్ అని నిరూపించారు. బీసీలకు పలు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి అధికారం కట్టబెట్టారు. జనరల్ స్థానాలను సైతం బీసీలకు కేటాయించారు. తాజాగా జరగబోయే లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ బీసీలకు అత్యధిక స్థానాలను కేటాయించి వారిపట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. సాక్షి, నరసరావుపేట/సత్తెనపల్లి: నరసరావుపేట లోక్సభ చరిత్రలో ఇప్పటి వరకు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎంపీగా ఎన్నికవ్వలేదు. సుమారు నలభై దాకా బీసీ ఉప కులాలు ఉన్న పల్నాడు ప్రాంతంలో ఎప్పుడూ అగ్ర వర్ణాలకు చెందిన వారే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ ఒరవడిని మార్చి బీసీలకు ఈ ప్రాంతం నుంచి పార్లమెంట్లో స్థానం కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా నరసరావుపేట పార్లమెంట్కు మాజీ మంత్రి పి అనిల్కుమార్ యాదవ్ను సమన్వయకర్తగా నియమించడంతో బీసీ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నాయి. దీంతో రాబోయే ఎన్నికల్లో బీసీలంతా సమష్టిగా సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి గెలుపు కోసం పని చేస్తామని చెబుతున్నారు. చరిత్రలో తొలిసారిగా.... 1952 నుంచి 2019 వరకు 15సార్లు పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటికీ ఏ రాజకీయపార్టీ కూడా బీసీలకు ప్రాతినిధ్యం కల్పించలేదు. ఇక్కడ నుంచి సి.రామయ్యచౌదరి, మద్ది సుదర్శనం, కాసు బ్రహ్మానందరెడ్డి, కాటూరి నారాయణస్వామి, కోట సైదయ్య, కాసు వెంకటకృష్ణారెడ్డి, కొణిజేటి రోశయ్య, నేదురుమల్లి జనార్దనరెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డి, మోదుగుల వేణుగోపాల్రెడ్డి, రాయపాటి సాంబశివరావు లాంటి ఉద్దండులు ప్రాతినిధ్యం వహించారు. అలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న నరసరావుపేట పార్లమెంటు స్థానాన్ని తొలిసారిగా బీసీలకు కేటాయించిన ఘనత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందని బీసీ సంఘాల నాయకులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో నరసరావుపేట పార్లమెంట్ నుంచి అనిల్కుమార్ యాదవ్ను గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కానుకగా అందిస్తామని సంబరాలు నిర్వహించారు. ఇటీవల నరసరావుపేటలో కార్యాలయం ప్రారంభోత్సవానికి పెద్ద ఎత్తున జనం తరలివచ్చి మద్దతు పలికారు. వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ రాష్ట్రంలో ఎన్నడూ వడ్డెర సామాజిక వర్గానికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన దాఖలాలు లేవు, గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్ చంద్రగిరి ఏసురత్నంను శాసనమండలికి పంపారు. పల్నాడుకు చెందిన మరో బీసీ నేత జంగా కృష్ణమూర్తికి ఎమ్మెల్సీ ఇవ్వడంతోపాటు ప్రభుత్వ విప్గా సముచిత స్థానం కలి్పంచారు. గుంటూరు మార్కెట్ యార్డుకు చైర్మన్గా యాదవ సామాజిక వర్గానికి చెందిన నిమ్మకాయల రాజానారాయణకు అవకాశం కలి్పంచారు. స్థానిక సంస్థలు, పలు కార్పొరేషన్ల డైరెక్టర్ పదవులను బీసీలకు కేటాయించారు. గెలుపునకు సమష్టిగా కృషి చేస్తాం నరసరావుపేట ఎంపీ సీటు బీసీలకు కేటాయించడం చాలా సంతోషం. నరసరావుపేట ఎంపీ అభ్యరి్థతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థుల గెలుపునకు సమష్టిగా కృషి చేస్తాం. – రాజవరపు శివనాగేశ్వరరావు, న్యాయవాది, శాలివాహన సంఘనేత, సత్తెనపల్లి రాజ్యాధికారం దిశగా బీసీలు బీసీలకు రాజ్యాధికారం అందించే దిశగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు. రాష్ట్రంలోని బీసీలంతా íసీఎంకు రుణపడి ఉంటారు. అన్నింటా బీసీలకు పెద్దపీట వేస్తున్నారు. – ఎద్దులదొడ్డి కోటేశ్వరమ్మ, వాల్మీకి, బోయ కార్పొరేషన్ డైరెక్టర్, సత్తెనపల్లి -
పల్నాడుకి సరైన వాడిని జగనన్న పంపాడు !
-
ఆ ముగ్గురి ఎన్నిక లాంఛనమే!
సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ ద్వైవార్షిక ఎన్నికలో భాగంగా రాష్ట్రం నుంచి మూడు స్థానాలకు గాను మూడు నామినేషన్లు దాఖలయ్యాయి. గురువారం నామినేషన్ల గడువు పూర్తయ్యే సమయానికి కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు, బీఆర్ఎస్ నుంచి ఒక నామినేషన్ దాఖలు కావడంతో వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి సీనియర్నేత రేణుకా చౌదరి, యువనేత అనిల్కుమార్ యాదవ్ చెరి మూడేసి సెట్ల చొప్పున, బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచంద్ర రెండుసెట్ల నామినేషన్పత్రాలను సమర్పించారు. కాంగ్రెస్ అభ్యర్థులు మూడే సి సెట్ల నామినేషన్లలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు (ఒక్కో దాంట్లో పదేసి మంది చొప్పున మొత్తం 60 మంది సభ్యులు)సంతకాలు చేసినట్లు పార్టీ వర్గాల సమాచారం. గురువారం రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డికి రేణుకా చౌదరి తమ నామినేషన్ పత్రాలను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో సమర్పించారు. అనిల్కుమార్ యాదవ్ తమ పత్రాలను సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు డి. శ్రీధర్బాబు, కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సమక్షంలో అందజేశారు. వద్దిరాజు రవిచంద్ర తమ పత్రాలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్రావు గంగుల కమలాకర్, నాగేందర్, జగదీశ్రెడ్డి సమక్షంలో రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. రేణుక, అనిల్కు బీఫామ్స్ అందజేసిన సీఎం అంతకుముందు సీఎం చాంబర్లో అభ్యర్థులు రేణుకాచౌదరి, అనిల్కుమార్కు రేవంత్రెడ్డి బీఫామ్స్ అందజేసినపుడు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యేలు ఆదిశ్రీనివాస్, మల్రెడ్డి రంగారెడ్డి, ఈర్లపల్లి శంకర్, తదితరులున్నారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థులను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అభినందించారు. గురువారం ఉదయం తెలంగాణ భవన్లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న వద్దిరాజు తెలంగాణ తల్లి విగ్రహానికి దండలు వేసి అసెంబ్లీకి చేరుకున్నారు. తొలుత అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్పార్కులోని తెలంగాణ అమరుల స్తూపానికి నివాళులర్పించారు. ఎన్నిక ఏకగ్రీవమే! వచ్చే ఏప్రిల్ 2న బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, జోగినపల్లి సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్ పదవీ కాలం ముగియనుండడంతో రాష్ట్రం నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఖాళీలు ఏర్పడ్డాయి. ఈ మూడు సీట్లకు గాను నామినేషన్ల గడువు ముగిసే సమయానికి మూడు నామినేషన్లే దాఖలు కావడంతో... కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బలాబలాల ఆధారంగా ఈ నెల 27న ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం లేకుండానే వీరి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 16న పత్రాల నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈనెల 20న నామినేషన్ల ఉపసంహరణకు అఖరి రోజు. ఈ గడువు ముగియగానే ఈ ముగ్గురు ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. -
రాజ్యసభ అభ్యర్థులుగా నామినేషన్ వేసిన రేణుకా చౌదరి, అనిల్ కుమార్
రాజ్యసభ సభ్యులుగా నామినేషన్లు వేసిన కాంగ్రెస్ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ మూడు సెట్ల నామినేషన్లు వేసిన అభ్యర్థులు అసెంబ్లీ రిటర్నింగ్ ఆఫీసర్ నామినేషన్ పత్రాలు సమర్పించిన నేతలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇంచార్జ్ దీపా దాస్ మున్షి, దిగ్విజయ్ సింగ్, మంత్రులు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్కు పీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీ-ఫామ్ అందజేశారు. సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేయనున్నారు. అసెంబ్లీ సెక్రటరీ వద్ద రాజ్యసభ అభ్యర్థులు రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ నానామినేషన్ దాఖలు చేయనున్నారు. నామినేషన్ వేసే కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పాల్గొంటారని తెలుస్తోంది. తెలంగాణ నుంచి ఇద్దరు రాజ్యసభ అభ్యర్థులను బుధవారం అఖిల భారత కాంగ్రెస్ కమిటీ(ఏఐసీసీ) ప్రకటించిన విషయం తెలిసిందే. రేణుక చౌదరి, అనిల్కుమార్ యాదవ్కు ఏఐసీసీ అవకాశం ఇచ్చింది. మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ తనయుడే అనిల్ కుమార్ యాదవ్. దీంతో పెద్దల సభలోకి యువకుడు అనిల్ కుమార్ యాదవ్ అడుగుబెట్టనున్నారు. రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో అనిల్ కుమార్ యాదవ్ పేరు అనూహ్యంగా తెరపైకి వచ్చింది. యూత్ కాంగ్రెస్ కోటాలో అనిల్కు అవకాశం కల్పించింది కాంగ్రెస్ అధిష్టానం. -
నరసరావు పేట గడ్డపై అనిల్ కుమార్ యాదవ్ గూస్ బంప్స్ స్పీచ్
-
టీడీపీ వాళ్లు నన్ను అవహేళన చేశారు.. వారికి ఒకటే చెబుతున్నా!
సాక్షి, నరసరావుపేట: బీసీ బిడ్డను గెలిపించి పార్లమెంట్కు పంపే బాధ్యత పల్నాడు జిల్లా ప్రజలదేనని నరసరావుపేట లోక్సభ సమన్వయకర్త అనిల్కుమార్ యాదవ్ వ్యాఖ్యానించారు. తొలిసారి జిల్లాలో అడుగిడిన సందర్భంగా బుధవారం నరసరావుపేటలోని పల్నాడు బస్టాండ్ సెంటర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... జగనన్న ఆదేశాల మేరకు నెల్లూరు నుంచి వచ్చే సమయంలో చాలా బాధపడ్డా.. మనసుకు భారంగా అనిపించిందన్నారు. కానీ పల్నాడు జిల్లా ప్రజల ప్రేమ, ఆప్యాయతలతో పలికిన స్వాగతం చూసి చాలా ఆనందంగా ఉందన్నారు. మీ అందరి సహకారంతో ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిచి మీకు సేవ చేసి రుణం తీర్చుకుంటానన్నారు. ఓ గొర్రెల కాపరికి మంత్రి పదవి ఇచ్చారని టీడీపీ వారు నన్ను అవహేళన చేశారు. వారికి ఒకటే చెబుతున్నా.. శ్రీకృష్ణుడు గొర్రెలకాపరి, ఏసుప్రభు పుట్టింది గొర్రెల చావడిలో అని గుర్తుంచుకోండి. నారా భువనేశ్వరి తన ఆస్తిలో 2 శాతం అమ్మితే రూ.400 కోట్లు వస్తుందన్నారు. అంటే వారి ఆస్తి సుమారు రూ.20 వేల కోట్లు. ఇదంతా ఆవులు, గేదేలు కాసే బీసీ బిడ్డలు పాలు పితికి మీకు పోస్తేనే సంపాదించారని గుర్తుచేశారు. కోటప్పకొండ శివయ్య సాక్షిగా చెబుతున్నా జగనన్న నన్ను రాజకీయంగా ఎంతో ప్రోత్సహించారు.. ప్రతీ అడుగులో అండగా నిలిచారన్నారు. తక్కువ సమయంలో ఉండటంతో వీలైన ఎక్కువ మందిని కలిసే ప్రయత్నం చేస్తానని, ఎవరైనా కలవలేకపోతే 5 ఏళ్లు ఎంపీగా ఉన్న సమయంలో కలుస్తానన్నారు. భారీ జోష్.. అనిల్ కుమార్ యాదవ్ పల్నాడులో అడుగుపెట్టిన సమయం నుంచి బహిరంగసభ ముగిసే వరకు కార్యకర్తల్లో భారీ జోష్ కనిపించింది. అనిల్కు ప్రజలు అపూర్వస్వాగతం పలికారు. అనిల్ ప్రసంగించే సమయంలో యువత కేకలతో సభ దద్దరిల్లింది. కార్యక్రమంలో పార్టీ ముఖ్యనేతలు పిన్నెల్లి వెంకట రామిరెడ్డి, నాగార్జున యాదవ్, ఖలీల్ అహ్మద్, నిమ్మకాయల రాజనారాయణ, యనుముల మురళీధర్రెడ్డి, గజ్జల నాగభూషణం రెడ్డి పాల్గొన్నారు. జగనన్న బాణం అనిల్.. జగనన్న వదిలిన బాణం అనిల్కుమార్ యాదవ్. అనిల్ పేరు ప్రకటనతో జిల్లా రాజకీయాల్లో పెనుమార్పులు వచ్చాయి. నెల్లూరు వారికి నరసరావుపేట ప్రాంతానికి అవినాభావ సంబంధం ఉంది. ఇక్కడ నేదురుమల్లి జనార్ధనరెడ్డి, మేకపాటి రాజమోహన్రెడ్డిలను ఎంపీగా గెలిపించిన చరిత్ర ఉంది. అనిల్ ఎంపీగా గెలవడంతోపాటు మేం ఏడు మంది ఎమ్మెల్యేలుగా గెలుస్తాం. – నంబూరు శంకరరావు, ఎమ్మెల్యే ఇవి చదవండి: ‘పోలవరం’ ఆలస్యానికి చంద్రబాబే కారణం! -
పార్టీ మార్పులపై రిపోర్టర్ కి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ రిప్లై
-
టీడీపీ ఎందరు బీసీ నేతలకు టికెట్లు ఇచ్చిందో చూడాలి: అనిల్
-
అనిల్ కుమార్ యాదవ్ ఎంపీ సీట్ పై మంత్రి అంబటి ప్రశంసలు
-
నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్
-
సీఎం జగన్ ఎక్కడ పోటీచేయమంటే అక్కడ చేస్తా
-
సానుభూతి కోసం కుమార్తెతో నారాయణ ప్రచారం చేయిస్తున్నారు: అనిల్
-
అనిల్ కుమార్ యాదవ్ పవర్ ఫుల్ స్పీచ్
-
షర్మిల కామెంట్స్ కు..అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ రిప్లై
-
నా జీవితాంతం జగన్ కోసమే పని చేస్తాను: అనిల్ కుమార్ యాదవ్
-
ఎల్లో మీడియాకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన అనిల్ కుమార్ యాదవ్
-
నారాయణపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ సంచలన ఆరోపణలు
-
సలార్ డైలాగ్ తో లోకేష్ ను ఉతికి ఆరేసిన అనిల్ కుమార్ యాదవ్
-
మాజీ మంత్రి నారాయణపై అనిల్ ఫైర్
-
నీకు దమ్ముంటే చర్చకు రా.. అనిల్ కుమార్ సవాల్
-
నీకు దమ్ముంటే చర్చకు రా..అనిల్ కుమార్ సవాల్
-
చంద్రబాబు కట్టు కథలు ప్రజలు నమ్మరు: మాజీ మంత్రి అనిల్
-
సీఎం జగన్ గురించి అనిల్ కుమార్ యాదవ్ గూస్ బంప్స్ స్పీచ్
-
ఇంచార్జ్ మార్పులుపై జ అనిల్ కుమార్ యాదవ్ కామెంట్స్
-
టీడీపీ నేతలపై అనిల్ కుమార్ ఫైర్
-
అధికారులు, జిల్లా కలెక్టర్ కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే అనిల్ కుమార్
-
పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్
-
టీడీపీని ఏకిపారేసిన అనిల్ కుమార్ యాదవ్
-
పవన్ కళ్యాణ్ కి అనిల్ కుమార్ యాదవ్ స్ట్రాంగ్ కౌంటర్
-
అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించాం
-
అనిల్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన తుని
-
అమ్మ భువనేశ్వరి నీ భర్త రాముడు కాదు
-
నారాయణపై అనిల్ కుమార్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు
-
లోకేష్ పాదయాత్రపై అనిల్ కుమార్ యాదవ్ పంచులు..!
-
అనిల్ కుమార్ యాదవ్ స్పీచ్ కి దద్దరిల్లిన పొన్నూరు
-
చంద్రబాబు, నారాయణపై అనిల్ కుమార్ యాదవ్ పంచులే పంచులు
-
మంత్రి పెద్దిరెడ్డి గురించి అనిల్ కుమార్ యాదవ్ ఏమన్నారంటే
-
నీ మరదలి ప్రశ్నలకు సమాధానం చెప్పు ముందు..!
-
ఆళ్లగడ్డలో స్పీచ్ అదరగొట్టిన అనిల్ కుమార్ యాదవ్
-
అనిల్ కుమార్ యాదవ్ పవర్ ఫుల్ స్పీచ్
-
అనిల్ కుమార్ స్పీచ్ కి దద్దరిల్లిన మాచర్ల
-
టీడీపీ నారాయణను చెడుగుడు ఆడిన అనిల్ కుమార్ యాదవ్
-
సామాజిక న్యాయం సీఎం జగన్తోనే సాధ్యం: అనిల్ కుమార్ యాదవ్
-
జగనన్న పుట్టిన రోజు నాడే..పేదలకి 7 లక్షల వరకు..
-
బండారు పై అనిల్ కుమార్ యాదవ్ ఉగ్రరూపం
-
టీడీపీలో ఒక వెధవకి చెప్తున్నా..అనిల్ కుమార్ యాదవ్ సీరియస్ కామెంట్స్
-
చంద్రబాబుని నమ్ముకుని మీరు పిచ్చోళ్ళు అవ్వొద్దు..
-
బ్రాహ్మణి, కోటంరెడ్డిపై అనిల్ కుమార్ పంచులు
-
చంద్రబాబు, నారాయణ కలిసి వేలకోట్లు దోచుకున్నారు
-
పేదల భూములు కొట్టేసిన నారాయణ సత్య హరిశ్చంద్రుడా?: అనిల్
సాక్షి, నెల్లూరు జిల్లా: ప్రజల ఆరోగ్య రక్షణే ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నామని, జగనన్న సురక్ష కార్యక్రమాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తామని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు, నారాయణ కలిసి వేలకోట్లు దోచుకున్నారని మండిపడ్డారు. ‘‘పేదల భూములు కొట్టేసిన నారాయణ సత్య హరిశ్చంద్రుడా?. త్వరలో అరెస్టవుతానని నారాయణకి భయం పట్టుకుంది. రూ.800 కోట్ల పేదల అసైన్డ్ భూములు నారాయణ దోచేశారు. త్వరలో నారాయణ అక్రమాలన్నీ బయటపడతాయి. విచారణకు సహకరించకూడదని బాబు, నారాయణ మాట్లాడుకున్నారు. వారి చరిత్ర ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు’’ అని అనిల్ పేర్కొన్నారు. ‘‘టీడీపీ నేతలు గంటలు కొట్టడం దేవుడి స్క్రిప్ట్.. ముద్రగడను, ఆయన కుటుంబ సభ్యులను చిత్ర హింసలు పెట్టీ.. ఇబ్బందులు పెట్టిన విషయం టీడీపీ నేతలకు గుర్తు లేదా..?. లోకేష్ ఒక పులకేశి.. ఢిల్లీలో లాయర్స్తో మాట్లాడుతున్నాడని టీడీపీ నేతలు బిల్డప్ ఇస్తున్నారు. సీఐడీ అధికారులకు దొరక్కుండా లోకేష్ దొంగలగా తప్పించుకుని తిరుగుతూ ఉంటే.. నిన్న అధికారులు పట్టుకుని నోటీసులు ఇచ్చారు’’ అంటూ అనిల్ ఎద్దేవా చేశారు. చదవండి: అసలు చంద్రబాబు అరెస్ట్కి, తిరుమలకు ఏం సంబంధం? -
నిను వీడని నీడను నేనే
-
పవన్, లోకేష్ కు అనిల్ కుమార్ ఛాలెంజ్..
-
చంద్రబాబు అరెస్ట్పై మా ఆనం, కోటంరెడ్డి ఓవరాక్షన్ చూస్తే..
-
‘అందుకే బాబుకు కోర్టులు బెయిల్ ఇవ్వడం లేదు’
సాక్షి, నెల్లూరు జిల్లా: చంద్రబాబు అరెస్ట్పై మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ తనదైన శైలిలో స్పందించారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు పక్కా ఆధారాలు ఉన్నాయన్నారు. ఆధారాలతోనే సీఐడీ అరెస్ట్ చేసింది.. కోర్టులు కూడా బెయిల్ ఇవ్వకపోవడానికి అదే కారణం. చంద్రబాబు చేసిన స్కాం లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి’’ అని అనిల్ పేర్కొన్నారు. ‘‘చంద్రబాబుకు 23 లక్కీ నంబర్.. మా పార్టీకి చెందిన 23 మందిని లాక్కున్నాడు.. 2019లో ఆయనకి వచ్చిన సీట్లు 23.. జైలుకు వెళ్లిన డేట్ కూడా 23 యే.. చంద్రబాబు అరెస్ట్ పై సొంత పార్టీ నేతలే సైలెంట్గా ఉంటే.. మా పార్టీ నుంచి జంప్ అయిన ఎమ్మెల్యేల హడావుడి ఎక్కువైంది’’ అని అనిల్ ఎద్దేవా చేశారు. ‘‘మునిగిపోయే పడవలో కూర్చుని ఎక్కువ రోజులు వారు రాజకీయం చెయ్యలేరు. తప్పు చేస్తే మా ప్రభుత్వంలో ఎంతటి వారికైనా జైలు జీవితం తప్పదు. ఏ వయస్సులో తప్పు చేసినా.. నేరం నేరమే.. భవిష్యత్తులో చంద్రబాబు మరిన్ని కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అనిల్ స్పష్టం చేశారు. చదవండి: CBN: ఆర్థిక అరాచకం.. స్వయంకృతాపరాధం -
నీకెందుకు అంత దూల
-
లోకేష్ నువ్వు కూడా రెడీగా ఉండు మీ బాబుతో పాటు..
-
‘బాబూ.. గంటకి రూ.కోటి తీసుకునే లాయర్ ఎలా వచ్చాడు?’
సాక్షి, నెల్లూరు జిల్లా: వాచ్ కూడా లేదని చెప్పే చంద్రబాబు.. గంటకి రూ.కోటి రూపాయలు తీసుకునే లాయర్ ఎలా వచ్చాడంటూ మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రశ్నించారు. ఆదివారం ఆయన నెల్లూరులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, మరిదిని కాపాడుకునేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ప్రయత్నాలు చేస్తున్నారు. బంధు ప్రీతి పక్కన పెట్టి ఆమె మాట్లాడాలి.. పక్కా సాక్ష్యాలు ఉన్నా కూడా అక్రమ కేసు అని ఎలా చెబుతారు అంటూ అనిల్ దుయ్యబట్టారు. ‘‘తన పార్టీ నేతను అరెస్ట్ చేసినట్లు పవన్ కళ్యాణ్ ఓవర్ యాక్షన్ చేశారు. నానా హంగామా చేశాడు.. సుపుత్రుడు సైలెంట్ అయితే.. దత్త పుత్రుడు మాత్రం చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు అరెస్తో టీడీపీ కూసాలు కదులుతున్నాయి.. చంద్రబాబుకు మద్దతుగా జనాలు రోడ్ల మీదకు రావడం లేదని అచ్చం నాయుడు మాట్లాడిన ఆడియో లీక్ అయింది. అవినీతి అనకొండగా ఉన్న చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో ముద్దాయి అయ్యాడు.’’ అని అనిల్ ధ్వజమెత్తారు. ‘‘చంద్రబాబు అరెస్ట్లో సీఎం జగన్ నిజాయితీగా వ్యవహరించారు. ఎవరు తప్పు చేసినా వదలం అనే మెసేజ్ను ప్రజలకు పంపాం. బాబు మరో ఆరు జన్మలు ఎత్తినా సీఎం అయ్యే అవకాశం లేదు. చంద్రబాబు అరెస్ట్తో టీడీపీ మూతపడటం ఖాయం’’ అని అనిల్ పేర్కొన్నారు. చదవండి: స్కిల్ స్కామ్: సీఐడీ రిమాండ్ రిపోర్ట్లో సంచలన విషయాలు -
ఎన్నో స్కాముల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు పాపం పండింది
-
ఎల్లో బ్యాచ్ సైలెంట్ పై అనిల్ కుమార్ యాదవ్ పంచ్ లు
-
దత్తపుత్రుడు అందుకే సైలెంట్ అయ్యాడా..?
-
చంద్రబాబుపై, ఎల్లో మీడియాపై అనిల్ కుమార్ యాదవ్ సెన్సేషనల్ కామెంట్స్
-
చంద్రబాబు అవినీతిలో పవన్కు కూడా వాటా ఉందా?
-
ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదు?
-
అందుకే దత్తపుత్రుడు సైలెంట్ అయ్యాడా..?: మాజీ మంత్రి అనిల్
సాక్షి, తాడేపల్లి: అమరావతి పేరుతో చంద్రబాబు అవినీతికి పాల్పడారని, రూ.118 కోట్ల ముడుపులు ఎందుకు లెక్కల్లో చూపలేదని మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ‘‘తన పీఏ ద్వారా చంద్రబాబు ముడుపులు తీసుకున్నారు. ఐటీ శాఖ ఇచ్చిన నోటీసులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదు?. నేను సత్యహరిశ్చంద్రుడునని చెప్పే బాబు ఇప్పుడు ఏం చెబుతారు?’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘ఐటీ నోటీసులపై చంద్రబాబు ఎందుకు మౌనంగా ఉన్నారు?. ఎల్లో మీడియా నోటీసులపై ఎందుకు మాట్లాడదు?. చంద్రబాబు అవినీతిపై పవన్ ఎందుకు స్పందించడం లేదు? రూ.118 కోట్ల అవినీతి కనిపించడం లేదా?. చంద్రబాబు అవినీతిపై పవన్ కనీసం ట్వీట్ కూడా పెట్టలేదు. చంద్రబాబు అవినీతిలో పవన్ కూడా వాటా ఉందా?. చంద్రబాబు అవినీతిపై వామపక్షాలు ఎందుకు మాట్లాడటం లేదు’’ అని అనిల్ మండిపడ్డారు. ‘‘చంద్రబాబుకు శక్తి, వయసు అయిపోయింది.. చేసిన పాపానికి పరిహారం చెల్లించాల్సిన సమయం మాత్రమే మిగిలి ఉంది. ఐటీ శాఖ ఇప్పటికే నాలుగు నోటీసులు ఇచ్చింది. షాపూర్జీ పల్లోంజీ ప్రతినిధి మనోజ్ వాసుదేవ్ ఇచ్చిన లంచాల వ్యవహారాన్ని బట్టబయలు చేశారు. చంద్రబాబు పీఏ శ్రీనివాస్ ఇంట్లో కూడా ఐటీ శాఖ రైడ్ చేసినప్పుడు రెండు వేల కోట్ల రూపాయల అక్రమ సొత్తు దొరికాయి. అమరావతి పేరుతో కొల్లకొట్టిన నిధుల్లో ఇది కొంత మాత్రమే. ఐటీ నోటీసులకు చంద్రబాబు సమాధానం చెప్పకుండా కప్పను తిన్న పాములాగా కూర్చున్నారు’’ అంటూ అనిల్ ఎద్దేవా చేశారు. చదవండి: నరం లేని నాలుక.. సీపీఐ మరీ దయనీయంగా.. రామోజీ, రాధాకృష్ణ, బీఆర్ నాయుడులకు కూడా ఈ అవినీతి సొమ్ములో వాటాలు ఉన్నాయి. అందుకే వారు కూడా నోరెత్తటం లేదు. దత్తపుత్రుడికి కూడా ఈ లావాదేవీలలో ముడుపులు అందాయి. అందుకే ప్రశ్నిస్తానని చెప్పే దత్తపుత్రుడు సైలెంట్ అయ్యారు. పురంధేశ్వరి కూడా తన మరిదిని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. చంద్రబాబు, లోకేష్లకు దుబాయ్లో కూడా ముడుపులు అందాయి. అమరావతి అనే బొమ్మ వెనుక జరిగిన భారీ అక్రమాలలో ఇది ఒక మచ్చుతునక మాత్రమే. బీజేపీ పెద్దలను చంద్రబాబు కలవటం వెనుక కారణం కూడా ఈ ఐటీ కేసుల గురించే.. ఇంకా విచారణ జరిపితే భారీ అక్రమాలు బయటకు వస్తాయని చంద్రబాబు భయపడుతున్నారు. ఆయనను వెంటనే అరెస్టు చేయాలి ’’ అంటూ మాజీ మంత్రి అనిల్ డిమాండ్ చేశారు. -
చంద్రబాబుపై ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఫైర్
-
మంత్రి పదవిపై తండ్రి ఆశలు, అక్కడే ఉంది ట్విస్టు! కొడుకేమంటాడో?
రాజకీయ కుటుంబాల్లో సీటు పంచాయితీ కామనే. చాలా నియోజకవర్గాల్లో అన్న దమ్ముల మధ్య, కజిన్స్ మధ్య సీటు కోసం కుస్తీ పోటీలు జరుగుతుంటాయి. కాని ఓ నియోజకవర్గం కోసం తండ్రీ కొడుకులే కుస్తీ పట్లు పడుతున్నారు. ఇప్పుడిదే తెలంగాణ కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. సీటు త్యాగం చేయడానికి ఇద్దరిలో ఏ ఒక్కరూ సిద్ధంగా లేరని టాక్. వారి సంగతేంటో తెలుసుకుందా.. తెలంగాణ కాంగ్రెస్లో ఓ తండ్రీ కొడుకుల పొలిటికల్ కుస్తీ ఆసక్తికరంగా మారింది. ఇద్దరూ పీసీసీలో ముఖ్యులే. కాంగ్రెస్ పెద్దలకు సన్నిహితులే. కాని సీటు కోసం అటు తండ్రి, ఇటు కొడుకు పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ, టీ.కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్కుమార్ యాదవ్, ఆయన కొడుకు అనిల్కుమార్ యాదవ్ ముషీరాబాద్ సీటు కోసం పోటీ పడుతున్నారట. రెండోసారి తప్పుకుంటే ఎలా.. అంజన్కుమార్ గతంలో సికింద్రాబాద్ నుంచి ఎంపీగా గెలవగా, ఆయన తనయుడు అనిల్కుమార్ ముషీరాబాద్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల్లో కూడా ముషీరాబాద్ నుంచి పోటీ చేయాలని అనిల్కుమార్ కోరుకుంటున్నారు. అయితే ఆయన తండ్రి కూడా తమకు పట్టున్న ముషీరాబాద్ నుంచే పోటీ చేసి గెలిచి, కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మంత్రి పదవి పొందాలని తాపత్రయపడుతున్నారు. ఇక్కడే ఇద్దరి మధ్యా వార్ మొదలైంది. తనకు రానున్న అవకాశాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి తన కొడుకు అనిల్కుమార్ను డ్రాప్ చేసుకోవాలని అంజన్కుమార్ కోరుతున్నారు. అయితే అనిల్ మాత్రం ఒకసారి పోటీ చేసి రెండోసారి తప్పుకుంటే తన రాజకీయ భవిష్యత్కు ఇబ్బందిగా ఫీలవుతున్నారు. ఈ సారి పోటీ చేయకుంటే మళ్ళీ ఆ తర్వాత టిక్కెట్ రావడం కష్టమని అనిల్ భావిస్తున్నారట. అందుకే తన తండ్రిని ఎలాగైనా ఒప్పించి ఎలాగైనా ముషీరాబాద్ బరిలో నిలవాలని అనిల్ పట్టదలతో ఉన్నారు. అయితే తండ్రి, కొడుకులు ఇద్దరూ తమ రాజకీయ భవిష్యత్ గురించే ఆలోచిస్తున్నారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేస్తారా అనే అనుమానం కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తండ్రీ కొడుకుల్లో ఎవరో ఒకరు త్యాగం చేసి తప్పుకోకపోతే.. ఇద్దరూ నష్టపోతారని హితవు చెబుతున్నారు అంజన్కుమార్ సన్నిహితులు. హైకమాండ్ కరుణిస్తే ఓకే లేదంటే.. కుటుంబానికి ఒకే టిక్కెట్ నిబంధన కాంగ్రెస్ హైకమాండ్ కచ్చితంగా అమలు చేస్తే ముషీరాబాద్ నుంచి అంజన్కుమార్ పోటీ చేసే అవకాశాలే కనిపిస్తున్నాయని, ఇద్దరికీ టిక్కెట్లు ఇస్తే చెరో నియోజకవర్గం నుంచి పోటీ చేయవచ్చని భావిస్తున్నారు. ఒకే సీటు కోసం తండ్రీ కొడుకులు పోటీ పడుతుండటం విచిత్రంగా ఉందని గాంధీభవన్ వర్గాలు కామెంట్ చేస్తున్నాయి. ఒక్కరికే సీటిస్తే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న అంజన్కుమార్యాదవ్కే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. మరి తండ్రి కోసం కొడుకు సీటు త్యాగం చేస్తాడా? అయితే టీపీసీసీ ఉపాధ్యక్షుడు సంగిశెట్టి జగదీష్ కూడా ముషీరాబాద్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్నారు. తండ్రీ కొడుకుల్లో ఎవరికైనా దక్కుతుందా? లేక పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్లుగా మూడో వ్యక్తికి ఇస్తారా అనేది చూడాలి. - పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్
-
లోకేష్ నాపై చేసిన ఆరోపణలు అవాస్తవమని దేవుడిపై ప్రమాణం చేస్తున్నా
-
లోకేష్ ఆరోపణలు.. వేంకటేశ్వరుని సన్నిధిలో మాజీ మంత్రి అనిల్ ప్రమాణం
సాక్షి, నెల్లూరు జిల్లా: వెంకటేశ్వరపురం శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ మంత్రి అనిల్కుమార్ యాదవ్ శుక్రవారం పూజలు నిర్వహించారు. తనకు ఎలాంటి అక్రమాస్తులు లేవని ఆలయంలో అనిల్ ప్రమాణం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ లోకేష్ తనపై చేసిన ఆస్తుల ఆరోపణలపై దేవుడి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు. ‘‘నేను చేసినంత ధైర్యంగా లోకేష్ దేవుడి ఎదుట ప్రమాణం చేయగలరా?. లోకేష్ చెప్పిన ఆస్తులు నావే అని సోమిరెడ్డి చేస్తారా?. నేను ఎదుటి వారికి సహాయం చేశాను కానీ, అక్రమాస్తులు కూడబెట్టలేదు. అప్పు చేసి వ్యాపారం చేయడం తప్పు ఎందుకు అవుతుంది?. నేను తప్పు చేసి ఉంటే దేవుడే చూసుకుంటాడు. ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి పై లోకేష్ చేసిన వ్యాఖ్యలు సరికాదు’’ అని అనిల్ పేర్కొన్నారు. చదవండి: ‘రామోజీ కులంవారు తప్ప వేరే వాళ్లు అధికారంలోకి రాకూడదా?’ -
లోకేష్ చేసిన ఆరోపణలపై ప్రమాణం చేసేందుకు నేను సిద్ధం