అల్లర్లపై ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి | Anil Kumar Yadav Strong Counter To Election Commission, More Details Inside | Sakshi
Sakshi News home page

Anil Kumar Yadav: అల్లర్లపై ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలి

May 24 2024 6:20 AM | Updated on May 24 2024 10:52 AM

Anil Kumar Yadav Counter To Election Commission

నరసరావుపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌

టీడీపీ నేతలు సత్యహరిశ్చంద్రులు అన్నట్లుగా కమిషన్‌ వ్యవహరిస్తోంది 

మాచర్లలో అధికారులను మార్చిన తర్వాతే హింసాత్మక ఘటనలు

టీడీపీ అల్లర్లకు పాల్పడే అవకాశం ఉన్నదని పిన్నెల్లి ముందే ఈసీకి లేఖ 

రిగ్గింగ్‌ నిరోధించడంలో జిల్లా ఎస్పీ విఫలం

సాక్షి,అమరావతి/నరసరావుపేట: మాచర్లలో జరిగిన అల్లర్లపై ఎన్నికల కమిషన్‌ సమాధానం చెప్పాలని నరసరావుపేట వైఎస్సార్‌సీపీ పార్లమెంట్‌ అభ్యర్ధి అనిల్‌కుమార్‌ యాదవ్‌ డిమాండ్‌ చేశారు. ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ఎన్ని­కల కమిషన్‌ అల్లర్లపై ఎలాంటి చర్యలు తీసు­కోలే­దని ఆయన ఆరోపించారు. టీడీపీ నేతలు సత్యహరి­శ్చంద్రులు అన్నట్లుగా వ్యవహరిస్తోందని ఆయన దుయ్యబట్టారు. గురువారం ఆయన తన ప్రసంగంతో కూడిన వీడియోను విడుదల చేశారు. ఎన్నికల హింస, అల్లర్లపై ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ప్రశ్నించారు. మాచర్ల నియోజకవర్గంలో అధికారు­లను మార్చిన తరువాతే దాడులు, హింసాత్మక సంఘటనలు చోటుచేసుకు­న్నా­యన్నారు.

టీడీపీ అల్లర్లకు పాల్పడేందుకు అవ­కా­శాలున్నా­యని పిన్నెల్లి ముందు నుంచి ఈసీకి లేఖలు రాస్తూనే ఉన్నారని గుర్తుచేశారు. మాచర్ల­లోని పలు ప్రాంతాల్లో  రిగ్గింగ్‌ జరుగుతోందని, ఎస్సీ, ఎస్టీ, బీసీల­పై దాడులు జరుగుతున్నాయని జిల్లా ఎస్పీకి ఫోన్‌ చేసినా స్పందించలేదని ఆరోపించారు. టీడీపీ రిగ్గింగ్‌ చేస్తున్న చోట ఎస్పీ సహకారం అందించారని, టీడీపీ పాల్పడ్డ రిగ్గింగ్‌ పై ఎస్పీ స్పందించకపోతే స్వయంగా పిన్నెల్లి వెళ్లి అడ్డుకున్నారని గుర్తుచేశారు. పాల్వాయి గేట్‌ వద్ద పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కొడుకు తల పగులకొట్టినా పోలీసులు స్పందించలేదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఎన్నికల రోజు తొమ్మిది ఈవీఎంలు ధ్వంసం అయితే  పిన్నె­ల్లి వీడియో మాత్రమే ఎందుకు బయటకు వచ్చిందని ప్రశ్నించారు. 

పిన్నెల్లి వీడియో బయటకు ఎలా వచ్చిందనే దానిపై  కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. ఒక సామాజికవర్గం అధికారులను అడ్డం పెట్టుకుని టీడీపీ నేతలు రిగ్గింగ్‌ చేశారని, కానీ టీడీపీ ఎంపీ అభ్యర్థి లావు కృష్ణ దేవరాయులు సుద్ధ పూసలాగా మాట్లాడు­తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.   తుమృకోటలో రిగ్గింగ్‌ జరుగుతోందని తానే  ఫోన్‌ చేసి ఎస్పీకి తెలియ­చేశానని, టీడీపీవాళ్లు దాడులు చేస్తున్నారని చెప్పినా స్పందించలేదన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామ­న్నారు. టీడీపీ రిగ్గింగ్‌ కు పాల్పడుతున్న ఒప్పి­చర్ల, తుమృకోట, పాల్వా­యి గేట్, చింత­పల్లిలో మాత్రం నామమాత్రంగా పోలీసులను నియ­మించారని ఆరోపించారు. ఈ గ్రామాల్లో పోలింగ్‌ బూత్‌ ల వీడియో ఫుటేజ్‌ బయట పెట్టాలని డి­మాం­డ్‌ చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement