47 పరుగుల వద్ద తొలి వికెట్టు కోల్పోయిన ఆసీస్ | ausis lose first wicket in brisbane test | Sakshi
Sakshi News home page

47 పరుగుల వద్ద తొలి వికెట్టు కోల్పోయిన ఆసీస్

Dec 18 2014 9:10 AM | Updated on Sep 2 2017 6:23 PM

టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా తొలి వికెట్టును కోల్పోయింది

బ్రిస్బేన్: టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 47 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి వికెట్టును కోల్పోయింది. రెండో రోజు ఆటలో భాగంగా ఆసీస్ ఓపెనర్ వార్నర్ (29) పరుగులకే అవుటయ్యాడు.  తొలి టెస్టులో రెండు సెంచరీలతో ఆకట్టుకున్న వార్నర్ .. భారత అటాకింగ్ బౌలర్ ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో అశ్విన్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.


రెండో రోజు ఆట లంచ్‌లోపే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది. 311/4 ఓవర్ నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన భారత్ జట్టు  408 పరుగులకు ఆలౌట్ అయ్యింది. మొత్తంగా 97 పరుగులకు చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. మురళీ విజయ్ (144) పరుగులతో ఆకట్టుకోగా,  రహేనా(81) పరుగులు చేశాడు. అనంతరం రోహిత్‌ శర్మ 32, కెప్టెన్‌ ధోనీ 33, అశ్విన్‌ 35 పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హాజల్‌వుడ్‌ అయిదు వికెట్లు, స్పిన్నర్‌ లియాన్‌ మూడు వికెట్లు తీశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement