ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి శంకర రావు డిమాండ్ చేశారు.
ఢిల్లీ: ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ నిర్ణయాన్ని ప్రశ్నిస్తున్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణలు క్షమాపణలు చెప్పాలని మాజీ మంత్రి శంకర రావు డిమాండ్ చేశారు. అందరిని సంప్రదించిన తరువాతే తెలంగాణపై నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. సోనియా నిర్ణయాన్ని ధిక్కరించడం మంచిదికాదని హితబోధ చేశారు.
తెలంగాణపై కేంద్ర మంత్రి చిరంజీవి, టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు వ్యాఖ్యలను స్వాగతిస్తున్నారు. తెలంగాణకు సీమాంధ్రనేతలు అడ్డుపడొద్దని కోరారు.