నకిలీ స్కానర్లతో మోసాలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ స్కానర్లతో మోసాలు

Aug 6 2026 1:09 AM | Updated on Aug 6 2026 1:09 AM

ఉక్కునగరం: పెట్రోల్‌ బంకుల్లో స్కానర్లు మార్చి నగదు మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని స్టీల్‌ప్లాంట్‌ పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామానికి చెందిన ఎండ భవానీ అలియాస్‌ బాలాజీ స్టీల్‌ప్లాంట్‌ టౌన్‌షిప్‌ సెక్టార్‌–11లోని ఓ పెట్రోల్‌ బంకులో ఉద్యోగిగా చేరాడు. అనంతరం విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం కొత్తూరు గ్రామానికి చెందిన మత్స రమేష్‌తో కలిసి బంకులో ఉన్న స్కానర్‌కు బదులుగా తమ సొంత స్కానర్‌ను ఉపయోగించి నగదు తమ ఖాతాల్లోకి మళ్లిస్తూ మోసాలకు పాల్పడ్డారు. ఈ వ్యవహారాన్ని గుర్తించిన పెట్రోల్‌ బంక్‌ యాజమాన్యం స్టీల్‌ప్లాంట్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్‌ఐ నజీర్‌ దర్యాప్తు చేపట్టి ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్‌ విధించినట్లు పోలీసులు తెలిపారు.

ఇద్దరి అరెస్ట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement