యాదాద్రి భువనగిరి జిల్లా: భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గురువారం తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులపై చెట్టు కొమ్మ కుప్పకూలింది. దీంతో మూడో తరగతి విద్యార్థిని హలీమా మృతి చెందింది. మరో పది మందికి గాయాలయ్యాయి. నొప్పితో చిన్నారులు విలవిలలాడిపోయారు. గాయపడ్డవారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.


