breaking news
School
-
క్రీస్తుపూర్వం బడి... నేటికీ ఉంది తెలుసా?
పిల్లలూ! మీ స్కూల్ కట్టి ఎన్నేళ్లయ్యింది? పదేళ్లు, ఇరవై ఏళ్లు..మహా అయితే యాభై ఏళ్లు. అయితే వేల సంవత్సరాల క్రితమే ఉన్న బడి గురించి తెలుసా? మరింత ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, నేటికీ అది నడుస్తోంది. అందులో విద్యార్థులు చదువుకుంటున్నారు. అదే చైనా దేశంలోని చాంటూ షూషే ఉన్నత పాఠశాల.ఈ పాఠశాలను క్రీ.పూ.143–141 సంవత్సరాల మధ్య హాన్ రాజవంశపు గవర్నర్ వెన్ వెంగ్ నిర్మించారు. చైనాలో స్థానిక ప్రభుత్వం నిర్మించిన మొట్టమొదటి ప్రభుత్వ పాఠశాల ఇదే. దీన్ని మొదట రాళ్లతో నిర్మించారు. అందుకే దీనికి ‘షూషే’ అంటారు. అంటే ’రాతి గది’ అని అర్థం. ఈ పాఠశాలను వెన్వెంగ్ షూషే అని కూడా పిలుస్తారు. చరిత్రలో నిలిచిన హాన్ రాజవంశ పండితుడు సిమా జియాంగ్రు ఈ పాఠశాలలోనే చదువుకున్నారు. అనంతరం ఈ పాఠశాల అగ్నిప్రమాదంలో ధ్వంసమైంది. ఆపై క్రీ.శ.199లో పునర్నిర్మించారు. 17వ శతాబ్దంలో మింగ్ రాజవంశం పతనమైనప్పుడు జాంగ్ జియాన్ జాంగ్ యొక్క తిరుగుబాటు దళం ఈ బడిని నాశనం చేసింది.1661లో క్వింగ్ రాజవంశం అదే ప్రదేశంలో బడిని తిరిగి స్థాపించింది. తరువాత కాలంలో సిచువాన్ విశ్వవిద్యాలయంగా మారిన జిన్జియాంగ్ అకాడమీ 1740లో ఈ పాఠశాలలోనే స్థాపించారు.1902లో ప్రవేశపెట్టిన కొత్త విద్యావిధానంలో ఇది ‘చెంగ్డు ఫుక్సు చెంగ్డు నార్మల్ స్కూల్’గా మారింది. ఆ తర్వాత 1904లో ఇది చెంగ్డు మిడిల్ స్కూల్గా మారింది. 1940లో దీన్ని చెంగ్డు షూషే మిడిల్ స్కూల్గా మార్చారు. 1948 మధ్యలో దేశవ్యాప్తంగా ఉన్న మాధ్యమిక పాఠశాలలకు ఒక నమూనాగా గుర్తించారు. 1952లో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా స్థాపించిన తర్వాత ఈ పాఠశాల పేరును చెంగ్డు నంబర్ 4 మిడిల్ స్కూల్గా మార్చారు. చైనాలోని టాప్ 100 హైస్కూల్స్లో ఇదీ ఒకటిగా నేటికీ నిలబడింది. ఎంతోమంది చైనా ప్రముఖులు ఈ బడిలో చదువుకున్నారు. -
కాగ్నిబోట్ స్కూల్ తొలి వార్షికోత్సవం (ఫోటోలు)
-
విద్యార్థి ఆత్మహత్య కేసు: ‘ఆమె’ వివరణే కీలకం కానుందా?
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో 10వ తరగతి విద్యార్థి ఆత్మహత్య కేసు ప్రస్తుతం దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. 16 ఏళ్ల శౌర్య పటిల్ అనే విద్యార్థి, తన స్కూల్లో టీచర్ల అవమానాలు, ఒత్తిడి కారణంగా మెట్రో స్టేషన్ నుంచి దూకి ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపుతోంది. విద్యార్థి మరణానికి దారితీసిన పరిణామాలను వెలుగులోకి తెచ్చే ప్రక్రియలో అతనిని చివరిసారిగా చూసిన దీప్షిక అనే ప్రధాన సాక్షి వివరణ పోలీసు విచారణకు కీలక ఆధారంగా మారింది.ఇ-రిక్షాలో జరిగిన బాధాకర ఘటన45 ఏళ్ల గృహిణి అయిన దీప్షిక తెలిపిన వివరాల ప్రకారం.. ఆమె తన కుమారుడు, మరొక విద్యార్థితో మధ్యాహ్నం 2.15 గంటలకు పాఠశాల వెలుపల ఇ-రిక్షాలో ఎక్కారు. కొద్దిసేపటికి అదే వాహనంలో ఆ విద్యార్థి కూడా వారితో చేరాడు. ప్రారంభం నుండి అతడు తీవ్రంగా ఆందోళనలో ఉన్నట్లుగా కనిపించాడని ఆమె తెలిపింది. ఏడాది పొడవునా హింసించారు: విద్యార్థి వేదనఆ విద్యార్థిని ఎందుకు ఏడుస్తున్నావని తాను అడిగినప్పుడు సదరు విద్యార్థి పాఠశాలలో అవమానాలు, మందలింపులు ఎదురవుతున్నాయని, ఏడాది అంతా ఒత్తిడి చేస్తూ ప్రతి చిన్న తప్పులకు కూడా తన తల్లిదండ్రులను పదేపదే పిలిపించారని వేదనతో చెప్పాడని ఆమె వెల్లడించింది. అందులో ప్రధానంగా నలుగురు ఉపాధ్యాయుల పేర్లు ప్రస్తావిస్తూ వారి వల్లే నేను ఇబ్బందులు పడుతు న్నట్లు తనకు చెప్పినట్లు దీప్షిక అనే మహిళ స్పష్టం చేసింది. తరచుగా పాఠశాలకు వచ్చే క్రమంలో తాను భరించలేని ఒత్తిడికి గురయ్యానని కూడా విద్యార్థి చెప్పినట్లు నివేదికలో ఆమె పేర్కొంది.ఆమె దిగేటప్పుడు విద్యార్థి వద్ద ప్రయాణానికి డబ్బు లేకపోవటంతో రూ.10 ఇచ్చిందని, అతను ధన్యవాదాలు చెప్పి వెళ్లిపోయిన కాసేపటికి ఈ విషాదాంతం వెలుగులోకి వచ్చినట్లు ఆమె తెలిపింది.సూసైడ్ నోట్లో వేధింపుల ఆరోపణలుపోలీసుల చేతిలో ఉన్న విద్యార్థి వ్యక్తిగత నోట్లో ఉపాధ్యాయుల చేత అవమానాలు ఎదుర్కొన్న క్రమాన్ని వెల్లడించాడు.. కొన్ని నెలలుగా తనపై కొనసాగిన వేధింపుల పర్వాన్ని వివరించాడు. అందులో నలుగురు ఉపాధ్యాయుల పేర్లు కూడా రాసినట్లు పోలీసులు స్పష్టం చేశారు. పోలీసు చర్యలు, పాఠశాల స్పందనవిద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఘటనతో ముడిపడినట్లు ఆరోపణులు ఎదుర్కొంటున్ననలుగురు ఉపాధ్యాయులను తాత్కాలికంగా సస్పెండ్ చేసింది స్కూల్ యాజమాన్యం. -
రెండు రోజుల్లో ఇద్దరు.. మరో విద్యార్థిని ఆత్మహత్య
ముంబై: ఢిల్లీలో విద్యార్థి శౌర్య పాటిల్ మృతి ఘటన మరువక ముందే మహారాష్ట్రలో మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. మహారాష్ట్రలో ఎనిమిదో తరగతి విద్యార్థిని(13) పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. అయితే, ఉపాధ్యాయుల వేధింపుల కారణంగానే తమ బిడ్డ ఆత్మహత్య చేసుకుందని పేరెంట్స్ ఆరోపిస్తున్నారు.ఈ ఘటనపై సీఐ సందీప్ భారతీ తెలిపిన వివరాల ప్రకారం.. జల్నా నగరంలోని CTMK గుజరాతీ విద్యాలయంలో ఆరోహి దీపక్ బిట్లాన్(13) ఎనిమిదో తరగతి చదువుతోంది. ప్రతీరోజు మాదిరిగానే ఆమె.. శుక్రవారం పాఠశాలకు వచ్చింది. అనంతరం, ఉదయం 7:30 గంటల ప్రాంతంలో పాఠశాల భవనంలోని మూడవ అంతస్తు నుంచి దూకింది. దీంతో, వెంటనే ఆమెను ప్రైవేటు ఆసుపత్రికి తరలించి తర్వాత.. సివిల్ ఆసుపత్రికి తరలించారు. పాఠశాల యాజమాన్యం ఆమె తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. కానీ, అప్పటికే బాధితురాలు చనిపోయినట్టు వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలలో ఎలాంటి సూసైడ్ నోట్ లభ్యం కాలేదన్నారు.మరోవైపు, బాధితురాలు తల్లిదండ్రులు తమ బిడ్డ మరణంపై మాట్లాడుతూ.. ఉపాధ్యాయుల నిరంతర వేధింపులు, చిత్రహింసల కారణంగానే మా కుమార్తె ఆత్మహత్య చేసుకుంది. చాలా రోజులుగా ఆమె ఆవేదనతో ఉంది. కానీ, తను ఇలా ఆత్మహత్య చేసుకుంటుందని ఊహించలేదు. మాకు న్యాయం కావాలి. మా బిడ్డను వేధించిన పాఠశాల సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. ఇక, విద్యార్థిని మృతిపై పాఠశాల ప్రిన్సిపాల్ స్పందిస్తూ.. ఆమె మృతి విషాదకరమని అన్నారు. దీనిపై దర్యాప్తునకు పూర్తిగా సహకరించనున్నట్టు తెలిపారు. పోలీసులు తమ విచారణను పూర్తి చేసిన తర్వాతే వాస్తవాలు స్పష్టంగా తెలుస్తాయని అన్నారు.#WATCH | Jalna, Maharashtra: Sadar Police Inspector Sandeep Bharti says, "This morning, around 7:30-8 o'clock, information was received about a 13-year-old schoolgirl jumping from the school roof and committing suicide. Investigation is underway. Preliminary investigation is… pic.twitter.com/TqNohmAL0R— ANI (@ANI) November 21, 2025 -
Gadwal District: పర్దిపురం గ్రామంలో బస్సు ఆపడం లేదంటూ రోడ్డుపై విద్యార్థుల ధర్నా
-
ఈ బడి నిండా బోసినవ్వుల అవ్వలే!
అక్కడి బడిలో చదివేది అంతా 60 నుంచి 90 ఏళ్ల వయసు మధ్య ఉన్న అవ్వలే. అందరూ గులాబీ రంగు చీరలు యూనిఫామ్లా ధరించి.. స్కూల్ బ్యాగులతో హుషారుగా క్లాసులకు హాజరవుతుంటారు. పాఠాలు వింటూనే మధ్య మధ్యలో తమకు వచ్చిన.. నచ్చిన పాటలు పాడుకుంటూ, డ్యాన్సులు వేసుకుంటూ హుషారుగా గడుపుతుంటారు. అందుకే ఈ అవ్వల బడి ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. తమ చిన్నతనంలో చదువుకోలేకపోయామే అన్న బాధలో ఉన్న అవ్వలే వీళ్లంతా. అలాంటి వాళ్లు తమ కలను నెరవేర్చుకునేందుకు వీలుగా యోగేంద్ర బంగార్ అనే వ్యక్తిని ఈ బడిని స్థాపించారు. నిత్య విద్యార్థి అనే మాటకు వందకు వంద శాతం న్యాయం చేసేందుకు వాళ్లంతా బడి బాట పట్టి ఓనమాలు దిద్దుతున్నారు. మహారాష్ట్రలోని ముర్బాద్ సమీపంలోని ఫాంగ్నే గ్రామంలో ఉంది ఈ అవ్వల బడి. ఇక్కడ ప్రతి శనివారం, ఆదివారం ఈ దృశ్యం కనిపిస్తుంది. చేతిలో స్కూల్ బ్యాగులు పట్టుకుని నవ్వుతూ క్లాసులకు హాజరవుతుంటారు వాళ్లంతా. అజ్జిబాయ్ చీ శాలా(Aajibai Chi Shala)గా పేరున్న ఈ బడిని.. ఉచితంగా ప్రాథమిక విద్యను అందిస్తున్నారు. విద్యకు వయస్సు అడ్డుకాదు అనే ఫిలాసఫీని యోగేంద్ర ఇక్కడ అన్వయింపజేశారు. ఈ బడి నిండా బోసినవ్వులు అవ్వలు.. చదువు పట్ల తపనతో నేర్చుకోవడం అందరినీ మంత్ర ముగ్ధుల్ని చేస్తోంది. ఏ వయస్సులోనైనా కొత్తగా నేర్చుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ విద్య అందుబాటులో ఉండాలి అనే సందేశంతో ఈ అద్భుత దృశ్యాలను చూపించే వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.“आजीबाईची शाळा” (Aajibai chi shala) या वाक्प्रचाराचा अर्थ आहे ‘आजीबाईंसाठीची शाळा’. याचा उपयोग अशा एका उपक्रमासाठी केला जातो, जिथे ६० ते ९० वयोगटातील महिलांना शिकण्याची संधी मिळते, ज्यामुळे त्यांची दीर्घकाळापासूनची शिक्षणाची स्वप्ने पूर्ण होऊ शकतात.📍 मुरबाड, महाराष्ट्र… pic.twitter.com/ieKteWnz9r— बृहन्महाराष्ट्र मराठी मंडळ (@RetweetMarathi) November 12, 2025ఈ వీడియోపై నెటిజన్లు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.‘‘ సోషల్ మీడియాలో నేను చూసిన అత్యుత్తమ దృశ్యం అని ఒకరు కామెంట్ చేయగా.. ఇది చూసినప్పుడు నా హృదయం ఆనందంతో నిండిపోయింది అని మరొకరు.. దేవుడా.. చాలా ఆనందంగా ఉంది’’ అని మరొకరు కామెంట్లు చేశారు.


