పాఠశాలలో క్షుద్రపూజల కలకలం | Black magic in school: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

పాఠశాలలో క్షుద్రపూజల కలకలం

Jan 20 2026 4:49 AM | Updated on Jan 20 2026 4:51 AM

Black magic in school: Andhra Pradesh

కాగతి పాఠశాలలో క్షుద్రపూజల ఆనవాళ్లు 

భయాందోళనకు గురవుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులు 

పోలీసులకు ఫిర్యాదు చేసిన ఉపాధ్యాయులు

చౌడేపల్లె: అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలంలోని కాగతి ప్రాథమికోన్నత పాఠశాలలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. పాఠశాలలో 94మంది విద్యార్థులు చదువుకొంటున్నారు. సంక్రాంతి సెలవులు ముగియడంతో సోమవా­రం విద్యార్థులు, ఉపాధ్యాయులు పాఠశాలకు వచ్చారు. ఆదివారం రాత్రి మౌని అమావాస్య సందర్భంగా గ్రామంలోని కొందరు పాఠశాల వంట గది సమీపంలో ముగ్గుపోసి, నిమ్మకాయ­లు కోసి, తాంబూలం పెట్టి, అక్షింతలు,  పసుపు, కుంకుమ చల్లి తాంత్రిక పూజలు చేసి­నట్లు గుర్తించి భయాందోళనకు గురయ్యారు. 

6 నెలలుగా  గుర్తు తెలి­యని వ్యక్తులు తరగతి గదుల వరండాలో మల, మూత్ర విసర్జన చేయడం, ప్రభు­త్వ ఆస్తులను ధ్వంసం చేయడం వంటి ఘటనలు జరుగుతున్నాయి. గ్రామస్తులు, యువత సహకారంతో పాఠశాలకు సీసీ కెమెరాలు సై­తం ఏర్పాటు చేశారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు  అందింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement