పీవీ సత్యనారాయణకు స్వామినాథన్‌ అవార్డు ప్రదానం | Swaminathan Award for Satyanarayana for contributions to agriculture | Sakshi
Sakshi News home page

పీవీ సత్యనారాయణకు స్వామినాథన్‌ అవార్డు ప్రదానం

Sep 4 2023 5:39 AM | Updated on Sep 4 2023 5:39 AM

 Swaminathan Award for Satyanarayana for contributions to agriculture - Sakshi

ఏజీ వర్సిటీ: ఎంఎస్‌ స్వామినాథన్‌ అవార్డు 2021–2012 ఏడాదికి రాగోలులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ వర్సిటీ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రిన్సిపల్‌ సైంటిస్ట్‌ పీవీ సత్యనారాయణకు అందించారు. రిటైర్డ్‌ ఐసీఏఆర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్, నూజివీడ్‌ సీడ్స్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా ఏర్పాటుచేసిన ఈ దైవార్షిక జాతీయ అవార్డు కింద రూ.2 లక్షల నగదుతోపాటు బంగారు పతకం అందజేశారు.హైబ్రిడ్‌ వరి వంగడాలను అభివృద్ధి చేయడంలో కృషికి గాను సత్యనారాయణను ఈ పురస్కారానికి ఎంపిక చేశారు.

రాజేంద్రనగర్‌లోని ఐసీఏఆర్‌–ఐఐఆర్‌ఆర్‌లోని రిటైర్డ్‌ ఐసీఏఆర్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ సిల్వర్‌ జూబ్లీ వేడుకలను ఆదివారం నిర్వహించారు. ఈ వేడుకలతో పాటు ఈ అవార్డును కూడా అందించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు ఇప్పటివరకు 8 మందికి ప్రకటిస్తే అందులో నలుగురు తెలుగురాష్ట్రాల వారే కావడం సంతోషకరమని అన్నారు. కార్యక్రమంలో ఐసీఏఆర్‌ డీజీ డీఏఆర్‌ఈ కార్యదర్శి హిమాన్షు పాఠక్, డీఏఆర్‌ఈ కార్యదర్శి ఆర్‌ఎస్‌ పరోడా, ఐసీఏఆర్‌ మాజీ డీడీజీ ఈఏ సిద్దిఖ్, నూజివీడ్స్‌ సీఏండీ ఎం.ప్రభాకరరావు, తదితరులు పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement