హైదరాబాద్: సరూర్నగర్లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించింది. ఆ ధాటికి ఇల్లు పూర్తిగా దగ్ధం అయ్యింది. స్థానికుల వివరాల ప్రకారం.. సరూర్నగర్ పరిధిలోని బాబూనగర్లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీగా పేలిన శబ్ధం వినిపించింది. ఆ శబ్ధానికి అప్రమత్తమైన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో ఆరా తీస్తున్నారు.
అయితే, ఆ పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసమైనట్టుగా పోలీసులు చెప్పారు. అలాగే, అదే సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లోనే ఉన్నప్పటికి ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా ఉండటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పేలుడు సంభవించిన సమయంలో ఇంట్లో మూడు గ్యాస్ సిలిండర్లు ఉన్నా వాటినుంచి ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో పేలుడుకు అసలు కారణాలేంటో ఇంకా తెలియాల్సి ఉంది.
భారీ పేలుడు.. ధ్వంసమైన ఇల్లు
హైదరాబాద్ - సరూర్నగర్ పరిధిలోని బాబూనగర్లో రిటైర్డ్ బ్యాంకు ఉద్యోగి దేవేందర్ ఇంట్లో భారీ పేలుడు
పేలుడు ధాటికి ఇల్లు పూర్తిగా ధ్వంసం
కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్నప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్న స్థానికులు
ఇంట్లో ఉన్న… pic.twitter.com/sQ356wGrXi— Telugu Scribe (@TeluguScribe) June 30, 2026


