ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత | Hyderabad Rains: Heavy Flood Water To Reservoirs - Sakshi
Sakshi News home page

ఉధృతంగా ఈసీ, మూసీ వాగులు.. ఆ రోడ్డు మూసివేత

Sep 6 2023 10:38 AM | Updated on Sep 6 2023 10:59 AM

Hyderabad Rains: Heavy Flood Water In Reservoirs - Sakshi

రాజేంద్రనగర్‌ నుంచి పోలీస్‌ అకాడమీ వైపు వెళ్లే ఔటర్‌ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు.

సాక్షి, రంగారెడ్డి: కుండపోత వర్షాలతో హైదరాబాద్‌ శివారులోని జంట జలాశయాలు నిండుకుండలా మారాయి. ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ ఆరు గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు అధికారులు. లోతట్టు ప్రాంతవాసులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మూసీ పరివాహక ప్రాంత వాసులను అధికారులు అప్రమత్తం చేశారు. ఈసీ,మూసీ వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.

రాజేంద్రనగర్‌ నుంచి పోలీస్‌ అకాడమీ వైపు వెళ్లే ఔటర్‌ సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. నార్సింగి నుంచి మంచిరేవులకు వెళ్తే దారిని నార్సింగి పోలీసులు మూసేశారు. ‍ప్రత్నామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాలని పోలీసులు సూచించారు.

ఎగువ ప్రాంతాల నుంచి జంట జలాశయాలకు వరద భారీగా చేరుతోంది. వికారాబాద్‌, తాండూర్‌, శంకర్‌పల్లి, షాబాద్‌, షాద్‌ నగర్‌, పరిగితో పాటు పలు గ్రామాలకు నుంచి భారీగా వరద ప్రవాహం కొనసాగుతోంది.
చదవండి: మూసీలో కొట్టుకొచ్చిన లక్ష్మీ మృతదేహం?

Advertisement
 
Advertisement
Advertisement