సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది. పలు జిల్లాల్లో భారీగా వర్షం పడుతోంది. నాగర్కర్నూల్లో ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడుతున్నాయి. గద్వాలలో ఈదురుగాలులతో కూడిన జల్లులు పడుతున్నాయి. మామిళ్లపల్లిలో పిడుగుపడి రాజు అనే కానిస్టేబుల్ మృతి చెందాడు.
మరోవైపు విజయవాడలోనూ భారీ వర్షం పడుతోంది. పెద్దఎత్తున వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. విస్సన్నపేట, మైలవరంలో ఈదురుగాలులలో కూడిన జల్లులు పడుతున్నాయి.


