మంట ధరల మంట! టమాటా, పచ్చిమిర్చి చోరీ | Tomato and green pepper theft | Sakshi
Sakshi News home page

మంట ధరల మంట! టమాటా, పచ్చిమిర్చి చోరీ

Jul 6 2023 4:12 AM | Updated on Jul 6 2023 8:04 AM

Tomato and green pepper theft - Sakshi

డోర్నకల్‌: అధిక ధర పలు­కు­­తున్న టమాటా, పచ్చి­మిర్చి, చామ­గడ్డలపై దొంగల కళ్లు పడ్డాయి. మహబూ­బాబాద్‌ జిల్లా డోర్నకల్‌ కూరగా­యల మార్కెట్‌లోని పలు దుకా­ణా­ల్లో ఇటీవల కూరగా­యలు చోరీకి గురవుతు­న్నాయి. గాంధీసెంటర్‌­లోని కూరగాయల మార్కెట్‌లో రాత్రి వేళల్లో దుకా­­ణా­లకు తాత్కా­లిక నెట్‌ ఏర్పాటు చేస్తారు.

మార్కెట్‌కు నైట్‌వాచ్‌మన్‌ లేకపోవడం, ఇటీవల కూర­గాయల ధరలు పెరగడంతో రాత్రి వేళల్లో పలు దుకాణాల్లోని కూరగాయలు చోరీకి గురవుతున్నట్లు వ్యాపారులు గుర్తించారు. బుధవారం ఉదయం కూరగాయల వ్యాపారి లక్‌పతి తన దుకాణం తెరిచి చూడగా అధిక ధర పలుకుతున్న టమాటా, పచ్చిమిర్చి, చామగడ్డతోపాటు ఇతర కూరగాయలు చోరీ అయినట్టు గుర్తించి లబోదిబోమన్నాడు.

కర్ణాటకలో టమాటా పంట చోరీ
యశవంతపుర: కాయగూరల ధరలు ఆకాశా­న్నంటుతున్నాయి. టమాటా ధరలు కిలో వంద రూపాయలను దాటాయి. దీంతో అందరి కళ్లు ఇప్పుడు ట­మాటాలపై పడ్డాయి. కర్ణాటకలో హసన్‌ జిల్లా బేలూరు తాలూకా గోణి సోమనహళ్లి గ్రామంలో టమాటా పంటను దొంగలు ఎత్తుకుపోయారు.

మంగళవారం రాత్రి తోటలోకి ప్రవేశించి, దాదాపు 60 సంచుల టమాటాలను కోసుకెళ్లారు. రైతు పొలంలోకి వెళ్లి చూడగా పంట మొత్తం మాయం కావడంతో హళేబీడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోయిన పంట ధర రూ.1.5 లక్షల వరకూ ఉంటుందని తెలిపాడు.  

టమాటా తోటకు సీసీ కెమెరా రక్షణ  
కర్ణాటకలోని హావేరి జిల్లా హానగల్‌ తాలూకా అక్కి ఆలూరు గ్రామంలో రైతు మల్లప్ప తన టమాటా తోటకు సీసీ కెమెరాలతో రక్షణ ఏర్పాటు చేసుకున్నాడు. ధరలు పెరగటంతో దొంగలు ఎత్తుకెళ్లే ప్రమాదం ఉందని, అందుకే జాగ్రత్తలు తీసుకుంటున్నానని చెప్పాడు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, అటువైపు దొంగలు రాకుండా కాపలా కాస్తున్నట్లు తెలిపాడు.  

Advertisement
 
Advertisement
Advertisement