టీవీ సీరియల్‌ డైరెక్టర్‌ భార్య ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

టీవీ సీరియల్‌ డైరెక్టర్‌ భార్య ఆత్మహత్య

May 27 2023 8:38 AM | Updated on May 27 2023 8:40 AM

- - Sakshi

తిరువొత్తియూరు: చైన్నె వలసరవాక్కంలో దంపతుల మధ్య ఏర్పడిన కుటుంబకులహాల కారణంగా ప్రముఖ టీవీ సీరియల్‌ డైరెక్టర్‌ భార్య గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చైన్నె వలసరవాక్కము అన్బునగర్‌ రెండవ వీధిలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్న నాగరత్నం (47). ఇతను టీవీ సీరియల్‌ డైరెక్టర్‌. ప్రముఖ ప్రైవేటు చానల్‌లో ప్రసారం అవుతున్న పాండవర్‌ ఇల్లం అనే సీరియల్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. పైగా వాణి రాణి, సెవ్వంది అనే టీవీ సీరియల్‌ లోను డైరెక్టర్‌గా ఉన్నారు.

 ఇతని భార్య పద్మావతి (37). వీరి సొంత ఊరు కోవై జిల్లా పొల్లార్చి. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. వీరికి నవీనేషు (15), సాయి ఆదర్శ (8) ఇద్దరు కుమారులు. ప్రస్తుతం పాఠశాలలలకు సెలవులు కావడంతో నాగరత్నం కుటుంబంతో కలిసి సొంతూరు పొల్లాచ్చికి వెళ్లారు. తర్వాత ఇద్దరు కుమారులను అక్కడ వదిలిపెట్టి భార్యతో కలిసి నాగరత్నం చైన్నెకి వచ్చారు. ఇంట్లో ఉన్న నగలను తాకట్టు పెట్టి ఏదైనా వ్యాపారం చేపడతామని నాగరత్నంతో భార్య పద్మావతి చెప్పింది. ఈ విషయంగా దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి.

ఈ క్రమంలో బుధవారం రాత్రి టీవీ సీరియల్‌ షూటింగ్‌కు వెళ్లి నాగరత్నం గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య భర్త మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు గురువారం ఉదయం పొల్లాచ్చి నుంచి చైన్నెకి తిరిగి వచ్చారు. వారిని తీసుకొచ్చేందుకు నాగరత్నం కోయంబేడు బస్‌స్టేషన్‌కు వెళ్లాడు. కుమారులను తీసుకొని ఇంటికి వచ్చాడు.

ఆ సమయంలో గదిలో పద్మావతి ఉరి వేసుకొని వేలాడుతుండడం చూసి దిగ్బ్రాంతి చెందాడు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రకి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమె అప్పటికే మృతిచెందిన్నట్లు తెలిపారు. విషయం తెలిసి వలసరవాక్కం పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement