breaking news
nagaratnam
-
తెలుగు ప్రజల జీవనశైలి..
తెలుగు ప్రజల జీవన శైలిలో ప్రత్యేక స్థానం పొందిన పండుగ సంక్రాంతి. ఇది ప్రకృతితో, పంటలతో, కుటుంబ బంధాలతో ముడిపడి ఉంది. సంస్కృతి, సంప్రదాయాల ప్రతీక. అలాంటి పండుగను ఒక వేడుకలా ప్రతి యేటా హైదరాబాద్ నగర శివారులోని ఓ ఫామ్హౌస్లో జరపడం ఆనవాయితీ. దాదాపు మూడేళ్ల నుంచి ఈ సంక్రాంతి వేడుకలను నాగరత్నం నాయుడు ఇక్కడ జరుపుతున్నారు. ప్రకృతికి హానిచేయొద్దు.. జననీ జన్మభూమిశ్చ.. స్వర్గాదపి గరీయసి.. అన్నారు. అందుకే వందల మైళ్లు ప్రయాణం చేసి సొంత ఊర్లకు వెళ్లి అక్కడి సంస్కృతిని పాడుచేయొద్దు. మన ఇంటిని కాపాడుకున్నట్లే.. మన సంస్కృతిని, వ్యవసాయాన్ని, చేతి వృత్తులను, పాడి పంటలను కాపాడుకోవాలి. కుల మతాలకు అతీతంగా అందరూ కలిసి సంబరాన్ని చేసుకోవాలి. ఈ క్రమంలో ప్రకృతికి హానిచేయొద్దు. ఇటీవల కాలంలో జూదాలపై ఆసక్తి పెరుగుతోంది. వాటితో జీవితానుల పాడుచేసుకోవద్దు. ప్రకృతిని మనం కాపాడితే.. ఆ ప్రకృతే మనల్ని పది కాలాల పాటు జీవించేలా చేస్తుంది. – గొట్టిపాటి సత్యవాణిసంప్రదాయాలు మర్చిపోకుండా.. మూడేళ్ల నుంచి మా ఫామ్ హౌస్లో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తున్నాను. అందుకే ఫామ్లో అన్ని రకాల పంటలూ పండిస్తాం. దీంతో పాటు యేటా నిర్వహించే సంక్రాంతి వేడుకలకు సాధారణ ఎంట్రీ ఫీజునే వసూలు చేస్తున్నాం. పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనం ఏర్పాటు చేస్తాం.. కాబట్టి.. ఆ ఖర్చులను పార్టిసిపెంట్స్ భరిస్తుంటారు. నేను కేవలం బియ్యం, కూరగాయలు అందిస్తుంటాను. మిగతా ఖర్చంతా ఔత్సాహికులైన యువకులు పెట్టుకుంటారు. ముగ్గుల పోటీలు, ఎడ్లబండ్ల పోటీలు, టగ్ ఆఫ్ వార్ లాంటి పోటీలు నిర్వహించి మన సంస్కృతి పట్ల ఇప్పటి యువతకు అవగాహన కల్పిండమే నా సంకల్పం. ఆ ప్రయత్నంలో నూటికి నూరు శాతం ఫలితాన్ని పొందుతున్నా.. అందరికీ సంక్రాంతి ఒక ఎమోషన్ అవ్వాలనేదే నా ఆకాంక్ష. – నాగరత్నం నాయుడు,ప్రోగ్రెసివ్ ఆర్గానిక్ ఫార్మర్ఏడాది కష్టాన్ని దూరం చేసే వేడుక.. మాది మణికొండలోని కళాకృతి డాన్స్ ఇన్స్టిట్యూట్. మా పిల్లలు డీ షో వంటి పెద్ద షోస్లో పాల్గొన్నారు. నేను డాన్స్ కోరియో గ్రాఫర్ని. బంగారి బాలరాజు, ఉత్తర, అసలేం జరిగిందంటే వంటి చిత్రాల్లో, రాములమ్మ సీరియల్ల్ హీరోయిన్గా నటించాను. తమిళ్ చిత్రాల్లోనూ నటించా. మనది వ్యవసాయ కుటుంబం. ఏడాది పాటు సాగులో పడిన కష్టానికి ప్రతిఫలం వచ్చిన సందర్భంగా ఈ పండుగ చేసుకుంటాం.. మన సంస్కృతిని మర్చిపోకూడదు. అందుకే ఇలాంటి వేడుకల్లో భాగస్వామ్యం కావడం సంతోషంగా ఉంది. – కరొన్య కాథరిన్, సినిమా నటిఈ ఫామ్తో మంచి అనుబంధం ఉంది.. నేను రిటైర్డ్ పోలీస్ అధికారిని. మాకు పెద్దపల్లిలో ఫార్మ్ ఉంది. ముప్పై ఎకరాల్లో హార్టీ కల్చర్ చేస్తున్నాను. ఈ ఫామ్ని మూడు నాలుగు సార్లు విజిట్ చేశాను. ఇక్కడ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చారు. ఆంధ్ర, తెలంగాణ నుంచి ఇక్కడకి చాలా మంది రైతులు వస్తుంటారు. ఈ ఫార్మ్ దాదాపు 25 ఏళ్ల నుంచి నడుపుతున్నారు. ఈ రోజు సంక్రాంతి సంబరాల్లో మేము భాగా ఎంజాయ్ చేశాం. ఇక్కడికి నేనొక్కడినే వచ్చాను. నాకు ఈ ఫామ్తో మంచి అనుబంధం ఉంది. – చిట్టిబాబు, రిటైర్డ్ పోలీసు అధికారి -
టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య ఆత్మహత్య
తిరువొత్తియూరు: చైన్నె వలసరవాక్కంలో దంపతుల మధ్య ఏర్పడిన కుటుంబకులహాల కారణంగా ప్రముఖ టీవీ సీరియల్ డైరెక్టర్ భార్య గురువారం మధ్యాహ్నం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చైన్నె వలసరవాక్కము అన్బునగర్ రెండవ వీధిలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో నివాసం ఉంటున్న నాగరత్నం (47). ఇతను టీవీ సీరియల్ డైరెక్టర్. ప్రముఖ ప్రైవేటు చానల్లో ప్రసారం అవుతున్న పాండవర్ ఇల్లం అనే సీరియల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. పైగా వాణి రాణి, సెవ్వంది అనే టీవీ సీరియల్ లోను డైరెక్టర్గా ఉన్నారు. ఇతని భార్య పద్మావతి (37). వీరి సొంత ఊరు కోవై జిల్లా పొల్లార్చి. ఒకే గ్రామానికి చెందిన వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. వీరికి నవీనేషు (15), సాయి ఆదర్శ (8) ఇద్దరు కుమారులు. ప్రస్తుతం పాఠశాలలలకు సెలవులు కావడంతో నాగరత్నం కుటుంబంతో కలిసి సొంతూరు పొల్లాచ్చికి వెళ్లారు. తర్వాత ఇద్దరు కుమారులను అక్కడ వదిలిపెట్టి భార్యతో కలిసి నాగరత్నం చైన్నెకి వచ్చారు. ఇంట్లో ఉన్న నగలను తాకట్టు పెట్టి ఏదైనా వ్యాపారం చేపడతామని నాగరత్నంతో భార్య పద్మావతి చెప్పింది. ఈ విషయంగా దంపతుల మధ్య కొన్ని రోజులుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం రాత్రి టీవీ సీరియల్ షూటింగ్కు వెళ్లి నాగరత్నం గురువారం తెల్లవారుజామున ఇంటికి వచ్చారు. ఆ సమయంలో భార్య భర్త మధ్య మళ్లీ గొడవ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కుమారులు గురువారం ఉదయం పొల్లాచ్చి నుంచి చైన్నెకి తిరిగి వచ్చారు. వారిని తీసుకొచ్చేందుకు నాగరత్నం కోయంబేడు బస్స్టేషన్కు వెళ్లాడు. కుమారులను తీసుకొని ఇంటికి వచ్చాడు. ఆ సమయంలో గదిలో పద్మావతి ఉరి వేసుకొని వేలాడుతుండడం చూసి దిగ్బ్రాంతి చెందాడు. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రకి తీసుకెళ్లాడు. అక్కడ డాక్టర్లు పరీక్షించి ఆమె అప్పటికే మృతిచెందిన్నట్లు తెలిపారు. విషయం తెలిసి వలసరవాక్కం పోలీసులు అక్కడకు వెళ్లి మృతదేహాన్ని శవపరీక్ష కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివి వినాయక్ కు మాతృవియోగం
హైదరాబాద్: ప్రముఖ దర్శకుడు వివి వినాయక్ కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి నాగరత్నం(59) మంగళవారం కన్నుమూశారు. కిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. వినాయక్ తల్లి మరణం పట్ల సినిమా ప్రముఖులు సంతాపం ప్రకటించారు. పశ్చిమగోదావరి జిల్లా చాగల్లు వినాయక్ స్వస్థలం. ఆయన తండ్రి కృష్ణారావు సినిమా డిస్ట్రిబ్యూటర్ గా పనిచేశారు.