గిల్‌, పంత్‌, బుమ్రాలకు విశ్రాంతి..? | UPDATES OF INDIAN TEAM FOR BANGLADESH T20I SERIES | Sakshi
Sakshi News home page

గిల్‌, పంత్‌, బుమ్రాలకు విశ్రాంతి..?

Sep 15 2024 4:54 PM | Updated on Sep 15 2024 5:27 PM

UPDATES OF INDIAN TEAM FOR BANGLADESH T20I SERIES

బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియాకు సంబంధించిన అప్‌డేట్స్‌ వెలువడ్డాయి. పీటీఐ సోర్సస్‌ ప్రకారం ఈ సిరీస్‌కు శుభ్‌మన్‌ గిల్‌ దూరంగా ఉండనున్నాడని తెలుస్తుంది. సెలెక్టర్లు గిల్‌కు విశ్రాంతినివ్వనున్నారని సమాచారం. వర్క్‌ లోడ్‌ కారణంగా సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. భారత్‌ త్వరలో న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాలతో టెస్ట్‌ సిరీస్‌లు ఆడనున్న విషయం తెలిసిందే.

బుమ్రా, సిరాజ్‌లకు కూడా..
బంగ్లాతో టీ20 సిరీస్‌కు గిల్‌తో పాటు బుమ్రా, సిరాజ్‌లకు కూడా విశ్రాంతినిచ్చే అవకాశం ఉంది. రొటేషన్‌ పద్దతిలో భాగంగా వీరిని పక్కకు పెట్టనున్నట్లు తెలుస్తుంది. యువ పేసర్లకు అవకాశం ఇవ్వడం కోసం సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం​.

పంత్‌ స్థానంలో ఇషాన్‌..
బంగ్లాతో టీ20 సిరీస్‌కు గిల్‌, బుమ్రా, సిరాజ్‌లతో పాటు రిషబ్‌ పంత్‌కు కూడా విశ్రాంతినిచ్చే ఛాన్స్‌ ఉంది. సెలెక్టర్లు ఒకవేళ పంత్‌ను పక్కన పెడితే అతడి స్థానంలో ఇషాన్‌ కిషన్‌కు అవకాశం ఇవ్వవచ్చు. ఇషాన్‌ ఇటీవలి కాలంలో సూపర్‌ ఫామ్‌లో ఉన్న విషయం తెలిసిందే. బంగ్లాదేశ్‌తో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ అక్టోబర్‌ 6న ప్రారంభం కానుంది. గ్వాలియర్‌, ఢిల్లీ, హైదరాబాద్‌ వేదికలుగా అక్టోబర్‌ 6, 9, 12 తేదీల్లో మ్యాచ్‌లు జరుగనున్నాయి.

టీ20 సిరీస్‌కు ముందు బంగ్లాదేశ్‌ టీమిండియాతో రెండు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌ ఆడనుంది. తొలి టెస్ట్‌ సెప్టెంబర్‌ 19 నుంచి చెన్నై వేదికగా జరుగనుంది. రెండో టెస్ట్‌ కాన్పూర్‌ వేదికగా సెప్టెంబర్‌ 27న ప్రారంభమవుతుంది. ఈ సిరీస్‌ కోసం భారత ఆటగాళ్లు ఇదివరకే ప్రాక్టీస్‌ మొదలుపెట్టారు. చెన్నైలోని చిదంబరం స్టేడియంలో టీమిండియా ట్రయినింగ్‌ క్యాంప్‌ జరుగుతుంది. 

చదవండి: జోరుగా సాగుతున్న టీమిండియా ప్రాక్టీస్‌.. వీడియో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement