భారత్‌ ఆడే సిడ్నీ మ్యాచ్‌ టికెట్లు ‘సోల్డ్‌ అవుట్‌’ | Tickets for Indias Sydney match sold out | Sakshi
Sakshi News home page

భారత్‌ ఆడే సిడ్నీ మ్యాచ్‌ టికెట్లు ‘సోల్డ్‌ అవుట్‌’

Jun 27 2025 3:55 AM | Updated on Jun 27 2025 3:55 AM

Tickets for Indias Sydney match sold out

కాన్‌బెర్రా టి20కీ అదే బోర్డు  

మెల్‌బోర్న్‌: టీమిండియా ప్రస్తుతం ఇంగ్లండ్‌ పర్యటనలో సంప్రదాయ టెస్టు ఫార్మాట్‌ ఆడుతోంది. ఇది ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్‌ కావడంతో ఇంగ్లండ్‌ పర్యటన ముగిసేందుకే చాలా సమయం పడుతోంది. ఆగస్టు 4 వరకు అఖరి టెస్టు జరుగుతుంది. అనంతరం బంగ్లాదేశ్‌ పర్యటన ఉంది. ఆ తర్వాతే ఆ్రస్టేలియాలో భారత్‌ పర్యటిస్తుంది. అక్టోబర్‌–నవంబర్‌లలో జరిగే ఈ పరిమిత ఓవర్ల సిరీస్‌లకు ఇంకా నాలుగు నెలల సమయం ఉంది. అయినా సరే భారత్‌ క్రికెట్‌ క్రేజ్‌ను ఆస్ట్రేలియా కూడా సొమ్ము చేసుకుంది. 

మూడు వన్డేలు, ఐదు టి20ల కోసం క్రికెట్‌ ఆ్రస్టేలియా (సీఏ) టికెట్ల విక్రయం చేపట్టగా ఏకంగా 90 వేల పైచిలుకు టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయినట్లు స్వయంగా సీఏ వర్గాలే వెల్లడించాయి. సిడ్నీలో జరిగే మూడో వన్డే, కాన్‌బెర్రాలో జరిగే తొలి టి20 టికెట్లయితే ఒక్కటి కూడా మిగలకుండా ‘సోల్డ్‌ అవుట్‌’ కావడం విశేషం. ‘భారత్, ఆసీస్‌ల మధ్య జరగబోయే పరిమిత ఓవర్ల సిరీస్‌ల కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టికెట్లు హాట్‌కేకుల్లా అమ్ముడవుతున్నాయి. 

ముఖ్యంగా ‘కంగారూ’ దేశంలో స్థిరపడిన భారత సంతతి ప్రేక్షకులు వేలంవెర్రిగా ఎగబడ్డారు’ అని సీఏ ఒక ప్రకటనలో తెలిపింది. సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌ (మూడో వన్డే వేదిక), మనుక ఓవల్‌ (కాన్‌బెర్రా–తొలి టి20 వేదిక)లలో జరిగే మ్యాచ్‌ టికెట్లకు అనూహ్య డిమాండ్‌ నెలకొనడంతో నాలుగు నెలల ముందే టికెట్లన్నీ అయిపోయాయని సీఏ పేర్కొంది. భారత సంతతి అభిమానులు కొందరు వందలు, వేల సంఖ్యలో టికెట్లు కొనుగోలు చేసినట్లు తెలిసింది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement