
27 ఏళ్ల తర్వాత తొలి ఐసీసీ టైటిల్ను సొంతం చేసుకునేందుకు సౌతాఫ్రికా కేవలం 69 పరుగుల దూరంలో నిలిచింది. ఐకానిక్ లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్లో ప్రోటీస్ విజయానికి చేరువైంది.
282 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సౌతాఫ్రికా.. మూడో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసింది. ఆరంభంలో రెండు వికెట్లు కోల్పోయినప్పటికి సౌతాఫ్రికా తిరిగి పుంజుకుంది. ఐడైన్ మార్క్రమ్(102 బ్యాటింగ్), బావుమా(65 బ్యాటింగ్) అద్బుతమైన ప్రదర్శన కనబరుస్తున్నారు.
వీరిద్దరూ మూడో వికెట్కు 143 పరుగుల ఆజేయ భాగస్వామ్యం నెలకొల్పారు. బావుమా ఓ వైపు గాయంతో బాధపడుతూనే తన బ్యాటింగ్ను కొనసాగిస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్లో బావుమా కీలక నాక్ ఆడాడు. ఈ క్రమంలో టెంబా బావుమా ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
తొలి కెప్టెన్గా..
డబ్ల్యూటీసీ ఫైనల్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ చేసిన కెప్టెన్గా బావుమా నిలిచాడు. టెంబా బావుమా 3వ రోజు ముగిసే సమయానికి 121 బంతుల్లో 65 పరుగులు చేశాడు. ఇంతకుముందు ఈ రికార్డు కివీస్ మాజీ కెప్టెన్ కేన్ విలియమ్సన్ పేరిట ఉండేది. విలియమ్సన్ డబ్ల్యూటీసీ ఫైనల్లో భారత్పై 52 పరుగులు చేశాడు. తాజా ఇన్నింగ్స్తో విలియమ్సన్ రికార్డును బావుమా బ్రేక్ చేశాడు.
చదవండి: 'మ్యాచ్ ఇంకా ముగియ లేదు'.. ప్రోటీస్కు ఆసీస్ కోచ్ వార్నింగ్