లండన్: ఇంగ్లండ్తో తొలి టెస్టులో ఘోర పరాజయం ఎదుర్కొన్న న్యూజిలాండ్... రెండో టెస్టులో ఘనవిజయంతో సిరీస్ను 1–1తో సమం చేసింది. ఆదివారం ముగిసిన రెండో టెస్టులో న్యూజిలాండ్ 253 పరుగుల తేడాతో నెగ్గింది. 463 పరుగుల లక్ష్యఛేదనలో ఓవర్నైట్ స్కోరు 182/5తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్ 58.1 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది.
జో రూట్ (145 బంతుల్లో 77; 8 ఫోర్లు) పోరాడాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ మ్యాట్ హెన్రీ 29 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్లో 391 పరుగులు చేయగా... ఇంగ్లండ్ 291 పరుగులకు పరిమితమైంది. న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్లో 362 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు కొండంత లక్ష్యాన్ని నిలిపింది.


