
వెస్టిండీస్తో మూడు టీ20ల సిరీస్లో ఇంగ్లండ్ శుభారంభం చేసింది. చెస్టర్-లె-స్ట్రీట్ వేదికగా జరిగిన తొలి టీ20లో 21 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లీష్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ జోస్ బట్లర్ విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు.
ఫస్ట్ డౌన్లో బ్యాటింగ్కు వచ్చిన బట్లర్.. విండీస్ బౌలర్లను ఊతికారేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 59 బంతులు మాత్రమే ఎదుర్కొన్న బట్లర్.. 6 ఫోర్లు, 4 సిక్స్లతో 96 పరుగులు చేశాడు. అతడితో పాటు యువ ఓపెనర్ జేమీ స్మిత్(38), జాకబ్ బెతల్(23) రాణించారు. విండీస్ బౌలర్లలో షెఫర్డ్ రెండు వికెట్లు పడగొట్టగా.. జోషఫ్, రస్సెల్, ఛేజ్ తలా వికెట్ సాధించారు.
తిప్పిసేన డాసన్..
అనంతరం లక్ష్య చేధనలో వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఇంగ్లండ్ స్పిన్నర్ లియాస్ డాసన్ ధాటికి కరేబియన్ బ్యాటర్లు విల్లవిల్లాడారు. డాసన్ నాలుగు వికెట్లు పడగొట్టి ప్రత్యర్ధి జట్టును దెబ్బతీశాడు.
అతడితో పాటు జాకబ్ బెతల్, మాథ్యూ పాట్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఇక విండీస్ ఇన్నింగ్స్లో ఎవిన్ లూయిస్(39) పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టీ20 బ్రిస్టల్ వేదికగా ఆదివారం జరగనుంది.
చదవండి: Bengaluru stampede: తొక్కిసలాట ఘటన.. కర్ణాటక క్రికెట్ అసోసియేషన్లో ఇద్దరి రాజీనామా